Pakistan Democracy Controversy: రామ భక్తుడు రామదాసు.. నిజాం పాలనలో భద్రాచలంలో రామాలయం నిర్మాణానికి పూనుకున్నాడు. రాముడు ఉన్నాడని నిరూపించాలనుకున్నాడు. కానీ నింజాలు రాముడిని నమ్మలేదు. దీంతో రామదాసును జైల్లో పెట్టారు. ఇక ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఉందని నిరూపించాలనుకున్నాడు ఓ రీసెర్చ్ స్కారల్.. కానీ చివరకు జైలుపాలయ్యాడు.
Also Read: జగన్ కోసం రంగంలోకి ఆ ఇద్దరు!
ఏం జరిగిందంటే..
కెనడాలో స్థిరపడిన పాకిస్తాన్ మూలానికి చెందిన యువకుడు హంజా అహ్మద్ ఖాన్, టోరాంటోలో చదువుకుంటున్నాడు. పరిశోధనా విద్యార్థిగా చదువుతూ ఇస్లామిక్ దేశాల్లో ప్రజాస్వామ్య సాధ్యాసాధ్యాలపై ఆసక్తి చూపాడు. తన స్వదేశానికి వెళ్లి, ఈ అంశంపై స్థానికుల అభిప్రాయాలు సేకరించేందుకు సర్వే చేపట్టాడు. ఆయన ప్రశ్నలు సాధారణంగా ప్రజల పాల్గొన్న పాలిటిక్స్, మత నిబంధనల మధ్య సమతుల్యతపై కేంద్రీకరించాఉ.
హఠాత్తు అదృశ్యం..
సర్వేలో నిమగ్నమైన హంజా అహ్మద్ ఖాన్ ఒక్కసారిగా కనబడకుండా పోయాడు. దీంతో కెనడాలోని కుటుంబం, పాకిస్తాన్లోని స్నేహితులు ఆదోళన చెందారు. పాకిస్తాన్కు వచ్చి అతని కోసం గాలింపు చేపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. రోజుల తరబడి విచారణలు జరిగాయి. పాలకులను బతిమాలుకున్నారు. చివరికి ఆయన మత విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న అనుమానంతో పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పాకిస్తాన్లో ప్రజాస్వామ్య గురించి చర్చించడమే కారణంగా, ఆయన్ను రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ అనుచరుడిగా భావించారు.
ఇస్లామిక్ సమాజాల్లో ప్రజాస్వామ్యం ఇదీ..
హంజా సంఘటన మతాధారిత దేశాల్లో ప్రజాస్వామ్య చర్చల హద్దులను సూచిస్తుంది. ఇక్కడ పాలిటిక్స్ మతంతో గట్టిగా కట్టబడి ఉంటుంది. అధికారులు ఏదైనా విమర్శను మత వ్యతిరేకంగా చేస్తే కఠిన శిక్షలు తప్పవు. పాకిస్తాన్ వంటి దేశాల్లో చట్టాలు ఇలాంటి దుర్వినియోగానికి దారితీస్తాయి. ప్రజాస్వామ్య ఆలోచనలు గురించి ఇస్లామిక్ దేశాల్లో మాట్లాడడం కూడా నేరమే.