spot_img
Homeఅంతర్జాతీయంUAE Iran Economic Cooperation: అమెరికాకు యూఏఈ షాక్‌.. ఇరాన్‌తో ఆర్థిక సహకారం పునరుద్ధరణ!

UAE Iran Economic Cooperation: అమెరికాకు యూఏఈ షాక్‌.. ఇరాన్‌తో ఆర్థిక సహకారం పునరుద్ధరణ!

UAE Iran Economic Cooperation: అమెరికా–ఇరాన్‌ వార్‌ ఇంకా ముగియలేదు. తుది శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌ నిన్నటి వరకూ ఇరాన్‌పై దాడులు చేశాయి. ప్రతిగా ఇరాన్‌ అమెరికాకు మద్దతుగా ఉన్న గల్ఫ్‌ దేశాలు యూఏఈ, ఒమన్, ఖతార్, బహ్రెయిన్‌పై దాడులు చేసింది. ఆయిల్‌ రిఫైనరీలను ధ్వంసం చేసింది. ఇలాంటి పరిస్థితిలో యూఏఈ అమెరికాకు షాక్‌ ఇచ్చింది. ఇరాన్‌ దాడిని ఎదుర్కొన్న గల్ఫ్‌ దేశం.. ఇరాన్‌కే ఇప్పుడు ఆర్థిక సహకారం అందించింది. మొత్తం 10 బిలియన్‌ డాలర్లు విడుదల చేయాలని, వాటిలో 3 బిలియన్‌ డార్లకంటే కంటే ఎక్కువ ఇప్పటికే ఇరాన్‌కు అందించింది.

ఖండించిన యూఏఈ…
ఇదిలా ఉంటే యూఈఏ–ఇరాన్‌ ఆర్థిక సహకారం పునరుద్ధరణ వార్తలను యూఏఈ ఖండించింది. యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ రాయిటర్‌లో వచ్చిన వార్తలను పూర్తిగా తిరస్కరించింది. ‘‘ఫ్రోజెన్‌ ఇరానియన్‌ ఫండ్స్‌ ఏవీ విడుదల చేయలేదు, బదిలీ చేయలేదు లేదా సులభతరం చేయలేదు’’ అని అధికారికంగా ప్రకటించింది. వార్తలు వాస్తవాల ఆధారంగా లేవని, మీడియా అధికారిక వనరులపై ఆధారపడాలని సూచించింది.

యూఏఈపై ఇరాన్‌ దాడులు..
అమెరికా–ఇజ్రాయెల్‌–ఇరాన్‌ సంఘర్షణ నేపథ్యంలో యూఏఈపై ఇరాన్‌ దాడులు చేసింది. క్షిపణి, డ్రోన్‌లతో విరుచుకుపడింది. దీంతో యూఏఈ ఆర్థిక వ్యవస్థకు (లాజిస్టిక్స్, ఎనర్జీ, బ్యాంకింగ్‌) గణనీయమైన నష్టం కలిగించింది. యూఏఈ చారిత్రకంగా ఇరాన్‌ ఆర్థిక కార్యకలాపాలకు హబ్‌గా ఉంది, కానీ ఇటీవలి దాడుల తర్వాత భద్రతా చర్యలు తీసుకుంది. యూఏఈ మిత్రరాజ్యం (అబ్రహామ్‌ అకార్డ్స్, ఆయుధ ఒప్పందాలు), అయినప్పటికీ ప్రాగ్మాటిక్‌ విధానం అనుసరిస్తుంది. చైనా, ఇతర శక్తులతో సంబంధాలు కొనసాగిస్తూ, తన ఆర్థిక ప్రయోజనాలను రక్షించుకోవడానికి ఇరాన్‌తో సంభాషణలు జరపడం సాధారణం.

ట్రంప్‌పై నమ్మకం కోల్పోయిన యూఏఈ..
యుద్ధం నేపథ్యంలో ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికాపై యూఏఈ నమ్మకం కోల్పోయింది. యూఎస్‌పై ఆధారపడటం ఆర్థిక నష్టం అని భావిస్తోంది. అందుకే ఇరాన్‌ దాడుల నుంచి తక్షణ రక్షణ ఇరాన్‌తో సహకారం పునరుద్ధరించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌ ఫండ్స్‌ అన్‌లాక్‌ అయితే యూఏఈ–ఇరాన్‌ వాణిజ్యం పుంజుకుంటుంది. ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గుతాయి. నిజానికి యూఏఈ ఇరాన్‌ ఆస్తులను ఫ్రీజ్‌ చేయాలని ముందు ఆలోచించింది.ఇప్పుడు దాడులు ఆపడానికి వ్యతిరేక దిశలో వెళ్తే అది వాస్తవిక భద్రతా అవసరం.

యూఏఈ వంటి దేశాలు తమ ఆర్థిక–భద్రతా ప్రయోజనాల కోసం బహుముఖ విధానం అనుసరిస్తాయి. ట్రంప్‌ పరిపాలనలో అమెరికాకు మద్దతు ఉన్నప్పటికీ, తన స్వంత ప్రయోజనాలను రక్షించుకోవడం సహజం. ప్రాంతీయ శాంతి కోసం దౌత్యం ముఖ్యం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper