Home Blog Page 3

వర్షాకాలంలో ఇవి తినొచ్చా.. లేదా.. ఏం చేయాలి..

Monsoon Health Tips
Monsoon Health Tips

Monsoon Health Tips: వర్షాకాలం ప్రారంభమైన తర్వాత చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది. ఈ సమయంలో బలమైన ఆహారం తినాలనే ఉద్దేశంతో కొందరు మాంసాహారం తింటూ ఉంటారు.మరికొందరు మాత్రం వ్యాధుల విజృంభణకు అవకాశం ఉండడంతో చికెన్, మటన్ వంటి నాన్‌వెజ్ ఆహారంతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఎటువంటి ఆహారం తీసుకున్నా పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవు. అలా కాకపోతే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ సమస్యలు ఏంటో చూద్దాం..

వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటంతో బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్ వేగంగా పెరుగుతాయి. ఈ కాలంలో జీర్ణవ్యవస్థ పనితీరు కూడా కొంత మందగిస్తుంది. అందువల్ల కలుషితమైన లేదా సరిగా ఉడకని మాంసం తింటే ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

చికెన్‌లో అధిక నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీర కండరాల నిర్మాణానికి, దెబ్బతిన్న కణజాలం పునరుద్ధరణకు సహాయపడుతుంది. ఇందులో విటమిన్ B6, B12, నియాసిన్, ఫాస్పరస్, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, శక్తిని అందించడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.

మటన్‌లో ఐరన్, జింక్, విటమిన్ B12, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. రక్తహీనత సమస్య ఉన్నవారికి ఐరన్ ఉపయోగపడుతుంది. జింక్ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే మటన్‌లో కొవ్వు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ కాలంలో మాంసాన్ని సరిగా నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్, ఈ.కోలై వంటి బ్యాక్టీరియా ద్వారా ఫుడ్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. సరిగా ఉడకని మాంసం తింటే కడుపు ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, జ్వరం, వాంతులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, మధుమేహం ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వర్షాకాలంలో నాన్‌వెజ్ తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీరు ఎప్పుడూ తాజాగా వండిన మాంసాన్ని మాత్రమే తీసుకోవడం మంచిది.

వర్షాకాలంలో నాన్‌వెజ్ తినేటప్పుడు ఎప్పుడూ తాజా చికెన్ లేదా మటన్ మాత్రమే కొనుగోలు చేయాలి. ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేసిన మాంసాన్ని వీలైనంత వరకు ఉపయోగించకూడదు. మాంసాన్ని కనీసం 75°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా ఉడికేలా వండాలి. పచ్చి మాంసానికి ఉపయోగించిన కత్తి, కట్టింగ్ బోర్డు, పాత్రలను వెంటనే శుభ్రం చేయాలి. వీధి ఆహారం లేదా పరిశుభ్రత లేని హోటళ్లలో నాన్‌వెజ్ తినకుండా ఉండటం మంచిది. మసాలాలు ఎక్కువగా, నూనెలో డీప్ ఫ్రై చేసిన వంటకాల కంటే ఉడికించిన లేదా తక్కువ నూనెతో చేసిన వంటకాలను ఎంచుకోవాలి.

ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం ఆరోగ్యవంతులైన పెద్దలు వారానికి 2 నుంచి 3 సార్లు పరిమిత మోతాదులో చికెన్ లేదా మటన్ తీసుకోవచ్చు. అయితే గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.

ఈ స్టార్ డైరెక్టర్స్ పరిస్థితి ఏంటి...సక్సెస్ లు ఎప్పుడు కొడతారు...

Tollywood Directors
Tollywood Directors

Tollywood Directors: ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవాళ్లకు మాత్రమే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. వాళ్లతో సినిమాలు చేయడానికి ఎక్కువ మంది హీరోలు ఆసక్తి చూపిస్తుంటారు. వాళ్లకి మార్కెట్ కూడా విపరీతంగా ఉంటుంది. ప్రేక్షకులు సైతం వాళ్ల సినిమాలను థియేటర్ కి వచ్చి చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది స్టార్ డైరెక్టర్లు ఇంతకు ముందు స్టార్ హీరోలతో సినిమాలను చేసినప్పటికే వాళ్లకు సరైన గుర్తింపు రావడం లేదు. ఈ కారణంతో వాళ్లను ప్రేక్షకులు సైతం తీసి పక్కన పెడుతున్నారు. ఇక వాళ్ళు మరోసారి లైమ్ లైట్ లోకి రావాలన్న వాళ్ళకంటూ ఒక స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకోవాలన్న కూడా భారీ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది. దీనికోసం డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకొని మంచి కథలతో ప్రేక్షకులు ముందుకు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు సూపర్ సక్సెస్ లను సాధిస్తారు. లేకపోతే మాత్రం మరింత డీలాపడిపోయే ప్రమాదం ఉంది. ఇక ఈ క్రమంలోనే హరీష్ శంకర్ లాంటి దర్శకుడు కెరియర్ మొదట్లో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నప్పటికి ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలేవి ప్రేక్షకులను మెప్పించడం లేదు. వరుసగా మిస్టర్ బచ్చన్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నిరాశపర్చడంతో అతనితో సినిమాలు చేయడానికి ఏ హీరో కూడా ఆసక్తి చూపించడం లేదు.

ఇక బోయపాటి శ్రీను లాంటి దర్శకుడు సైతం కెరియర్ మొదట్లో మాస్ సినిమాలతో చెలరేగిపోయిన ఆయన ఇప్పుడు వరుసగా స్కంద, అఖండ 2 సినిమాలతో భారీ డిజాస్టర్ లను మూటగట్టుకోవడంతో అతనితో సినిమా చేయడానికి యంగ్ హీరోలు సైతం ఆసక్తి చూపించడం లేదు. అంటే ఆయన ఎంతలా డీలా పడిపోయాడో మనం అర్థం చేసుకోవచ్చు…

పూరి జగన్నాధ్ లాంటి దర్శకుడు సైతం ఈ మధ్యకాలంలో చాలావరకు డౌన్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతి ని హీరోగా పెట్టి చేస్తున్న స్లమ్ డాగ్ సినిమా తొందరలోనే రిలీజ్ కి రెడీ అవుతుంది. కాబట్టి ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తేనే ఆయన ఇండస్ట్రీలో తన కెరీర్ ను మరింత ముందుకు తీసుకెళ్తాడు.

లేకపోతే మాత్రం ఆయనతో సినిమాలు చేయడానికి ఏ హీరో కూడా ఆసక్తి చూపించకపోవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. ఇక వీళ్ళతో పాటు మరికొంతమంది దర్శకులు సైతం సక్సెస్ లను సాధించడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. ఇక వాళ్ళకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు చేసే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి మరోసారి స్టార్ డమ్ ను అందుకోవాల్సిన అవసరమైతే ఉంది…

వైసీపీ నేతలు ఎంగిలి మెతుకులు కూడా వదిలిపెట్టరు.. జడ శ్రావణ్ ఇలా ప్లేట్ తిప్పాడేంటి..

Jada Sravan
Jada Sravan

Jada Sravan: కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాలలో జడ శ్రావణ్ సృష్టిస్తున్న సంచలనం అంతా అంతా కాదు. అప్పట్లో క్రైస్తవులు సమావేశం పెట్టుకుంటే.. దానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు శ్రావణ్.. పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశాడు. పది చదివిన నువ్వే ఉప ముఖ్యమంత్రి అవ్వంగా లేనిది.. జడ్జి చదివిన నేను ఉపముఖ్యమంత్రి అయితే తప్పేంటయ్యా అంటూ శ్రవణ్ తీవ్ర స్వరంతో వ్యాఖ్యలు చేశారు. ఇక అప్పట్నుంచి శ్రవణ్ ఏదో ఒక సందర్భంలో.. ఏదో ఒక రీతిగా పవన్ కళ్యాణ్ మీద.. జనసేన మీద.. కూటమి ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

జడ శ్రవణ్ ఇటీవల యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ అరెస్టు పట్ల స్పందించారు. ఆయనను అరెస్టు చేసిన ప్రతి పోలీస్ స్టేషన్ కు వెళ్లి బెయిల్ మీద విడిపించుకుని వచ్చారు. అయితే ఈసారి ఏపీ పోలీసులు సరికొత్త ఆధారాలను సంపాదించారు.. జోసెఫ్ అలియాస్ రావణ్ మీద రాజ ద్రోహం కేసు పెట్టారు. ఉపా చట్టం కింద అతడి మీద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం రావణ్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఆ మధ్య రావణ్ కు.. వైసిపికి అనుకూలంగా మాట్లాడారు శ్రవణ్.. పైగా వచ్చేది వైసిపి ప్రభుత్వం అని.. ఉపముఖ్యమంత్రిగా శ్రావణ్ ఉంటారని.. జగన్ ముఖ్యమంత్రి అవుతారని సోషల్ మీడియాలో కొంతమంది యూట్యూబర్లు వీడియోలు కూడా చేశారు.

వైసిపికి అనుకూలంగా మాట్లాడిన శ్రవణ్ ఇప్పుడు ఒక్కసారిగా స్వరం మార్చారు. తనకు వైసిపి నేతలు ఫండింగ్ చేస్తున్నారని వస్తున్న ఆరోపణ నేపథ్యంలో.. ఆయన క్లారిటీ ఇచ్చారు. వైసీపీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదిలిపెట్టరని.. వాటిని కూడా ఏరుకొని తింటారని.. అలాంటప్పుడు వాళ్లు తనకు ఫండింగ్ ఎలా చేస్తారని శ్రావణ్ ప్రశ్నించారు.. తన వెనుక ఎవరూ లేరని .. ఫండింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదని శ్రవణ్ స్పష్టం చేశారు. అయితే అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా 500 కేసులు వేసినందుకు.. దాదాపు 25 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టానని శ్రవణ్ పేర్కొన్నారు. వాస్తవానికి ఆ కేసులకు అంతస్థాయిలో డబ్బు ఎక్కడిది.. అంత డబ్బును శ్రావణ్ ఎలా సంపాదించగలిగారు అనే చర్చ కూడా నడిచింది.. మొత్తానికి వైసీపీ నేతలకు షాక్ ఇచ్చే విధంగా శ్రవణ్ వ్యాఖ్యలు చేయడంతో ఏపీ రాజకీయాలలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు.

నకిలీ డిగ్రీలతో.. 3000 మందికి టీచర్ జాబ్ లు..

Bihar Fake Degree Scam
Bihar Fake Degree Scam

Bihar Fake Degree Scam: ఒక ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి దరఖాస్తు చేయాలంటే అనేక రకాల ధ్రువపత్రాలు జతచేయాలి. అనేక పరిశీలనల తర్వాత ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపిక ప్రక్రియలోను అధికారులు అనేక రకాలుగా వడపోతలు చేపడతారు. చివరికి అర్హులకు రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగం కల్పిస్తారు. ఇలా చేయలేదేమో.. ఇలా చేయాలి అనుకోలేదేమో.. మొత్తానికి దున్నపోతు పాలు పితకమని అనుకున్నారేమో.. మొత్తానికి కళ్ళు మూసుకున్నారు.. వారు కళ్ళు మూసుకుని ఉన్న ఫలితం దారుణానికి దారి తీసింది.

అది బీహార్ రాష్ట్రం.. అక్కడి ప్రభుత్వం 2006 నుంచి 2015 మధ్య జరిగిన ఉపాధ్యాయ నియామకాల వ్యవహారాన్ని తేల్చాలని విజిలెన్స్ బ్యూరోను నియమించింది. అ బ్యూరో బృందం సమగ్ర విచారణ జరిపింది. ఈ సందర్భంగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా నకిలీ విద్యాసంస్థల పేరుతో డిగ్రీలు జారీ చేశారు. ఫోర్జరీ సర్టిఫికెట్లు ఇచ్చారు. వీటన్నింటినీ కొంతమంది అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. వీటి ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా దర్జాగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. అంతేకాదు జీతాలు కూడా బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు.

విజిలెన్స్ ఎంక్వయిరీలో ఈ విషయం తెలియడంతో పోలీసులు మరింత లోతుగా ఈ వ్యవహారం మీద దృష్టి సారించారు. అయితే నాటి ప్రభుత్వం అండదండలతోనే ఈ వ్యక్తులు చెలరేగిపోయారని తెలుస్తోంది. నకిలీ విద్యాసంస్థలు నాటి కాలంలో ఇష్టానుసారంగా ధ్రువ పత్రాలు జారీ చేశాయని.. ఫలితంగా వారంతా ఉద్యోగాలు పొందారని విజిలెన్స్ ఎంక్వయిరీలో బయటపడింది. దాదాపు 3000 మంది టీచర్లు ఇలా అక్రమంగా ఉద్యోగాలు పొందారని ఎంక్వైరీలో తేలింది. అయితే వీరి మీద బీహార్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టింది. ఇప్పటివరకు ప్రభుత్వం చెల్లించిన జీతాలను వడ్డీతో సహా వారి దగ్గర నుంచి వసూలు చేయనుంది. అయితే ఈ విచారణ భయంతోనే ఇప్పటికే కొంతమంది ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే వారిని కూడా బీహార్ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు. వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది. వారికి చెల్లించిన జీతభత్యాలను కూడా వసూలు చేయాలని నిర్ణయించింది.

గత ప్రభుత్వాల నియామక వ్యవహారాల మీద ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారించింది. అంతేకాదు ఈ వ్యవహారాలలో అక్రమాలకు పాల్పడిన అధికారులను గుర్తించింది. ఈ తీగ మొత్తం లాగుతున్న నేపథ్యంలో నాడు ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ప్రజాప్రతినిధులు కూడా దోషులుగా మారే అవకాశం కనిపిస్తోంది.. మరి వీరిపై బీహార్ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది.. భవిష్యత్ కాలంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎటువంటి విధానాలకు రూపకల్పన చేస్తుంది.. చూడాల్సి ఉంది.

ఇస్లామాబాద్ నడిబొడ్డున లేపేసినా పాకిస్తాన్ కట్టుకథ అల్లింది.. నిజం తెలిసి పరువు పోయింది

Pakistan
Pakistan

Pakistan: అబద్ధాలు ఆడినప్పటికీ అతికినట్టు ఉండాలని మన పెద్దలు అంటుంటారు. పాపం పాకిస్తాన్ దేశానికి అబద్ధాలు ఆడటం వచ్చు. కాకపోతే వాటిని అతికినట్టు చేయలేదు. అబద్ధాలు ఆడినంత సేపు పట్టదు అవి నిజాలని ప్రపంచానికి తెలియడానికి. అవి తెలిసినప్పటికీ పాకిస్తాన్ ఏమి చేయలేదు. ఎందుకంటే పరువు ఉన్న దేశం అయితే అలాంటి అబద్ధాలు ఆడదు. కానీ పాకిస్తాన్ దేశానికి పరువు.. మర్యాద వంటివి ఉండవు. కేవలం అవసరాలు మాత్రమే ఉంటాయి. పైగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉంటాయి కాబట్టి పాకిస్తాన్ దేశం.. అబద్ధాలు ఆడుతూనే ఉంటుంది. ప్రపంచం ముందు చులకన అవుతూనే ఉంటుంది. తాజాగా ఒక బలమైన సంఘటన జరిగింది.. అది కాస్త పాకిస్తాన్ దేశాన్ని మరింత నవ్వులపాలు చేసింది.

పాకిస్తాన్ దేశంలో ఇస్లామాబాద్ అత్యంత కీలకమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన కీలకమైన మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారి కెప్టెన్ ఆసీమ్ తారీక్ ఇటీవల ఇస్లామాబాద్ ప్రాంతంలో తన కారులో ఉండగా చనిపోయారు. ఇది పాకిస్తాన్ ప్రభుత్వానికి పెద్ద అవమానంగా మారింది. సైన్యానికి ఒక మాయని మచ్చలాగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో దీని వెనుక ఒక కట్టుకథ అల్లడం మొదలుపెట్టింది. ఒక మహిళను రక్షించే క్రమంలో ఆసిమ్ వీరోచితంగా పోరాటం చేశారని.. చివరికి ఆయన చనిపోయారని అక్కడ మీడియాకు చెప్పింది అదే నిజమని భావించిన అక్కడ మీడియా వార్తలు రాసింది. పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆయనను హీరోగా చిత్రీకరించింది.

ఇది జరిగి 24 గంటలు కూడా కాకముందే.. తెహరిక్ ఏ తాలిబాన్ అనే సంస్థ తాము దాడికి పాల్పడినట్టు ప్రకటించింది. తమపై చేస్తున్న దాడులకు ప్రతీకారంగా ఈ హత్య చేశామని వీడియో సాక్షాలతో సహా బయట పెట్టింది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం పరువు గాలిలో కలిసిపోయింది. ఇటీవల కాలంలో ఇస్లామాబాద్.. రావల్పిండి వంటి ప్రాంతాలలో వరుసగా దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని చంపేస్తున్నారు. పైగా వీడియోలతో సహా బయట పెడుతున్నారు. ఈ పని చేసింది తామే అంటూ స్పష్టం చేస్తున్నారు. అలాంటప్పుడు పాక్ ఎటువంటి కల్లబొల్లి కబుర్లు చెప్పినప్పటికీ ఉపయోగం ఉండడం లేదు. అల్లిన కట్టు కథలు నిలబడడం లేదు. ఇంకా ఇంకా అబద్దాలతో కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. వాస్తవాలు బయటికి రావడంతో పాకిస్తాన్ ఏం చేసినా సరే.. ప్రపంచ నమ్మడం లేదు.

సచిన్ ..అంజలి.. పక్కనే గిల్..పెద్ద ప్లానే ఇది..

Shubman Gill
Shubman Gill

Shubman Gill: సచిన్ కుమార్తె సారా తో టీం ఇండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ గిల్ ఏదో చేస్తున్నాడని.. ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని కొంతకాలంగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. దీనిని గిల్ ఖండించలేదు. అలాగని సమర్థించలేదు. ఆ మధ్య లండన్ లో టీమిండియా ఉన్నప్పుడు సచిన్ తన కుటుంబంతో సహా ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. అప్పుడు గిల్ కూడా జట్టు సభ్యులతో కలిసి వచ్చాడు. నాడు టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా సారాను చూపిస్తూ గిల్ ను ఆట పట్టించాడు. దీంతో అప్పుడే అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఇటీవల సచిన్ కుమారుడు అర్జున్ వివాహం చేసుకున్నాడు. ఇక మిగిలింది సారానే. సారా ముంబైలో వ్యాపారం చేస్తోంది.. సోషల్ మీడియాలో తన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ప్రస్తుతం గిల్ లండన్ లో ఉన్నాడు. అక్కడ వింబుల్డన్ టోర్నీ చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడు రాయల్ బాక్సులో కూర్చొని వింబుల్డన్ పోటీని వీక్షించాడు. సూటు బూటు ధరించిన అతడు సెంటర్ కోర్టులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపించాడు. వింబుల్డన్ రాయల్ గా కనిపించిన అతడు సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ ఆహ్వానం అందుకున్న టీమ్ ఇండియా నాలుగో సారధిగా అతడు నిలిచాడు. ఈ జాబితాలో సచిన్.. విరాట్ కోహ్లీ.. రోహిత్ ఉన్నారు. ఇప్పుడు గిల్ ఆ జాబితాలో చేరాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లను సచిన్ సైతం రాయల్ బాక్స్ లో కూర్చుని వీక్షిస్తున్నాడు. గిల్ కు ఏకంగా రాయల్ బాక్స్ స్వాగతం లభించడంతో.. సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చ నడుస్తోంది. సచిన్ దారిలోనే గిల్ నడుస్తున్నాడని.. తెరవెనుక ప్లాన్ గట్టిగానే రూపొందించాడని ప్రచారం సాగుతోంది. రాయల్ బాక్స్ లో సచిన్,అంజలితో కలిసి మ్యాచ్ చూశాడు. ఇది కాకతాళీయమా..లేక ఇంకా ఏమైనా ప్లాన్ ఉందా..

గిల్ ఆట తీరు చూసేందుకు గతంలో సారా అనేక పర్యాయాలు మైదానాలకు వచ్చింది. ఆ సమయంలో మీడియా ఫోకస్ మొత్తం కూడా సారా మీదనే ఉంది. సారా కూడా ఆ సమయాన్ని ఆస్వాదించింది. అప్పట్లో ముంబైలో గిల్.. సార దొంగచాటుగా కలుసుకున్నారని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. అయితే దీనిపై అటు గిల్.. ఇటు సారా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దానిని ఖండించలేదు. అంటే వీరిద్దరూ రహస్యంగా తమ వ్యవహారాన్ని సాగిస్తున్నారని.. సమయం దొరికినప్పుడు బయట పెడతారని కొంతమంది అంటూ ఉండగా.. మరి కొంతమంది అలాంటి వ్యవహారాలు ఏవీ లేవని.. అదంతా కూడా మీడియా సృష్టి మాత్రమేనని మరి కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ గిల్ ప్రస్తావన వచ్చినప్పుడు.. కచ్చితంగా మీడియా సారాకు లింక్ పెడుతుంది. రకరకాల కథనాలను వండి వారిస్తూ ఉంటుంది. నేటి కాలంలో సీరియస్ విషయాలకంటే మసాలా వంటకాలకు ప్రాధాన్యం ఎక్కువ. ఇది కూడా మసాలా వంటకం కాబట్టి.. జనాలు ఏమీ లేకపోయినప్పటికీ చదువుతున్నారు. ఏదో ఉందనుకొని భావిస్తున్నారు.

సీనియర్ హీరోలకు వరంగా దొరికిన స్టార్ డైరెక్టర్స్ వీళ్లే...

Senior Telugu Heroes
Senior Telugu Heroes

Senior Telugu Heroes: ప్రస్తుతం టైర్ వన్ హీరోలందరు పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నారు. వాళ్ళకంటూ ఒక స్టేటస్ ను ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్లు పాన్ ఇండియా సినిమాలనే చేయాలి. లేకపోతే వాళ్ళ మార్కెట్ పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది. దానికి తగ్గట్టుగానే దర్శకులను ఎంపిక చేసుకొని పాన్ ఇండియాలో గొప్ప విజయాలను సాధించగలిగే కథలతో వాళ్లు ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ప్రస్తుతం ప్రతి ఒక్క హీరో కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ లను ఎంచుకొని సినిమాలను చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సీనియర్ హీరోలు మాత్రం కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమవుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ల నుంచి వచ్చే సినిమాలతో తెలుగులో ఉన్న ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక టైర్ వన్ హీరోలు సైతం పాన్ ఇండియా నేపథ్యంలో ముందుకు దూసుకెళ్తుంటే సీనియర్ హీరోలు మాత్రం తెలుగులోనే వాళ్ళ సత్తా చాటుతున్నారు.

ఇక ఇప్పటికే సీనియర్ హీరోలు, దర్శకులు సైతం వాళ్ళ మార్కెట్ ను పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా అనూప్ రావిపూడి, బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బాబీ, కొరటాల శివ లాంటి దర్శకులు సీనియర్ హీరోలకు అచ్చొచ్చిన దర్శకులుగా పేరు సంపాదించుకున్నారు.

వీళ్ళందరు వాళ్ళతో సినిమాలను చేసి సక్సెస్ లను సాధించి పెడుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ – బాలయ్య బాబుకి భారీ సక్సెస్ లను అందించాలనే నేపథ్యంలో ముందుకు దూసుకెళ్తున్నాడు… ఈ దర్శకులే మార్చి మార్చి సీనియర్ హీరోలతో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఇక మీదట వాళ్ళు సీనియర్ హీరోలతో చేసే సినిమాలు భారీ విజయాలను సాధిస్తాయా? రాబోయే రోజుల్లో మన సీనియర్ హీరోల మార్కెట్ ను మరింత పెంచే ప్రయత్నం చేస్తారా..? వీలైతే వీళ్లను పాన్ ఇండియాలోకి ప్రవేశ పెట్టే ప్రయత్నం చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో మన టైర్ వన్ హీరోలే నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు. మన దర్శకులే టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు…

పాకిస్తాన్ లో వరుస అంతర్గత సంక్షోభాలు.. ఎందుకిలా.. ఏమైంది..

Pakistan Internal Crisis
Pakistan Internal Crisis

Pakistan Internal Crisis: పాకిస్తాన్ దేశంలో వరుసగా అంతర్గత సంక్షోభాలు చోటు చేసుకుంటున్నాయి. మనతో పాటుగానే స్వాతంత్రం పొందినప్పటికీ పాకిస్తాన్ ఏమాత్రం అభివృద్ధి సాధించలేదు. ఆర్థికంగా.. సామాజికంగా.. రక్షణ పరంగా.. ఏ అంశంలో చూసుకున్నా సరే పాకిస్తాన్ అభివృద్ధి కాదు కదా.. ఇండియాతో పోల్చి చూస్తే కనీసం కరివేపాకు స్థాయిలో కూడా వృద్ధి సాధించలేదు. ఇండియా ఏకంగా ప్రపంచ శక్తిగా ఎదిగితే.. పాకిస్తాన్ ఉగ్రవాదంలో ఆ స్థాయిని చేరుకుంది.

పాకిస్తాన్ దేశంలో గతంలో అక్కడ ఏం జరిగినా సరే బయటికి తెలిసేది కాదు. అక్కడి పాలకులు నిరంకుశంగా వ్యవహరించేవారు. ప్రజలకు చుక్కలు చూపించేవారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో.. ఇతర చుట్టుపక్కల ప్రాంతాలలో పాకిస్థాన్ పాలకులు నిరంకుశంగా వ్యవహరించడం మొదలుపెట్టేవారు. ఒక రకంగా ప్రజలను పశువుల లాగా చూసేవారు. విలువైన వనరులను దోచుకుని పోయేవారు. ప్రశ్నించిన ప్రజల మీద ఆర్మీని ప్రయోగించేవారు. కాల్పులకు తెగబడేవారు.

ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్.. బలూచ్.. కైబర్ వంటి ప్రాంతాల ప్రజలలో చైతన్యం పెరిగింది. అంతేకాదు పాకిస్తాన్ పెత్తనాన్ని అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల మాంగీ డ్యామ్ వద్ద నిరసనకారులు పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. దాడులు కూడా చేశారు. ఈ దాడుల్లో చాలామంది పోలీస్ సిబ్బంది చనిపోయినట్టు తెలుస్తోంది. మాంగి డ్యాం వద్ద గంటల తరబడి పోరాటం జరిగింది. అయితే ఇక్కడ పాకిస్తాన్ సైన్యం అక్కడి పోలీసులకు కనీసం సహకారం కూడా అందించలేదు. వైమానిక రక్షణ కూడా కల్పించలేదు. ప్రజల్లో నెలకొన్న తీవ్రస్థాయి ఆగ్రహాన్ని పాకిస్థాన్ ఆర్మీ ముందుగానే అంచనా వేసింది. అక్కడికి వెళ్తే తమ ప్రాణాలు కూడా పోతాయని భావించి బయపడింది. ఫలితంగా పాకిస్తాన్ పోలీసులకు రక్షణ ఇవ్వకుండా వినోదం చూసింది.

కైబర్.. బలూచ్.. ఇతర ప్రాంతాలలో కొంతకాలంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలు చేపడుతున్నారు. తమ ప్రాంతాలలో పాకిస్థాన్ పెత్తనం ఉండకూడదని.. తమకు స్వాతంత్రాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నారు. అందువల్లే పాకిస్తాన్ ఆర్మీ మీద తీవ్రస్థాయిలో దాడులు చేస్తున్నారు. ఒక దశలో ప్రాణాలు పోయినా సరే.. పాకిస్తాన్ దేశానికి తమ ప్రాంతాల మీద పెత్తనం అప్పగించే సవాలే లేదని అక్కడి ప్రజలు స్పష్టం చేస్తున్నారు. అందువల్లే పాకిస్తాన్ ప్రభుత్వం ఆ ప్రాంతాల మీద అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తోంది. వాస్తవానికి అంతర్గత సంక్షోభాలను కనీసం పరిష్కరించుకోలేని పాకిస్తాన్ పరిపాలకులు.. ఇరాన్, అమెరికా యుద్ధంలో మధ్యవర్తి పాత్ర పోషించడం ఏంటని మేధావులు ప్రశ్నిస్తున్నారు.. ముందు పాకిస్తాన్ తన ఇంటిని చక్కదిద్దుకోవాలని.. అప్పుడు మిగతా ప్రపంచం గురించి ఆలోచించాలని వారు సూచిస్తున్నారు.

భారత్ మీద కక్ష.. చైనాకు తగిన శాస్తి..

China Brahmaputra Dam
China Brahmaputra Dam

China Brahmaputra Dam: భారత్ తో నిత్యం కవ్వింపులకు.. అంతర్గత ఘర్షణలకు పాల్పడుతూ ఉంటుంది చైనా. ఆ మధ్య గాల్వాన్ లోయలో ఘర్షణకు పాల్పడింది. అంతర్జాతీయ వేదికల మీద భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటుంది.. పైగా మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాల చిత్రపటాలను మార్చుతూ ఉంటుంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ లోని భూభాగాన్ని.. తన పరిధిలో ఉందన్నట్టుగా చైనా చెబుతూ ఉంటుంది. ఆ ప్రాంతాలకు చైనా పేర్లు పెడుతూ ఉంటుంది. ఈ విషయంపై భారత్ అనేకసార్లు చైనాతో వాగ్వాదానికి దిగింది. చైనా తీరును తప్పు పట్టింది.

మనదేశంలో ఈశాన్య రాష్ట్రాలకు అత్యంత ముఖ్యమైనది బ్రహ్మపుత్రా నది. ఈ నది ప్రవాహం ఆధారంగానే ఈశాన్య రాష్ట్రాలలో వ్యవసాయం సాగుతూ ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల మీదుగా బంగ్లాదేశ్ దాకా ప్రవహిస్తూ ఉంటుంది ఈ నది. ఈ నది చైనా నుంచి మనదేశంలోకి ప్రవహిస్తూ ఉంటుంది. చైనాలో ఈ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు అక్కడి ప్రభుత్వం కొద్దిరోజులుగా ప్రణాళిక రూపొందించింది. దీనిపై భారత్ అభ్యంతర వ్యక్తం చేసినప్పటికీ చైనా పట్టించుకోలేదు. పైగా ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టును చైనా బ్రహ్మపుత్ర నది మీద నిర్మిస్తోంది. గత ఏడాది దీనికి సంబంధించిన పనులను మొదలుపెట్టింది.

బ్రహ్మపుత్ర నది మీద చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టుకు సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఈ విషయం చైనా శాస్త్రవేత్తల అధ్యాయంలో బయటికి వచ్చింది. బ్రహ్మపుత్ర నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టు సంబంధించి భూభాగం సక్రమంగా లేదని.. అందులో ఒక క్రియాశీలకమైన పగులు ఉందని.. అది మౌలిక సదుపాయాల మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని చైనా భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ ప్రాజెక్టును చైనా టిబెట్ లోని ఓ నగరం పరిధిలో నిర్మిస్తోంది. ఇటీవల చైనా జియాలాజికల్ సర్వే నిర్వహించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఒక కీలకమైన అధ్యయనం జరిగింది. ప్రాజెక్ట్ నిర్మిస్తున్న ప్రాంతంలో అడుగు భాగంలో ఒక పగులు ఉందని.. అది రాళ్ల భాగాన్ని మొత్తం చీల్చి వేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. పైగా ఆ పగులు కొన్ని వేల సంవత్సరాల నాటిదని శాస్త్రవేత్తలు అంటున్నారు.. పగలు ఏర్పడటం వల్ల జల విద్యుత్ ప్రాజెక్టు సమీపంలో నిర్మించే వంతెనలు.. నీటి ప్రాజెక్టులు.. రోడ్లు.. సొరంగాలు దెబ్బ తినే ప్రమాదం ఉంది. ఈ ప్రాజెక్టుకు సమీపంలో పై అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం భూకంపం ఎదుర్కొనే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 9 సంవత్సరాల క్రితం ఇక్కడ 6.9 తీవ్రతతో భూమి కంపించింది.

టీమిండియా పరువు సంజు శాంసన్ చేతిలో..

Sanju Samson
Sanju Samson

Sanju Samson: ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఎందుకిలా అవుతుందో తెలియడం లేదు. అసలు ప్రవాహం లాగా పరుగులు సాధించే ఆటగాళ్లు ఇలా ఎందుకు అవుతున్నారో ఎంతకీ అంతు పట్టడం లేదు. ఐపీఎల్ లో సెంచరీల మీద సెంచరీలు చేసి.. పరుగుల మీద పరుగులు చేసిన ఆటగాళ్లు ఇలా ఎందుకు అవుట్ అవుతున్నారు బోధపడడం లేదు. నిజానికి భారత జట్టు ప్లేయర్లు ఇలా ఆడతారని.. ఇలా విఫలం అవుతారని ఏ అభిమాని కూడా కలలో ఊహించలేదు.

ఐరిష్ జట్టుతో సిరీస్ కోల్పోవడం.. అది కూడా వైట్ వాష్ కు గురి కావడం సగటు అభిమానిని ఆందోళనకు గురి చేసింది. ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టుతో ఆ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే సిరీస్ టీమ్ ఇండియాకు కోల్పోయింది. వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో శనివారం జరిగే చివరి మ్యాచ్ టీమ్ ఇండియాకు అత్యంత కీలకం. ఎందుకంటే ఈ మ్యాచ్ లో కనుక ఓడిపోతే వరుసగా రెండు వైట్ వాష్ లకు గురైన జట్టుగా టీమిండియా చెడ్డ రికార్డు సొంతం చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అలాంటి చెత్త రికార్డు నమోదు చేయకూడని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే చివరి మ్యాచ్ కు అనేక రకాల మార్పులు చేర్పులు చేయాలని బలమైన నిర్ణయంతో ఉంది.

కనీసం ఒక విజయమైనా సాధించి.. రెండు సిరీస్ ల ఓటమి తాలూకు ఒత్తిడిని జయించాలని టీమిండియా భావిస్తోంది. ఇందులో భాగంగానే పక్కన పెట్టిన ఓపెనర్ సంజు శాంసన్ కు మేనేజ్మెంట్ పిలుపు ఇచ్చినట్టు తెలుస్తోంది. అతడికి చివరి మ్యాచ్లో చోటు కల్పిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే టి20 వరల్డ్ కప్ లో అతడు ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించుకోలేదు. కానీ మేనేజ్మెంట్ అతడికి అవకాశం ఇచ్చింది. వచ్చిన అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకున్నాడు. టీమిండియా పొట్టి ప్రపంచ కప్ సాధించడంలో ముఖ్యపాత్ర పోషించాడు. అయితే అతడికి ఐరిష్ సిరీస్..లో చోటు కల్పించినప్పటికీ.. రెండు మ్యాచ్లలో విఫలమయ్యాడు. దీంతో అతడిని పక్కనపెట్టి సూర్య వంశీని ఓపెనర్ గా తీసుకొచ్చారు. అతడు కూడా ఆశించిన స్థాయిలో ఆడ లేకపోవడంతో.. మళ్లీ సంజును మేనేజ్మెంట్ రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. చివరి మ్యాచ్లో అతనితోపాటు.. సూర్యాంష్ కు చోటు కల్పిస్తారని సమాచారం. సరిగ్గా ఆడలేక పోతున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. వాషింగ్టన్ సుందర్ ను చివరి మ్యాచ్లో పక్కన పెట్టాలని మేనేజ్మెంట్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఈ ఐదు రాశుల వారికి ఈరోజు లాభాల పంట..

Today 11 July 2026 Horoscope
Today 11 July 2026 Horoscope

Today 11 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై కృతిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోకుండా ధన లాభం ఉండనుంది. మరికొన్ని రాసిన వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వీరికి తోటి వారి సహాయంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఇంటికి అవసరమైన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు శుభ ఫలితాలు రానున్నాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు వేస్తారు. అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. గ్రహాల అనుకూలతతో కొన్ని పనులను త్వరగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు ఉంటాయి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. గతంలో ఆగిపోయిన పనులన్నీ ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. విద్యార్థుల కెరీర్ విషయంలో చర్చ ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంటుంది. వీరితో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ఇతరుల సహాయం తీసుకుంటారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉండే అవకాశం ఉంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉంటుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ప్రత్యర్థులతో బెడద ఉంటుంది. ఇలాంటి సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గ్రహాలు అనుకూలంగా ఉండడంతో ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులకు భారీగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల సహకారంతో ప్రాజెక్టులన్ని వెంటనే పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందర పడకూడదు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు అనేక ప్రయోజనాలు ఉండనున్నాయి విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. సమాజంలో గౌరవం లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రతిభకు తగిన ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగులు నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో ప్రశంసలు పొందుతారు. కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం. వ్యాపారులకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడంతో అధిక లాభాలు పొందుతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగా క్షణాలు ఉంటాయి. వ్యాపారులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పెద్దల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు కొత్త విషయాలను నేర్చుకుంటారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనుల నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.

జగన్ తో ప్రశ్న రావణ్ కొలీగ్ గగన.. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఏం జరిగింది..

_Jagan, Ravan Joseph,

YS Jagan Mohan Reddy : రాజ ద్రోహం కేసులో అరెస్టయి జైల్లో ఉన్న రావణ్.. అలియాస్ జోసెఫ్ కు సంబంధించి ఏదో ఒక వార్త మీడియాలో కనిపిస్తూనే ఉంది. ఇటీవల కాలంలో జోసెఫ్ కు వైసీపీ అధినేత జగన్ బహిరంగంగానే మద్దతు పలికారు. చంద్రబాబును.. పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేసిన జోసెఫ్ ను జగన్ సమర్థించారు. పైగా ఆయనను అరెస్ట్ చేయడానికి ఖండించారు. దీంతో రావడం వెనక ఎవరు ఉన్నారు అనే దానిమీద క్లారిటీ వచ్చిందని టిడిపి నేతలు అంటున్నారు.

రావణ్ అరెస్టు తర్వాత అతని భార్య తెర మీదకి వచ్చింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమెను ఇంటర్వ్యూ చేశాయి. పవన్ కళ్యాణ్ మీద రావణ్ సతీమణి విమర్శలు చేసింది. రావణ్ కేసును విచారిస్తున్న పోలీసులకు సంచలన నిజాలు తెలుస్తున్నాయి. ఆయన ఫోన్లో బూతు వీడియోలు ఉన్నాయని.. దేశ వ్యతిరేక శక్తులకు సంబంధించిన సమాచారం.. కీలక విషయాలు అందులో ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. ఆ బూతు వీడియోల ద్వారా రావణ్ అనేకమంది అమ్మాయిలను వేధించాడని.. ఇబ్బంది పెట్టాడని తెలుస్తోంది. సుమారు పది మంది మహిళలు అతడి బాధితులని సమాచారం.

రావణ్ వ్యవహారం ఇలా సాగుతుండగానే.. మరొక కీలక విషయం బయటకు వచ్చింది. రావణ్ తో పాటు ప్రశ్న బృందంలో పనిచేసే గగన అనే అమ్మాయి గన్నవరం విమానాశ్రయానికి వచ్చింది. రావణ్ అరెస్ట్ అయిన తర్వాత గగన పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆమెకు కొంతమంది సంఘీభావంగా నిలబడిన విషయం కూడా తెలిసిందే. అయితే గగన గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసింది. గగన ను చూడగానే జగన్ వెనక్కి వచ్చారు. ఆమె నెత్తి మీద చేయి వేసి ఆశీర్వదించారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ సమయంలో జగన్ వెంట దేవినేని అవినాష్ ఉన్నారు. గగన కొంతకాలంగా వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతోంది. కూటమినేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. ప్రశ్న బృందం వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని ఎప్పటినుంచో టిడిపి నేతలు చెబుతున్నారు. గగన జగన్మోహన్ రెడ్డిని కలవడం.. అతడు ఆమెను ఆశీర్వదించడం.. కొద్దిసేపు మాట్లాడటం వంటి పరిణామాలు గన్నవరం విమానాశ్రయంలో చోటు చేసుకున్న నేపథ్యంలో టిడిపి నేతలు అసలు విషయాలను వెల్లడిస్తున్నారు. ప్రశ్న బృందాన్ని వైసిపి నేతలు పెంచి పోషించారని.. కూటమి నేతల పై ఉసిగొల్పారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.

బాలయ్య వేట మొదలుపెట్టాడుగా...ఇక తగ్గేదే లేదు...

Balakrishna
Balakrishna

Balakrishna : నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏ సినిమా చేసిన కూడా అందులో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. వరుసగా నాలుగు విజయాలను అందుకున్న ఆయన బోయపాటి డైరెక్షన్ లో చేసిన ‘అఖండ 2’ సినిమాతో భారీగా డీలాపడ్డాడు. మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన అనుకున్న సక్సెస్ ని సాధిస్తాడని అందరు అనుకున్నప్పటికి అది వర్కౌట్ కాలేదు. ఇక ఎట్టకేలకు ఆయన భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకుంటాడా? ఈ ఏజ్ లో కూడా కుర్ర హీరోలకు పోటీని ఇస్తు తన స్టామినా ఏంటో చూపించగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా కొరటాల శివ దర్శకత్వంలో కూడా మరొక సినిమా చేస్తున్నాడు. ఈ రెండింటితో పాటు ఇంకొంతమంది దర్శకులు చెప్పే కథలను వింటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తమిళ స్టార్ డైరెక్టర్ అయిన హరి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలు విపరీతంగా వస్తున్నాయి. కారణం ఏంటంటే హరి కమర్షియల్ సినిమాలను పర్ఫెక్ట్ గా చేయగలిగే కెపాసిటి ఉన్న దర్శకుడు కాబట్టి అలాంటి దర్శకుడు బాలయ్య బాబుకి పడితే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని బాలయ్య అభిమానులు కూడా భావిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో హరి ఆశించిన మేరకు సక్సెస్ లను సాధించడం లేదు. కాబట్టి ఈ మూవీ తనకి ఏ రేంజ్ సక్సెస్ ను సాధించి పెడుతుంది. తద్వారా బాలయ్య సైతం మరోసారి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోగలుగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక హరి తన కెరియర్ లో చేసిన సినిమాల్లో స్వామి, సింగం సినిమాలు అతనికి మంచి ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టాయి.

ఇక ఇప్పుడు అలాంటి సినిమాలే చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక వాటాన్నింటిని ఆయన ఎలా మేనేజ్ చేస్తాడు. బాలయ్య ఇమేజ్ ను హ్యాండిల్ చేయగలిగే కెపాసిటి హరికి ఉందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇదంతా చూస్తున్న బాలయ్య బాబు అభిమానులు మాత్రం బాలయ్య ఎక్కడ తగ్గకుండా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆయన ఇదే ఊపులో ముందుకెళ్తే మరిన్ని సక్సెస్ లను సాధించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…

ప్యారడైజ్ పరిస్థితి ఏంటి భయ్యా... రోజుకో వార్త వినిపిస్తుంది...

Nani The Paradise Netflix deal
Nani The Paradise Netflix deal

The Paradise : శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. నిజానికి మార్చి 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది అంటూ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ మార్చి తర్వాత ఈ రిలీజ్ డేట్ ని పూర్తిగా మార్చేశారు. ఆగస్టు 21వ తేదీన ఈ సినిమా రాబోతుంది అంటూ మరో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ ప్రస్తుతం అందుతున్న సంవత్సరం ప్రకారం ఆగస్టు 21వ తేదీన కూడా ఈ సినిమా రావడం లేదు. ఈ సినిమా కోసం అహర్నిశలు వెయిట్ చేస్తున్న అభిమానులు అలాగే ప్రేక్షకులు ఈ సినిమాని చూడడానికి ఎంతలా ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళందరికి మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు.

రిలీజ్ డేట్ ని తొందర్లోనే అనౌన్స్ చేస్తే బాగుంటుంది కదా రోజురోజుకీ సినిమా మీద ఉన్న అంచనాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి అంటూ మరి కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఎలాగైనా సరే ఈ సినిమాతో తనకంటూ ఒక అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు.

నిజానికి శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాని శరవేగంగా షూటింగ్ జరుపుతున్నాడు. ఇంతకు ముందు కొద్ది రోజులు షూటింగ్ ఆగిపోవడం వల్ల ఈ సినిమాకి ఇంత లేట్ అయింది. కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఊపందుకున్న ఈ సినిమాను తొందర్లోనే కంప్లీట్ చేసి దసర బరిలో నిలపాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

తను అనుకున్న టైం కి ఈ సినిమాని రిలీజ్ చేయగలుగుతారా? మరోసారి రిలీజ్ డేట్ ని మారిస్తే బాగుంటదనే ఉద్దేశ్యంతోనే ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం లేదు. ఇక ఈ మధ్యలో ఏదైనా జరిగే అవకాశం ఉందా మొత్తానికైతే ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

19 నుండి 2వ స్థానం.. పంచాయతీ రాజ్ శాఖలో పవన్ మరో సెన్సేషనల్ రికార్డు!

Pawan Kalyan Tribal Village
Pawan Kalyan Tribal Village

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆద్వర్యం లో ఉన్నటువంటి పంచాయితీ రాజ్ శాఖ కు దేశవ్యాప్తంగా ఎలాంటి ఖ్యాతి వస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నో జాతీయ పురస్కారాలు ఈ శాఖకు సొంతం అయ్యాయి. దేశ చరిత్ర లోనే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి అభివృద్ధి ని చేసి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా రోడ్ల విషయం లో పవన్ కళ్యాణ్ తన అధికార యంత్రాంగాన్ని ఏ రేంజ్ లో పరుగులు తీయించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గ్రామాల్లో అద్దాలు లాంటి రోడ్లను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అంతే కాకుండా క్వాలిటీ విషయం లో పవన్ కళ్యాణ్ ఎక్కడా రాజీపడలేదు. స్వయంగా ఆయన ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించారు. ఇకపోతే లేటెస్ట్ గా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి గ్రామా సడక్ యోజన ద్వారా సర్వే నిర్వహించారు.

ఈ సర్వే లో దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ రోడ్ల నాణ్యత ని పరిశీలించారు. నాణ్యత విషయంలో గుజరాత్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రెండవ స్థానం లో ఉంది. వైసీపీ హయాం లో ఇదే సర్వే నిర్వహించగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 19 వ స్థానంలో నిల్చింది. ఆ స్థాయి ర్యాంకు నుండి ఈ రేంజ్ కి ఎగబాకడం అనేది సాధారణమైన విషయం కాదు. రాబోయే రోజుల్లో ఈ శాఖ ఇంకా ఎన్ని అద్భుతాలను నెలకొల్పబోతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ సాధిస్తున్న ఈ విజయాలను చూసి , ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గా ఉంటేనే ఆయన ఇన్ని అద్భుతాలను సృష్టిస్తున్నారు , ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తారో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఓజీ నే , రాజకీయాల్లోనూ ఓజీ నే, ఆయనకు సాటి మరెవ్వరు లేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ గ్రామీణాభివృద్ధి , రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రేంజ్ ఫలితాలను తీసుకొని రాబోతుందో చూడాలి. ఈ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ లో రాబోతున్నాయని పవన్ కళ్యాణ్ నిన్న తన ఎమ్మెల్యేలు , ఎంపీల సమావేశంలో చెప్పుకొచ్చారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ రేపు తన రెండు భుజాలకు సర్జరీ చేయించుకోవడం కోసం ముంబై కి వెళ్లనున్నారు. అనంతరం ఆయన కొన్ని వారాలు విశ్రాంతి తీసుకొని ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం గా ఉండనున్నారు.

సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న 'లెనిన్'.. గ్రాస్ ఏ రేంజ్ లో ఉందంటే!

Lenin First Day Collections
Lenin First Day Collections

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ రేంజ్ లో జరగలేదు కానీ , విడుదల తర్వాత టాక్ వచ్చిన తర్వాత మాత్రం దుమ్ము లేచిపోయే రేంజ్ బుకింగ్స్ నమోదు అయ్యాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 10 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఈ రేంజ్ లో అక్కినేని సినిమాకు బుకింగ్స్ జరిగి చాలా కాలం అయ్యింది. అయితే మొదటి రోజు ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఏ రేంజ్ వసూళ్లు రాబోతున్నాయి అనేది ఇప్పుడు అంచనాకి వద్దాం. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 8 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట.

అంటే షేర్ వసూళ్లు 5 నుండి 6 కోట్ల రూపాయిల మధ్యలో ఉంటుందని అంచనా. ఉత్తరాంధ్ర , కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఈ చిత్రానికి సెన్సేషనల్ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంతం నుండే ఈ చిత్రానికి మొదటి రోజున 50 లక్షల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇది సాధారణమైన విషయం కాదు. అదే విధంగా కృష్ణా , గుంటూరు , నెల్లూరు , రాయలసీమ , గోదావరి జిల్లాలు కలిపి ఈ చిత్రానికి మరో 2 కోట్ల 50 లక్షల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని , ఓవరాల్ గా అఖిల్ కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక నైజాం ప్రాంతం లో అయితే 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట.

అంటే షేర్ వసూళ్లు 2 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు. ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 70 నుండి 1 కోటి రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లు రావొచ్చని అంటున్నారు. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి అనే చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి 3 లక్షల డాలర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని , ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 2 కోట్ల 90 లక్షల గ్రాస్ ఉంటుందని , షేర్ వసూళ్లు 1 కోటి 50 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 7 కోట్ల 50 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట.

అల్లు అర్జున్ రాజకీయ అరంగేట్రం పై క్లారిటీ ఇచ్చిన పీఆర్ టీం.. ట్వీట్ వైరల్..

Pushpa 2 Movie Craze
Pushpa 2 Movie Craze

Allu Arjun Politics : ఈరోజు ఉదయం నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ప్రచారం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ ఏంటి ?, రాజకీయాల్లోకి రావడం ఏంటి?, చాలా విడ్డూరంగా ఉందే, పాన్ ఇండియా లెవెల్ లో భారీ కాంబినేషన్ సినిమాలు చేస్తూ , పీక్ రేంజ్ కెరీర్ ని వదులుకొని ఆయన ఎందుకు రాజకీయాల్లోకి వస్తారు?, అసలు వచ్చే సూచనలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదే?, అసలు ఏమి జరుగుతోంది అంటూ అభిమానులు సైతం షాక్ కి గురయ్యారు. ఎందుకంటే ఈ వార్త ని ప్రచురించింది ఒక టాప్ వెబ్ సైట్, ఒక రాజకీయ పార్టీ కి చెందినది కాబట్టే, ఈ రేంజ్ లో సీరియస్ గా తీసుకున్నారు నెటిజెన్స్. అంతే కాదు , ఆ వెబ్ సైట్ కి వచ్చిన సమాచారం ప్రకారం రీసెంట్ గానే అల్లు అర్జున్ ముంబై లో ప్రశాంత్ కిషోర్ ని కలిశారట.

2019 ఎన్నికల్లో జగన్ సీఎం అవ్వడానికి , అదే విధంగా ఈ ఏడాది తమిళనాడు లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి సినీ నటుడు విజయ్ సీఎం అవ్వడానికి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు ఏ రేంజ్ లో పనికొచ్చాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇతనితో అల్లు అర్జున్ రాజకీయ అరంగేట్రం చేయడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేయమని రిక్వెస్ట్ చేశారట. అంతే కాదు , అల్లు అర్జున్ మామయ్య చంద్ర శేఖర్ రెడ్డి కూడా రాజకీయ పరంగా చాలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్టు చెప్పుకొచ్చింది సదరు వెబ్ సైట్. అయితే ఈ వార్తలపై అల్లు అర్జున్ పీఆర్ టీం స్పందించింది. అల్లు అర్జున్ కి వ్యక్తిగత మ్యానేజర్ గా పని చేస్తున్న శరత్ చంద్ర మాట్లాడుతూ ‘మీరు ప్రచారం చేస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అంటూ రిప్లై ఇచ్చారు.

దీంతో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు అనే వార్తల ప్రచారానికి చెక్ పడింది. అయితే నిప్పు లేనిదే పొగ రాదని పెద్దలు అంటుంటారు. అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ తో ఎలాంటి సంప్రదింపులు జరపకపోయుంటే , ఇలాంటి వార్తలు ఈ సమయం లో ఎందుకు వస్తాయి?, కచ్చితంగా ఎదో జరుగుతోంది, సోషల్ మీడియా లో లీక్ అయిపోవడం వల్ల, అల్లు అర్జున్ పీఆర్ టీం కావాలనే ఇలా అబద్దం చెప్పి ఉండొచ్చు కదా.. అల్లు అర్జున్ ఇప్పట్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేవు, ఆయన టార్గెట్ 2034 ఎన్నికలు కాబట్టి , అల్లు అర్జున్ అప్పుడే ఈ విషయం పై సోషల్ మీడియా లో చర్చ ఎందుకు అనే ఉద్దేశ్యంతోనే తన పీఆర్ టీం తో ఇలా చెప్పించి ఉండచ్చేమో అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు నెటిజెన్స్.