రానున్న మూడురోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణశాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల వాతావరణం ఉండడంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడనున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

రానున్న మూడురోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణశాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల వాతావరణం ఉండడంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడనున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.