
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 56,409 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 355 కొత్త కేసులు నమోదు కాగా.. ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,80,430కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 7,091 మంది కొవిడ్తో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 354 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,69,478కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,861 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,15,31,206 శాంపిల్స్ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది.