spot_img
Homeక్రీడలుSA20 2024 Final: సన్ రైజర్స్ గెలుస్తుందా? సూపర్ జెయింట్స్ సత్తా చాటుతుందా? ఫైనల్ పోరు...

SA20 2024 Final: సన్ రైజర్స్ గెలుస్తుందా? సూపర్ జెయింట్స్ సత్తా చాటుతుందా? ఫైనల్ పోరు నేడు..

SA20 2024 Final: పొట్టి క్రికెట్ ఫార్మాట్ నిర్వహణలో మన దేశం మాత్రమే కాదు దక్షిణాఫ్రికా కూడా సత్తా చాటుతోంది.. సౌత్ ఆఫ్రికా 20 పేరుతో టి20 క్రికెట్ టోర్నీ నిర్వహిస్తోంది. గత ఏడాది మొదటి ఎడిషన్ విజయవంతంగా సాగింది. ఈ ఏడాది రెండవ ఎడిషన్ లోకి అడుగుపెట్టిన ఈ టోర్నీ తుది అంచుకు చేరింది. శనివారం రాత్రి తొమ్మిది గంటలకు ఫైనల్ మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా జరగనుంది. ఫైనల్ మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ తో డర్బన్ సూపర్ జెయింట్స్ తలపడునుంది. గురువారం జరిగిన మ్యాచ్ లో జోబర్గ్ సూపర్ కింగ్స్ పై డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టు 69 పరుగుల తేడాతో విజయం సాధించింది.. దీంతో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్, డర్బన్ సూపర్ జెయింట్స్ అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్, డర్బన్ సూపర్ జెయింట్స్ ఇప్పటివరకు ఈ టోర్నీలో మూడుసార్లు తలపడ్డాయి. మొదటిసారి సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. సన్ రైజర్స్ రెండుసార్లు విజయం సాధించింది. రెండు జట్లకు సంబంధించిన అభిమానులు భారీగా టికెట్లు కొనుగోలు చేయడంతో కేప్ టౌన్ స్టేడియం నిండిపోయింది.

ఐడెన్ మార్క్రామ్ ఆధ్వర్యంలో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఈ టోర్నీలో రెండు మ్యాచ్ లు మాత్రమే ఓడిపోయింది. గ్రూప్ దశ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో ఈ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు విజయం సాధించింది. కేశవ్ మహారాజ్ ఆధ్వర్యంలో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది.. క్వాలిఫైయర్_1 మ్యాచ్ లో ఈస్టర్న్ కేఫ్ చేతిలో ఓడిపోయిన తర్వాత ..సూపర్ జెయింట్స్ తిరిగి పుంజుకుంది. క్వాలిఫైయర్_2 లో జో బర్గ్ సూపర్ కింగ్స్ పై 69 పరుగులు తేడాతో విజయం సాధించింది.

మైదానం ఎలా ఉందంటే.

న్యూ లాండ్స్ మైదానం మీద పచ్చిక, తేమ ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు ఈ మైదానంపై భారీ స్కోర్లు నమోదు కాలేదు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం న్యూ లాండ్స్ మైదానంపై సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోర్ 172 పరుగులు నమోదయ్యే అవకాశం ఉందని క్యూరేటర్ చెబుతున్నారు. ఇరుజట్లలో బలమైన బ్యాటర్లు, బౌలర్లు ఉన్న నేపథ్యంలో రసవత్తరమైన పోరు జరిగేందుకు ఆస్కారం ఉంది. ఇప్పటివరకు ఈ మైదానంపై 38 మ్యాచులు జరిగాయి. బ్యాటింగ్ చేసిన జట్లు 15 సార్లు గెలిచాయి. ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్ అత్యధిక స్కోరు 151 పరుగులు, రెండవ అత్యధిక స్కోరు 138 పరుగులు. ఈ మైదానంపై ఇంగ్లాండ్ మహిళల జట్టు 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఈ మైదానంపై ఇదే అత్యధిక స్కోర్ గా ఉంది. పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు ఈ మైదానంపై 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఐర్లాండ్ మహిళల జట్టు ఈ మైదానంపై 95 అతి స్వల్ప స్కోర్ నమోదు చేసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper