Homeఅంతర్జాతీయంIsrael Iraq Conflict: ఓ గొర్రెల కాపరి.. ఇరాక్ ను బతికించాడు.. ఇజ్రాయిల్ కు చుక్కలు...

Israel Iraq Conflict: ఓ గొర్రెల కాపరి.. ఇరాక్ ను బతికించాడు.. ఇజ్రాయిల్ కు చుక్కలు చూపించాడు..

Israel Iraq Conflict: ప్రపంచాన్ని అత్యాధునిక మిలిటరీ సాంకేతిక పరిజ్ఞానం ఇజ్రాయిల్ వద్ద ఉంది. ఇజ్రాయిల్ తయారు చేసే వెపన్స్ అత్యంత ఖచ్చితత్వంతో పని చేస్తూ ఉంటాయి. పైగా ఇజ్రాయిల్ దేశానికి మోస్సాద్ అత్యంత సమర్థవంతంగా పనిచేసే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. అంతటి టెక్నాలజీ ఉన్న ఇజ్రాయిల్ దేశం ఒక గొర్రెల కాపరికి దొరికిపోయింది. అంతేకాదు బతుకు జీవుడా అంటూ బయటపడింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ లో ఇజ్రాయిల్ దేశానికి తిరుగులేదు. ఆ దేశం ఆయుధాల తయారీలో తిరుగులేని […]

Israel Iraq Conflict: ప్రపంచాన్ని అత్యాధునిక మిలిటరీ సాంకేతిక పరిజ్ఞానం ఇజ్రాయిల్ వద్ద ఉంది. ఇజ్రాయిల్ తయారు చేసే వెపన్స్ అత్యంత ఖచ్చితత్వంతో పని చేస్తూ ఉంటాయి. పైగా ఇజ్రాయిల్ దేశానికి మోస్సాద్ అత్యంత సమర్థవంతంగా పనిచేసే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. అంతటి టెక్నాలజీ ఉన్న ఇజ్రాయిల్ దేశం ఒక గొర్రెల కాపరికి దొరికిపోయింది. అంతేకాదు బతుకు జీవుడా అంటూ బయటపడింది.

కౌంటర్ ఇంటెలిజెన్స్ లో ఇజ్రాయిల్ దేశానికి తిరుగులేదు. ఆ దేశం ఆయుధాల తయారీలో తిరుగులేని స్థానంలో ఉంటుంది. అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఇజ్రాయిల్ తయారు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మూడవ కంటికి తెలియకుండా పని పూర్తి చేయడంలో ఇజ్రాయిల్ కు మించిన దేశం లేదు. ఇటీవల ఇరాన్ మీద యుద్ధం చేసినప్పుడు.. ఇజ్రాయిల్ అనేక శక్తివంతమైన ఆయుధాలను ప్రయోగించింది. మిస్సైల్స్ ను వేసింది. ఇరాన్ దేశాన్ని సర్వనాశనం చేసింది.

ఇరాన్ దేశంలో అంతకుమించి అనే స్థాయి విధ్వంసం సృష్టించేందుకు ఇజ్రాయిల్ ప్రణాళిక రూపొందించింది. మూడో కంటికి తెలియకుండా పని పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. ఇరాన్ మీద మరింత దారుణంగా దాడులు చేసేందుకు ఇజ్రాయిల్ మిలిటరీ ఏకంగా ఇరాక్ ఎడారి ప్రాంతంలో మిలిటరీ బేస్ వే ఏర్పాటు చేసింది. ఇరాన్ ఇజ్రాయిల్ దేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందువల్లే యుద్ధం ప్రారంభానికి ముందు ఈ పని చేసింది.

ఓ గొర్రెల కాపరి తన గొర్రెలను మేపుతుండగా ఇజ్రాయిల్ సైన్యం చేస్తున్న పని చూశాడు. ఈ సమాచారాన్ని ఇరాక్ దేశ అధికారులకు తెలియజేశాడు. వాస్తవానికి ఆ గొర్రెల కాపరి గనక లేకపోతే ఇరాన్ దేశం ఇంకా ఇబ్బంది పడేది. ఆ గొర్రెల కాపరి ఇజ్రాయిల్ దేశానికి ఒక రకంగా శత్రువుగా మారిపోయాడు. తన దీర్ఘ దృష్టితో ఇజ్రాయిల్ చేస్తున్న దురాగతాన్ని ఇరాక్ కు చేరవేశాడు. ఫలితంగా ఇజ్రాయిల్ పన్నాగం బయటపడింది. ఇరాక్ బతికిపోయింది.

ఇరాక్ మీద దాడి చేయడానికి ఇజ్రాయిల్ ఇరాన్ దేశాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ కాస్త కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ.. ఇరాక్ దేశంలో దాడులు చేసేందుకు ఇరాన్ భూభాగాన్ని స్థావరం గా ఎంచుకుంది ఇజ్రాయిల్. అయితే గొర్రెల కాపరి చూడటంతో ఇజ్రాయిల్ పన్నాగం బయటపడింది. ఈ క్రమంలోనే విచారణ జరపడానికి ఇరాకీ దళాలు అక్కడికి వెళ్లాయి. వారిపై ఇజ్రాయిల్ వైమానికంగా దాడులు చేసింది.. అయితే ఈ ఘటనలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు.. ఎంత నష్టం చోటుచేసుకుంది అనే విషయాల మీద ఇంతవరకు క్లారిటీ లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper