
వాట్సాప్.. ఇప్పుడు మన దేశంలో ఏ ఫోన్లో చూసినా ప్రతి ఒక్కరి వద్దా కనిపించే యాప్. ఈ యాప్ ద్వారా ఎన్నో పర్సనల్స్ విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే.. వాట్సాప్ కొత్త గోప్యతా విధానంపై వినియోగదారుల్లో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయట. కొత్త విధానం ప్రకారం.. ఫేస్బుక్, ఇతర మధ్యవర్తిత్వ సంస్థలతో తమ సమాచారాన్ని పంచుకుంటే వాట్సాప్ పేమెంట్స్తోపాటు, బిజినెస్ చాట్ను పూర్తిగా బహిష్కరిస్తామని అత్యధిక మంది వినియోగదారులు పేర్కొన్నట్లు ఓ ప్రముఖ సర్వేలో వెల్లడైంది.
Also Read: ఎయిర్ టెల్ కస్టమర్లకు శుభవార్త.. సెకన్లలో మూవీ డౌన్ లోడ్..?
లోకల్ సర్కిల్ అనే ఆన్లైన్ ప్లాట్ఫాం ఈ మేరకు సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా మొత్తం 17 వేల మంది వాట్సాప్ వినియోగదారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో దాదాపు ఐదు శాతం మంది ఇప్పటికే యాప్ను డెలీట్ చేసినట్లు తెలిపారు. మరో 22 శాతం మంది యాప్ను తక్కువగా ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక తమ సమాచారాన్ని పేస్బుక్, ఇతర మధ్యవర్తిత్వ సంస్థలతో పంచుకుంటే వాట్సాప్ పేమెంట్ను పూర్తిగా మానేస్తామని 92 శాతం మంది తెలపడం గమనార్హం.
అలాగే.. కొత్త విధానాన్ని యథావిధిగా అమలు చేస్తే బిజినెస్ అకౌంట్స్ను వాడడం నిలిపివేస్తామని 79 శాతం మంది పేర్కొన్నారు. ఇప్పటికే 55 శాతం మంది ప్రత్యామ్నాయ యాప్లను డౌన్లోడ్ చేసుకున్నట్లు.. వీరిలో 22 శాతం మంది ఆవటిని విరివిగా ఉపయోగిస్తున్నట్లు సర్వేలో తేలింది. బీఎం నెక్ట్స్ నిర్వహించిన మరో సర్వేలోనూ 82 శాతం మంది వినియోగదారులు కొత్త విధానంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రత్యామ్నాయ యాప్లను వాడడానికి తాము సిద్ధంగా ఉన్నామని 72 శాతం మంది తెలిపారు.
Also Read: తరచూ కోపం వస్తోందా.. మీలో ఈ సమస్య ఉన్నట్టే..?
కొద్దిరోజుల క్రితం వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా యూజర్స్ వ్యక్తిగత సమాచారంతోపాటు ఐపీ అడ్రస్ వంటి వివరాలను ఫేస్బుక్తో పంచుకుంటారంటూ అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. దీంతో ఫిబ్రవరి 8 నుంచి అమలు చేయాలనుకున్న ఈ కొత్త విధానాన్ని మే 15కు వాయిదా వేసింది. మరోవైపు ఈ ప్రైవసీ పాలసీలో మార్పులను ఉపసంహరించుకోవాలని వాట్సాప్ను కేంద్రం ఆదేశించింది. వాట్సాప్ సీఈవోకు కేంద్ర సాంకేతిక, సమాచార శాఖ లేఖ రాసింది.