spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Govt Advisors: సలహాదారుల నియామకం.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటి?!

AP Govt Advisors: సలహాదారుల నియామకం.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటి?!

AP Govt Advisors: ఏపీలో( Andhra Pradesh) సలహాదారుల నియామకం జరుగుతోంది. తాజాగా కార్టూనిస్ట్ శ్రీధర్, డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు సలహాదారులుగా నియమితులయ్యారు. దీంతో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైసిపి హయాంలో సైతం చాలామంది సలహాదారులను నియమించారు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా నియమిస్తున్నారు. అయితే అప్పటికీ.. ఇప్పటికీ ఒక తేడా కనిపిస్తోంది. గతంలో రాజకీయ నిరుద్యోగం కోసం భర్తీ చేసేవారు. ఇప్పుడు ఆయా రంగాల్లో నిపుణులను నియమిస్తున్నారు. సలహాదారులు అనేది రాజకీయ కోణంలో నియామకాలు జరగడం లేదు. చివరకు ఢిల్లీలో ఏపీ ప్రతినిధిగా కూడా ఐపీఎస్ అధికారిని నియమించారు.

* అంతా పార్టీ మనుషులతోనే..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో ఓ 40 మంది సలహాదారుల నియామకం జరిగింది. పార్టీకి పనికి వచ్చారని.. పార్టీకి పనికొస్తారని.. సామాజిక వర్గం వారని.. ఇలా అన్ని అంశాలను.. సమీకరణలను పరిగణలోకి తీసుకుని సలహాదారులను నియమించేవారు. అసలు సాగునీటి వనరులు గురించి తెలియని వారు సాగునీటి శాఖ సలహాదారులుగా నియమితులయ్యారు. ఐటీ గురించి తెలియని వారు సైతం ఐటి సలహాదారులు అయ్యారు. చివరకు సినిమా మనుషులను తెచ్చి మీడియా సలహాదారులుగా నియమించుకున్నారు. వారు సైతం సలహాదారులు కంటే రాజకీయ నాయకులం అన్నట్టు వ్యవహరించారు. ఏకంగా మీడియా సమావేశాలు నిర్వహించి నిత్యం రాజకీయ విమర్శలు చేసేవారు.

* గతానికి విరుద్ధం..
అయితే వైసిపి హయాంలో సలహాదారుల నియామకం అనేది ఒక నిత్య ప్రక్రియ గా సాగేది. ఫలానా సలహాదారుడు అంటూ సొంత పార్టీ శ్రేణులకు కూడా తెలియని చాలామంది ఉన్నారు. అయితే అటువంటి వ్యవస్థ ఉండకూడదని కూటమి ప్రభుత్వం తీర్మానించుకుంది. నిపుణులతో పాటు ఆయా రంగాల్లో ప్రముఖులను మాత్రమే సలహాదారులుగా నియమించుకోవాలని భావించింది. అందులో భాగంగానే ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు వంటివారికి క్యాబినెట్ హోదా తో కూడిన సలహాదారు పదవి ఇచ్చింది. అయితే ప్రభుత్వం నుంచి వచ్చే పారితోషికాలు, హోదాలు స్వీకరించలేదు చాగంటి. కానీ తనపై మోపిన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. విద్యార్థులకు నైతిక విలువలపై మెరుగైన సలహాలు అందించగలుగుతున్నారు. ఇప్పుడు ప్రముఖ ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణ రాజు, కార్టూనిస్ట్ శ్రీధర్ కు సలహాదారు పదవిలో నియమించడం మాత్రం సహేతుకమే. ఎందుకంటే వీరు రాజకీయాలు చేయలేదు. రాజకీయాలు మాట్లాడలేదు. ఇకముందు మాట్లాడరు కూడా. అయితే ఏదో చక్కటి పరిణామంగా విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper