Home Blog Page 8644

జనసేన ఎమ్మెల్యే రాపాకపై శ్రీరెడ్డి కేక పోస్ట్…!

 

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మళ్లీ సీన్లోకి వచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ వివాదాన్ని తెరపైకి తెచ్చిన శ్రీరెడ్డి.. గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైకి మకాం మార్చేసిన శ్రీరెడ్డి సినీ అవకాశాలతో బిజీ బిజీగా వుంది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంది. తాజాగా శ్రీరెడ్డి జనసేన ఎమ్మెల్యే రాపాక గురించి ఓ పోస్టు చేసింది.

 

తన ఫేస్‌బుక్ ఖాతాలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావుపై ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. ”రాపాక మీరు కేక” అంటూ పోస్టు చేసింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వికేంద్రీకరణ బిల్లుకు రాపాక వరప్రసాదరావు అసెంబ్లీలో మద్దతు పలకడాన్ని శ్రీరెడ్డి స్వాగతించింది.

 

Read More: అమరావతిలో తెల్లరేషన్‌ కార్డు ఉండి వందల ఎకరాల భూములు కొన్నవారిపై సిఐడి విచారణ

 

ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను వ్యతిరేకించాలని, ఒకవేళ దానిపై ఓటింగ్ నిర్వహిస్తే అందుకు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ పవన్ కళ్యాణ్ రాపాక వరప్రసాద్‌కు బహిరంగ లేఖ రాశారు. అయితే, అధినేత లేఖను లైట్ తీసుకున్న రాపాక వరప్రసాద్ తాను మాత్రం వికేంద్రీకరణ బిల్లుకు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే శ్రీరెడ్డి రాపాక వరప్రసాద్ మీద ”రాపాకా.. మీరు కేక” అని కామెంట్ పోస్ట్ చేసింది.

 

Read More: ప్రియుడిని చంపి శవాన్ని తింటూ వీడియో తీసిన పోర్న్ స్టార్

‘నాన్నకు ప్రేమతో’.. కూతురి టాలెంట్ చూసి షాక్ అవుతున్న సుకుమార్

 

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన రైటింగ్, మేకింగ్ టాలెంట్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇప్పుడు ఆయన కూతురు సుకృతి తన సింగింగ్ టాలెంట్ తో షాకిస్తోంది. జనవరి 11న సుకుమార్ 50వ పుట్టినరోజు వేడుకులు జరుపుకున్నారు.

 

ఈ సందర్భంగా సుకుమార్ కుమార్తె సుకృతి ఆయన కోసం ఓ పాట పాడి తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అయితే నేడు సుకృతి పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ట్విట్టర్ వేదికగా సుకృతి పాడిన పాట వీడియోను పోస్ట్ చేశారు.

 

‘డార్లింగ్ డైరెక్టర్ సుకుమార్ ముద్దుల కుమార్తె సుకృతికి పుట్టినరోజు శుభాకాంక్షలు. తండ్రి పుట్టినరోజు కోసం తాను పాడిన పాటని.. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్నాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను’ అని దేవిశ్రీ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

 

సుకృతి పాట విన్న నెటిజన్లు ఆమె టాలెంట్ ని పొగుడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తన వాయిస్ అధ్బుతంగా ఉందని పొగుడుతున్నారు. ప్రస్తుతం సుకుమార్.. అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా కనిపించనుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

అయోధ్య తీర్పుపై పాకిస్తాన్‌ కుట్ర!

 

నిన్న (2019, నవంబర్ 09) భారతదేశ చరిత్రలో మరిచిపోలేని రోజు. ఎన్నో ఏళ్ల నుంచి తెగని రామ జన్మభూమి సమస్య సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. దేశంలో అన్ని పార్టీ నేతలు, అన్ని వర్గాల వారు స్వాగతిస్తూ, శాంతి యుతంగా ఉంటూ తీర్పును గౌరవిస్తూ ఉండగా.. విద్వేషపూరిత వాతావరణం వ్యాప్తిం చేసేందుకే పాకిస్తాన్‌ కుట్ర చేసింది. తీర్పు పట్ల పాకిస్తాన్‌ స్పందనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. పాక్‌ స్పందన అవాంఛనీయం, అసందర్భమని తోసిపుచ్చింది. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుని విద్వేషపూరిత వాతావరణం వ్యాప్తిం చేసేందుకే పాకిస్తాన్‌ ఇలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది.

 

భారత్‌కు సంబంధించిన అంతర్గత వ్యవహారంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల పాక్‌ వ్యాఖ్యానించిన తీరు దురుద్దేశపూరితంగా ఉందని, అసందర్భంగా ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవం సందర్భంగా పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ మాట్లాడుతూ సంతోషకర సమయాన సున్నితత్వం లేని వైఖరి చూపడం పట్ల విచారం వెలిబుచ్చుతున్నట్టు పేర్కొన్నారు. కాగా అయోధ్యలో వివాదాస్పద భూమిని రామజన్మ న్యాస్‌కు అప్పగిస్తూ మసీదుకు ప్రత్యామ్నాయంగా ఐదెకరాల స్థలం ఇవ్వాలని ఆదేశిస్తూ సుప్రీం కోర్టు శనివారం చారిత్రక తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే.

అల వైకుంఠపురములో.. దిమ్మతిరిగే భారీ వసూళ్లు

 

అల వైకుంఠపురములో.. అటు ఓవర్సీస్ లోనూ ఇటు ఇండియా లోనూ భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ రోజు చిత్ర నిర్మాతలు గీతా ఆర్ట్స్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా .. 10 రోజుల సినిమా వసూళ్లను గ్రాస్ మరియు షేర్ వివరాలతో కూడిన పోస్టర్ ని రిలీజ్ చేసారు. వసూళ్లు మాములుగా లేవు… ద్యావుడా.. అన్నట్టు ఉన్నాయి. ఇదే రీతిగా రెండు రోజులు కొనసాగితే అత్యధిక వసూళ్లు సాధించిన రెండొవ తెలుగు చిత్రంగా రికార్డ్స్ లో నిలిచిపోతుంది. అంటే తెలుగు కలెక్షన్స్ లో బాహుబలి సినీమా తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేస్తుంది. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాల లిస్ట్ ఇలా ఉంది.

 

  • బాహుబలి 2 (తెలుగు వెర్షన్స్) 310కోట్లు (షేర్స్) : డైరెక్టర్ – రాజమౌళి…
  • బాహుబలి 1 (తెలుగు) -183 కోట్లు (షేర్స్) – : డైరెక్టర్ – రాజమౌళి…
  • సైరా నరసింహా రెడ్డి – 134కోట్లు – డైరెక్టర్ – సురేందర్ రెడ్డి…
  • అల వైకుంఠపురములో – 130కోట్లు(+) నాటౌట్ – డైరెక్టర్ త్రివిక్రమ్…
  • సరిలేరు నీకెవ్వరు – 124కోట్లు (+)నాటౌట్ – డైరెక్టర్ అనిల్ రావిపూడి…
  • రంగస్థలం – 119కోట్లు – డైరెక్టర్ సుకుమార్…
  • ఖైదీ నెంబర్ 150 – 102కోట్లు – డైరక్టర్ వివి.వినాయక్…
  • మహర్షి – 101కోట్లు – డైరెక్టర్ వంశీ పైడిపల్లి…
  • భరత్ అనే నేను – 94కోట్లు : డైరెక్టర్ – కొరటాల శివ…
  • అరవింద సమేత – 88కోట్లు – డైరెక్టర్ త్రివిక్రమ్…
  • శ్రీమంతుడు – 84కోట్లు – డైరెక్టర్ కొరటాల శివ…

Read More: వైరల్ అవుతున్న ఫోటో : వైస్సార్ విగ్రహాన్ని తగలబెట్టిన వైనం

మనిషి పోలికలతో వున్న చేప

 

చైనాలో కనిపించిన ఓ చేప అచ్చం మనిషి ముఖాన్ని పోలి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

 

చైనాలోని మియో గ్రామానికి వెళ్లిన ఓ మహిళకు అక్కడి నీటి ప్రవాహంలో ఈ చేప దర్శనమిచ్చినట్లు ఆంగ్ల ప్రతికలు పేర్కొన్నాయి. నీళ్లలో చేప వస్తున్న వీడియోను తీసిన మహిళ వెంటనే చైనా మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ వీబోలో పోస్ట్‌ చేయడంతో ఒక్కసారిగా వైరల్‌ అయింది. నీటిలో ఈదుకొంటూ వస్తున్న చేప ముందు భాగం మనిషిని పోలినట్లు కళ్లు, ముక్కు, నోరు కనిపించాయి. ఈ చేపను చూసిన నెటిజన్‌లు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘ఇది నిజంగా భయానకం’, ‘ఈ చేపను తినడానికి ఎవరికైనా ధైర్యముందా’ అంటూ వరుస కామెంట్లు పెడుతున్నారు. ఆ చేపను మీరూ చూసేయండి.

మ్యాజిక్ ఫిగర్ కోసం శివసేన జిమ్మిక్కులు!

 

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం తమకు లేదని ఆదివారం(నవంబర్ 10) బీజేపీ ప్రకటించడంతో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన రెడీ అయింది. ఇవాళ మధ్యాహ్నాం 2గంటలకు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలవనున్నారు శివసేన నాయకులు

 

ఇప్పటికే ఎన్సీపీ శరద్ పవర్ ని కలిసి లైన్ క్లియర్ చేసుకున్న శివసేన, మరోవైపు ఇవాళ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో శివసేన ముఖ్యనాయకుడు సంజయ్ రౌత్ సమావేశమవనున్నట్లు సమాచారం. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ని ఆయన నివాసానికి వెళ్లి కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయనతో చర్చించనున్నారు. ఉద్దవ్ ఠాక్రే సీఎంగా,డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ వ్యక్తి ఉంటారని మహారాష్ట్రలో ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సమయంలో ఎన్టీయేలో భాగస్వామిగా ఇప్పటివరకు ఉన్న శివసేన తరపున కేంద్రమంత్రిగా ఉన్న అర్వింద్ సావంత్ సోమవారం(నవంబర్-11,2019)ఉదయం తన పదవికి రాజీనామా చేశారు.

 

288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున 105మంది విజయం సాధించగా, శివసేనకు 56మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు 44మంది,ఎన్సీపీ 54మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ-శివసేన,ఎన్సీపీ-కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే 50:50ఫార్ములాకు బీజేపీ ఒప్పుకోకపోడంతో శివసేన బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అంగీకరించలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

ఎంఎంటీఎస్ ట్రైన్ ఆక్సిడెంట్ సీసీటీవీ వీడియో

నిన్న కాచిగూడ లో ఎంఎంటీఎస్ ట్రైన్ ఆక్సిడెంట్ ఎలా జరిగిందో సీసీటీవీ లో రికార్డు అయింది ఆ వీడియో…

ఆధార్‌ కార్డులో మార్పులుపై కొత్త రూల్స్!

 

ఆధార్‌ కార్డులో మార్పులు చేర్పులపై భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ(ఉడాయ్‌) కొత్తగా ఆంక్షలు తీసుకొచ్చింది. గతంలో మాదిరిగా ఇకపై ఎన్ని సార్లు అంటే అన్నిసార్లు ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోడానికి కుదరదు. కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై ఆధార్‌లో పుట్టినతేదీని కేవలం ఒకసారి మాత్రమే మార్చుకునేందుకు వీలుంటుంది.

 

ఆధార్‌ కార్డు జారీ చేసిన సమయంలో పేరు, పుట్టినతేదీ ఇలా దేనిలోనైనా పొరబాట్లు ఉంటే సరిదిద్దుకోడానికి వీలుగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకునే వీలుంది. అయితే ఆధార్‌ అప్‌డేట్‌ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో మార్పులు చేర్పులపై ఉడాయ్‌ కొత్తగా నిబంధనలు తీసుకొచ్చింది. ముఖ్యంగా పేరు, పుట్టినతేదీని ఇష్టానుసారంగా మార్చుకునే వీలు లేకుండా పరిమితులు విధించింది.

 

ఆధార్‌ కార్డులో మార్పులుపై కొత్త రూల్స్ ఇవే..

  • పుట్టిన తేదీ, లింగం విషయంలో తప్పులుంటే: కేవలం ఒక్కసారే మార్చుకోవాలి. మూడేళ్లు తక్కువ గానీ, ఎక్కువ గానీ మార్చుకునేందుకు మాత్రమే అవకాశముంటుంది. పుట్టినతేదీ మార్చుకోడానికి కచ్చితంగా ధ్రువపత్రం ఉండాల్సిందే.
  • పేరులో తప్పులుంటే: ఇకపై కేవలం రెండు సార్లు మాత్రమే మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది.
  • నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువ సార్లు కార్డుదారు తన పేరు, పుట్టినతేదీ, లింగ మార్పులు చేసుకోవాల్సి వస్తే ఆ వ్యక్తి దగ్గర్లోని ఆధార్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. మార్పులకు సంబంధించిన ధ్రువపత్రాలను ఇ-మెయిల్‌ లేదా పోస్టు ద్వారా పంపాలి. సంబంధిత ధ్రువపత్రాలతో పాటు ఎందుకు తమ అభ్యర్థనను అంగీకరించాలో కూడా వివరించాల్సి ఉంటుంది.
  • ప్రాంతీయ కార్యాలయం కార్డుదారు నుంచి అదనపు సమాచారం కోరే అవకాశం కూడా ఉంది. అవసరమైతే క్షేత్ర స్థాయి వెరిఫికేషన్‌ కూడా ఉంటుంది. మార్పు కోసం వచ్చిన అభ్యర్థన నిజమైందేనని నిర్ధరణకు వస్తే అప్పుడు కార్డును అప్‌డేట్‌ చేస్తారు.

వెంకటేష్ ‘నారప్ప’ ఫస్ట్ లుక్..!

 

వెంకిమామ మూవీ తర్వాత వెంకటేష్ తమిళ హిట్ మూవీ ‘అసురన్‌’ రీమేక్ లో నటిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు ‘నారప్ప’ అనే టైటిల్ తో పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అనంతపురంలో జరుగుతుంది. ఇక ఈ సినిమా పూర్తిగా పల్లెటూరు నేపథ్యంలో ఉండబోతుంది. కాగా ఈ సినిమాను సురేష్ బాబు, కలైపులి యస్‌.థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయోధ్యలో రామ మందిరం ప్లాన్!

 

అయోధ్యలో “రామజన్మ భూమి-బాబ్రి మసీదు” ల శతబ్దాల చరిత్రలో దశాబ్దాల కేసులో అంతమ తీర్పు వెలువడిన తర్వాత రామ మందిర నిర్మాణం తెర పైకి వచ్చింది.

 

అయోధ్యలో ఈ రామ మందిర నిర్మాణం కోసం గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన చంద్రకాంత్ సోంపుర 1989లోనే ఒక ప్లాన్ రూపొందించారు. అదే ప్లాన్ ప్రకారం ఇప్పుడు మందిర నిర్మాణం జరుగుతుంది. చంద్రకాంత్ సోంపుర కుటుంబానికి దేశంలోని ఎన్నో ఆలయాలను డిజైన్ చేసిన ఘనత ఉంది. గుజరాత్‌లో అరేబియా సముద్రం తీరంలో ఉన్న సోమనాథ్ ఆలయం కూడా రూపకల్పన చేసింది ఆయన తాతగారే.

అయోధ్యలో రామ మందిరం ప్లాన్ ఇలా ఉంటుంది.

 

“రామమందిరం పొడవు 270 అడుగులు. వెడల్పు 140 అడుగులు, ఎత్తు 128 అడుగులు ఉంటుంది. ప్రధాన ఆలయం చుట్టూ భరత్ మందిర్, లక్ష్మణ్ మందిర్, సీత మందిర్, గణేష్ మందిర్ అనే నాలుగు చిన్న ఆలయాలు ఉంటాయి. దానికి ఒక వైపున కథా కుంజ్ ఉంటుంది. అక్కడ రామాయణం, మహాభారతం లాంటి కథలు ప్రదర్శించవచ్చు. ఆ ఆవరణలోనే రీసెర్చ్ సెంటర్. భోజనశాల, ధర్మశాల. స్టాఫ్ క్వార్టర్స్ ఉంటాయి. నాలుగు వైపులా అన్ని దిక్కుల్లో గేట్లు ఉంటాయి. అక్కడ లభించే స్థలాన్ని బట్టి అవి పెద్దగా, చిన్నగా కట్టినా, మందిరం ప్లాన్‌లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.” అని చంద్రకాంత్ వివరించారు.

 

జగన్ విమర్శలకు జనసేన స్ట్రాంగ్ కౌంటర్!

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కు జనసేన పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల మీద చేసిన వ్యాఖ్యలకు జనసేన పార్టీ ఘాటుగా స్పందించింది.

 

మౌలానా అబుల్ కలాం ఆజాద్ 132వ జయంతి సందర్బంగా విజయవాడలో జాతీయ విద్య, మైనార్టీ దినో్త్సవం సభలో జగన్ మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్‌ను అడుగుతున్నా. ఆయనకు ముగ్గురు భార్యలు. నలుగురో ఐదుగురో పిల్లలు. మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు?’ అని ప్రశ్నించారు. అయితే, జగన్ వ్యాఖ్యలకు జనసేన సోషల్ మీడియా టీం ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ‘మీ దొంగల ముఠా అంతా జైల్లో చిప్పకూడు తిన్నది కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వల్ల అంట నిజమా వైఎస్ జగన్ ?’ అని జనసేన శతఘ్ని టీమ్ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీన్ని జనసేన అధికారిక ఖాతాలో రీ ట్వీట్ చేశారు.

 

అలాగే “దిగజారి పోతోన్న భాషాభిమానం” అంటూ సాక్షి పేపర్ లో వచ్చిన ఒక ఆర్టికల్ ను పోస్ట్ చేస్తూ మరో ఘాటు విమర్శ చేసింది జనసేన.

 

“దేశ భాషలందు తెలుగు లెస్స” అని జగన్ ట్వీట్ ను పోస్ట్ చేశారు.

 

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను తీసేసి ఇంగ్లీష్ మీడియాను ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి.. మెల్లమెల్లగా పదో తరగతి వరకు పెంచాలని భావిస్తోంది. అయితే, రాష్ట్రంలో తెలుగు భాషను లేకుండా చేస్తున్నారంటూ అన్ని విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూడా జగన్ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే, ఈ వ్యాఖ్యలకు స్వయంగా జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

కలెక్షన్స్: టాప్ 10 టాలీవుడ్ మూవీస్

 

తెలుగు చిత్రాలకు కట్టలతో ముంచెత్తిన సినిమాలు ఇప్పటి తరానికి చెందటం విశేషం. ఎన్నడూ ఊహించని విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ సినిమాలు దిమ్మ తిరిగేలా చేశాయి. యాభై కోట్లతో కాదు ఏకంగా వందల కొట్లలో కలెక్షన్స్ సాదించి సౌత్ ఇండియా ఇండస్ట్రీకే కాదు , బాలీవుడ్ ని కూడా బెంబెలేత్తింస్తున్నాయి ఈ సినిమాలు. సంక్రాంతి కి రిలీజ్ అయినా మహేష్ సరిలేరు నీకెవ్వరు – అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలు కూడా అదే స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటున్నాయి. ఇక టోటల్ గా వరల్డ్ వైడ్ గా అత్యధిక లాభాలని అందించిన టాప్ 10 టాలీవుడ్ మూవీస్ పై ఒక లుక్కేస్తే.. (షేర్స్)

 

  • బాహుబలి 2 (తెలుగు వెర్షన్స్) 310కోట్లు (షేర్స్) : డైరెక్టర్ – రాజమౌళి…
  • బాహుబలి 1 (తెలుగు) -183 కోట్లు (షేర్స్) – : డైరెక్టర్ – రాజమౌళి…
  • సైరా నరసింహా రెడ్డి – 134కోట్లు – డైరెక్టర్ – సురేందర్ రెడ్డి…
  • అల వైకుంఠపురములో – 130కోట్లు(+) నాటౌట్ – డైరెక్టర్ త్రివిక్రమ్…
  • సరిలేరు నీకెవ్వరు – 124కోట్లు (+)నాటౌట్ – డైరెక్టర్ అనిల్ రావిపూడి…
  • రంగస్థలం – 119కోట్లు – డైరెక్టర్ సుకుమార్…
  • ఖైదీ నెంబర్ 150 – 102కోట్లు – డైరక్టర్ వివి.వినాయక్…
  • మహర్షి – 101కోట్లు – డైరెక్టర్ వంశీ పైడిపల్లి…
  • భరత్ అనే నేను – 94కోట్లు : డైరెక్టర్ – కొరటాల శివ…
  • అరవింద సమేత – 88కోట్లు – డైరెక్టర్ త్రివిక్రమ్…
  • శ్రీమంతుడు – 84కోట్లు – డైరెక్టర్ కొరటాల శివ…

ఇండియా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ స్టార్ హీరో..!

 

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇండియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఇటీవల విడుదలైన తానాజీ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ నటించాడు. ఆ సినిమా ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటిషర్లు వచ్చే వరకు ఇండియా అనే కాన్సెప్ట్ లేదని అన్నాడు. బ్రిటిషర్లు రాకముందు ఇండియా అనే భావన ప్రజల్లో లేదని సైఫ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండి పడుతున్నారు.

 

సైఫ్ అలీ ఖాన్ అసలు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని.. బ్రిటిష్ వారు రాగానే ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. అంతకు 150 ఏళ్ళ కిందటే వాస్కోడిగామా కొలంబస్ లాంటివారు మన దేశాన్ని ఇండియా అని పిలిచారని నెటిజన్లు రిప్లై ఇచ్చారు.

భూరికార్డుల సంస్కరణలే విజయారెడ్డి హత్యకు కారణమా?

 

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో రెవెన్యూ సిబ్బందితో పనిపడుతుంది. కుల – ఆదాయ – స్థానికత ధ్రువపత్రాల గురించో, భూమి సమస్యల గురించో, పట్టాదారు పాసు పుస్తకం గురించో, మరేదైనా అవసరంతోనో రెవెన్యూ కార్యాలయం గుమ్మం తొక్కని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కాబట్టే ప్రభుత్వంలో రెవెన్యూ ఉద్యోగులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.

 

ఇటీవల తెలంగాణలో భూరికార్డుల సంస్కరణ చేపట్టారు. కొత్త పాసుపుస్తకాలు ఇచ్చారు. వాటిలో చాలా తప్పులు జరిగాయి. రికార్డుల సరవణ బాగా చేశారని ఒక దశలో రెవెన్యూ సిబ్బందిని మెచ్చుకుని, ఒక నెల జీతం బోనస్ ఇచ్చిన సీఎం కేసీఆర్, తర్వాత వారిని తప్పుబట్టారు. ఈ విషయంలో తప్పు మీదంటే మీదంటూ రచ్చ జరిగింది. ఈ పరిస్థితుల్లో రెవెన్యూశాఖను ప్రక్షాళించాలని సంకల్పించింది తెలంగాణ ప్రభుత్వం.

 

రెవెన్యూ వ్యవస్థ బాగా లేదనీ, రెవెన్యూ వ్యవస్థను సంస్కరించి సరికొత్త చట్టం తెస్తామని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో సీఎం చెప్పారు. అంతేకాదు పలు వేదికల మీద రెవెన్యూ సిబ్బందిపై ఘాటు విమర్శలు చేశారు. ఒక వీఆర్వో తలచుకుంటే ఒకరి భూమిని మరొకరి పేరిట రాసేయగలడని చెప్పారు.
ఈ నేపధ్యంలోనే తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను సమూలంగా మార్చాలనీ, సంస్కరణలు తేవాలనీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రయత్నాలు చివరి దశకు వచ్చాయి.

 

సంస్కరణలు అవసరమా, కాదా?

రెవెన్యూ శాఖలో ఎలాంటి సంస్కరణలు కావాలనే విషయంలో అభిప్రాయ బేధాలున్నాయిగానీ, సంస్కరణలు అవసరమనేది అన్ని వర్గాలూ ఒప్పుకొనే మాట.

 

రెవెన్యూ ఉద్యోగులు అన్ని రకాల చట్టాలు, జీవోలను తెలుసుకుంటూ పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి వీరికి పని ఎక్కువ, పలుకుబడి ఎక్కువ. వీరిపై ఆరోపణలు కూడా ఎక్కువే. చాలా సందర్భాల్లో రెవెన్యూ సిబ్బంది అందుబాటులోఉండరు. కనుక చట్టవ్యతిరేక మార్గాల్లో పనిచేయించుకునేవారు, చేసేవారూ పెరిగిపోయారు. రెవిన్యూ అధికారులను ఎవరు ఏమీ అనరు ఎందుకంటే భూమి రికార్డులు వాళ్ల చేతుల్లో ఉంటాయి కాబట్టి.

 

ప్రస్తుత రెవెన్యూ వ్యవస్థ వల్ల అటు సిబ్బందీ, ఇటు పౌరులూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పనిమీద తహశీల్దార్ ఆఫీసుకు వెళ్లాలంటే, తహశీల్దార్ తోపాటు ఆర్ఐ, వీఆర్వోలు ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియని పరిస్థితి. సాధారణంగా తహశీల్దార్లు కలెక్టరేట్లో సమావేశాలనీ, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ల సమావేశాలనీ, శిక్షణ కార్యక్రమాలనీ, మంత్రుల పర్యటనలనీ.. ఇలా రకరకాల పనుల్లో ఉంటారు. దీంతో ఈ సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలుసుకుని వెళ్లి వారి చేత పనిచేయించుకోవడం పెద్ద తలనొప్పి.

 

అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎంఆర్ఓ విజయారెడ్డి హత్య వెనుక అసలు కారణాలు ఏమిటి?

విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్. ఇతనిది రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని గౌరెల్లి గ్రామం. తన తండ్రి కృష్ణ. వారి అన్నదమ్ముల పొత్తులో 30 కుటుంబాలకు కలిపి సుమారు 110 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి వివాదంలో ఉంది. పాస్ బుక్ పొందటం కోసం ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్ళాడు. ఆ విషయం లోనే విజయారెడ్డితో గొడవపడి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చు.(నిజా నిజాలను పోలీసులు విచారిస్తున్నారు).

 

ఏది ఏమైనా చట్టానికి లోబడి విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగికి ఇలాంటి చర్య జరగటం బాధాకరం.

వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ సాంగ్ రిలీజ్

 

విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటించారు. ఓ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమాలో విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో మొదటి పాటను విడుదల చేశారు చిత్ర యూనిట్. ‘మై లవ్’ అంటూ సాగే ఈ పాటను శ్రీకృష్ణ, రమ్య బెహెర పాడారు. ఇక గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై వల్లభ నిర్మించారు.

 

మహిళల భద్రత కోసం.. ప్రత్యేక వాట్సప్ నెంబర్..

 

హైద్రాబాద్ లో దిశ ఘటన తర్వాత మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీస్ యంత్రాంగం పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మహిళల భద్రత కోసం షీ టీం ప్రత్యేక వాట్సప్ నెంబర్ ఏర్పాటు చేసింది. ఇందు కోసం వాట్సప్ నెంబర్ 94416 69988ను ఆవిష్కరించారు. మహిళలు ఈ వాట్సప్ నెంబర్‌కు ఫిర్యాదులు పంపితే…పోలీసులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఈ నెంబర్ రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉమెన్‌ సేఫ్టీ వాట్సాప్‌ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చామని షీ టీం ఐజీ స్వాతి లక్రా తెలిపారు.

హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్‌ కళాశాల ఆడిటోరియంలో ఐపీఎస్‌ అధికారిణి సుమతి, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ పి.శ్రావణ్‌కుమార్‌, కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ నాగమణిలతో కలిసి ఉమెన్‌ సేఫ్టీ వాట్సాప్‌ నంబరు- 94416 69988ను స్వాతిలక్రా ఆవిష్కరించారు. ఈ నంబరుకు కేవలం వాట్సాప్‌ మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోల వివరాలే పంపాలని సూచించారు. మహిళల భద్రత కోసం తెలంగాణ వ్యాప్తంగా త్వరలోనే పబ్లిక్‌ సేఫ్టీ క్లబ్బులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.