Trivikram Srinivas: త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ‘గాడ్ ఆఫ్ వార్ ‘ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా తమిళులు చాలా వరకు వ్యతిరేకతను చూపిస్తున్నారు. కారణం ఏంటంటే మా దేవుడి కథను తెలుగు వాళ్ళు ఎలా చేస్తారు అంటువాళ్లు కొంతవరకు కొన్ని విభేదాలను సృష్టిస్తున్నారు. ఇక దీనికి పోటీగా ఇప్పుడు వెట్రీ మారన్ సైతం ఇలాంటి సినిమానే చేయబోతున్నాను అంటూ ఒక అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. ధనుష్ ను హీరోగా పెట్టి ఆయన చేయబోయే సినిమా కూడా గాడ్ ఆఫ్ వార్ సినిమా స్టోరీ లాగానే ఉంటుందని చెప్పడంతో త్రివిక్రమ్ కి పెద్ద షాక్ తగిలింది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా మొదట స్టార్ట్ అవుతుంది.
రెండు సినిమాల కథలు ఏంటి ఎవరెవరు ఎలాంటి కథలతో ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్నారు. రెండు సినిమాల కథలు ఒకటే అయితే ఎవరికి ఎక్కువగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇద్దరు కూడా ఒకసారి ఈ కాన్సెప్ట్ మీద చర్చించుకుని ఎవరి కథకు సంబంధం లేకుండా సినిమాని చేయగలిగితే మంచిది. లేకపోతే మాత్రం వీళ్ళిద్దరూ చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సినిమా చేయాల్సిన అవసరమైతే ఉంది…
అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళిద్దరు రెండు కథలను డిఫరెంట్ సబ్జెక్టులుగా మార్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విషయం మీద ఇద్దరు ఎవరికి వారు మా కథకి దానికి సంబంధం ఉండదు అనుకోవడం కంటే కూడా ఇద్దరు దర్శకులు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు కూడా క్లారిటీ ఇస్తున్నారు. ఈ రెండు కథల్లో ఏది ముందుగా సెట్స్ మీదకి వెళుతుంది. ఏది ముందుగా రిలీజ్ అవుతుంది ప్రేక్షకులు ఏ సినిమాకు ఓటేస్తారు అనేది తెలియాల్సి ఉంది…
















