KCR farmhouse latest news: ఎమ్మెల్యేగా.. ఎంపీగా.. కేంద్ర మంత్రిగా.. ఉద్యమ నాయకుడిగా.. ముఖ్యమంత్రిగా.. ప్రతిపక్ష నాయకుడిగా.. ఇలా అనేక పాత్రలను పోషించారు కేసీఆర్. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో కేసీఆర్ ఎన్నో ఆటుపోట్లను చవిచూశారు. ఉద్యమ సమయంలో అనేక రకాల విమర్శలు ఎదుర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని పరిపాలించారు.. 2023 ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు.
2024 పార్లమెంటు ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినప్పటికీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లోను ఆశించిన స్థాయిలో స్థానాలు లభించకపోయినప్పటికీ.. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో నమ్మకం కోల్పోకుండా ఉండేందుకు కేసీఆర్ అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. పార్టీ 25 సంవత్సరాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇటీవల జగిత్యాల సభలో సూపర్ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. పార్టీకి మళ్ళీ జవసత్వాలు అందించేందుకు కెసిఆర్ కృషి చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు పార్టీ క్రియాశీలక సభ్యత్వాల నమోదును కూడా ప్రారంభించారు. ఇప్పటికే అన్ని జిల్లాల బాధ్యులతో కేసీఆర్ మాట్లాడారు.
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఆయన వ్యవసాయ క్షేత్రానికి పరిమితం అవుతారు. ఆయనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. పైగా గజ్వేల్ ప్రాంతంలో ఆయనకు విస్తారమైన వ్యవసాయ క్షేత్రం ఉంది. అందులో ధాన్యం పంటలు.. వాణిజ్యం పంటలు అన్ని పండుతాయి. క్యాప్సికం.. ముల్లంగి.. స్ట్రాబెరీ.. ఇంకా రకరకాల పంటలు అందులో సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో వరి కోతలు సాగుతున్నాయి. దీనికి సంబంధించి వరి కోతకు వచ్చిన హార్వెస్టర్ డ్రైవర్ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కెసిఆర్ ఫామ్ హౌస్ లో వరికోస్తున్నామంటూ అతడు ఒక వీడియో తీసి పోస్ట్ చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది. చివరికి కేసీఆర్ ఫామ్ హౌస్ లో వరి కోస్తున్న వీడియో కూడా ఈ తీరుగా సంచలనం సృష్టిస్తోందంటే మాటలు కాదని నెటిజన్లు అంటున్నారు.
View this post on Instagram
