Pakistani Student Thanks PM Modi: ఉక్రెయిన్ పై రష్యా యుద్దం తర్వాత అక్కడ చిక్కుకుపోయిన విదేశీ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుజీవుడా అంటూ విద్యార్థులు ఉక్రెయిన్ సరిహద్దులకు వచ్చి తమను ఈ దేశం నుంచి తీసుకెళ్లాలని వేడుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ అనే పేరుతో మన దేశ విద్యార్థులను విమానాల ద్వారా దేశానికి తరలించి మంచి మార్కులు కొట్టేసింది. అయితే పక్కనే ఉన్న పాకిస్తాన్ దేశం మాత్రం ఆ పని చేయలేకపోయింది. తమ దేశ విద్యార్థులను గాలికి వదిలేసిందన్న ఆరోపణలున్నాయి. స్వయంగా దీనిపై పాక్ విద్యార్థులు వీడియోల్లో వాపోయారు.
Also Read: CPI Narayana: నారాయణ.. నారాయణ.. ఏంటీ బూతు బాగోతం
ఈ క్రమంలోనే యుద్ధంతో రగులుతున్న ఉక్రెయిన్ నుంచి భారత్ సాయంతో బయటపడిన పాకిస్తాన్ బాలిక తాజాగా సంచలన వీడియో రిలీజ్ చేసింది. భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

పాకిస్తాన్ బాలిక ఆస్మా షఫీక్ తాజాగా ఆ వీడియోలో మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్ లోని కీవ్ లో తాను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేందుకు తనకు సాయం చేసిన ఇండియన్ ఎంబసీకి, ప్రధాని నరేంద్రమోడీకి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.చాలా క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న మాకు అన్ని విధాలుగా సాయం చేసిన కీవ్ లోని భారత రాయబార కార్యాలయానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా.. అలాగే భారత ప్రధానికి కూడా.. మేం సురక్షితంగా ఇంటికి చేరుకుంటామని ఆశిస్తున్నాం.. భారత రాయబార కార్యాలయానికి ధన్యవాదాలు’ అంటూ వీడియోలో భారత్ గురించి గొప్పగా ఆస్మా పేర్కొంది.
Also Read: Krishnam Raju: షాకింగ్: ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు ప్రమాదం.. సర్జరీ.. వేలు తొలగింపు
ఆస్మా ఇప్పుడు భారత్ సాయంతో పశ్చిమ ఉక్రెయిన్ కు వెళుతోంది. అక్కడి నుంచి ఆమె బయటపడి స్వదేశానికి చేరుకుంటుంది.
#WATCH | Pakistan’s Asma Shafique thanks the Indian embassy in Kyiv and Prime Minister Modi for evacuating her.
Shas been rescued by Indian authorities and is enroute to Western #Ukraine for further evacuation out of the country. She will be reunited with her family soon:Sources pic.twitter.com/9hiBWGKvNp
— ANI (@ANI) March 9, 2022
[…] Viral Photo: ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎక్కువ అయిపోయింది. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను విపరీతంగా ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియా కారణంగా ఎవరైనా రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోతున్నారు. ఇటీవల కచ్చా బాదమ్ పాటతో భుజన్ బద్యాకర్ అనే వ్యక్తి సోషల్ మీడియాతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. కూలీ పని చేసుకునే 60 ఏళ్ల వ్యక్తి మమ్మిక్కా కూడా మోడల్ అయిపోయాడు. […]
[…] India-Russia Relation: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో అన్ని దేశాలు నష్టపోతున్నాయి. ప్రపంచం మొత్తం యుద్ధం వద్దని సూచిస్తున్నా రష్యా మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో దాని ఫలితాలు అందరు అనుభవించాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరిగినా అవి సరైన ఫలితం ఇవ్వకపోవడంతో ఇక యుద్ధమే శరణ్యమని రష్యా తన సేనలను ముందుకు నడిపిస్తోంది. ఈ నేపథ్యంలో నాటో, యూరోపియన్ యూనియన్ దేశాలతోపాటు అగ్రరాజ్యం అమెరికా, జర్మనీ, బ్రిటన్, జపాన్ సహా చాలా దేశాలు రష్యా చర్యలను ఖండిస్తున్నాయి. […]