Cooku With Jathiratnalu 2: స్టార్ మా ఛానల్ లో ప్రతి శని , ఆదివారాల్లో ప్రసారమయ్యే ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ ప్రోగ్రాం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో కొనసాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది ఇదే. ఇప్పటికే ఈ షో నుండి శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణ్ పడాల , పల్లవి రామస్వామి , తేజస్విని గౌడ వంటి వారు ఎలిమినేట్ అయ్యారు. వీళ్ళ ఎలిమినేషన్ తర్వాత నేడు జరగబోయే ఎపిసోడ్ లో నలుగురు కుక్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు. వాళ్ళు ఎవరంటే కృత్తిక ఉమా శంకర్ (పొదరిల్లు హీరోయిన్), శ్రవణ్ కుమార్ (మగువా ఓ మగువా హీరో), పునర్వవి భూపాళం(బిగ్ బాస్ 3 కంటెస్టెంట్), సుమిత్ (సీనియర్ సీరియల్ ఆర్టిస్ట్) ఎంట్రీ ఇచ్చారు.
ఈ వారం ఎన్నడూ లేని విధంగా ఇద్దరు కుక్స్ కలిసి వంట చేసే టాస్క్ ఇచ్చారు జడ్జీలు. ఈ వారం మినీ లాంచ్ ఈవెంట్ లెక్కలోకి వస్తుంది కాబట్టి, ఈ వారం స్కోర్స్ లెక్కల్లోకి రాదు. వచ్చే రెండు వారాల్లో వచ్చే స్కోర్స్ ఆధారంగానే ఎలిమినేషన్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్స్ కూడా పూర్తి అయ్యాయి. ముందుగా సుమిత్ అనే కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడట. ఇక ఆ తర్వాత వారాలకు సంబంధించిన ఎపిసోడ్స్ లో అతి తక్కువ మార్కులు డిమోన్ పవన్ మరియు శ్రవణ్ కుమార్ లకు వచ్చిందట. వీళ్లిద్దరి మధ్య జరిగిన ‘కుక్ ఆఫ్’ రౌండ్ లో డిమాం పవన్ గెలవగా, శ్రవణ్ కుమార్ ఓటమి పాలై ఎలిమినేట్ అయ్యారు. అలా నేడు ఎంట్రీ ఇచ్చిన నలుగురు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ లో ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఇక చివర్లో మిగిలేది ఎవరో చూడాలి.
ఇకపోతే ఈరోజు , రేపు ప్రసారం అవ్వబోయే ఎపిసోడ్స్ లో తనూజ కనిపించకపోయేసరికి , ఆమె ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. తనూజ ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో బిజీ గా ఉంది. ఆ కారణం చేత ఆమె ఈ ఎపిసోడ్స్ లో పాల్గొనలేకపోయిందని , తదుపరి వారం లో జరగబోయే ఎపిసోడ్స్ లో ఆమె కచ్చితంగా కనిపిస్తుందని , అందుకు సంబంధించిన షూటింగ్స్ కూడా పూర్తి అయ్యాయని సమాచారం. అదే విధంగా వచ్చే వారం జాతి రత్నాలు క్యాటగిరీ lo నూకరాజు ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. చూడాలి మరి , ఈయన ఏ రేంజ్ సందడి చేయబోతున్నాడు అనేది.
















౩వ పెళ్లి ప్లానింగ్ పై అమీర్ ఖాన్ హాట్ కామెంట్స్.. మండిపడుతున్న ఫ్యాన్స్..
Aamir Khan Third Marriage: ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మూడవ పెళ్ళికి అన్ని విధాలుగా సిద్ధమైనట్టు బాలీవుడ్ వర్గాల్లో ఒక చర్చ జోరుగా సాగుతోంది. గత కొంతకాలం గా ఆయన గౌరీ స్ప్రాట్ అనే అమ్మాయితో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ఈ పెళ్లి గురించి రీసెంట్ గా అమీర్ ఖాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘మా పెళ్లి చాలా సాధారణంగానే ఉంటుంది. మీరు ఊహించుకుంటున్నట్టు హంగులు ఆర్భాటలు ఏమి లేవు. మేము రిజిస్టర్ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇరు కుటుంబాలకు సంబంధించిన ఆత్యంత ఆప్త మిత్రులు , సన్నిహితుల సమక్షం లో మేమిద్దరం సింపుల్ గా వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం’ అంటూ అమీర్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా లో తీవ్ర స్థాయి విమర్శలు వస్తున్నాయి.
కొడుకులకు , కూతుర్లకు పెళ్లిళ్లు చేసి , వాళ్ళ మనవళ్లతో ఆదుకోవాల్సిన వయస్సులో పెళ్లేంటి?, అమీర్ ఖాన్ కి పిచ్చి పరాకాష్ట కి చేరింది అంటూ ఆయన పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు నెటిజెన్స్. అభిమానులు కూడా ఈ విషయం లో అమీర్ ఖాన్ ని వెనకేసుకొని రాలేకపోతున్నారు. ఇకపోతే జులై 5 న వీళ్లిద్దరి పెళ్లి జరగబోతున్నట్టు బాలీవుడ్ మీడియా లో ప్రచారం జరిగింది. ఇందులో నిజమెంత అని మీడియా అమీర్ ఖాన్ ని అడగ్గా, అది నిజమేంనని ఆయన స్పందించారు. ప్రస్తుతం ఆయన అమెరికా లో ఉన్నాడట, ఇండియా కి తిరిగి వచ్చిన వెంటనే ఈ వివాహం చేసుకోనున్నట్లు తెలిపారు అమీర్ ఖాన్.
తన 60 వ పుట్టిన రోజు సందర్భంగా అమీర్ ఖాన్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ఈ విషయాలన్నీ వెల్లడించారు. సుమారుగా ఆమెతో ఏడాదిన్నర నుండి డేటింగ్ లో ఉన్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈమెని మీడియా కి పరిచయం చేస్తూ , తనకు మొదటి నుండి ఈమె ఎంతో మద్దతు ఇస్తూ అన్ని విషయాల్లో తోడుండని చెప్పుకొచ్చారు అమీర్ ఖాన్. ఇకపొత్ రీసెంట్ గానే అమీర్ ఖాన్ తన ఇద్దరు మాజీ భార్యలతో కలిసి , కారులో ప్రయాణించడం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ కారులో తన కాబోయే భార్య సంధ్య కూడా ఉండడం గమనార్హం.