Home Blog

Tecno నుంచి అదిరిపోయే డిస్ ప్లే.. మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లోకి...

Tecno Camon 50 Ultra 5G
Tecno Camon 50 Ultra 5G

Tecno Camon 50 Ultra 5G: టెక్నో (Tecno) కంపెనీ నుంచి సరికొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి రావడానికి సిద్ధమైంది. ప్రీమియం లుక్ తో పాటు ఏఐ ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ గురించి సమాచారం ఇప్పటికే లీక్ కావడంతో దీనిపై ఆసక్తి పెరిగింది. దీంతో దీనిని దక్కించుకోవడానికి చాలా మంది వినియోగదారులు రెడీగా ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది. మరి ఈ ఫోన్ ఎలా ఉండబోతుందో చూద్దాం.. లాంచ్ తేదీ మరియు అమెజాన్ లభ్యత:

Tecno నుంచి Camon 50 Ultra 5G జూలై 17, మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా విడుదల కానుంది. ఆ తర్వాత దీనిని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్‌ చాలా ప్రీమియం లుక్‌తో డిజైన్ చేసింది. దీని కోసం ప్రత్యేకంగా ‘సిల్క్-ఫ్లో’ డిజైన్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది చేతిలో పట్టుకున్నప్పుడు మంచి గ్రిప్, స్లిమ్ మరియు స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఈ మొబైల్ భారత్‌లో నెబ్యులా టైటానియం , సైప్రస్ గ్రీన్ , మిస్టీ పర్పుల్ అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో లభించనుంది. అంతేకాకుండా నీరు, ధూళి నుంచి రక్షణ కోసం IP69 రేటింగ్స్ కూడా ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల AMOLED కర్వ్‌డ్ డిస్‌ప్లేతో వస్తోంది. 1.5K రిజల్యూషన్ తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల స్మూత్ స్క్రోలింగ్ చేసుకోవచ్చు. అవుట్‌డోర్‌లో స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 4,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆల్టిమేట్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను అమర్చారు.

‘Sees It All’ అనే కాన్సెప్ట్‌తో ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. దీని వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా , 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 50MP ఆటోఫోకస్ కెమెరా ఇచ్చారు. ఇందులో ఫోటోలను అందంగా మార్చే AI Photo Enhancement వంటి ఇంటెలిజెంట్ ఫీచర్లు హైలైట్‌గా నిలవనున్నాయి.

ఈ ఫోన్‌లో రోజంతా ఛార్జింగ్ బ్యాకప్ ఇచ్చేలా 6,500mAh భారీ బ్యాటరీని అందించారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సినిమా, మ్యూజిక్ లవర్స్ కోసం మెరుగైన సౌండ్ క్వాలిటీని అందించేలా స్టీరియో స్పీకర్లతో పాటు డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్‌ను కూడా ఇందులో చేర్చారు. భారత మార్కెట్లో దీని ఖచ్చితమైన ధర మరియు ఆఫర్ల వివరాలు జూలై 17 లాంచ్ రోజున వెల్లడవుతాయి.

బరితెగించి బూతు దుస్తులు ధరించిన హీరోయిన్.. పరువు పోయిందిగా..

Uorfi Javed
Uorfi Javed

Uorfi Javed: ఈమధ్య కాలంలో హీరోయిన్లు దుస్తుల విషయం లో హద్దులు దాటేస్తున్నారు. సమాజం లో తిరుగుతున్నాము , ఇలాంటి దుస్తులు వేసుకుంటే పరువు పోతుంది అనేది కూడా పట్టించుకోవడం లేదు , ఎదో ఒక విధంగా జనాల్లో హాట్ టాపిక్ గా మారాలని బరితెగించేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే , శివాజీ చేసిన కామెంట్స్ గుర్తుకు వస్తుంటాయి. ఆయన లాగా ఎంతో మంది సామాన్యులు ఇలాంటి వాళ్ళని చూసి ఫ్రస్ట్రేషన్ కి గురై అప్పుడప్పుడు ఇలా నోరు జారుతుంటారు. రీసెంట్ గా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఉర్ఫీ జావీద్ వేసుకున్న దుస్తులు చూస్తే , శివాజీ వంటి వారు అడ్రస్ కనుక్కొని మరీ ఆమె ఇంటికి వెళ్లి కొడుతారేమో. స్త్రీ సమాజం సిగ్గు పడే స్థాయి దుస్తులను ధరించింది ఆమె. వాటిని వర్ణించలేకపోతున్నాం , మీరే ఈ క్రింది వీడియో లో చూడండి.

ఇలాంటి హీరోయిన్లు హద్దులు దాటి , పవిత్రమైన స్త్రీ జాతిని అవమానిస్తున్నారు. తిరిగి ప్రశ్నిస్తే స్త్రీలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో నిర్ణయించడానికి మీరెవరు అంటూ విక్టిమ్ కార్డు ప్లే చేస్తారు. ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఫ్యాషన్ అయిపోయింది. కనీసం ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అనే ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎలా?, సెలబ్రిటీ హోదా లో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళని చూసి కుర్రాళ్ళు ఏమి నేర్చుకోవాలి?. వీళ్ళు చేసినప్పుడు మేము ఎందుకు చేయకూడదు అని వీళ్ళని చూసి మరికొంతమంది హీరోయిన్లు తయారు అవుతారు. ఇక ఈ ఉర్ఫీ జావీద్ విషయానికి వస్తే ఈమె బాలీవుడ్ లో కమర్షియల్ యాడ్స్ ద్వారా పాపులర్ అయ్యి , ఆ తర్వాత హిందీ బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నది. ఈ సీజన్ ద్వారా ఆమెకు వచ్చిన ఫేమ్ తో ఒక సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చింది.

కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత ఈమె ఎక్కువగా హిందీ సీరియల్స్ లో , రియాలిటీ షోస్ లో కనిపిస్తూ వచ్చింది. కేవలం సినిమాల్లో అవకాశాల కోసమే , ఆమె ఇలాంటి దుస్తులు ధరించి ఉంటుందని అంటున్నారు నెటిజెన్స్. నిర్మాతలకు తాను ఏ స్థాయిలో అయినా అందాల ప్రదర్శనకు సిద్దమే అని చెప్పడానికి ఆమె ఈ రేంజ్ లో బరితెగించింది. కచ్చితంగా ఇలాంటి వారిపై సీరియస్ గానే యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళ ప్రభావం యువత మీద పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంటుందో అర్థం కావడం లేదు. ఇలాగే వదిలేస్తే ఇలాంటోళ్ళు రేపటి రోజున ఎంతకైనా తెగిస్తారు.

 

View this post on Instagram

 

A post shared by Mobile Multiplex (@mobile_multiplex)

మల్టీ టాస్కింగ్, హెవీ గేమింగ్ కోరుకునేవారికి Motorola బెస్ట్ ఫోన్ ఇదే..

Motorola Edge 70 Max
Motorola Edge 70 Max

Motorola Edge 70 Max: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో Motorola కంపెనీ తనదైన ముద్ర వేసుకుంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఆకట్టుకునే మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి. అయితే లేటేస్ట్ గా ప్రీమియం సెగ్మెంట్‌లో మరో సంచలనానికి తెరలేపింది. మోటోరోలా ఎడ్జ్ 70 సిరీస్‌లో భాగంగా అత్యంత పవర్‌ఫుల్ ఫీచర్లతో Motorola Edge 70 Max మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించిన మైక్రోసైట్ ఇప్పటికే లైవ్ అయింది. అయితే ఇందులో కొన్ని ఫీచర్లు, సౌకర్యాల గురించి తెలియడంతో యూత్ ఆగలేకపోతున్నారు. ఇంతకీ ఈ మొబైల్ ఎలా ఉంటుందంటే?

Motorola Edge 70 Max స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణ ఇందులో ఉండే బ్యాటరీ. ఇందులో 8000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఉంచారు. అంతేకాకుండా ఈ బ్యాటరీ సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఫోన్ స్లిమ్‌గా ఉంటూనే, రెండు నుంచి మూడు రోజుల పాటు నిరంతరాయంగా బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. దీనికి తోడు, వైర్‌లెస్ పవర్ కన్సార్టియం (WPC) లిస్టింగ్ ప్రకారం.. ఆపిల్ మ్యాగ్‌సేఫ్ తరహాలోనే ఈ ఫోన్ Qi2 మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ఫలితంగా ఎలాంటి వైర్ల ఇబ్బంది లేకుండా మాగ్నెటిక్ ఛార్జర్ల సాయంతో సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్‌లో అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ Qualcomm Snapdragon 8 Gen 5 ని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ ,గ్రాఫిక్స్ పనులకు బాగా ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేకంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టాస్క్‌ల కోసం ఈ ఫోన్‌లో ఒక డెడికేటెడ్ ‘Moto AI Key’ (బటన్) ను ఇస్తున్నారు. ఇది మునుపటి మోడళ్లతో పోలిస్తే 46 శాతం మెరుగైన ఎన్‌పియు పనితీరును అందిస్తూ, యూజర్లకు సరికొత్త AI అనుభూతిని పరిచయం చేయనుంది.

మోటోరో ఎడ్జ్ 70 సిరీస్‌లోని ఇతర మోడళ్లు కర్వ్‌డ్ డిస్‌ప్లేతో రాగా, ఈ ‘మ్యాక్స్’ వేరియంట్ మాత్రం క్లాసిక్ లుక్ ఇచ్చే ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే తో ఉండనుంది. ఫ్లాట్ ప్యానెల్ సెంటర్ పంచ్-హోల్ సెల్ఫీ కెమెరాతో విభిన్నంగా రానుంది. వెనుక భాగంలో స్టైలిష్ స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఫొటోగ్రఫీ లవర్స్ కోసం దీనిలో 200MP ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది.

'లెనిన్' సక్సెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకున్న అక్కినేని నాగార్జున.. వీడియో వైరల్..

Akhil Lenin Success Meet
Akhil Lenin Success Meet

Akhil Lenin Success Meet: వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురుకునే వ్యక్తి జీవితం లో , ఒక్క సక్సెస్ వస్తే చాలు, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. మీలో కూడా ఎవరో ఒకరు మీ జీవితం లో ఈ అనుభూతిని పొందే ఉంటారు. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ సరిగ్గా అలాంటి అనుభూతినే పొందుతోంది. అఖిల్ వెండితెర అరంగేట్రం చేసినప్పటి నుండి , నిన్న మొన్నటి వరకు కూడా కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సక్సెస్ కూడా లేదు అనే సంగతి అందరికీ తెలిసిందే. అఖిల్ కి ఇక ఎప్పటికీ హిట్ రాదు , ఇక ఆయన హీరోగా పనికిరాదు అంటూ సోషల్ మీడియాలో అనేక మంది అతన్ని అవహేళన చేశారు. అక్కినేని ఫ్యాన్స్ కూడా కౌంటర్లు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ట్రాక్ రికార్డు అలా ఉన్నింది మరి. సరిగ్గా అలాంటి సమయం లోనే ‘లెనిన్’ చిత్రాన్ని ప్రకటించారు.

ఈ సినిమా విడుదలకు ముందే నాగార్జున నుండి స్టాంప్ పడిపోయింది. కచ్చితంగా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని , కొత్త అఖిల్ ని చూస్తారు అంటూ ఆయన చాలా నమ్మకం గా చెప్పిన మాటలను చూసి అభిమానులు మాత్రమే కాదు , ప్రేక్షకులు కూడా నమ్మారు. ప్రమోషనల్ కంటెంట్ కూడా చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. అలా మంచి హైప్ తో విడుదలైన ఈ సినిమా నిన్న ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ టాక్ కి తగ్గట్టుగానే సెన్సేషనల్ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. కెరీర్ లో ఒక్క సక్సెస్ కూడా లేకుండా ఈ రేంజ్ ఓపెనింగ్ సాధించడం చూస్తుంటే , అఖిల్ పొటెన్షియల్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే నేడు ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో అభిమానులకు కావాల్సినంత గూస్ బంప్స్ , ఎమోషనల్ మూమెంట్స్ దొరికాయి.

ఈ ఈవెంట్ లో సినిమా థియేటర్స్ వద్ద అభిమానుల రియాక్షన్స్ అన్నిటిని కలిపి ఒక వీడియో గా చేసి LED పై ప్లే చేశారు. ఈ వీడియో చూసి అక్కినేని నాగార్జున కంటతడి పెట్టుకున్నారు. ఇన్నేళ్ల సుదీర్ఘమైన నాగార్జున కెరీర్ లో ఎప్పుడూ ఇంతలా ఎమోషనల్ అవ్వడం ఫ్యాన్స్ చూడలేదు. కేవలం నాగార్జున ముఖం లో నవ్వు మాత్రమే చూస్తూ వచ్చిన ఫ్యాన్స్ , మొట్టమొదటి సారి ఎమోషనల్ అవ్వడాన్ని చూసి , వాళ్ళు కూడా బాగా ఎమోషనల్ అయిపోయారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

హాస్పిటల్ బెడ్ పై ఉన్న పండు మాస్టర్ కి శేఖర్ మాస్టర్ చేసిన గొప్ప పని చూస్తే ..సెల్యూట్ చేస్తారు..

Pandu Master
Pandu Master

Pandu Master: ఈటీవీ లో ప్రసారమయ్యే పాపులర్ డ్యాన్స్ షో ‘ఢీ ‘ ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన పండుకి మాస్టర్, రీసెంట్ గానే ఒక ఈవెంట్ కి వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్ కి గురై తీవ్రంగా గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. కాళ్లకు తీవమైన గాయాలు అవ్వడంతో నడవలేని పరిస్థితి ఏర్పడింది. ‘ఢీ 20’ షోలో టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న పండు మాస్టర్ , ఈసారి టైటిల్ కచ్చితంగా కొడతాడని అంతా అనుకున్నారు. ఆయన ఈ సీజన్ లో ఎక్కువగా వాడిన డైలాగ్ కూడా ‘ఈ సాలా కప్ నామ్ దే’. ఈ డైలాగ్ తో ఆయన చాలా ఫన్ కూడా జనరేట్ చేశారు. రెండు మూడు సెన్సేషనల్ పెర్ఫార్మన్స్ లు కూడా ఇచ్చారు పండు మాస్టర్. అలా దూసుకుపోతున్న సమయం లో కాళ్లకు తీవ్రమైన గాయాలు అవ్వడం తో ఈ షో నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పండు మాస్టర్ ని శేఖర్ మాస్టర్ నేడు కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన రావడమే కాకుండా, తన టీం మొత్తాన్ని తీసుకొచ్చి , పండు మాస్టర్ ని కలిసి ఆప్యాయంగా పలకరించారు. ఎప్పటి లాగానే ఇప్పుడు కూడా పండు మాస్టర్ చాలా సరదాగా మాట్లాడడం చూసేందుకు గొప్పగా అనిపించింది. ‘ఢీ’ సిరీస్ సమయం లోనే పండు మాస్టర్ కి శేఖర్ మాస్టర్ తో పాటు , ఆ షో లో పాల్గొన్న ప్రతీ ఒక్కరితో మంచి సాన్నిహిత్య సంబంధం ఏర్పడింది. యాంకర్ ప్రదీప్ అయితే , పండు మాస్టర్ తండ్రి కి ఆపరేషన్ సమయం డబ్బు సహాయం కూడా చేసారు. ఇలా వీళ్లంతా ఒకే కుటుంబం లాగా కలిసి పెరుగుతూ వచ్చారు. ఎల్లప్పుడూ నవ్వుతూ , అందరినీ నవ్వించే పండు మాస్టర్ కి ఇలా జరగడం తో తట్టుకోలేక పోయారు.

అది కూడా కెరీర్ పీక్ రేంజ్ కి వెళ్తున్న సమయంలో ఇలా జరగడం దురదృష్టకరం అనే చెప్పాలి. అతని టైం బాగా ఉండుంటే , కచ్చితంగా ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేవారు. కానీ దురదృష్టం చూడండి ఎలా ఉందో , దేవుడు ఎందుకు ఇలాంటి టాలెంట్ ఉన్న కుర్రాళ్లకు ఇలాంటి కష్టాలు ఇస్తారో అర్థం కాదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే పండు మాస్టర్ త్వరలోనే కోలుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు డాక్టర్లు. ఇంతకు ముందు తో పోలిస్తే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడింది అట. ఒకవేళ పూర్తి స్థాయిలో కోలుకుంటే బిగ్ బాస్ షో కి వస్తారో లేదో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by OkTelugu (@okteluguofficial)

చైనాలో అతిపెద్ద డ్యాం... భవిష్యత్తులో ఢాం!

China Brahmaputra Dam
China Brahmaputra Dam

China Brahmaputra Dam: చైనా తమ దేశ ప్రయోజనాల కోసం అనేక తప్పుడు మార్గాలు అనుసరిస్తుంది. వివిధ దేశాల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. తైవాన్, భారత్‌ సరిహద్దుల్లోనూ తప్పుడు పనులు చేస్తోంది. తాజాగా భారత ప్రయోజనాలను దెబ్బతీసేలా టిబెట్‌లోని మెడాగ్‌ (మోటువో) కౌంటీలో బ్రహ్మపుత్ర నది (యార్లుంగ్‌ సాంగ్పో)పై ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోపవర్‌ ప్రాజెక్టును నిర్మిస్తోంది. భారత సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ భారీ ప్రాజెక్టు దిగువ ప్రాంతాలైన భారత్, బంగ్లాదేశ్‌కు నీటి ప్రవాహం, వరదలు, పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు చైనా సొంత భూగర్భ శాస్త్రవేత్తలు ఈ డ్యామ్‌కు తీవ్రమైన భూకంప, కొండచరియల ముప్పు ఉందని హెచ్చరించడం వల్ల ప్రాజెక్టు భవిష్యత్తు మరింత సంక్లిష్టంగా మారింది.

డ్యామ్‌ వివరాలు..
ఈ ప్రాజెక్టును మెడాగ్‌ హైడ్రోపవర్‌ స్టేషన్‌ అని పిలుస్తారు. ఇది యార్లుంగ్‌ సాంగ్పో నది గ్రేట్‌ బెండ్‌ ప్రాంతంలో ఐదు క్యాస్కేడింగ్‌ స్టేషన్లతో నిర్మాణం జరుగుతోంది. ఇన్‌స్టాల్డ్‌ కెపాసిటీ 60 గిగావాట్లు (60,000 మెగావాట్లు). వార్షిక విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం సుమారు 300 బిలియన్‌ కిలోవాట్‌–గంటలు అని అంచనా. ఇది చైనాలోని థ్రీ గోర్జెస్‌ డ్యామ్‌ కంటే మూడు రెట్లు ఎక్కువ. నిర్మాణ ఖర్చు 1.2 ట్రిలియన్‌ యువాన్‌ (సుమారు 137 నుంచి 167 బిలియన్‌ డాలర్లు) అని అంచనా. చైనా ప్రభుత్వం డిసెంబర్‌ 2024లో ఆమోదించిన ఈ ప్రాజెక్టు నిర్మాణం జూలై 2025లో ప్రారంభమైంది. 2033 నాటికి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కావాలని లక్ష్యం.

భారతదేశ ఆందోళనలు.
ఈ డ్యామ్‌ భారత సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల భారత్‌కు తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయి. చైనా నీటిని మళ్లించి పొడి కాలంలో నది ప్రవాహాన్ని 85 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని భారత్‌ భయపడుతోంది. ఇది అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లో వ్యవసాయం, తాగునీరు, జలవిద్యుత్‌ ప్రాజెక్టులను ప్రభావితం చేస్తుంది. అలాగే వరదల సమయంలో ఒకేసారి భారీగా నీటిని వదిలేస్తే తీవ్ర వరదలు వచ్చే ప్రమాదం ఉంది. భారత్‌ ఈ సమస్యను ఎదుర్కొనడానికి అప్పర్‌ సియాంగ్‌ డ్యామ్‌ వంటి కౌంటర్‌ ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది.

చైనా శాస్త్రవేత్తల హెచ్చరికలు..
ఆశ్చర్యకరంగా, చైనా సొంత భూగర్భ శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టుకు తీవ్రమైన ముప్పు ఉందని హెచ్చరించారు. జూన్‌ 2026లో చైనీస్‌ భాషా జర్నల్‌ సెడిమెంటరీ జియాలజీ అండ్‌ టెథ్యాన్‌ జియాలజీలో ప్రచురితమైన పేపర్‌ డ్యామ్‌ అడుగున నేరుగా నడుస్తుందని తెలిపింది. ఈ ఫాల్ట్‌ ప్లీస్టోసీన్‌ కాలం నుంచి చాలా యాక్టివ్‌గా ఉంది. భూకంపాలు, ఫాల్ట్‌ కదలికలు, నేల లూజ్‌ స్ట్రక్చర్‌ వల్ల కొండచరియలు, కొల్లాప్స్‌లు సులభంగా సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రిజర్వాయర్‌ ప్రాంతంలోని వాలులను బలపరచాలని, రిటైనింగ్‌ ప్రొటెక్షన్లు అమలు చేయాలని సూచించారు. 1950లో జరిగిన 8.6–8.7 తీవ్రత గల అస్సాం–టిబెట్‌ భూకంపం ఈ ప్రాంతం సమీపంలోనే సంభవించింది.

పర్యావరణ ప్రభావాలు..
చైనా ఈ మెగా ప్రాజెక్టు రెండు వైపులా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు ఇది శుభ్రమైన విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా ఆర్థిక, ఎనర్జీ భద్రతను అందిస్తుంది. మరోవైపు హిమాలయాల్లోని అత్యంత సున్నితమైన భౌగోళిక నిర్మాణం వల్ల భూకంపాలు, భారీ కొండచరియలు, గ్లేషియల్‌ లేక్‌ అవుట్‌బరస్ట్‌ ఫ్లడ్స్‌ వంటి ప్రమాదాలు ఎక్కువ. థ్రీ గోర్జెస్‌ డ్యామ్‌ కంటే మూడు రెట్లు పెద్దదైన ఈ ప్రాజెక్టు ఖర్చు, రిస్క్‌ కూడా అధికం. చైనా సొంత శాస్త్రవేత్తలు హెచ్చరించడం వల్ల ఈ ప్రాజెక్టు రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారింది.

భారత్‌పై ప్రభావం..
భారతదేశం కోసం ఇది నీటి భద్రతకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. బ్రహ్మపుత్ర నది ద్వారా ఆధారపడే లక్షలాది మంది జీవనోపాధి, వ్యవసాయం, పర్యావరణం ప్రభావితం కావచ్చు. అంతర్జాతీయ స్థాయిలో జల వనరులను ఉమ్మడిగా నిర్వహించే ఒప్పందాలు లేనప్పుడు, ఇలాంటి ప్రాజెక్టులు ద్వైపాక్షిక సంబంధాలను కూడా ప్రభావితం చేస్తాయి. చైనా నీటిని మళ్లించం అని చెప్పినప్పటికీ, డ్యామ్‌ ఉనికి వల్ల నీటి నియంత్రణ శక్తి చైనా చేతుల్లోకి వెళ్లడం భౌగోళిక రాజకీయాల్లో కీలకం. పర్యావరణవేత్తలు జీవవైవిధ్య నష్టం, స్థానిక సముదాయాల స్థానభ్రంశం వంటి సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.

చైనా బ్రహ్మపుత్ర డ్యామ్‌ ప్రాజెక్టు ఇప్పుడు కేవలం జల రాజకీయాల సమస్యగా మాత్రమే కాకుండా, భూకంప, పర్యావరణ సవాళ్లతో కూడిన సంక్లిష్ట సమస్యగా మారింది. చైనా సొంత శాస్త్రవేత్తల హెచ్చరికలు ఈ ప్రాజెక్టు రూపకల్పనలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. భారతదేశం కోసం ఇది నీటి భద్రత, పర్యావరణ రక్షణపై మరింత దృష్టి పెట్టాల్సిన సమయం. ద్వైపాక్షిక సంభాషణలు, శాస్త్రీయ సహకారం పారదర్శకత ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కొనడం అవసరం.

నారా బ్రాహ్మణి.. మోస్ట్ పవర్ఫుల్ విమెన్..బాబు, లోకేష్ ఏమోషనల్

nara brahmini

Nara Brahmani : మామ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించిన వ్యక్తి. నాన్న తెలుగు సినిమా రంగంలో కీలకమైన కథానాయకుడు.. భర్త ఏపీ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి.. అత్త హెరిటేజ్ ఫుడ్స్ చైర్ పర్సన్.. ఇలా ఎటు చూసుకున్నా సరే బలమైన ఆర్థిక నేపథ్యం.. అంతకుమించిన కుటుంబం ఆమె సొంతం.. అయినప్పటికీ ఆమె పనిచేయడం మానలేదు. ప్రయోగాలు చేయడం వదులుకోలేదు. చివరిగా ఆమె మోస్ట్ పవర్ఫుల్ విమెన్ లాగా అవతరించింది. ఏకంగా ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో చోటు సంపాదించింది.

ఈ స్థాయిలో ఘనత సాధించిన ఆమె పేరు నారా బ్రాహ్మణి. ప్రస్తుతం నారా బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ లో అత్యంత కీలకమైన డెయిరీ విభాగాన్ని ఆమె పర్యవేక్షిస్తున్నారు. రైతులతో మమేకం కావడం.. నాణ్యమైన పాల ఉత్పత్తి సాధించడం.. వినియోగదారుల మనసు చూరగొనడం.. నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ ను అత్యున్నత స్థాయిలో నిలిపారు. ఫలితంగా ఈ కంపెనీ మరిన్ని లాభాలను సాధిస్తోంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా.. తమిళనాడు.. కర్ణాటకలో కూడా కార్యకలాపాలు సాగిస్తోంది. డెయిరీ ఉత్పత్తులను తయారు చేస్తూ మరింత మార్కెట్ సొంతం చేసుకుంటున్నది. దీని వెనక నారా బ్రాహ్మణి కృషి ఉంది. ఆమె ప్రణాళికలు.. భవిష్యత్తు లక్ష్యాలు హెరిటేజ్ కంపెనీని అత్యున్నత స్థాయిలో నిలిపాయి.

రైతులకు అందిస్తున్న ప్రయోజనాలు.. వినియోగదారులకు లభిస్తున్న నాణ్యమైన పాలు.. మిగతా అంశాలు నారా బ్రాహ్మణి లో ఉన్న అసలు సిసలైన వ్యాపారవేత్తను కార్పొరేట్ ప్రపంచానికి పరిచయం చేశాయి. ఆమె నాయకత్వ పటిమను గుర్తించిన ఫార్చ్యూన్ ఇండియా.. నారా బ్రాహ్మణిని ఇండియా 100 మోస్ట్ పవర్ఫుల్ విమెన్ గా ఎంపిక చేసింది. ఒక పారిశ్రామికవేత్తగా ఆమె కనబరుస్తున్న ప్రతిభ.. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను బలోపేతం చేయడం.. రైతులతో సాగిస్తున్న ప్రయాణం.. వారితో పెంచుకున్న బంధం.. పాల ఉత్పత్తిలో చేస్తున్న ఆవిష్కరణలు.. ఇవన్నీ కూడా నారా బ్రాహ్మణి ని నాయకత్వ పటిమకు నిదర్శనాలని భావించిన ఫార్చ్యూన్.. ఆమెకు 100 మోస్ట్ పవర్ఫుల్ విమెన్ జాబితాలో చోటు కల్పించింది. బ్రాహ్మణి ఈ అరుదైన ఘనత సాధించిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఆమె ఇటువంటి పురస్కారాలు మరిన్ని సాధించాలని కోరారు.

సైన్యం చేతికి మరో యుద్ధ నౌక.. భారత సముద్ర రక్షణలో కొత్త అధ్యాయం!

INS Mahendragiri
INS Mahendragiri

INS Mahendragiri: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్‌ సొంత రక్షణపై మరింత దృష్టిపెట్టింది. స్వదేశీ ఆయుధాల తయారీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఆయుధాలను వేగంగా తయారు చేస్తోంది. ఇక ఇటీవలికాలంలో సముద్ర రక్షణపైనా మోదీ దృష్టి పెట్టారు. ఈమేరకు వివిధ దేశాలలో పర్యటిస్తూ.. సముద్ర రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు భారత నౌకాదళాన్ని బలోపేతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ జాతికి అంకితం చేశారు. ప్రాజెక్ట్‌ 17ఏ కింద నిర్మించిన ఈ స్వదేశీ స్టెల్త్‌ ఫ్రిగేట్‌ భారతదేశ రక్షణ ఉత్పత్తి సామర్థ్యానికి మరో ముఖ్యమైన ఉదాహరణగా నిలిచింది. ఇది కేవలం ఒక నౌక కమిషనింగ్‌ మాత్రమే కాదు, ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యం వైపు సాగుతున్న ప్రయాణంలో ఒక మైలురాయి.

మహేంద్రగిరి సాంకేతిక సామర్థ్యాలు..
ఈ యుద్ధనౌక స్టెల్త్‌ టెక్నాలజీతో తయారైంది. దీని రూపకల్పనతో శత్రు రాడార్ల నుంచి సులభంగా గుర్తించడం కష్టం. బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్షిపణులు, అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలు, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ సామర్థ్యాలు దీనిలో భాగం. ఇవి బహుముఖ యుద్ధ పరిస్థితుల్లో నౌకను అత్యంత సమర్థవంతంగా మార్చుతాయి. ఆధునిక ఆయుధ వ్యవస్థలతో సన్నద్ధమైన ఈ ఫ్రిగేట్‌ భారత నౌకాదళం మొత్తం సామర్థ్యాన్ని పెంచుతుంది.

స్వదేశీ నౌకా నిర్మాణంలో ముందడుగు..
ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి ప్రాజెక్ట్‌ 17ఏ కింద నిర్మించిన ఆరవ స్టెల్త్‌ ఫ్రిగేట్‌. ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశం విదేశీ సాంకేతిక సహాయం లేకుండా అధునాతన యుద్ధనౌకలను నిర్మించే సామర్థ్యాన్ని సాధించింది. స్వదేశీ నిర్మాణం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా, సాంకేతిక జ్ఞానం స్వంతం అవుతుంది. ఇది రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను పటిష్టం చేస్తుంది, భవిష్యత్తులో మరిన్ని నౌకల నిర్మాణానికి పునాది వేస్తుంది.

సముద్ర భద్రత కీలకం..
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హిందూ మహాసముద్రంలో శాంతి, స్థిరత్వానికి భారతదేశం ఒక ముఖ్యమైన భరోసాగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ వాణిజ్యంలో 90 శాతం కంటే ఎక్కువ సముద్ర మార్గాల ద్వారా జరుగుతుంది. అందువల్ల సముద్ర భద్రతను కాపాడడం ఆర్థిక వృద్ధికి, జాతీయ భద్రతకు అవసరం. భవిష్యత్‌ యుద్ధాల్లో కొత్త సాంకేతికతలను స్వీకరించాలని సైనిక బలగాలకు రాజ్‌నాథ్‌సింగ్‌ సూచించారు. ఇది కేవలం ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనడానికి మాత్రమే కాకుండా, రేపటి మారుతున్న యుద్ధ వ్యూహాలకు సిద్ధం కావడానికి కూడా ముఖ్యం.

ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి ఆగమనం భారతదేశం సముద్ర రక్షణ వ్యూహాన్ని బలపరుస్తుంది. హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, అధునాతన స్టెల్త్‌ ఫ్రిగేట్లు భారత్‌ను ‘నెట్‌ సెక్యూరిటీ ప్రొవైడర్‌’గా మార్చడానికి సహాయపడతాయి. స్వదేశీ నిర్మాణం ఆర్థికంగా లాభదాయకం మాత్రమే కాకుండా, విదేశీ ఆధారిత్వాన్ని తగ్గిస్తుంది. భవిష్యత్తులో సముద్ర యుద్ధాలు మరింత సాంకేతికంగా మారే అవకాశం ఉంది. సముద్ర భద్రతను కాపాడడం ద్వారా భారతదేశం తన ఆర్థిక ప్రయోజనాలను రక్షించుకోవడమే కాకుండా, ప్రాంతీయ శాంతిని కాపాడే బాధ్యతను కూడా నెరవేర్చగలుగుతుంది.

లెనిన్ మూవీలో అఖిల్ చేసిన తప్పేంటో చెప్పిన మహేష్ బాబు...

Mahesh Babu On Akhil
Mahesh Babu On Akhil

Mahesh Babu On Akhil: అక్కినేని అఖిల్ లెనిన్ సినిమాతో సక్సెస్ ని సాధించాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకుంది. ఇక సినిమాను చూసిన అక్కినేని ఫ్యాన్స్ మాత్రం అఖిల్ ఎట్టకేలకు సక్సెస్ ని సాధించాడు అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు దాటినప్పటికి ఇప్పటివరకు ఆయనకు సరైన సక్సెస్ లేదు. దీంతో ఆయన కెరియర్ ఫేడ్ ఔట్ అవ్వబోతుంది ఈ సినిమా తేడా కొడితే ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోవాల్సిన పరిస్థితి రాబోతుంది అంటూ చాలామంది విమర్శకులు సైతం కామెంట్స్ చేశారు.

మొత్తానికైతే ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకోవడంతో చాలామంది సినిమా సెలబ్రిటీలు సైతం అఖిల్ కి ఫోన్ చేసి మాట్లాడుతున్నారట. ఇక మహేష్ బాబు సైతం అఖిల్ కి ఫోన్ చేసి యాక్టింగ్ అద్భుతంగా చేశావు అంటూ అతన్ని మెచ్చుకున్నాడట.

దాంతోపాటుగా రా లుక్ లో తన బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉన్నప్పటికి కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఆ రగ్గుడ్ రా నెస్ అనేది అంత ఎఫెక్టివ్ గా రాలేదని అది ఇంకొంచెం బెటర్మెంట్ గా చేసి ఉంటే బాగుండేదని కూడా మహేష్ బాబు అఖిల్ కి చెప్పినట్టుగా కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా అఖిల్ ఎట్టకేలకు సక్సెస్ ను సాధించడంతో అఖిల్ అభిమానులతో పాటు ఎంటైర్ ఇండస్ట్రీ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది.

కారణం ఏంటంటే అక్కినేని ఫ్యామిలీకి చాలా రోజుల నుంచి చాలా ఘన కీర్తి ఉంది. దానిని ముందుకు తీసుకెళ్లే హీరోల్లో నాగ చైతన్య, అఖిల్ ఎంతవరకు ప్రయత్నం చేసిన కూడా వాళ్లకు సరైన సక్సెస్ లు రావడం లేదు. మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన డిఫరెంట్ ప్రయత్నం చేయడమే కాకుండా ప్రేక్షకులందరిని అలరించాడు. కాబట్టి ఈ సినిమా మొత్తానికైతే సక్సెస్ఫుల్ టాక్ ను సంపాదించుకొని ముందుకు సాగుతుంది. ఇక మీదట కూడా ఆయన మంచి కథలను సెలెక్ట్ చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు…

త్రివిక్రమ్ vs వెట్రీ మారన్.... ఏం జరగబోతుంది...

Trivikram Srinivas
Trivikram Srinivas

Trivikram Srinivas: త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ‘గాడ్ ఆఫ్ వార్ ‘ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా తమిళులు చాలా వరకు వ్యతిరేకతను చూపిస్తున్నారు. కారణం ఏంటంటే మా దేవుడి కథను తెలుగు వాళ్ళు ఎలా చేస్తారు అంటువాళ్లు కొంతవరకు కొన్ని విభేదాలను సృష్టిస్తున్నారు. ఇక దీనికి పోటీగా ఇప్పుడు వెట్రీ మారన్ సైతం ఇలాంటి సినిమానే చేయబోతున్నాను అంటూ ఒక అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. ధనుష్ ను హీరోగా పెట్టి ఆయన చేయబోయే సినిమా కూడా గాడ్ ఆఫ్ వార్ సినిమా స్టోరీ లాగానే ఉంటుందని చెప్పడంతో త్రివిక్రమ్ కి పెద్ద షాక్ తగిలింది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా మొదట స్టార్ట్ అవుతుంది.

రెండు సినిమాల కథలు ఏంటి ఎవరెవరు ఎలాంటి కథలతో ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్నారు. రెండు సినిమాల కథలు ఒకటే అయితే ఎవరికి ఎక్కువగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇద్దరు కూడా ఒకసారి ఈ కాన్సెప్ట్ మీద చర్చించుకుని ఎవరి కథకు సంబంధం లేకుండా సినిమాని చేయగలిగితే మంచిది. లేకపోతే మాత్రం వీళ్ళిద్దరూ చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సినిమా చేయాల్సిన అవసరమైతే ఉంది…

అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళిద్దరు రెండు కథలను డిఫరెంట్ సబ్జెక్టులుగా మార్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విషయం మీద ఇద్దరు ఎవరికి వారు మా కథకి దానికి సంబంధం ఉండదు అనుకోవడం కంటే కూడా ఇద్దరు దర్శకులు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు కూడా క్లారిటీ ఇస్తున్నారు. ఈ రెండు కథల్లో ఏది ముందుగా సెట్స్ మీదకి వెళుతుంది. ఏది ముందుగా రిలీజ్ అవుతుంది ప్రేక్షకులు ఏ సినిమాకు ఓటేస్తారు అనేది తెలియాల్సి ఉంది…

పాపం విరాట్ కోహ్లీకి ప్రశాంతత లేకుండా పోయింది

Virat Kohli
Virat Kohli

Virat Kohli: టీం ఇండియా స్టార్ ఆటగాడిగా.. పరుగుల యంత్రంగా విరాట్ కోహ్లీకి పేరు ఉంది. టీమ్ ఇండియా సాధించిన ఎన్నో విజయాలలో అతడు ముఖ్య పాత్ర పోషించాడు. అతడి నాయకత్వంలో టీమిండియా అగ్రిసివ్ ఆటతీరు మొదలుపెట్టింది. ఎన్నో దేశాల మీద అద్భుతమైన క్రికెట్ ఆడింది. నాయకుడిగా.. ఆటగాడిగా విరాట్ కోహ్లీ.. అసాధ్యాలను సుసాధ్యం చేశాడు. సరికొత్త రికార్డులను నమోదు చేసుకున్నాడు.

విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. టీమిండియా 2024లో పొట్టి ప్రపంచ కప్ అందుకున్న తర్వాత ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత టెస్ట్ ఫార్మాట్ నుంచి కూడా వీడ్కోలు తీసుకున్నాడు. ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే అతడు కొనసాగుతున్నాడు. టీమిండియా కు 2027లో వన్డే వరల్డ్ కప్ అందించడమే లక్ష్యంగా అతడు ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు తన మకాం మొత్తాన్ని లండన్ నగరానికి షిఫ్ట్ చేశాడు.

భార్య.. పిల్లలతో కొంతకాలంగా విరాట్ కోహ్లీ లండన్ నగరంలోనే ఉంటున్నాడు. ఐపీఎల్ ఆడినప్పుడు.. టీమిండియా స్వదేశంలో మ్యాచులు ఆడినప్పుడు.. ఇంకా ఏమైనా వ్యవహారాలు ఉన్నప్పుడు మాత్రమే అతడు ఇండియాకు వస్తున్నాడు. ఇక్కడ పనులు చక్కపెట్టుకొని లండన్ వెళ్లిపోతున్నాడు. లండన్ లోనే విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. వాస్తవానికి ఇండియాలో అతడికి ప్రైవసీ లేకపోవడంతో లండన్ వచ్చాడు. ఇక్కడ కూడా అతడికి ప్రైవసీ లేకుండా పోతుంది.

గాయం నుంచి సాంత్వన పొందిన తర్వాత విరాట్ కోహ్లీ ఇంగ్లీష్ జట్టుతో వన్డే సిరీస్ ఆడేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో కాక్స్ అనే ఆటగాడు విరాట్ కోహ్లీతో సంభాషణ జరిపాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ నడిచింది..”విరాట్ కోహ్లీ నాతో మాట్లాడాడు. అనేక విషయాలు చెప్పుకున్నాడు. ఇటీవల ఆతులు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు మీడియాలోకి వచ్చాయి. దీంతో విరాట్ కోహ్లీ ఒక రకమైన అసహనం వ్యక్తం చేశాడు. ఇండియాలోనే కాదు తనకు ఇక్కడ కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది అని చెప్పాడు. హాయిగా తిరిగే హక్కును కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశాడని” కాక్స్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ నాయకత్వ లక్షణాలు అద్బుతంగా ఉంటాయని కాక్స్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.

'అయ్యగారు' అని నామకరణం చేసిన ఫ్యాన్ కి అఖిల్ అరుదైన గిఫ్ట్..ఇలా ఏ హీరో చేసి ఉండరు..

Akhil Akkineni
Akhil Akkineni

Akhil Akkineni: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘లెనిన్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాక్ కి తగ్గట్టుగానే ఈ చిత్రానికి అనకాపల్లి నుండి అమెరికా వరకు బంపర్ ఓపెనింగ్ వచ్చింది. అక్కినేని ఫ్యాన్స్ ఈ ఓపెనింగ్ ని చూసి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రేంజ్ లో టాక్ వస్తుందని అసలు ఊహించలేదని , అఖిల్ ఎట్టకేలకు కుంభస్థలం బద్దలు కొట్టాడని అంటూ అభిమానులు సంతోషం తో చిందులు వేస్తున్నారు. ఇక అఖిల్ నిన్న కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ లో తీవ్రమైన భావోద్వేగానికి గురై తన తండ్రి అక్కినేని నాగార్జున ని గట్టిగా పట్టుకొని ఏడవడం హైలైట్ అయ్యింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. ఎక్కడ చూసినా ఇప్పుడు దీని గురించే చర్చ.

ఇకపోతే అక్కినేని అఖిల్ ప్రతీ సినిమాకు ఒక అభిమాని బాగా ఫోకస్ అవుతూ ఉంటారు. ‘అయ్యగారే నెంబర్ 1’ అంటూ ఈ అభిమాని చేసే హంగామాని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా చెప్పండి?. అఖిల్ కి కూడా ee అభిమాని బాగా సుపరిచితమే. ఒకసారి ఆయన ఈ వీడియో ని చూసి కచ్చితంగా కలుస్తానని కూడా చెప్పారు. కానీ మామూలుగా కలవను , భారీ హిట్ కొట్టిన తర్వాతే కలుస్తాను , అతనితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చారు అఖిల్. ‘లెనిన్’ చిత్రం ఇప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అఖిల్ తన వీరాభిమానిని కలిసేందుకు సిద్ధం అవుతున్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ త్వరలోనే బయటకు రానున్నాయి. ఒక అభిమాని కోసం హీరో స్వయంగా రావడం కొన్ని సందర్భాల్లోనే చూసాం. ఇప్పుడు మరోసారి అలాంటి సందర్భం క్రియేట్ అవ్వనుంది.

ఇక ఆ అభిమానికి ఇంతకు మించిన బహుమతి ఏమి ఉంటుంది చెప్పండి. లెనిన్ చిత్రానికి కూడా ఈ అభిమాని తన తోటి అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ని కూడా అఖిల్ చూసారు. అది కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇక అఖిల్ ఈ అభిమానిని కలిసే రోజు సోషల్ మీడియా లో ఆ వీడియో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో చూడాలి. ఒకప్పుడు ఈ వీడియో పెద్ద ట్రోల్ మెటీరియల్ అయ్యింది , కానీ ఇది ఇప్పుడు అభిమానులకు హై ఇచ్చే మూమెంట్ కాబోతుంది. సక్సెస్ ఇచ్చే కిక్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం.

సూర్య వంశీ ని ఆటాడుకుంటున్నారు..ఇదేం ర్యాగింగ్ రా అయ్యా..

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: టీమిండియా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్య వంశీ అంచనాలకు మించి ఆడటం లేదు. సూపర్ బ్యాటింగ్ చేయడం లేదు. ఐపీఎల్ తరహాలో పరుగుల ప్రవాహం కొనసాగించడం లేదు. ఇలా వస్తున్నాడు అలా వెళ్ళిపోతున్నాడు.. ఐరిష్ సిరీస్ కు ఎంపికైనప్పటికీ.. సూర్య వంశీకి మేనేజ్మెంట్ జట్టులో చోటు ఇవ్వలేదు. ఆ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ లో అతనికి అవకాశం వచ్చింది. ఇచ్చిన అవకాశాన్ని అతడు వినియోగించుకోలేకపోతున్నాడు. వరుసగా అట్టర్ ఫ్లాఫ్ అవుతున్నాడు.

ఐపీఎల్ లో సూర్య వంశీ పెద్ద పెద్ద బౌలర్లను సైతం ఇబ్బంది పెట్టాడు. సునాయాసంగా సిక్సర్లు కొట్టాడు. పరుగుల ప్రభావం కొనసాగించి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. కానీ అదే జోరు ఇంగ్లాండ్ సిరీస్ లో చూపించలేకపోతున్నాడు. ఫోర్ లేదా సిక్సర్ కొట్టి వెంటనే అవుట్ అవుతున్నాడు. పదునైన బంతులను ఎదుర్కోలేకపోతున్నాడు. అతడి లోపానికి గమనించిన ఇంగ్లీష్ బౌలర్లు.. పదే పదే అదే తరహా బంతులు వేసి అతడిని అవుట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్య వంశీ మీద సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వినిపిస్తున్నాయి.

సూర్యవంశీ కేవలం ప్లాట్ మైదానాల మీద మాత్రమే ఆడతాడని.. ఇంగ్లీష్ గ్రీన్ పిచ్ ల మీద ఆకట్టుకోలేడని.. అతడికి ఆడ టం సాధ్యం కాదని.. సోషల్ మీడియాలో కొంతమంది వీడియోలు ప్రశ్నిస్తున్నారు. ప్లాట్ మైదానాల మీద సూర్య వంశీ ఆడే తీరును.. ఇంగ్లీష్ మైదానాల మీద ఆడే తీరును వివరిస్తూ వీడియోలు రూపొందిస్తున్నారు.

ఈ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి. సూర్యవంశీ ఆటతీరు పట్ల దెప్పి పొడిచే విధంగా ఉన్నాయి. ఈ వీడియోలు ఒకవేళ సూర్య వంశీ కంటపడితే ఎలా ఉంటుంది.. ఇటీవల ట్రై సిరీస్లో శ్రీలంక ప్లేయర్లు అతడిని రెచ్చగొట్టారు. దీంతో అతడు రెచ్చిపోయి ఫైనల్ మ్యాచ్లో అదరగొట్టాడు. ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ అభిమానులు సూర్య వంశీ ఆట తీరును ఎగతాళి చేస్తున్నారు. ఈ వీడియో చూసిన అతడు చివరి టి20 మ్యాచ్లో రెచ్చిపోతే.. ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు కనిపిస్తాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడితే ఎలా ఉంటుందో.. సూర్య వంశీ ఫామ్ లోకి వస్తే అలానే ఉంటుందని.. అలాంటప్పుడు అతడిని గెలకకపోవడమే మంచిదని విశ్లేషకులు అంటున్నారు.

అర్ధరాత్రి మహిళ పిలిచిందని వెళ్లాడు.. ఆ రాత్రి జరిగిన సీన్ చూసి పోలీసుల శరణు కోరాడు

Bihar Marriage
Bihar Marriage

Bihar Marriage: దానికోసం కక్కుర్తి పడకూడదు. అనవసరంగా ఆశపడకూడదు. ఆ తర్వాత జరిగే సంఘటనలు వేరే విధంగా ఉంటాయి. అప్పుడు చింతించి ఉపయోగం ఉండదు. బాధపడి ప్రయోజనం ఉండదు. పాపం ఆ యువకుడి పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించాడు. అయినప్పటికీ అక్కడ న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. ఎందుకంటే జరిగిన సంఘటన అటువంటిది కాబట్టి..

అతనికి 22 సంవత్సరాలు. ఉండేది బీహార్ రాష్ట్రంలో.. ఇతడికి ఒక హాస్పిటల్లో 32 సంవత్సరాల మహిళ పరిచయం అయింది. అప్పటికే ఆమెకు వివాహం జరిగింది. ఒక కుమార్తె కూడా ఉంది. ఒక హాస్పిటల్లో ఆమెతో అయిన పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమ దాకా వెళ్ళింది. వారిద్దరు ఆ పని కూడా మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే ఒకరోజు రాత్రి మా ఇంటికి రావాలి అంటూ ఆమె వర్తమానం పంపింది. దీంతో అతడు ఎంతో ఆత్రుతతో అక్కడికి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.. ఆమెకు.. అతడికి పెళ్లి చేశారు. స్థానికులను పిలిచి ఈ వేడుకను గ్రాండ్ గా జరిపారు. పెళ్లిరోజు అతడు సానుకూలంగానే ఉన్నాడు. ఆమె పెద్దలు చెప్పినట్టు చేశాడు. కానీ తర్వాత, అతడు పోలీసులను ఆశ్రయించాడు. తనను బెదిరించి పెళ్లి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ సంఘటనపై బీహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలోని ఖగారీయా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ పెళ్లికి ఆ మహిళ కూతురు కూడా ఒప్పుకోవడం గమనార్హం.

అతడి సమ్మతితోనే పెళ్లి చేశామని ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇందులో అతడిని ఎటువంటి ఒత్తిడికి గురి చేయలేదని.. వేధింపులకు పాల్పడలేదని.. ఇబ్బంది పెట్టలేదని వారు చెబుతున్నారు. ఇష్టంతో పెళ్లి చేసుకొని.. ఇప్పుడు ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. తాము కూడా రిటర్న్ కేసు పెడతామని.. పోలీసుల దృష్టికి అన్ని విషయాలు తీసుకెళ్తామని ఆ నర్స్ బంధువులు చెబుతున్నారు.

ఈ దసరా బరిలో నిలిచే మూవీస్ ఇవే...

Dasara 2026 Movies
Dasara 2026 Movies

Dasara 2026 Movies: ఇండస్ట్రీ లో పండగ వాతావరణం వచ్చిందంటే చాలు సినిమాల సందడి మొదలవుతుంది. కారణం ఏంటంటే పండక్కి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఒకే చోట కలుసుకుంటారు. దాని వల్ల ఫ్యామిలీ మొత్తం ఆహ్లాదంగా గడపడానికి ఇష్టపడతారు.తద్వారా అందరు సినిమాలను చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దాని కోసమే పండగ సీజన్లో మంచి సినిమాలు రిలీజ్ చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే దసరా పండగకి చాలా పెద్ద సినిమాలను రిలీజ్ చేసి దానిని క్యాచ్ చేసుకోవాలని చాలామంది చూస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ దసరాకి మాత్రం చాలా పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా రజనీకాంత్ హీరోగా నెల్సన్ డైరెక్షన్ లో వస్తున్న ‘జైలర్ 2’ సినిమా దసరాకి రిలీజ్ అవుతుంది. ఇక దాంతోపాటుగా చిరంజీవి విశ్వంభర సినిమా కూడా దసరాకి వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక రెండు సినిమాలతో పాటు నాని హీరోగా వస్తున్న ‘ప్యారడైజ్’ సినిమాని కూడా దసరా బరిలో నిలపాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు ప్రేక్షకులందరిలో ఎలాంటి గుర్తింపును తెచ్చుకోవాలనుకుంటున్నారు అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమాలు రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని చిన్న సినిమాలు కూడా బరిలోకి దిగబోతున్నాయి అనే వార్తలైతే వస్తున్నాయి. దసరాకి ఇంకా మూడు నెలల సమయం ఉండడంతో ఈలోపు చిన్న చిన్న సినిమాలను సైతం రంగం సిద్ధం చేసి బరిలో దింపాలనే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నారు. ఈ సినిమాలను బరిలో దింపి సక్సెస్ ఫుల్ గా నిలుపుతారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ లను సాధించడం లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన లెనిన్ సినిమాతో ఇండస్ట్రీ కొంచెం ఊపిరి పీల్చుకుంది. ఈ మూడు రోజులపాటు ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…

80స్, 90స్ బ్యాక్ డ్రాప్ కథలకు డిమాండ్ పెరగడానికి కారణం ఇదే...

Tollywood Trends
Tollywood Trends

Tollywood Trends: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో టైమ్ లో ఒక్కో ట్రెండ్ నడుస్తుంది… ప్రస్తుతం 80,90స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథలకు మంచి డిమాండ్ ఉంది. వాళ్ళు ఆ సెటప్ ని బాగా వాడుకుంటున్నారు. మొత్తానికైతే గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి తరహా సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తుండడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ప్రేక్షకులు సైతం ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన స్టార్ హీరోల సినిమాలు మొత్తం 90స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినవే కావడం విశేషం…రంగస్థలం నుంచి మొన్న వచ్చిన పెద్ది వరకు అన్ని సినిమాలు 80స్ 90స్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా సక్సెస్ లు కూడా భారీగానే వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క మేకర్ కూడా దానినే అనుసరిస్తున్నాడు.

నిజానికి ఆ టైమ్ పిరియడ్ లో ఉన్న మనుషులు ఎలాంటి వారు అక్కడ ఉండే పరిస్థితులు ఎలాంటివి రాజకీయం ఎలాంటి రంగులు అలుముకునేది అనే విషయాలను కూడా చూపిస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ని క్రియేట్ చేయడంలో దర్శకులు సక్సెస్ అవుతున్నారు.

కాబట్టే ఇది సక్సెస్ ఫుల్ ఫార్ములాగా మారిపోయింది. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు సైతం ఆ సక్సెస్ ఫార్ములాను పాటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలతో వాళ్ళు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు ప్రేక్షకుల్లో ఎలాంటి ఐడెంటిటి ని క్రియేట్ చేయబోతున్నారనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇంకా ఎన్ని రోజులపాటు ఈ 80స్, 90స్ బ్యాక్ డ్రాప్ కథలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఆ తర్వాత ఎలాంటి కథలు రాబోతున్నాయి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమాలతో సక్సెస్ ను సాధించడానికి చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు…

హవ్వా.. చెరువులే ఓవైసీ కాలేజీకి దగ్గరకొచ్చాయట.. అంతా సక్రమమేనట..

Owaisi College Controversy
Owaisi College Controversy

Owaisi College Controversy: అంతా సక్రమమే. అక్రమం లేదు.. చెరువులు ఆక్రమించలేదు. చెరువులే ఏకంగా ఓవైసీ కాలేజీలకు వెళ్లాయి. ఇదీ తెలంగాణ ప్రభుత్వం ఓవైసీ కాలేజీలకు ఇచ్చిన క్లియరెన్స్.. చాంద్రాయణగుట్ట పరిధిలోని బండ్లగూడ ఖల్సా ప్రాంతంలో సల్కం చెరువు బఫర్ జోన్ ప్రాంతంలో నిర్మించిన బారిష్టర్ ఫాతిమా ఓవేసి ఎడ్యుకేషన్ క్యాంపస్ పై కొంతకాలంగా వివాదం సాగుతున్న విషయం తెలిసిందే. హైడ్రా ఈ కాలేజీ ని పడగొట్టాలని.. సల్కం చెరువు పరిధిలో ఉన్న ఓవైసీ అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని కొద్ది రోజులుగా బిజెపి నాయకులు.. భారత రాష్ట్ర సమితి నాయకులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. పేదల విషయంలో దూకుడుగా పని చేసే హైడ్రా.. ఓవైసీ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్న సంగతి విధితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు ఒక కీలక సమాచారాన్ని ఇచ్చారు. సల్కం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఎటువంటి అనధికారిక నిర్మాణాలు లేవని.. గతంలో మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేసినప్పుడు.. ఈ చెరువు చుట్టూ రింగ్ బండ్ కూడా నిర్మించామని ప్రభుత్వం ప్రకటించింది.

ప్రభుత్వం ఈ ప్రకటన చేయడంతో హైకోర్టు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వ వాదనలో అస్పష్టత ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. జల వనరులను కాపాడటం.. ఎఫ్ టి ఎల్ పరిధులను నిర్ణయించడం ప్రభుత్వ బాధ్యత అని.. అలాంటప్పుడు జిల్లా కలెక్టర్ ఇంతవరకు తుది నివేదిక ఎందుకు ఇవ్వలేదని.. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వెబ్సైట్లో మ్యాప్ ఎందుకు అప్లోడ్ చేయలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

సాలార్ ఏ మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్బరుద్దీన్ ఓవైసీ ఈ కాలేజీని నడిపిస్తున్నారు. అయితే ఈ విద్యాసంస్థకు చెందిన భవనాన్ని కూల్చి వేయడానికి కొద్దిరోజుల క్రితం హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ భవనం కూల్చివేత పై హైకోర్టు తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాటిని ఉపసంహరించుకుంది.. ఈ అంశం మీద వేరువేరు బెంచ్ లు సమాంతరంగా విచారణ సాగించడంతో.. విరుద్ధమైన తీర్పులు వస్తాయని హైకోర్టు ఈ నిర్ణయం తీసుకొంది.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన కూల్చివేతలను సాలార్ ట్రస్ట్ సవాల్ చేసింది.. హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సల్కం చెరువు ఆక్రమణలపై ప్రధాన పిల్ కోర్టులో నడుస్తున్న నేపథ్యంలో.. దానికి అనుబంధంగా దీనిని జత చేయాలని రిజిస్ట్రీ ఆదేశాలు జారీ చేయడం విశేషం.

హైకోర్టు ఇచ్చిన తీర్పులో మరొక కీలకమైన అంశం ఎక్కడ తెలుగులోకి వచ్చింది.. చెరువులను రక్షించే అధికారం హైడ్రాకు పూర్తిస్థాయిలో ఉన్నప్పుడు.. కొన్ని చెరువులను మాత్రమే ఎందుకు గుర్తిస్తున్నారని.. మిగతా వాటిని ఎందుకు పట్టించుకోవడంలేదని హైడ్రాను ప్రశ్నించింది. హైడ్రా యంత్రాంగం రాజకీయ నేతల ఒత్తిడికి తలవంచడం వల్ల ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయనే సంకేతాలు ప్రజలలోకి వెళ్తున్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. ఓవైసీ కాలేజీ విషయంలో విద్యాశాఖ.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులకు సంబంధించి కౌంటర్లు దాఖలు చేయకపోవడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

2017లో సాలార్ ఏ మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఒక సెటిల్మెంట్ డీడ్ ద్వారా ఈ భూమి మీద ఆకులు పొందామని చెబుతోంది. అలాంటప్పుడు ఈ ట్రస్ట్ 2016 లోనే భవన క్రమబద్ధీకరణ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకుందని హైకోర్టు ముందు పిటిషనర్ విజయ్ గోపాల్ సరికొత్త ప్రశ్న అందించారు. భూకబ్జా కోణం ఉందని.. సిబిఐ లేదా ఇతర దర్యాప్తు సంస్థలతో విచారణ సాగించాలని ఆయన కోరారు. ఈ కేసు విచారణలో ఈనెల 30 కి కోర్టు వాయిదా వేసింది. ఈ కాలేజీ ని ఎఫ్ టి ఎల్ పరిధిలోని లేదని ప్రభుత్వం చెప్పడం.. కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం వంటి పరిణామాలు తదుపరి దశలో కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.