వర్క్ ఫ్రం హోంకు ఎగనామం పెట్టేందుకు సమయమొచ్చిందా?

కరోనా సృష్టించిన విలయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం మూడో దశ కూడా పొంచి ఉండడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో వర్క్ ఫ్రం హోం కు ప్రాధాన్యం ఏర్పడింది. పలు కంపెనీలు ఇంటి నుంచి చేసే పనినే ప్రోత్సహిస్తున్నాయి. ఐటీ కంపెనీలు అయితే వర్క్ ఫ్రం హోం పైనే ఆధారపడుతున్నాయి. ఐటీ ప్రొఫెనల్స్ ఆరోగ్యం, కరోనా నిబంధనలు దృష్టిలో పెట్టుకుని ఇంటి నుంచి చేసే పనికే మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా కేసులు తగ్గుతుండడంతో […]

Written By: Srinivas, Updated On : July 18, 2021 11:31 am
Follow us on

కరోనా సృష్టించిన విలయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం మూడో దశ కూడా పొంచి ఉండడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో వర్క్ ఫ్రం హోం కు ప్రాధాన్యం ఏర్పడింది. పలు కంపెనీలు ఇంటి నుంచి చేసే పనినే ప్రోత్సహిస్తున్నాయి. ఐటీ కంపెనీలు అయితే వర్క్ ఫ్రం హోం పైనే ఆధారపడుతున్నాయి. ఐటీ ప్రొఫెనల్స్ ఆరోగ్యం, కరోనా నిబంధనలు దృష్టిలో పెట్టుకుని ఇంటి నుంచి చేసే పనికే మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా కేసులు తగ్గుతుండడంతో ఇంటి నుంచి చేసే పనికి స్వస్తి పలికి కార్యాలయానికి రావాలంటూ ఉద్యోగులను కోరేందుకు సిద్ధమవుతున్నాయి.

వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ఉద్యోగులను ఆఫీసుకు వచ్చి పని చేయాలంటూ కోరుతున్నాయి. ఇటీవల జరిగిన విప్రో వార్షిక సమావేశంలో వర్క్ ఫ్రం హోంపై కంపెనీ చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ ప్రకటన చేశారు. ఇండియాలో విప్రోకు రెండు లక్షల మంది ఉద్యోగులు ఉండగా ఇప్పటికే 55 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. మిగిలిన ఉద్యోగులకు కూడా టీకాలు ఇప్పించి ఆఫీసు నుంచి పని చేయాలని విప్రో కోరనున్నట్లు సమాచారం.

దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీగాఉన్న టీసీఎష్ కూడా వర్క్ ఫ్రం హోంకి బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే టీపీఎస్ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగే తీరు ఆధారంగానే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ చివరి నాటికి కంపెనీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు టీకాలు పూర్తవుతాయని టీసీఎస్ హెచ్ ఆర్ గ్లోబల్ చీఫ్ మిలింద్ తెలిపారు. ఇన్ఫోసిస్ కంపెనీకి చెందిన ఉద్యోగుల్లో 98 శాతం మంది వర్క్ ఫ్రం హోంలోనే ఉన్నారు. ఇందులో 20 నుంచి 30 శాతం మంది ఉద్యోగులైనా ఆఫీసు నుంచి పని చేయాలని కోరే యోచనలో ఇన్ఫోసిస్ ఉంది.

ఇప్పటివరకైతే టీసీఎష్, విప్రో కంపెనీలు సెప్టెంబర్ చివరి వారం నాటికి ఉద్యోగులను ఆఫీసుల నుంచి పని చేయాలని కోరాలనే ఆలోచనలో ఉన్నాయి. ఈ మేరకు హెచ్ఆర్ డిపార్ట్ మెంట్ నుంచి ప్రకటనలు వెలువడుతున్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్ ఈ ఏఢాది చివరి నాటికి కనీసం 30 శాతం మంది ఉద్యోగులను ఆఫీసులకు రమ్మనాలని పిలిచే అవకాశం ఉంది. అయితే వర్క్ ఫ్రం హోంక మంగళం పాడాలా వద్దా అనే అంశంపై ఐటీ కంపెనీలు కచ్చితమైన రోడ్ మ్యాప్ ను ప్రకటించలేకపోతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం, కరోనా థర్డ్ వేవ్ ఇతర అంశాలు ఆధారంగానే వర్క్ ఫ్రం హోం ఎన్నాళ్లు అనేది ఆధారపడి ఉంది.