Homeఎంటర్టైన్మెంట్Sivalenka Krishna Prasad: సమంత మరెవరో కాదు: ఆ నిర్మాత పెద్ద కుమార్తె

Sivalenka Krishna Prasad: సమంత మరెవరో కాదు: ఆ నిర్మాత పెద్ద కుమార్తె

Sivalenka Krishna Prasad: ప్రియాంక చోప్రా నుంచి మంచు లక్ష్మి దాకా ఇప్పుడు అంతా సరోగసి విధానంలోనే పిల్లల్ని కన్నారు.. కాదు కాదు అద్దె గర్భం ద్వారా అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఒక దశాబ్దం క్రితం వరకు మనదేశంలో సరోగసి అంటే అంతగా తెలియదు. కానీ కాలక్రమేణా ఇప్పుడు వందల కోట్ల వ్యాపారంగా మారిపోయింది. ఇక ఈ అద్దె గర్భం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి? సరోగసి పేరుతో సమాజంలో జరుగుతున్న దారుణాలు ఏ విధంగా ఉన్నాయి? వీటిపై శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా రూపొందిన చిత్రం యశోద. ఈ సినిమాలో సమంత టైటిల్ పాత్రలో నటించింది. నవంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు మీకోసం.

Sivalenka Krishna Prasad
Sivalenka Krishna Prasad, samantha

సమంత నా పెద్ద కుమార్తె

యశోద సినిమాలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్యనే చూపించారు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా దీనిని విడుదల చేస్తున్నారు. ఈ కథ అనుకున్నప్పటి నుంచి టైటిల్ రోల్ కు సమంత సరిపోతుందని భావించారు. గత ఏడాది ఆమెకు కథ చెప్పారు.. కథ విన్న 45 నిమిషాల్లోనే ఆమె పచ్చ జెండా ఊపారు. సినిమా చేసేందుకు అంగీకరించారు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి బాధ్యత ఆమె తీసుకున్నారు. దీంతో ఈ చిత్ర నిర్మాత కృష్ణ ప్రసాద్ ఆమెను తన పెద్ద కూతురుగా అభివర్ణించారు.

కొత్త కాన్సెప్ట్

కృష్ణ ప్రసాద్ గతంలో ఆదిత్య 369 సినిమా నిర్మించారు. ఈ సినిమాకి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. బాలకృష్ణ హీరోగా నటించారు. అప్పట్లో ఇది సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆదిత్య 369 కథ విన్నప్పుడు ఎంత ఉత్సాహానికి గురయ్యానో.. యశోద సినిమా కథ విన్నప్పుడు కూడా అంతే అనుభూతిని పొందానని ఈ చిత్రం నిర్మాత కృష్ణ ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో సమంత ఎంతో అద్భుతంగా నటించిందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ సినిమా విషయంలో పూర్తి నమ్మకంతో ఉన్నానని, మంచి సినిమా తీశానన్న సంతృప్తి ఉందని ప్రసాద్ పేర్కొన్నారు. ఇక ఇటీవల సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి బాగుందని మెచ్చుకున్నారు. నేపథ్యం కొత్తగా ఉందని నిర్మాతను ప్రశంసించారు.

బెడ్ పై పడుకునే

ఇక సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నది. దానికి చికిత్స కూడా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో యశోద డబ్బింగ్ సమయంలో అనారోగ్యానికి గురైంది. ఈ విషయం కూడా అప్పుడే ఈ చిత్ర నిర్మాతకు తెలిసింది. అయినప్పటికీ తెలుగు, తమిళంలో తన పాత్రకు ఆమే డబ్బింగ్ చెప్పింది. తమిళంలో డబ్బింగ్ చెబుతున్న సమయంలో సమంత పూర్తిగా నీరసించి పోయింది. డాక్టర్ పర్యవేక్షణలో సెలైన్ పెట్టుకొని డబ్బింగ్ చెప్పింది. హిందీ వెర్షన్ కి గాయని చిన్మయితో డబ్బింగ్ చెప్పించారు.

Sivalenka Krishna Prasad
Sivalenka Krishna Prasad

బడ్జెట్ పెరిగింది

ఈ సినిమాను మొదట్లో మూడు కోట్ల బడ్జెట్ తో తీయాలి అనుకున్నారు. కాకపోతే కథ డిమాండ్ చేయడం వల్ల బడ్జెట్ పెరిగింది. ఈ సినిమా కోసం నానక్ రామ్ గూడలో రెండు భారీ సెట్లు వేశారు. అందులో దాదాపు 55 రోజులపాటు షూటింగ్ చేశారు. సుమారు 180 మంది మహిళలు ఈ సినిమా కోసం పని చేశారు. ఇక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా బాలకృష్ణ హీరోగా అప్పట్లో ఆదిత్య 369 ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. సైన్స్ ఫిక్షన్ కేటగిరిలో అది ఒక కొత్త ఒరవడి సృష్టించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నట్టు బాలకృష్ణ ప్రకటించారు. దానికి “ఆదిత్య 999 మ్యాక్స్” అని టైటిల్ కూడా ఖరారు చేశారు. అయితే ఈ సినిమా ప్రకటన పట్ల కృష్ణ ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు.. కానీ ఆ సినిమాకు పెట్టేంత బడ్జెట్ తన వద్ద లేదని తేల్చి చెప్పేశారు..

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper