Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Viral Video: కల్లు తాగిన చంద్రబాబు తరువాత ఏం చేశాడంటే.. వీడియో వైరల్!

Chandrababu Viral Video: కల్లు తాగిన చంద్రబాబు తరువాత ఏం చేశాడంటే.. వీడియో వైరల్!

Chandrababu Viral Video: ఏపీ సీఎం చంద్రబాబు చాలా క్రమశిక్షణగా ఉంటారు. ఆహారం విషయంలో సైతం చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ఏడు పదుల వయసులో కూడా చాలా ఆరోగ్యంగా కనిపిస్తారు. రోజుకు 16 గంటలు పని చేసినా ఎక్కడా బడలిక ఉండదు. మితాహారం తీసుకుంటారు. యోగా చేస్తారు. ఇక వ్యసనాలు అంటూ ఏమీ లేవు. అందుకే ఈ వయసులో కూడా చాలా ఆరోగ్యంగా కనిపిస్తారు. అయితే ఉన్నట్టుండి చంద్రబాబు కల్లు తాగుతూ కనిపించారు. సోషల్ మీడియాలో ఆ […]

Chandrababu Viral Video: ఏపీ సీఎం చంద్రబాబు చాలా క్రమశిక్షణగా ఉంటారు. ఆహారం విషయంలో సైతం చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ఏడు పదుల వయసులో కూడా చాలా ఆరోగ్యంగా కనిపిస్తారు. రోజుకు 16 గంటలు పని చేసినా ఎక్కడా బడలిక ఉండదు. మితాహారం తీసుకుంటారు. యోగా చేస్తారు. ఇక వ్యసనాలు అంటూ ఏమీ లేవు. అందుకే ఈ వయసులో కూడా చాలా ఆరోగ్యంగా కనిపిస్తారు. అయితే ఉన్నట్టుండి చంద్రబాబు కల్లు తాగుతూ కనిపించారు. సోషల్ మీడియాలో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే ఆయన తాగాలని కాదు. జస్ట్ రుచి చూశారట. ఏది ఏమైనా ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

* గతానికి భిన్నంగా..
గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. వీలైనంతవరకు సామాన్యులతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రారంభం, ప్రతి నెల పింఛన్ల పంపిణీకి గాను ఏదో ఒక జిల్లాను ఎంచుకొని.. నేరుగా పింఛన్ అందించడమే కాదు సామాన్యులతో మమేకం అవుతున్నారు. జూన్ నెల కు సంబంధించి పింఛన్ నిన్ననే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని రామవరం లో అందించారు. ప్రతి నెల ఏదో ఒక జిల్లాలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది మాత్రం చామవరాన్ని ఎంపిక చేసుకోవడం విశేషం.

* గీత కార్మికుడి ఇంటికి..
ఈసారి చంద్రబాబు కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లారు. గ్రామంలో పూరి గుడిసెలో నివసిస్తున్న సింహాచలం సీఎం చంద్రబాబు తమ ఇంటికి రావడంతో ఆనందంతో మురిసిపోయాడు. సీఎం చంద్రబాబు సింహాచలం మనవడిని ఆత్మీయంగా ముద్దాడారు. ఇంటి ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నారు. సింహాచలం కోడలు చదువుకోవడంతో ఆమెకు ఉద్యోగం కల్పించాలని అక్కడ ఉన్న అధికారులను ఆదేశించారు. అనంతరం సింహాచలం నుంచి కల్లుగీతకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. సింహాచలం తమ కష్టాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఇంతలో సింహాచలం మేనల్లుడు తాటి చెట్టు ఎక్కి కల్లు తీశాడు. దానిని పరిశీలించిన చంద్రబాబు.. కల్లును రుచి చూసే ప్రయత్నం చేశారు. సింహాచలం తాటి బొరిగలో కల్లు వేసి ఇవ్వగా.. చంద్రబాబు రుచి చూశారు. బాగుంది అని అభినందించారు. సింహాచలం కుటుంబం ఉండేందుకు ఇల్లు, ఆపై మౌలిక వసతులు కల్పించాలని అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper