spot_img
Homeఅంతర్జాతీయంBritain refugee crisis: బ్రిటన్‌ కొంప ముంచుతున్న శరణార్థులు.. చేతులెత్తేసిన ప్రభుత్వం..!

Britain refugee crisis: బ్రిటన్‌ కొంప ముంచుతున్న శరణార్థులు.. చేతులెత్తేసిన ప్రభుత్వం..!

Britain refugee crisis: బ్రిటన్‌.. ఒకప్పుడు ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం. అనేక దేశాలను దశాబ్దాలు పాలించింది. బతుకుదెరువుకు వెళ్లి.. అక్కడే పాలకులుగా మారింది. భారత్‌కు కూడా వచ్చిన బ్రటిషర్లు మన దేశాన్ని 200 ఏళ్లు పాలించారు. అయితే మారుతున్న పరిణామాలతో ఇప్పుడు బ్రిటన్‌ వలసలతో బాధపడుతోంది. శరణార్ధులుగా వచ్చిన వారు అక్కడే స్థిరపడి బ్రిటిషర్లు స్థానికత కోల్పోయేలా చేస్తున్నారు. అడవులు, సముద్రాలు, నదీ మార్గాల ద్వారా బ్రిటన్‌లో అడుగుపెడుతున్న శరణార్థులను అక్కడి పోలీసులు పట్టుకుని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వారు స్థిరపడేందుకు సదుపాయాలు కల్పిస్తున్నారు. దీంతో అక్కడి జనాభాకన్నా శరణార్థులే ఎక్కువగా పెరిగిపోతున్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, సిరియా వంటి దేశాల నుంచి వలసలు ఎక్కువగా ఉంటున్నాయి.

స్థానికులపై దాడులు..
ఈ శరణార్థులు స్థానిక మహిళలు, యువతలపై దాడులు, లైంగిక అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు పెరిగాయి. కీర్‌ స్టార్మర్‌ ప్రభుత్వం ఈ సమస్యలను విస్మరించి, ఫిర్యాదు చేసిన బ్రిటిష్‌ పౌరులపైనే విదేశీయులను అవమానిస్తున్నారని రేసిజం కేసులు పెడుతోంది. ఇది స్థానికుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది.

11 నగరాలపై వలసదారుల పట్టు.
బ్రిటన్‌లోని 11 నగరాల్లో వలసదారులు విపరీతంగా పెరిగాయి. అక్కడ స్థానికులే మైనారిటీలుగా మారారు. దీంతో మెజారిటీగా ఉన్న శరణార్థులు మైనారిటీలపై దాడులు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ 11 నగరాల్లోనే శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది. దీంతో అక్కడి జనాభా పెరిగి స్థానిక పాలకులుగా కూడా వలసవాదులే ఎన్నికవుతున్నారు. ఈ నగరాల్లో ముస్లిం మేయర్లు, నాయకులు శరణార్థులను సమర్థిస్తూ చేరదీస్తున్నారు.

హోటళ్ల వద్ద నిరసన..
ప్రభుత్వం, వలసదారులు కలిసి స్థానికులకే సమస్యగా మారడంతో 11 నగరాల్లో ప్రజలు రోడ్డెక్కారు. పాలకుల తీరుకు, శరణార్ధుల దాడులకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శరణార్థులను దేశం నుంచి పంపించాలని డిమాండ్‌ చేశారు. అయితే కీర్‌ స్టార్మర్‌ ప్రభుత్వం ఆందోళన కారులను అరెస్టు చేసి నిరసనను అణచివేసింది.

ఈ సంఘటనలు బ్రిటన్‌ ఇమిగ్రేషన్‌ విధానాల్లో లోపాలను బయటపెడుతున్నాయి. శరణార్థుల పునరావాసం నేరాలు పెరగడానికి కారణమవుతోంది. సామాజిక సమతుల్యాన్ని దెబ్బతీస్తోంది. ప్రభుత్వం ఫిర్యాదులను అణచివేయడం ప్రజల ఆగ్రహాన్ని మరింత పెంచుతూ, దేశవ్యాప్త ఉద్రిక్తతలకు దారితీస్తోంది. భవిష్యత్తులో కఠిన చట్టాలు, సమతుల్య విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Oktelugu Epaper