దేశంలో చాలామంది ఉద్యోగులు, వ్యాపారులు తక్కువ మొత్తం ఇన్వెస్ట్ మెంట్ తో ఎక్కువ లాభాలు పొందే స్కీమ్ ల కోసం వెతుకుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉన్నారిస్క్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అలా కాకుండా స్థిర ఆదాయ ఇన్వెస్ట్మెంట్స్లో పొదుపు చేయాలని భావిస్తే మాత్రం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో డిపాజిట్ చేయడం మంచిది.
దీర్ఘకాలిక పెట్టుబడి పథకం అయిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడిపై పన్ను మినహాయింపును పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ పై కేంద్రం 7.1 శాతం వడ్డీరేటును అందిస్తోంది. 500 రూపాయల నుంచి లక్షన్నర రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉండగా ఈ స్కీమ్ గడువు 15 సంవత్సరాలుగా ఉంది. ఈ స్కీమ్ లో15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 12 లక్షల రూపాయల మొత్తం వడ్డీగా లభిస్తుంది.
నెలకు ఈ స్కీమ్ లో ప్రతి నెల 500 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే 15 సంవత్సరాల తరువాత 1,62,728 రూపాయలు పొందవచ్చు. ఎంత మొత్తమైనా డిపాజిట్ చేసే అవకాశం ఉండటంతో అందరికీ ఈ స్కీమ్ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రతి నెల 1000 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 3,25,457 రూపాయలు పొందవచ్చు. ఏడాదికి 10,000 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 2,71,214 రూపాయలు పొందవచ్చు.
ఈ స్కీమ్ లో చేరిన వాళ్లకు రుణం తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. స్కీమ్ లో చేరిన మూడు, ఐదవ సంవత్సరంలో రుణం తీసుకోవచ్చు. పీపీఎఫ్ గడువు ఆరు సంవత్సరాలు పూర్తయిన తర్వాత పెట్టుబడిదారుడు అవసరమైతే 50 శాతం మొత్తం ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.