Homeటాప్ స్టోరీస్Revanth Reddy Delimitation Strategy: రేవంత్ తీరు.. కాంగ్రెస్ కు కత్తిమీద సాము..

Revanth Reddy Delimitation Strategy: రేవంత్ తీరు.. కాంగ్రెస్ కు కత్తిమీద సాము..

Revanth Reddy Delimitation Strategy: తెలంగాణ గడ్డపై పాలనతో బిజీగా ఉండే సీఎం రేవంత్ రెడ్డి హస్తినలో అడుగుపెట్టగానే రూటు మారుస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఆయన ఎంచుకున్న సరికొత్త ఆయుధం.. ‘డీలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన). దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలే పరమావధిగా ఆయన వినిపిస్తున్న నినాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

Also Read: పవన్ కళ్యాణ్ తో ‘ధురంధర్ 2’ డైరెక్టర్ ఆదిత్య డర్ భేటీ.. త్వరలోనే బ్లాస్టింగ్ అప్డేట్ లోడింగ్..

దక్షిణాదికి శిక్షేనా? రేవంత్ లాజిక్ ఇదే!

నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్య పెరుగుతుంది. ఇక్కడే రేవంత్ రెడ్డి ఒక బలమైన పాయింట్‌ను తెరపైకి తెచ్చారు. దక్షిణాది రాష్ట్రాలు దశాబ్దాలుగా కేంద్రం చెప్పినట్లు కుటుంబ నియంత్రణను పాటించి జనాభాను అదుపు చేశాయి. కానీ, ఇప్పుడు జనాభా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలకే (యూపీ, బీహార్ వంటివి) ఎక్కువ ఎంపీ సీట్లు కేటాయిస్తే, అది క్రమశిక్షణ పాటించిన దక్షిణాదికి అన్యాయం చేసినట్లే అవుతుంది. “అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు శిక్ష.. జనాభా పెంచిన వారికి బహుమతా?” అన్న రేవంత్ ప్రశ్న ఇప్పుడు దక్షిణ భారతాన్ని ఆలోచింపజేస్తోంది.

కాంగ్రెస్ హైకమాండ్‌కు కత్తి మీద సాము!

రేవంత్ రెడ్డి తీస్తున్న ఈ ‘సౌత్ సెంటిమెంట్’ కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇరకాటంలో పడేస్తోంది. నార్త్ వర్సెస్ సౌత్ గా పరిస్థితి మారుతోంది. రేవంత్ వ్యాఖ్యలను గట్టిగా సమర్థిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లోని ఓటర్లు తమను కించపరుస్తున్నారని భావించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఉత్తరాదిన పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్న తరుణంలో ఈ ప్రాంతీయ భేదాలు పార్టీ జాతీయ ప్రతిష్టకు విఘాతం కలిగించవచ్చు. అందుకే రేవంత్ దూకుడుపై అధిష్టానం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ముద్ర వేయకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది.

‘తెలంగాణ ఫస్ట్’.. రేవంత్ మార్క్ పాలిటిక్స్

గతంలో కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల కోసం ‘బీఆర్ఎస్’ పెట్టి చేతులు కాల్చుకున్నారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అయితే రేవంత్ వ్యూహం భిన్నంగా ఉంది. ఆయన కేవలం పార్టీ లైన్ కాకుండా ప్రాంతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. దక్షిణాది ఎంపీల సంఖ్య తగ్గితే భవిష్యత్తులో కేంద్రం నుంచి వచ్చే నిధులు, రాజకీయ ప్రాతినిధ్యం కూడా తగ్గిపోతాయని ఆయన హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ మాదిరిగా ఉత్తరాదిలో పార్టీని విస్తరించడం కంటే, దక్షిణాది నేతలను ఏకం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవడమే రేవంత్ అసలు ప్లాన్ అని అర్థమవుతోంది.

బీజేపీకి చిక్కుముడి.. కాంగ్రెస్‌కు సవాల్!

ఉత్తరాదిన తిరుగులేని బలం ఉన్న బీజేపీకి, రేవంత్ లేవనెత్తిన ఈ అంశం పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఒకవేళ దక్షిణాది రాష్ట్రాలు నిజంగానే ఏకతాటిపైకి వస్తే, అది బీజేపీకి దక్షిణాదిన అడ్డుగోడగా మారుతుంది. అయితే, ఇదే సమయంలో రేవంత్ వ్యాఖ్యలను బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకుని “కాంగ్రెస్ దేశాన్ని విభజిస్తోంది” అనే ప్రచారాన్ని నార్త్ ఇండియాలో మొదలుపెట్టే ఛాన్స్ కూడా ఉంది.

రేవంత్ రెడ్డి ఎంచుకున్న ఈ ‘దక్షిణ సెంటిమెంట్’ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇది కేవలం సీట్ల పెంపు అంశమే కాదు.. భవిష్యత్తు భారత రాజకీయాల గమనాన్ని మార్చే కీలక పరిణామం. రేవంత్ రెడ్డి ఈ పోరాటంలో దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేయగలరా? లేదా జాతీయ రాజకీయాల ఒత్తిడిలో తన స్వరాన్ని తగ్గించుకుంటారా? అనేది కాలమే నిర్ణయించాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Jogi Ramesh daughter In Law

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...
Vangaveeti Radhakrishna

Vangaveeti Radha Krishna: విజయవాడ సెంట్రల్ బాధ్యతలు వంగవీటికి?!

Vangaveeti Radha Krishna: తెలుగుదేశం పార్టీ నాయకత్వం గతంలా వ్యవహరించడం లేదు. కాస్త దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటోంది. గతం మాదిరిగా ఉపేక్షిస్తే రాజకీయపరంగా ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. అందుకే వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది....
Roja

Roja: మాజీ మంత్రి రోజా చుట్టూ ఉచ్చు!

Roja: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి రోజా అరెస్టు అయ్యే అవకాశం ఉంది. ఆమెకు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 30న విచారణకు హాజరుకావాలని కోరారు....
Daggubati Purandeswari

Daggubati Purandeswari: కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఏపీ ఎంపీకి ఛాన్స్?!

Daggubati Purandeswari: కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విద్యావ్యవస్థలో వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఇందులో యాదృచ్ఛికం ఏంటంటే.....
Bonda Umamaheswara Rao

Bonda Umamaheswara Rao: అంబటి రాంబాబుతో చెట్టాపట్టాల్.. టిడిపి సీనియర్ ఎమ్మెల్యేకు షాక్!

Bonda Umamaheswara Rao: అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రేపిన కలకలం కొత్త మలుపు తిరిగింది. కాపు సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తానని చెప్పడం.. వైయస్సార్ కాంగ్రెస్...
Oktelugu Epaper