Homeఆంధ్రప్రదేశ్‌Volunteers: 'వాలంటీర్లు'పై చంద్రబాబు, పవన్ ది ఒకటే అభిప్రాయం

Volunteers: ‘వాలంటీర్లు’పై చంద్రబాబు, పవన్ ది ఒకటే అభిప్రాయం

Volunteers: ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్ల పంపిణీ జరిగింది. వాలంటీర్లు లేకుండా పింఛన్లు పంపిణీ చేయవచ్చని కూటమి ప్రభుత్వం నిరూపించింది. ఈ తరుణంలో వాలంటీర్లను కొనసాగిస్తారా? కొత్తవారిని నియమిస్తారా? అన్న విషయంలో సస్పెన్షన్ సాగుతోంది. అయితే ప్రభుత్వ తీరు చూస్తుంటే మరోలా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేయవచ్చని నిరూపించింది ప్రభుత్వం. ఒక విధంగా చెప్పాలంటే వాలంటీర్ల అవసరం లేదని చెప్పేందుకే ఈ ప్రయత్నం చేసింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏప్రిల్, మేలో సచివాలయ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేయాలని తమ కోరామని.. కానీ జగన్ సర్కార్ అలా చేయలేదన్నారు. దానిని నిరూపించేందుకే తాము సచివాలయ ఉద్యోగులతో పింఛన్లు ఇప్పించామని గుర్తు చేశారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం వలంటీర్ల వ్యవస్థ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో తొలి బహిరంగ సభను ఏర్పాటు చేశారు. స్థానికులతో మనసు గుత్తి మాట్లాడారు. ఎన్నికల ఫలితాల తర్వాత తాను ఊరేగింపులు చేయాలనుకోలేదని.. ఇప్పుడు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్లు పవన్ తెలిపారు. ప్రస్తుతం తాను పాలనా విధానాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తనను భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించిన పిఠాపురం ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

వాలంటీర్లు లేకుండా పింఛన్లు అందించడం సాధ్యం కాదని వైసీపీ ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు పవన్. కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లు రద్దు అవుతాయని కూడా బెదిరించిన వైనాన్ని గుర్తు చేశారు. అందుకే పింఛన్ మొత్తాన్ని పెంచి.. సచివాలయ ఉద్యోగుల ద్వారా అందించగలిగామని.. నాలుగు రోజుల్లో చేయాల్సిన పని ఒక రోజులో చేసి చూపించామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి నిధుల కొరత తీవ్రంగా ఉందని.. తనకు వచ్చిన జీతాన్ని సైతం విడిచి పెడుతున్నానని.. క్యాంప్ ఆఫీసునకు సొంతంగా ఫర్నిచర్ ఏర్పాటు చేసుకున్నట్లు కూడా పవన్ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులతో పనిచేయించుకోవడం మన విధి అని కూడా చెప్పుకొచ్చారు. ఒకవైపు నిధుల కొరత, మరోవైపు దుబారా ఖర్చును నియంత్రించడం, ఇంకోవైపు ప్రభుత్వ ఉద్యోగులతో పనిచేయించుకోవాలని పవన్ చెప్పడం చూస్తుంటే.. వాలంటీర్ల అవసరం లేదని భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపిస్తామని కూడా పవన్ చెప్పుకొచ్చారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper