
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన బులిటెన ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,620 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 16 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 7,96,919 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 6,524 గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 7,58,138 మంది కోలుకోగా ప్రస్తుతం 32,257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా 24 గంటల్లో రాష్ట్రంలో 76,726 పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.