Jagan(9)
Jagan: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో సమూల ప్రక్షాళన తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే పార్టీలో ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో అన్న పరిస్థితి నెలకొంది. పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి ఇటీవల పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన బాటలో మరికొందరు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే దీనికి విరుగుడుగా కాంగ్రెస్ లోని సీనియర్లను వైసీపీలోకి రప్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. నేతల రాజీనామాతో ఖాళీ అవుతున్న స్థానాలకు ఇన్చార్జిలను నియమిస్తున్నారు. ముఖ్య నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. అయితే ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి ఉండేవారు. ఆయన రాజీనామాతో అక్కడ ఖాళీ అయింది. అందుకే ఆయన స్థానంలో కొత్త నేతను ఎంపిక చేయనున్నారు జగన్మోహన్ రెడ్డి.
* ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం
2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ గెలిచింది. తర్వాత మూడు రాజధానుల పై సానుకూల నిర్ణయం తీసుకుంది. విశాఖను పాలనా రాజధానిగా చేయడానికి ప్రయత్నాలు చేసింది. అందుకే రాజకీయంగా ఉత్తరాంధ్రకు ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చింది. అప్పట్లో నెంబర్ టూ గా ఉన్న విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించింది. కానీ కొన్నేళ్ల తర్వాత ఆయనపై ఫిర్యాదులు రావడంతో తొలగించింది. ఆయన స్థానంలో వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు ఇచ్చింది. అయితే ఈ ఎన్నికల తరువాత తిరిగి విజయసాయి రెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చారు జగన్. కానీ ఆయన రాజీనామాతో ఆ పోస్ట్ ఖాళీ అయ్యింది.
* తెరపైకి స్థానికత
అయితే ఈసారి ఉత్తరాంధ్ర సమన్వయకర్త( North Andhra co-ordinator ) బాధ్యతలను స్థానిక నేతలకు అప్పగించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రధానంగా ఈ పోస్టును బొత్స సత్యనారాయణ ఆశిస్తున్నట్లు ప్రచారం నడిచింది. ముందుగా ధర్మాన సోదరులతో పాటు గుడివాడ అమర్నాథ్ పేరు సైతం ప్రధానంగా వినిపించింది. కానీ చివరకు బొత్స సత్యనారాయణ వైపు జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపినట్లు టాక్ నడిచింది. కానీ ఇంతలోనే మరో పేరు తెరపైకి వచ్చింది. మాజీమంత్రి పేర్ని నానికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.
* 12న కీలక సమావేశం
ఈ నెల 12న ఉత్తరాంధ్ర పార్టీ శ్రేణులతో జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) సమావేశం కానున్నారు. అదేరోజు ఉత్తరాంధ్ర ఇన్చార్జి విషయంలో ప్రకటన చేయనున్నారు. అయితే ఇప్పటికే బొత్స సత్యనారాయణ జగన్ తో చర్చలు జరిపారు. దీంతో బొత్సకు ఉత్తరాంధ్ర ఇన్చార్జి పదవి ఇస్తారని అంతా భావించారు. కానీ ఇప్పుడు పేర్ని నాని పేరు సడన్ గా తెరపైకి వచ్చింది. ఈ విషయంపై బొత్సతో సైతం జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈనెల 12న జరిగే వైసీపీ శ్రేణుల సమావేశంలో అధినేత జగన్మోహన్ రెడ్డి పేర్ని నాని పేరు ప్రకటిస్తారని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: It seems that the former ministers name will be given the responsibility of uttarandhra
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com