Abhishek Sharma Instagram Post: సోషల్ మీడియా.. మంచి చెడు అన్నింటికీ ఇప్పుడు అదే ఆధారం. సంతోషాన్ని బాధను దాంట్లోనే పంచుకుంటున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అంతా సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారు. దాంతోనే కాలక్షేపం చేస్తున్నారు. సెలబ్రిటీల పోస్టులు తమ పోస్టుల ద్వారా డబ్బులు సైతం సంపాదిస్తున్నారు. వారి పోస్టులకు లైక్లు, షేర్లు, కామెంట్లు కూడా ఎక్కువగా వస్తాయి. ఫాలోవర్స్ కూడా లక్షల్లో ఉంటారు. తాజాగా టీ20 జట్లు ఓపెనర్ అభిషేక్ శర్మ తన ఇన్స్టాగ్రామ్లో చేసిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. దీనిపై మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్సింగ్ తనదైన శైలిలో రిప్లైయ్ ఇచ్చాడు.
Also Read: టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?
యువీ సరదా సూచనలు..
అభిషేక్ షర్మ టీ20 వరల్డ్ కప్లో వరుస వైఫల్యాల తర్వాత జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో రాణించాడు. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీనిని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా సెలబ్రేట్ చేసుకున్నాడు అభిమానులంత శుభాకాంక్షలు తెలిపారు. అయితే మాజీ క్రికెటర్ యువరాజ్ సరదాగా ’చెప్పు’ ఎమోజీ డ్రాప్ చేశారు. ఇది మాత్రమే కాదు, గతంలో కూడా అభిషేక్ పోస్టులకు యువీ ఇలాంటి ఎమోజీలతో స్పందించారు. ఇవి కేవలం సరదా కాదు. ఆటపై మరింత దృష్టి పెట్టాలని సున్నితంగా హెచ్చరించారు.
ప్రశంసలతోపాటు స్టోరీ..
అభిషేక్ ప్రదర్శనను యువరాజ్ ఇన్స్టా స్టోరీలో ప్రత్యేకంగా హైలైట్ చేశారు. ఇది యువ క్రికెటర్కు ప్రోత్సాహం, అదే సమయంలో డిసిప్లిన్పై దృష్టి పెట్టాలనే సందేశం. ఈ ఇంటరాక్షన్ క్రికెట్ లోకంలో మెంటర్–ప్లేయర్ బంధాన్ని సూచిస్తోంది.
ఈ ఘటన సోషల్ మీడియా ప్లాట్ఫాంలు క్రికెటర్లకు ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూపిస్తుంది. అభిషేక్ వంటి యువత గెలుపులను షేర్ చేస్తూ ఫ్యాన్స్తో కనెక్ట్ అవుతున్నారు, కానీ యువీ ఎమోజీలు ఆటపై ఫోకస్ తప్పకూడదని గుర్తు చేస్తున్నాయి.
View this post on Instagram