spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YSR Congress Caste Politics: వారితో కాపులను టర్న్ చేసుకోవడం జగన్ కు కష్టమే!

YSR Congress Caste Politics: వారితో కాపులను టర్న్ చేసుకోవడం జగన్ కు కష్టమే!

YSR Congress Caste Politics: గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఓటమికి ప్రధాన కారణం కాపులు. ఆ సామాజిక వర్గం దూరం కావడంతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురైంది. ఎన్నికలకు ముందు కాపుల్లో స్పష్టమైన వైఖరి కనిపించింది. పవన్ కళ్యాణ్ వెంట నడిచేందుకు మెజారిటీ కాపులు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశారు. ఇతర సామాజిక వర్గాల ద్వారా విజయం సాధించవచ్చు అని అంచనా వేశారు. కానీ ఆ అంచనా తప్పింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది. జగన్మోహన్ రెడ్డి వైఖరిలో సైతం మార్పు వచ్చింది. కాపుల విషయంలో తప్పు జరిగిందని ఒక అంచనాకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అందుకే కాపు ఓటు బ్యాంకు చేజిక్కించుకునేందుకు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.

Also Read: జగన్ కోసం రంగంలోకి ఆ ఇద్దరు!

* కాపు నేతలకు కొదువ లేదు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాపు నేతలకు కొదువలేదు. బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ), అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలు ఉన్నారు. మరోవైపు కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత అయిన ముద్రగడ పద్మనాభం సైతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. అయినా సరే కాపులు జగన్మోహన్రెడ్డిని మొన్నటి ఎన్నికల్లో నమ్మలేదు. జగన్మోహన్ రెడ్డి వైసిపి విషయంలో కాపులకు అనేక రకాల అభ్యంతరాలు ఉన్నాయి. పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కాపులు జగన్ విషయంలో సానుకూలంగానే ఉండేవారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కాపుల ఆలోచన మారింది. తెలుగుదేశం పార్టీ కంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం హింసాత్మక ఘటనలకు దారి తీసిన నేపథ్యంలో.. 2019 ఎన్నికల్లో ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపారు కాపులు. కానీ కాపులు ఆశించిన పాలన సాగలేదు ఏపీలో. అంతకుముందు చంద్రబాబు ఇచ్చిన ఆర్థిక వెనుకబాటు రిజర్వేషన్లను సైతం కాపులకు రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి. కాపుల విషయంలో ప్రత్యేక పథకాలు ఏవి లేకుండా పోయాయి.

* పవన్ పై వ్యక్తిగత దాడి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయలేకపోయింది. 2014, 2019 ఎన్నికల మాదిరిగా కాపుల ఆలోచన ఉంటుందని అంచనా వేసింది. అయితే పవన్ కళ్యాణ్ పై అదే పనిగా వ్యక్తిగత దాడి కూడా కాపులను ప్రభావితం చేసింది. ఇప్పుడు వైసీపీలో ఉన్న కాపు నేతలంతా పవన్ కళ్యాణ్ కు తిట్టడానికి అన్న పరిస్థితి ఉండేది. అదే కాపుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కాపు నేతల నిర్ణయాలకు గౌరవించి ఉండాలి. వారితో కాపుల కోసం మంచి పనులు చేయించి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేదు. ఇప్పుడు అదే నేతలను కాపులపై ప్రయోగిస్తానంటే మాత్రం కుదిరే పని కాదు. పైగా వైసీపీలో కాపు నేతలంతా ఒకప్పటి దూకుడు కలిగిన నేతలే. వారితో పని అయ్యే ఛాన్సే లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper