Bhopal : ప్రస్తుతం దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ల కాలం నడుస్తోంది. వేగంగా ప్రయాణించగలిగే ప్రత్యేకత కలిగిన ఈ సెమీ హైస్పీడ్ రైలుకీ రోజురోజుకీ వీటికి ప్రజాదరణ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ఇప్పటికే రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు నడుస్తున్నాయి. రాళ్లు రువ్వడం, ఆవు, గేదేలు గుద్దుకొని రైలు దెబ్బతినడం వంటి విషయాలతో తరుచూ వందే భారత్ రైలు వివాదాల్లో నిలుస్తుంది. తాజాగా కొన్ని మార్పులతో ఆధునిక సౌకర్యాలతో కొత్త రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా వందే భారత్ ఎక్స్ప్రెస్ మరోసారి వార్తల్లో నిలిచింది.. మూత్ర విసర్జన కోసం వందే భారత్ రైలు ఎక్కిన ఓ వ్యక్తి ఏకంగా రూ.6 వేల మూల్యం చెల్లించుకున్నాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది.