
రీసెంట్ గా సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు అంటూ హిట్ కొట్టి వెకేషన్ ని అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారుమహేష్. అయితే ఆయనకు త్వరలో సర్జరీ జరగబోతోందని సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన మోకాలు నెప్పితో బాధపడుతున్నారు. దాంతో ఈ నెలాఖరున సర్జరీ చేయించుకోబోతోన్నట్లు తెలుస్తోంది. సర్జరీ అనంతరం ఐదు నెలలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారట.
Read More: టీవీ9లో లైంగిక వేధింపులు.. తాకరాని చోట తాకుతూ, హోటల్ కి రమ్మని..
శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘ఆగడు’ సినిమా టైటిల్ సాంగ్ షూటింగ్ సమయంలో మోకాలు దెబ్బ తగిలింది. 2017లో ఆయన సర్జరీ చేయించుకున్నారు. అయితే డాక్టర్స్ చెప్పినట్లు రెస్ట్ తీసుకోకపోవటంతో మళ్లీ మొదటికి వచ్చింది. నొప్పి ఎక్కువగా ఉండటంతో మరోసారి సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకోబోతున్నారు. తన తదుపరి సినిమాకు గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేస్తారు. ఏప్రియల్, మే నెలలో ఆయన హైదరాబాద్ రానున్నారు.
రవితేజ రేర్ ఫోటోలు: అసిస్టెంట్ స్థాయి నుండి హీరో
రేంజ్..!
ఇక మహేష్ తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారు. తనకు మహర్షి వంటి మరుపరాని హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నట్లు వినికిడి. దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం జేమ్స్ బాండ్ తరహా క్యారక్టరైజేషన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఎంతవరకూ నిజముంది అనేది తెలియాల్సి ఉంది. ఈ సంవత్సరం సగంలో ప్రారంభించి వచ్చే సంక్రాంతికి ఆ సినిమాని రిలీజ్ చేస్తారు.



.jpg)
.jpg)
.jpg)





































ఆ విషయంలో కెసిఆర్ ని పొగిడి.. పప్పులో కాలేసిన జగన్!
ఏపీలో ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ‘మహిళలకు రక్షణ ఎలా కల్పించాలి” అనే విషయంలో చర్చ జరగగా సీఎం జగన్ “దిశ” ఘటనపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “దిశ” నిందితులను ఎన్ కౌంటర్ విషయాన్ని సమర్ధిస్తూ ఈ విధంగా మాట్లాడారు.. ‘అంత గొప్ప నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్కు హ్యాట్సాఫ్’…అని. ఈ మాట ఇప్పుడు ఇటు తెలంగాణ అటు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంటే దిశా హంతకుల్ని ఎన్ కౌంటర్ చేయమని కేసీఆర్ గారు పోలీసులకు ముందే చెప్పారా? మరి అందేంటి.. తప్పించుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా, దాడి చేసినందుకే ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు చెప్పారు! అది నిజంకాదా??!” అని అనేకమంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అసలే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్ కౌంటర్ విషయంలో చాలా సీరియస్ గా ఉండగా ఇప్పుడు జగన్ మాటలు కెసిఆర్ కి మరింత తల నొప్పిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు!. ఇదిలా ఉండగా మరోవైపు మహిళా సంఘాలు కూడా ఎన్ కౌంటర్ విషయంలో కాస్త గుస్సుగా ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొంటన్న వారిని కూడా చంపేయాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో ఏపీ సీఎం మాటలు వారికి మరింత ఊతం ఇచ్చినట్లయింది. అలాగే ప్రస్తుతం ఏపీలో 2014 నుండి 2019ల మధ్య అనేక రేప్ కేసులు జరిగాయి. అందులో వైసీపీ పార్టీ నేతలుకూడా ఉన్నారు. 2014లో 82, 2015లో 100, 2016లో 116, 2017లో 105, 2018లో 93 కేసులు, 2019 జగన్ సీఎం అయ్యాక దాదాపు 40 పైగా రేప్ కేసులు పెండ్డింగ్ లో ఉన్నాయి వారందర్ని కూడా కెసిఆర్ పంథాలో జగన్ ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు, అనేక విమర్శలు ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. ఈ విమర్శలు ఇప్పుడే రాక పోవచ్చు కానీ మున్ముందు రావొచ్చు. ఇది, ఇలా ఉండగా ఈ జగన్ పొగడ్తల పై కెసిఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి…
మా ఈ కామెంట్ నిజమని చెప్పడానికి…. జగన్ విమర్శలు ఎదురుకోబోతున్నారు అనడానికి…