రెండు రోజుల కిందట ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడాన్ని నిషేధించిన ఏపీ ప్రభుత్వం తాజాగా మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మద్యం ధరలను సవరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. భారత్లో తయారయ్యే విదేశీ మద్యం, మీడియం, ప్రీమియం బ్రాండ్ల ధరలను తగ్గిస్తూ అబ్కారీశాఖ పేర్కొంది. రూ. 50 నుంచి 1,350 వరకు వివిధ బ్రాండ్లపై ధరలను తగ్గించింది. తగ్గించిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ప్రీమియం బ్రాండ్లు కొనేవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.