Homeజాతీయ వార్తలుKohinoor Diamond: పూరీ జగన్నాథుడిదే కోహినూర్ వజ్రం.. తెరపైకి కొత్త డిమాండ్

Kohinoor Diamond: పూరీ జగన్నాథుడిదే కోహినూర్ వజ్రం.. తెరపైకి కొత్త డిమాండ్

Kohinoor Diamond: మన దేశ ఔన్నత్యాన్నిపెంచే కోహినూర్ వజ్రం బ్రిటిష్ వారు అక్రమంగా దోచుకెళ్లారు.దీంతో మన వారు చాలా ఏళ్లుగా దాని గురించి చర్చలు జరిపారు. పోరాటాలు చేశారు. కానీ దాన్ని దేశానికి మాత్రం తీసుకురాలేకపోయారు. మన దేశానికి మకుటాయమానంగా ఉన్న కోహినూర్ వజ్రం ప్రస్తుతం బ్రిటన్ లో ఉంది. దాన్ని రాణి ఎలిజబెత్ మరణం తరువాత కాబోయే రాణి ధరిస్తారనే వాదనలు వస్తున్నాయి. కానీ మన సంపదను దోచుకెళ్లిన వారి నుంచి దాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయాలని చాలా మంది భావిస్తున్నారు.

Kohinoor Diamond
Kohinoor Diamond

మన దేశ సంపదను దోచుకెళ్లే హక్కు వారికి ఎక్కడుంది. అది మన సొంతం. మన దర్పణం. మన కీర్తికిరీటంలో కలికితురాయి. మన దేశ ఔన్నత్యానికి ప్రతీక. అలాంటి వజ్రాన్ని బ్రిటిష్ అక్రమంగా వారి దేశానికి తీసుకెళ్లడమే వివాదాస్పదంగా మారింది. దీంతో దాన్ని వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేయాల్సిన సమయం వచ్చింది. బ్రిటిష్ వారి నుంచి మనం మన వజ్రాన్ని తిరిగి తీసుకురావాలని యావత్ దేశ ప్రజలు ఆశిస్తున్నారు. కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనం అప్పుడు ఆంగ్లేయులు తీసుకెళ్లారు.

కోహినూర్ వజ్రం ఒడిశాలోని పూరీ జగన్నాథుడికి చెందింది. దాన్ని అప్పటి మహారాజు నుంచి బ్రిటిష్ అక్రమంగా తీసుకుపోయారు. ఒడిశాకు చెందిన చరిత్రకారుడు సురేంద్ర మిశ్రా జగన్నాథుడిని దర్శించుకున్న పంజాబ్ రాజు రంజిత్ సింగ్ స్వామికి వజ్రాన్ని కానుకగా ఇస్తారని వాదిస్తున్నారు. దీనిపై పూరీ జగన్నాథ సేన అధ్యక్షుడు, న్యాయవాది ప్రియదర్శన్ పట్నాయక్ సోమవారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి కోహినూర్ పై అంతర్జాతీయ కోర్టుకు వెళతామని తెలిపారు. కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు ప్రధాని మోడీ చర్యలు తీసుకోవాలని కోరారు.

Kohinoor Diamond
Kohinoor Diamond

బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి అక్టోబర్ 2016లో యునైటెడ్ కింగ్ డమ్ ప్రభుత్వానికి అప్పీల్ చేశారు దీంతో మెజెస్టి సలహా మేరకు వ్యవహరిస్తామని సమాధానం వచ్చింది. 1839లో రంజిత్ సింగ్ మరణించాక పదేళ్ల తరువాత ఆయన కుమారుడు దిలీప్ సింగ్ నుంచి బ్రిటిషర్లు కోహినూర్ వజ్రాన్ని లాగేసుకున్నారు. రంజిత్ సింగ్ వారసులు పాక్, అఫ్గనిస్తాన్ లలో అనేక మంది హక్కుదారులున్నా వారిని సమర్థించరని తెలుస్తోంది. వజ్రాన్ని లాహోర్ మహారాజు ఇంగ్లండ్ రాణికి 170 ఏళ్ల కిందట అప్పగించలేదని తెలిసింది. రాణి ఎలిజబెత్ మరణంతో ఆమె కుమారుడు చార్లెస్ రాజు కాగా చార్లెస్ భార్య కార్న్ వాల్ కెమిల్లా వజ్రాన్ని ధరించనున్నట్లు చెబుతున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper