Andhra Pradesh Gold Mines: జాతీయస్థాయిలో ఏపీ భరోసారీ ప్రత్యేక గుర్తింపు పొందింది.’గోల్డెన్’ ఛాన్స్ దక్కించుకుంది.. రాయలసీమలో మరో జిల్లాలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్య వహిస్తున్న చిత్తూరులో భారీగా నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం చిగురు గుంట బి సానత్తం లో బంగారు గనులపై దృష్టి సారించింది. ఈ బంగారు నిక్షేపాలను దక్కించుకునేందుకు నిర్వహించే వేలంలో పాల్గొనాలని భావిస్తోంది. మరోవైపు వేలం లేకుండా ఈ గనులను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు కేటాయించేలా చూడాలని కేంద్రాన్ని కోరే అవకాశం కూడా ఉంది. ఈ బంగారు గనులను దక్కించుకుంటే ఎంతో మేలు జరగనుంది రాష్ట్రానికి. ఇక్కడ ఏకంగా 22 లక్షల టన్నుల బంగారం ఖనిజాలు ఉన్నట్లు గుర్తించారు. ఒక టన్ను ఖనిజాన్ని శుద్ధి చేస్తే ఐదు పాయింట్ 64 గ్రాముల వరకు బంగారం సేకరించవచ్చని చెబుతున్నారు.
* భారీగా బంగారం వచ్చే ఛాన్స్..
తాజాగా గుర్తించిన ఈ బంగారం నిక్షేపంలో.. కనుజాన్ని వెలికి తీస్తే 12,500 కిలోల బంగారం వస్తుందని చెబుతున్నారు. గతంలో ఈ ప్రాంతంలో ఖనిజాన్ని బయటకు తీసి కొంత శుద్ధి చేసి అక్కడి నుంచి సమీపంలో ఉన్న కర్ణాటక కోలార్ గోల్డ్ మైన్స్ దగ్గరకు తరలించేవారు. అక్కడ ఖనిజాన్ని శుద్ధి చేసి బంగారాన్ని సేకరించేవారు. అయితే అప్పట్లో తవ్వకాలతో పాటు తరలింపునకు భారీగా ఖర్చు జరిగింది. అందుకే తవ్వకాలను నిలిపివేశారు. 2000లో గనులను మూసివేశారు. 2018లో మరోసారి వేలం నిర్వహించగా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఈ గనులను దక్కించుకుంది. కోర్టు కేసుల కారణంగా తరువాత చర్యలు ప్రారంభం కాలేదు.
* ఇటీవల కర్నూలులో..
ఇటీవల కర్నూలు జిల్లాలో బంగారు గనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. జొన్నగిరి మండలంలో గనులు ప్రారంభం అయ్యాయి. అందుకే తాజాగా సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో గనులపై ఖనిజాభివృద్ధి సంస్థ దృష్టి పెట్టింది. అందుకే వేలంలో పాల్గొనాలని భావిస్తోంది. ఎప్పటికీ 37 కోట్ల బ్యాంకు గ్యారంటీ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వేలంలో బిడ్డ ఏదైనా సంస్థతో కలిపి బంగారం తవ్వకాలు జరిపే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం.






