
మొన్న ఆలివర్ రాయ్, నిన్న రాజు రవితేజ్, ఇప్పుడు జేడీ లక్ష్మి నారాయణ, (రేపు రాపాకా అవ్వొచ్చు) ఇలా వరసగా జనసేన పార్టీని విడిచిపెట్టి కీలక నేతలు వెళ్లడంతో జనసేన కార్యకర్తలు ఆందోళన చెందటం సహజం. ఇటీవల కాలంలో ప్రజలకోసం, ప్రజల పక్షాన నిలబడే పార్టీగా “జనసేన” మంచి పేరునే గడించింది. అయితే వరుస పరిణామాలతో జడ్ స్పీడ్ తో దూసుకుపోతున్న పార్టీలో నుంచి కొంతమంది నేతలు బయటకు వెళ్తున్నారు..అందుకు గల కారణాలను విశ్లేషిద్దాం..
Read More: జనసేన-బీజేపీ:తాటి చెట్టు క్రింద మజ్జిగ తాగుతున్న పవన్..!?
పవన్ కళ్యాణ్ బీజేపీ తో కలవడం, తరవాత సినిమాల పై మొగ్గుచూపడంతో జేడీ జనసేన పార్టీ ని విడిచి వెళ్లారు. వ్యక్తిగతంగా ఏదో ఆశించి అది నెరవేరక పార్టీని విడిచే వాళ్ళు కొంతమంది, బలమైన జగన్ సర్కార్ ని ఎదిరించలేక వైసీపీ ప్రలోభాలకు లోబడి వెళ్లే వాళ్ళు మరికొంతమంది కాగా పవన్ కళ్యాణ్ ప్రవర్తన నచ్చక వెళ్ళే వాళ్ళు ఇంకొంతమంది. మొదటి రెండు కారణాల వల్ల పార్టీని విడిచిపోయే వాళ్ళ గూర్చి జనసేన పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు కానీ పవన్ ప్రవర్తన వల్ల పార్టీని విడిచిపెడితే కొంచం ఆలోచించాలి. ఎందుకంటే నాయకుడు అన్ని కోణాలలో నాయకత్వ లక్షణాలను కనపర్చాలి. ఒక ప్రాంతానికో, కులానికో, మతానికో, కొంతమంది వ్యక్తులకో కొమ్ము కాసినట్లయితే.. పార్టీ భవిష్యత్ ప్రశాంర్ధకం అవుతుంది.
Read More: జనసేనాని రాజకీయ ప్రస్థానంపై విశ్లేషణ
పవన్ కళ్యాణ్ విధి విధానాలు, ఆయన సిద్ధాంతాలను అర్థం చేసుకోలేక పార్టీని విడిచిపెడుతున్నారు అని జనసేన ఆరోపిస్తోంది.. ఒకవేళ అదే నిజమైతే.. కలిసి పని చేసిన వాళ్ళకే అర్థం కాకపోతే ప్రజలకు ఎలా అర్థమౌతుంది..? పవన్ విధి విధానాలు గొప్పవే కావొచ్చు కానీ వాటిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. క్షేత్రస్థాయిలోకి పవన్ విధి విధానాలను తీసుకెళ్లడంలో జనసేన విఫలమైతే.. మరి కొంత మంది నేతలు కూడా పార్టీని వీడే అవకాశాలు లేకపొలేదు. ఎమ్మెల్యే రాపాక కి కూడా పార్టీలో తగిన స్థానం, గౌరవం దక్కకపోవడంతో ఆతను కూడా జనసేనని విడిచి పెడుతున్నారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ పవన్ పై నమ్మకం, పార్టీ నుంచి ప్రజలు వెళ్లిపోకుండా జాగ్రత్త పడితే మంచిది.
Read More: సినిమాలు-రాజకీయాలు..బ్యాలన్స్ అవుతాయా?
అసెంబ్లీలో జగన్ పక్కన రాపాక… చూసినవారందకీ షాక్..
జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు తొలిరోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పక్కన కూర్చున్నారు. ఈ ఆసక్తికర సన్నివేశం చుసిన అసెంబ్లీ నాయకులందరూ ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యే రాపాక సీఎం జగన్ తో కొద్దిసేపు మాట్లాడారు.. ఇద్దరూ సీరియస్గా ఏదో చర్చించినట్లు కనిపించింది. సభ జరుగుతున్న సమయంలో జరిగిన ఈ సన్నివేశం చర్చనీయాంశమయ్యింది. సీఎంతో ముచ్చటించిన తర్వాత మళ్లీ వెళ్లి.. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తన స్థానంలో కూర్చున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు జగన్ పరిపాలన బాగుందని… అంటూ , జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి తన మద్దతు ప్రకటిస్తూ.. జనసేనకి ఒక ప్రశ్నలాగా తయారయ్యాడు. జనసేన వ్యతిరేకిస్తున్న అత్యంత కీలకమైన మూడు రాజధానుల నిర్ణయానికి కూడా మద్దతు పలికారు. అసెంబ్లీకి బిల్లు వస్తే అనుకూలంగా ఓటు వేస్తానని చెప్పుకొచ్చారు. ఆయన నిర్ణయం అలా ఉంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేకు షాకిచ్చారు.. ఆయనకు లేఖ రాశారు. ఆ లేఖలో.. రాజధాని నిర్మాణం అమరావతిలోనే కొనసాగాలని, ప్రభుత్వ పాలన సంపూర్ణముగా అమరావతి నుంచే కొనసాగాలని, అభివృద్ధి వికేంద్రీకరణ బరగాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలని జనసేన పార్టీలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది అన్నారు.
జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎమ్మెల్యే రాపాక శాసనసభ సమావేశాలకు హాజరై.. ఏపీ అసెంబ్లీలో ఏపీ డిసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్మెంట్ రీజియన్ యాక్ట్ 2020, అమరావతి మెట్రో డెవలప్మెంట్ యాక్ట్ 2020 బిల్లుల్ని ప్రవేశపెట్టే సమయంలో.. ఓటింగ్ సమయంలో వ్యతిరేకించవలసిందిగా కోరుతున్నాను అన్నారు. మరి అసెంబ్లీలో ఎమ్మెల్యే రాపాక బిల్లకు మద్దతుగా ఓటు వేస్తారా.. పార్టీ అభిప్రాయాన్ని గౌరవిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.