Kotha Prabhaker Reddy : మొన్న కూన శ్రీశైలం గౌడ్, నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి.. రేపు ఎవరో.. తెలంగాణలో ఈ పరిణామాలు అందరినీ కలవరపాటుకు గురిచేస్తున్నాయి. వీటిని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ హింసను ప్రేరేపించే వారిని ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఖండించాల్సి ఉంది.
మొన్న కూన శ్రీశైలం గౌడ్ పై దాడి చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దర్జాగా బయట తిరుగుతున్నాడు. ఎందుకు వివేకానంద క్షమాపణ చెప్పలేదు. బీఆర్ఎస్ ఎందుకు చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని కూడా అందరూ ఖండించాలి. ఈ దాడిని ఖండిస్తున్నట్టు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటించాడు. ఇది రఘునందన్ గొప్పతనంగా చెప్పొచ్చు.
దాడి చేసిన వ్యక్తి ఎవరు? ఎందుకు దాడి చేశాడన్నది బయటకు చెప్పకుండా లీకులు ఇవ్వడం ఏంటి? కమిషనర్ స్థాయి వ్యక్తి దాడి చేసిన వ్యక్తిని బీజేపీ సానుభూతి పరుడు అని ముద్రవేశాడు. అతడు వ్యక్తిగతంగా దాడి చేశాడా? లేదా కుట్రపూరితంగా చేశాడా? అన్నది దర్యాప్తు చేయాలి.
కొత్త ప్రభాకర రెడ్డి అయినా, కూన శ్రీశైలం గౌడ్ అయినా వాళ్లపై దాడిని ఖండిద్దాం.. తెలంగాణలో హింసపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
View Author's Full InfoWeb Title: Let us condemn the attack on kota prabhakara reddy and kuna srisailam goud