Homeఅంతర్జాతీయంJD Vance Statement Pakistan: పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ. పాపం దాయాది దేశం...

JD Vance Statement Pakistan: పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ. పాపం దాయాది దేశం బిక్క చచ్చి పోతోంది..

JD Vance Statement Pakistan: మొన్నటికీ మొన్న ఇరాన్ దేశంతో డీల్ కుదిరిన తర్వాత అమెరికా అధ్యక్షుడు కనీసం మాటవరసకైనా సరే పాకిస్తాన్ పేరును ప్రస్తావించలేదు. ఇరాన్ కూడా పాకిస్తాన్ గురించి మాట్లాడలేదు. పాకిస్తాన్ విషయంలో టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరించాయి. ఈ విషయంలో భారత్ నిశ్శబ్దంగా ఉండడంతో పాకిస్తాన్ ఆందోళన చెందింది. ఆవేదన చెందింది. కనీసం మాట వరసకైనా తమ గురించి చెప్పలేదని బాధపడింది. పాకిస్తాన్ మంత్రి ఒకరు సాక్షాత్తు అక్కడి పార్లమెంట్లో భారత్ […]

JD Vance Statement Pakistan: మొన్నటికీ మొన్న ఇరాన్ దేశంతో డీల్ కుదిరిన తర్వాత అమెరికా అధ్యక్షుడు కనీసం మాటవరసకైనా సరే పాకిస్తాన్ పేరును ప్రస్తావించలేదు. ఇరాన్ కూడా పాకిస్తాన్ గురించి మాట్లాడలేదు. పాకిస్తాన్ విషయంలో టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరించాయి.

ఈ విషయంలో భారత్ నిశ్శబ్దంగా ఉండడంతో పాకిస్తాన్ ఆందోళన చెందింది. ఆవేదన చెందింది. కనీసం మాట వరసకైనా తమ గురించి చెప్పలేదని బాధపడింది. పాకిస్తాన్ మంత్రి ఒకరు సాక్షాత్తు అక్కడి పార్లమెంట్లో భారత్ ప్రస్తావన తీసుకొచ్చి..”మేము యుద్ధం ఆపడానికి ఎంతో చేశాం. శాంతి చర్చలు నిర్వహించాం. ఇంత చేసినప్పటికీ మా గురించి భారత్ ప్రస్తావించకపోవడం బాధాకరంగా ఉంది అంటూ” ఆ మంత్రి పార్లమెంట్లో వ్యాఖ్యానించారు.

పీస్ డీల్ విషయంలో పాకిస్తాన్ ప్రస్తావన రాకపోవడం పట్ల అమెరికా క్లారిటీ ఇచ్చింది.. ఇన్ని రోజులపాటు అమెరికా, ఇరాన్ మధ్యవర్తిగా వ్యవహరించామని గొప్పలు చెప్పుకుంది పాకిస్తాన్. అయితే ఆ దేశం గాలి తీసేశారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. పాకిస్తాన్ దేశంలో పత్రికా స్వేచ్ఛ లేదని ఆరోపించారు. అందువల్లే తాము పీస్ డీల్ కు సంబంధించి వివరాలను ప్రకటించలేదని పేర్కొన్నారు. “ఈ వివరాలను మేము బయటపెట్టాలని అనుకున్నాం. కానీ పాకిస్తాన్, ఖతార్ దేశంలో పత్రిక స్వేచ్చలేదు. భావప్రకటన స్వేచ్ఛ చట్టం వంటివి అక్కడ లేదు. అందువల్లే ఆలస్యమైందని” వాన్స్ పేర్కొన్నారు.

వాన్స్ వ్యాఖ్యల నేపథ్యంలో పాకిస్తాన్ గురించి మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటివరకు పాకిస్తాన్ తనకు తానుగా డప్పు కొట్టుకుంది.. తాను శాంతి ఒప్పందంలో కీలకపాత్ర పోషించినట్టు పాకిస్తాన్ చేసుకున్న ప్రచారం మొత్తం ఉట్టిదే అని తేలిపోయింది. ఇప్పటివరకు అమెరికా పాకిస్తాన్ దేశాన్ని కేవలం అవసరం కోసమే వాడుకుందని అర్థం అయిపోయింది. అందువల్లే పాకిస్తాన్ దేశం గాలిని అటు ట్రంప్.. ఇటు వాన్స్ విడతల వారీగా తీస్తున్నారు. పాపం పాకిస్తాన్.. ఎంత కష్టం వచ్చింది..

అప్పట్లో శాంతి చర్చలు జరిగినప్పుడు పాకిస్తాన్ భారీగానే ఖర్చు పెట్టుకుంది. ఇస్లామాబాద్ లో పేరుపొందిన హోటల్లో ఖరీదైన వంటకాలను తయారు చేయించింది. రెండు దేశాల ప్రతినిధులకు ప్రత్యేకమైన స్వాగతం పలికింది. అయితే అప్పట్లో శాంతి ఒప్పందం కుదరలేదు. పాకిస్తాన్ దేశానికి పేరు రాకపోగా.. హోటల్ బిల్లులు తడిసి మోపెడయ్యాయి. చివరికి ఆ హోటల్ నిర్వాహకులు డబ్బు చెల్లించలేదని ఆరోపించడంతో.. పాకిస్తాన్ పరువు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి పోయింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper