Home Blog Page 8630

ఆంధ్ర విభజనని మరిచిపోలేని మోడీ

 

మోడీ ఆంధ్ర విభజనని మరిచిపోలేనట్లుంది. అవకాశం దొరికినప్పుడల్లా ఆ విషయం ప్రస్తావిస్తూనే వున్నాడు. ఈరోజు రాజ్య సభలో అధ్యక్ష ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ లోక్ సభ లో తలుపులు మూసేసి, లైట్లు ఆర్పేసి ఆంధ్ర విభజన ఎలా చేశారో మీ నిర్వాకం అందరికీ తెలుసునని చురకలంటించాడు. మోడీ ఎందుకని పదే పదే ప్రస్తావిస్తున్నాడో నని ఆలోచిస్తే ఎందుకనో అప్పటి లోక్ సభ పనితీరు ని మరిచిపోలేకపోతున్నాడని అర్ధమవుతుంది. ఇంతకుముందే ఈ విషయం అనేకసార్లు పార్లమెంటులో ప్రస్తావించటం జరిగింది. కాంగ్రెస్ ని ఎండగట్టే విషయం లో ఆంధ్ర విభజన ని ప్రధాన అంశంగా ఎంచుకుంటున్నాడు.

 

ఇందులో మొదటిగా కాంగ్రెస్ కి ప్రజాస్వామ్య ప్రక్రియపై నమ్మకం లేదని చెప్పటం. అంతవరకూ బాగానే వుంది. కానీ ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించటంతో అసలు మోడీకి ఆంధ్ర విభజన జరగటం ఇష్టంలేదా అనికూడా అభిప్రాయం ఏర్పడే అవకాశం వుంది. ఇప్పటికే తెరాస దీనిపై మోడీ పదే పదే ప్రస్తావించటాన్ని తప్పు పట్టింది. అసలు మోడీకి తెలంగాణ ఏర్పడటం ఇష్టంలేదని ఆరోపించింది. అయినా వెరవక అవకాశం దొరికినప్పుడల్లా మరలా మరలా అదే అంశాన్ని లేవనెత్తుతూనే వున్నాడు.

 

ఇప్పుడాలోచిస్తే ఒకవేళ నిజంగా మోడీ అప్పుడు పార్లమెంటులో వుండివుంటే పరిస్థితులు వేరుగా వుండేయని అనిపిస్తుంది. మొదట్నుంచి కొన్ని పుకారులు చక్కర్లు కొడుతున్నాయి. సోనియా గాంధీ ఓ పధకం ప్రకారం అప్పటి లోక్ సభ లో బీజేపీ నాయకురాలు, ప్రతిపక్ష పార్టీ నాయకురాలైన సుష్మ స్వరాజ్ తో ముందే మాట్లాడుకొని లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ద్వారా అనైతిక పద్దతిలో విభజన చట్టాన్ని ఆమోదింపచేసుకున్నారని చెబుతారు. అందుకే ఆ తర్వాత మీరా కుమార్ ని ఎన్నికల్లో ప్రత్యేకంగా తెలంగాణ ప్రచారానికి కాంగ్రెస్ తీసుకొచ్చుకుంది. అలాగే సుష్మ స్వరాజ్ తెలంగాణ కొచ్చి నేను మీ చిన్నమ్మ ననుకొని వోట్లెయ్యండని చెప్పింది. సరే తర్వాత కధ అందరికీ తెలిసిందే. కెసిఆర్ ని నమ్ముకున్న సోనియా గాంధీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం దేశంలోనే ఎన్నికల్లో బోల్తా పడటం ఆ తర్వాత ఇప్పటిదాకా కోల్పోకపోవటం తెలిసిందే. రాజకీయాల్లో ఒక్కోసారి కొన్ని నిర్ణయాలు మొత్తం చరిత్రనే మారుస్తాయనటానికి ఇదో ఉదాహరణ. మోడీ అందుకనే ఈ విషయాన్ని ప్రస్తావించి కాంగ్రెస్ ని మానసికంగా దెబ్బతీస్తున్నాడు.

 

ఇప్పుడుచూస్తే కాంగ్రెస్ పరిస్థితి రెండిటికీ చెడ్డ రేవడి లాగా అయిపొయింది. ఆంధ్రాలో ఎటూ తిరిగి కోలుకోలేదు. ఇప్పుడు తెలంగాణ లో కూడా మూడో స్థానానికి పడిపోయే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. కాంగ్రెస్ చేసిన నిర్వాకాన్ని పదే పదే గుర్తుచేస్తూ మోడీ పరవశం చెందుతున్నట్లు అనిపిస్తుంది. ఏది ఏమైనా ఇది తెలంగాణ లో బీజేపీ అవకాశాల్ని దెబ్బతీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక నాయకత్వంపై ఎక్కువ పడినట్లు అనిపిస్తుంది.

రాయితీలకు బదులు రాజకీయలు…కియాలో ప్రకంపనలు

 

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ తమ వాహన తయారీ ప్లాంటును ఆంధ్ర నుంచి తమిళనాడుకు తరలిస్తోంది అనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. రాయిటర్స్ అనే ప్రముఖ పత్రిక కియా మోటార్స్ తమిళనాడుకి తరలిపోతోంది అని ప్రచురించింది. తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ ఉన్నతాధికారి తమకు ఈ విషయం చెప్పినట్టుగా..తమ పత్రికలో వెల్లడించింది. దీనికి గాను ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయి మధ్యవర్తం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. హ్యుండాయి కంపెనీకి కియా కంపెనీకి ఉన్న దగ్గర సంబంధాలు ఉపయోగించుకొని కియాని తరలించాలనే ప్రయత్నం జరుగుతుందట. అయితే 1.1 బిలియన్ డాల్లర్లు ఖర్చు చేసి ఆంధ్రలో తమ సంస్థని స్థాపించి…ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోటానికి గల కారణం ఏమి అయ్యుంటుంది అనే దాని పైన ఇప్పుడు దేశం మొత్తం చర్చించుకుంటుంది.

 

కియా 2017 లో చంద్రబాబు సహాయంతో అనంతపూరులో నిర్మించారు. ఇది డిసెంబరు నాటికి పూర్తయింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఉన్నంతకాలం ఏ ఇబ్బంది లేకుండా ఉన్న కియాకు.. జగన్ ప్రభుత్వం వచ్చాక పెద్ద సమస్యే వచ్చింది. చంద్రబాబుపై ఉన్న ద్వేషంతో జగన్ రాష్ట్రంలోని అన్నిటిమీద సమీక్షలు నిర్వహిస్తున్నాడు..ఇందులో భాగంగా జగన్ కన్ను కియా పైన కూడా పడింది.

 

హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ కియా ప్రతినిధులతో వాగ్వాదానికి దిగిన సంగతి, కియా తమ ముఖ్య కార్యాలయానికి చెరవేసింది. జగన్ తెచ్చిన కొత్త నిబంధనలు ఆంధ్రలో ఉన్న ప్రైవేటు కంపెనీలకు నిద్రలేకుండా చేసింది. రాష్ట్రంలో ఉన్న ఏ సంస్థ అయినా 75 శాతం ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళకే ఇవ్వాలన్న నిబంధన కంపెనీలకు పెద్ద ఎదురు దెబ్బే. దీని కారణంగానే చాలా కంపెనీలు ఆంధ్ర నుంచి వెళ్ళిపోతున్నాయనే వాదన కూడా బలంగా ఉంది.

 

వీటికి తోడు చంద్రబాబు సమయంలో కియా కి ఇచ్చిన రాయతీలపై జగన్ సమీక్ష చేస్తున్నాడు. ఇలా కియా కి జగన్ ప్రభుత్వం వచ్చాక అన్ని ఎదురు దెబ్బలే తగిలాయి తప్ప..చెప్పుకోతగ్గ మంచి విషయం ఏది లేకపోగా…చంద్రబాబు ప్రారంభించిన కియాను జగన్ మళ్ళి ప్రారంభించినట్టు హడావుడి చేసారు.

 

కియా లాంటి దిగ్గజ సంస్థ 29 రాష్ట్రాలు ఉన్న దేశంలో…ఆంధ్రని ఎంచుకోవటం చాల గొప్ప విషయం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఇలాంటి సంస్థల వలన చాలా మేలు జరుగుతుంది. అలాంటిది సంస్థ ప్రారంభం అయినా కొన్ని సంవత్సరాలలోనే తరలిపోవాలని చూస్తుందంటే ఇది కచ్చితంగా ప్రభుత్వం చేతగాని తనమే. రాయతీలు ఇవ్వాల్సిన కంపెనీలకు రాజకీయాలు రుచి చూపిస్తుంటే…బెదరక ఏమి చేస్తారు. ఈ విషయాన్ని జగన్ ప్రభుత్వం అవాస్తవం అని కొట్టి పడేసినా…ముందు ముందు ఇది చాల తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. జగన్ తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు రాష్ట్రాన్ని మరింత సంక్షోభంలోకి తీసుకెళ్తున్నాయి అనడానికి ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు.

బీజేపీ ప్రవర్తనతో..ఎటు తేల్చుకోలేని పవన్

 

ఏపీ బీజేపీ నాయాకులు పవన్ కళ్యాణ్ తో కలిసి రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి..తీర్మానం కూడా ప్రవేశ పెట్టారు. రాజధాని ఎలా కదులుతుందో చూస్తాం..అని బీజేపీ నేత కన్నా అంటే…రాజధాని శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది అని పవన్ మాట ఇచ్చారు. వీళ్లంతా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది అనే ధీమాతో ఇన్ని రోజులు ప్రజల్లో తిరిగారు.

 

నిన్న గళ్ళ జయదేవ్ పార్లమెంట్ లో రాజధాని విషయం ప్రస్తావిస్తే…రాజధాని ఎంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్రం తెగేసి చెప్పింది. దీంతో పవన్ మరియు బీజేపీ నాయకులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి.

 

రాష్ట్ర బీజేపీ ఒకటి చెప్తే… కేంద్ర బీజేపీ ఇంకోటి చెబుతుంది. దీనికి తోడు మధ్యలో పవన్ ఎటు తేల్చుకొలేని పరిస్థితిలో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగ నిలదీద్దామా అంటే పొత్తు కారణంగా మాట్లాడలేని పరిస్థితి. ఇది ఇలానే ఉంటె జగన్ చక చక తన పనులు చేసుకుంటూ పోతాడు. ఏది ఏమైనా పవన్ మరియు కన్నా లక్ష్మినారాయణ చేసిన హడావుడికి…కేంద్రం నుంచి వచ్చిన సమాధానికి అస్సలు పొంతనే లేదు. ఇప్పుడు వీళ్ళు తమ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా నిర్మించుకుంటారో వేచి చూడాలి.

జగన్ ఆంగ్ల ప్రసంగం అదిరిపోయింది!

 

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విజయవాడలో జరిగిన ఎడ్యుకేషన్ ఇన్ ఎక్సలెన్స్ అనే సదస్సుకు హాజరై…అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు. తన ప్రసంగం మొత్తం ఆంగ్ల బాషలోనే వినిపించారు.

 

జగన్ ఇంగ్లీష్ మీడియం ఎందుకు ఉండాలో ఇంగ్లీషులోనే వివరిస్తుంటే…వినే వాళ్లంతా ఆలా చూస్తూ ఉండిపోయారు. చదువు విషయంలో ప్రపంచ దేశాలలో మన దేశ స్థానమేమిటో వివరిస్తూ… తాను విద్యకి ఇస్తున్న విలువ ఏంటో బయలుపరిచారు. విద్య రంగంలో చేస్తున్న సంస్కరణలు అన్నీ వివరిస్తూ…ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వివరించారు.

 

రాజధాని విషయం ప్రస్తావిస్తూ.. అందులో జరిగిన అవకతవకలు అన్నిటిగురించి వివరించారు. అమరావతికి తన దెగ్గర డబ్బు లేదని చెప్తూ….దానికి ఖర్చు చేసే దాంట్లో పదోవంతు వైజాగ్ నగరానికి ఖర్చు చేస్తే హైదరాబాద్ ని తల దాన్నే నగరాన్ని తయారు చేయొచ్చని జగన్ అన్నారు.

 

ఏది ఏమైనా జగన్ ప్రసంగానికి అందరు మైమరిచి పోయారు. తాను ఇంగ్లీష్ లో మాట్లాడటం విన్న ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే…ఆలా ఉంది జగన్ చేసిన ప్రసంగం.

సినిమా లెక్కలు తేలుస్తానంటున్న పవన్

 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడో సినిమా పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. ఇప్పటికే పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీగా పింక్(తెలుగు) ప్రారంభమైంది. పవన్ ఈ మూవీ చేస్తుండగానే ఆయన తదుపరి సినిమా క్రిష్ దర్శకత్వంలో ఉంటుందంటూ ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగానే పవన్ మూడో సినిమా ‘పండగసాయన్న’ అంటూ టైటిల్ పేరుతోసహా సోషల్ మీడియాలో ప్రచారం కావడం చర్చనీయాంశంగా మారింది.

 

Read More: అందాలతో కాక రేపుతున్న శ్రీముఖి..

 

పవన్ ఫొకస్ సినిమాలపైనే!

పింక్(తెలుగు) మూవీ కోసం పవర్ స్టార్ కేవలం 20రోజుల మాత్రమే కేటాయించారని సమాచారం. శరవేగంగా సినిమా షూటింగ్ జరుగుతుండగా కొన్ని ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఫొటోలకు సంబంధించి చిత్రబృందం ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఈ సినిమా ఓవైపు జరుగుతుండగా పవర్ స్టార్ తదుపరి మూవీ క్రిష్ దర్శకత్వంలో ఉంటుందంటూ ప్రచారం జరిగింది. మొగల్ సామ్రాజ్య కథాంశంతో దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దబోతున్నాడు. ఈ సినిమాపై పవన్ బందిపోటుగా నటిస్తాడని సమాచారం. పవన్ సరసన ఇద్దరి భామలకు అవకాశం ఉండగా కంచె బ్యూటీ ప్రగ్య జైస్వాల్ ఒక కథానాయికగా ఎంపికయినట్లు సమాచారం. ఇక మరో హీరోయిన్ విషయంలో చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షిసింగ్ పేరు విన్పిస్తుంది.

 

Read More: జనసేన-బీజేపీ:తాటి చెట్టు క్రింద మజ్జిగ తాగుతున్న పవన్..!?

 

తెరపైకి ‘పండగసాయన్న’

పవన్ నటించే మూడో సినిమా ‘పండగ సాయన్న’ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిరంజీవి చేసిన సైరా మూవీ తరహాలోనే పండుగ సాయన్న అనే స్వాతంత్ర్య సమరయోధుడి కథతో పవన్ చిత్రం ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. అయితే పవన్ ఇటూ రాజకీయాల్లో బీజీగా ఉన్న నేపథ్యంలో వరుస సినిమా పేర్లు తెరపైకి రావడం ఒక్కింత ఆశ్చర్యం కలుగజేస్తోంది. పవన్ సినిమా రంగంలో ఉన్నప్పుడు ఏడాది ఒక సినిమా రావడమే గగనంగా ఉండేది. అలాంటిది అటూ రాజకీయాల్లో బీజీగా ఉన్న సమయంలో వరుసగా సినిమాలు చేస్తాడని ప్రచారం జరగడంలో అంతర్యం ఏంటో అర్థం కావడం లేదు. గతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ తిరిగి ఆ లెక్కలను సరిచేసేందుకు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. దీనిపై పవన్ తరుపు నుంచి వీటిపై ఎలాంటి ఖండన రాకపోవడం గమనార్హం. ఇప్పటికైనా పవర్ స్టార్ తాను చేయబోయే సినిమా లెక్కలపై క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి మరీ..

సినిమాలు-రాజకీయాలు..బ్యాలన్స్ అవుతాయా?

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలుత అమరావతి సమస్యపై ఉధృతంగా వ్యవహరించినా…. ఇప్పుడు కొంచం ఊపు తగ్గించాడనే చెప్పవచ్చు. తాను మొదట స్పందించినంత స్థాయిలో ఇప్పుడైతే కచ్చితంగా స్పందించట్లేదు. దీనికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంది.

 

పవన్ సినిమాలు వదిలి…రాజకీయాల బాట పట్టాడు. అప్పటినుంచి ప్రజలు ఆశించిన స్థాయిలోనే వ్యవహరించినా… ఇప్పుడు సినిమాల్లో తిరిగి అరంగేట్రం చేసాక రాజకీయాలు పక్కన పెట్టి సినిమాల మీదే ఎక్కువ దృష్టి సారించారు.

 

Latest News: పవన్ కళ్యాణ్, ఆ రెండు మతాలకు వ్యతిరేకమా..?

 

ప్రస్తుతం ఒక హిందీ సినిమాని తెలుగులోకి రీమేక్ చేస్తూ… షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తదనంతరం యధావిధిగా రాజకీయాలలో చక్రం తిప్పుతాడు అనుకుంటే.. ఇంతలోనే దర్శకుడు క్రిష్ తో ఇంకో సినిమా చేయటానికి జై కొట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. కనుక ఈ సినిమాల తర్వాత అయిన రాయకీయాలలో క్రియ శీలంగా వ్యవహరిస్తారా..లేదా.. అనే సందేహం పార్టీ కార్యకర్తలలో నెలకుంది.

 

Read More: పవన్ కి అండ బీజేపీ – బీజేపీకి దండ పవన్

 

వాళ్ల సందేహంలో కొంత నిజం ఉంది… అసలు సినిమాలే చేయను అన్న పవన్ మళ్ళీ సినిమాలలో బిజీ అవ్వటం కొంత మందికి ఆనందం కలిగించినా కానీ.. మరి కొంతమందికి విచారం కలిగించింది. పవన్ తన సినిమాలు అయ్యే దాక రాజకీయాలలో మునుపులా వ్యవహరించలేరు.. అవి పూర్తి అయితే తప్ప పవన్ తన ఆలోచన మొత్తం జనల మీద పెట్టలేడు.

 

బీజేపీతో పొత్తు తర్వాత రాష్ట్రంలో సమస్యలు తేలికగ తీసుకున్నాడు అనే వాదన కూడా లేకపోలేదు. ఏది ఏమైన ఇంతకు ముందున్న ఊపు-ఉత్సాహం ఇప్పుడైతే తగ్గిపోయిందన్న మాట మాత్రం వాస్తావం. పవన్ ప్రజా క్షేత్రంలో తనదయిన ముద్ర వేయాలంటే ఖచ్చితంగా వేరే ఆలోచనలు తీసివేయాలి.. అప్పుడే ఒక నాయకుడిగా ఎదగ గలుగుతాడు.

 

ఇది కూడా చదవండి: అమిత్ షా ఆఫర్.. పట్టుకున్న పవన్

దేశంలోనే తొలిసారి.. దిశా చట్టంలో తొలి అడుగు

రాజమండ్రిలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ను సీఎం జగన్ ప్రారంభించారు. 24*7 ఈ పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దిశ చట్టానికి సంబంధించిన ఓ ప్రత్యేక యాప్‌ను కూడా జగన్ ప్రారంభం కావడం విశేషం. దిశా చట్టం ప్రకారం అత్యాచార కేసుల విషయంలో 14 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి.. 21 రోజుల్లోపే శిక్ష ఖరారయ్యేటట్టుగా ఈ చట్టాన్ని రూపొందించినట్లు సీఎం జగన్ తెలిపారు.

మహిళల రక్షణే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోందని.. వీటి ద్వారా మహిళలకు ప్రత్యేకంగా పూర్తిస్థాయి భద్రత కల్పించబోతున్నట్లు హోం మంత్రి సుచరిత తెలిపారు.

తలపట్టుకుంటున్న జగన్ అనుచరులు

 

శాసనమండలి రద్దు నిర్ణయం జగన్ కి ముందు ముందు గుదిబండ లాగా తయారవబోతుందనిపిస్తుంది. అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్లు చంద్రబాబు నాయుడు మీద కోపంతో మండలినే రద్దు చేయటం తన మెడకే చుట్టుకుంటుందా అనిపిస్తుంది. దీనివలన తను సాధించేదేమీ లేకపోవటంతో తన పర్సనాలిటీ పై తన క్యాడరుకే సందేహం ఏర్పడే అవకాశముంది. 2007 లో వైస్సార్ శాసన మండలిని పునరుద్దరించినప్పుడు ముందే మాట్లాడుకొని చక చకా చక్రం తిప్పి పని చక్కపెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు జగన్ అలా మోడీతో ముందే మాట్లాడుకొని చేసినట్లుగా అనిపించటం లేదు. ఒకవేళ మోడీ ఈ అసెంబ్లీ తీర్మానాన్ని చుట్టపెట్టి పక్కన పడిస్తే అందరిలో నగుబాటు కాక తప్పదు.

 

Read More: జగన్ ను ఇరకాటంలో పడవేస్తున్న వైఎస్ వివేకా హత్య

 

ఇప్పుడున్న పరిస్థితుల్లో శాసన మండలి రద్దు తీర్మానం పార్లమెంటు ఆమోదం పొందే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే శాసన మండలిని పునరుద్ధరించమని రాజస్థాన్, అస్సాం అసెంబ్లీలు చేసిన తీర్మానాలు ఆమోదానికి నోచుకోలేదు. 2018 లో కొత్తగా మండలిని ఏర్పాటుచేయమని ఒడిశా చేసిన తీర్మానం అక్కడే వుంది. 2013 లోనే పార్లమెంటు స్టాండింగ్ కమిటీ శాసన మండలి ఏర్పాటు, రద్దు విషయంలో ఓ జాతీయ విధానం కావాలని నివేదిక సమర్పించింది. ఎప్పుడు బడితే అప్పుడు, కొత్త ప్రభుత్వాలు మండలిని రద్దు చేయకుండా ఈ విధానం కావాలని చెప్పింది. ఈ నేపథ్యంలో మోడీ తక్షణం నిర్ణయం తీసుకుంటాడనుకోవటం లేదు. అసలు మోడీకి దీనిపై ఎటువంటి అభిప్రాయం వుందో తెలియదు. తన స్వంత రాష్ట్రం గుజరాత్ లో అసలు ఎగువ సభ లేదు. తన హయం లో అందుకోసం ప్రయత్నించిన దాఖలాలు లేవు.

 

Latest News: పవన్ కళ్యాణ్, ఆ రెండు మతాలకు వ్యతిరేకమా..?

 

ఇప్పుడు జరగబోయే పరిణామాలు ఒక్కసారి ఆలోచిద్దాం. మండలి ఇప్పట్లో రద్దు కాదు. ఒకవేళ నిజంగా మోడీ సానుకూలంగా వున్నా అది జరగటానికి కనీసం సమయం పడుతుంది. ఎందుకంటే అది మోడీ ప్రాధాన్యతా అంశాల్లో ఉండదు కాబట్టి. ఈ లోపల మండలి తీర్మానం తిరిగి అసెంబ్లీ కి వస్తుంది. మూడు నెలల లోపల బిల్లు తిరిగి పంపించాల్సివుంది. ఆ తర్వాత అసెంబ్లీ మరలా మండలికి పంపించినా తిరిగి నెలలోపల వాపసు వచ్చేస్తుంది. అంటే నాలుగు నెలల తర్వాత జగన్ అనుకున్నట్లు అసెంబ్లీ తీర్మానం చేస్తుంది. అంటే మండలి రద్దు తీర్మానం కంటే ముందే రాజధాని సమస్య పరిష్కారం అవుతుంది. ఆ తర్వాత ఇంకొన్ని నెలలకు మూడింట ఒకవంతు మంది రిటైరవుతారు. జగన్ కి మండలి లో మెజారిటీ వస్తుంది. అప్పుడు మండలి రద్దయితే జగన్ అనుచరులే గొడవపెడతారు. చూస్తూ చూస్తూ కొరివితో తలా గోక్కున్నట్లయిందని జగన్ పార్టీలోని కొందరు వాపోతున్నారు. ఎటూ ఇప్పుడు రద్దుకానిదానికి ఆవేశంగా ఎందుకు నిర్ణయం తీసుకున్నట్లు. పిల్లచేష్టలులాగా ఉన్నాయని ఆయన అనుచరులే గగ్గోలు పెడుతున్నారు. దీన్నిబట్టి జగన్ ఆలోచనాపరుడా ఆవేశపరుడా అనే చర్చ జనంలో నడుస్తుంది. ఇటువంటివి రెండు మూడు జరిగితే జగన్ పరువు గంగలో కలిసి పోతుంది. తస్మాత్ జాగ్రత్త.

 

Read More: కొత్త మలుపు తిరిగిన వైఎస్‌ వివేకానంద హత్య కేసు

కరోనా వైరస్ గురించి ముందే చెప్పిన బ్రహ్మంగారి కాలజ్ఞానం…!

 

కరోనా వైరస్ అనే కొత్త వ్యాధి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది చైనాలో మొదలయ్యి….చుట్టు పక్కల ఉన్న అన్నిదేశాలకు వ్యాప్తిచెందుతుంది. అయితే ఈ కరోనా వైరస్ గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందే చెప్పారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

Read More: కరోనా వైరస్ కలకలం: దాని లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 

బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలోని 114 వ శ్లోకంలో….కోరంకి అనే వ్యాధి గురించి ప్రస్తావించారు. ఈ వ్యాధి తూర్పన మొదలయ్యి ప్రపంచం మొత్తం వ్యపిస్తుందని…సుమారు కోటి మంది దాక ప్రాణాలు కోల్పోతారని… అయన తన పుస్తకంలో పొందుపరిచారు.

 

Latest News: చైనా ల్యాబ్ లో తయారైన వైరస్.. దేనికోసం చేశారు.. బయటపడుతున్న నిజాలు..

 

ఏమి జరిగిన మన వాళ్ళు కాలజ్ఞానంతో ముడి పెట్టి…తరువాత ఏమి జరుగబోతుందో ఊహిస్తారు. సరిగ్గా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కరోనా వైరస్ కూడా తూర్పున మొదలయ్యి…ఇతర దేశాలకు వ్యాపిస్తుంది… అచ్చాం కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే. ఇప్పుడు జనాలు దానికి దీనికి ముడి పెట్టి..ఇది బ్రహ్మంగారు ముందే చెప్పారని ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందొ…ఎంత అబద్దం ఉందొ రాసిన బ్రహ్మంగారికే తెలియాలి. అయినా ఇప్పుడు వచ్చిన ఈ వైరస్ గురించి అప్పుడెప్పుడో బ్రహ్మంగారు చెప్పారంటే కొంచం నమ్మేలా లేకపోయినా…ఇదే నిజం అని నమ్మేవాళ్ళు కొన్ని వేలమంది ఉన్నారు.

 

Read More: కరోనా వైరస్ సోకి మలేషియాలో చనిపోయిన భారతీయుడు

బాబుగారు దొరికేసారు…వీడియో చూపించి మరీ ఉతికేసారు!

 

ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి రద్దు చేయాలని అధికార పార్టీ ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో…దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ టీడీపీ సభకు రాకుండా నిరసన తెలియ చేసింది. అయితే ఈ రోజు అసెంబ్లీలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ… చంద్రబాబుది పాత వీడియో ఒకటి విడుదల చేసారు.

 

హైదరాబాద్ ప్రజలలో కలకలం రేపుతున్న కరోనా వైరస్

 

అది ఏంటంటే… 2004 లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి శాసన మండలిని మళ్ళి రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్న సమయంలో చంద్రబాబు ఎలా స్పందించారో అనేదే ఈ వీడియో.

 

ప్ర‌కాష్ రాజ్ కు డెత్ వార్నింగ్!

 

ఈ వీడియోలో….చంద్రబాబు అప్పటి ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ రెడ్డిని….మండలి రాష్ట్రానికి ఆర్ధిక భారమని…దాని వల్ల బిల్లులు ఆలస్యం అవుతాయని విన్నవించారు. ఇప్పుడు దీనికి విరుద్ధంగా మళ్ళీ ఆయనే మండలిని తీసేయటం మంచి పద్దతి కాదని చెప్పటం ఎంతవరకు సమంజసం.. ? అని అధికార పార్టీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలు ప్రశిస్తున్నారు.

 

బైక్ నడుపుతూ స్నానం చేసిన యువకులు… వీడియో వైరల్

 

ఇలాంటివి ఏవో ఉంటాయని గ్రహించే ఈ రోజు చంద్రబాబు అసెంబ్లీకి రాలేదని సెటైర్లు వేస్తున్నారు. నిజమే కదా అప్పుడు మండలి ఎందుకు వద్దొ.. ఆయనే వివరించారు…మరల ఇప్పుడు వైసీపీ అవే చెప్పి తీసేస్తుంటే..ఇది ఒక పిచ్చి చర్య అని గోల చేస్తున్నారు. మరి ఈ మతలబు ఏమిటో…బాబుగారికే తెలియాలి.

 

పింక్ సినిమాతో మళ్ళీ చిగురించిన పవన్-అలీ స్నేహబంధం

రాజమండ్రిలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ను సీఎం జగన్ ప్రారంభించారు. 24*7 ఈ పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దిశ చట్టానికి సంబంధించిన ఓ ప్రత్యేక యాప్‌ను కూడా జగన్ ప్రారంభం కావడం విశేషం. దిశా చట్టం ప్రకారం అత్యాచార కేసుల విషయంలో 14 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి.. 21 రోజుల్లోపే శిక్ష ఖరారయ్యేటట్టుగా ఈ చట్టాన్ని రూపొందించినట్లు సీఎం జగన్ తెలిపారు.

మహిళల రక్షణే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోందని.. వీటి ద్వారా మహిళలకు ప్రత్యేకంగా పూర్తిస్థాయి భద్రత కల్పించబోతున్నట్లు హోం మంత్రి సుచరిత తెలిపారు.

ఎమ్మెల్సీల పరిస్థితి ముందు గొయ్యి వెనక నుయ్యి

 

ఎమ్యెల్సీ ల్లో గుబులు పట్టుకుంది. ఇద్దరి మోతుబరీల రాజకీయ క్రీడలో మేము బలైపోయామా అనే మీమాంస ఎమ్యెల్సీ ల్లో మొదలయ్యింది. చంద్రబాబు నాయుడు తమని రాజకీయచదరంగం లో పావులాగా వాడుకున్నాడా అని అక్కడక్కడా మాట్లాడుకుంటున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. జగన్ కి కూడా కావాల్సిందిదే. అందుకే సోమవారం దాకా విరామమిచ్చాడు. ఈ రెండురోజుల్లో ఎమ్మెల్సీ లు ఏమైనా మారతారా అనే దింపుడుకళ్లెం ఆశ వున్నట్లుంది .

 

ఇంతకీ ఆరోజు ఏం జరిగింది? ప్రత్యక్షప్రసారాలు నిలిపివేయడంతో ప్రజలకి మొత్తం ప్రసారాలు చూసే అవకాశం కలగలేదు. జగన్ , చంద్రబాబు నాయుడులు తనకనుకూలమైన క్లిప్పింగ్ లనే విడుదలచేశారు. అసలు ప్రసారాలు ఆపే అధికారం ఎవరిది ? కౌన్సిల్ చైర్మన్ దా లేక ముఖ్యమంత్రిదా ? ముఖ్యమంత్రి ప్రసారాలు ఆపివుంటే అధికార దుర్వినియోగం కిందకే వస్తుంది. రెండోవైపు చైర్మన్ చేసిన పని కూడా ఏమీ బాగా లేదు. నిబంధనలకు విరుద్ధంగా విచక్షణాధికారాలు ఉపయోగించాననటం ఎంతవరకు సబబు? రాజ్యాంగంలో వున్న కొన్ని లొసుగులనుపయోగించుకొని చైర్మన్ ని తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తుంది. శాసన కార్యక్రమాల్లో తప్పులున్నా కోర్టులు ప్రశ్నించే అధికారం లేదు. ఆ రక్షణని ఉపయోగించుకొని చైర్మన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించేటట్లు ఒత్తిడి తీసుకొచ్చారని అభిప్రాయముంది.

 

Read More: తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఎన్టీఆర్ బాటలో జగన్?

 

ఇంతవరకూ బాగానే వున్నా అసలు కదా ఇప్పుడే మొదలయ్యింది. జగన్ కౌన్సిల్ లో జరిగిన విషయాన్ని పరాభవంగా భావించి కౌన్సిల్ రద్దుచేయాలని నిర్ణయించుకున్నాడు. చైర్మన్ ని ప్రభావితం చేసి జగన్ వ్యూహాన్ని దెబ్బతీయగలిగామని తెలుగు దేశం నాయకులు సంబరాలు చేసుకుంటే దానికి ప్రతి వ్యూహాన్ని జగన్ రచించాడు. అసలు కౌన్సిల్ నే రద్దు చేయటానికి సిద్దమయ్యాడు. దీనితో తెలుగుదేశం ఎమ్మెల్సీ ల్లో భయం మొదలయ్యింది. లోలోపల చంద్రబాబు నాయుడు వ్యూహం బెడిసి కొట్టిందని తమ పదవికే ఎసరు వచ్చిందని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. వాళ్ళు పార్టీ మారదామంటే జగన్ తీసుకున్న వైఖరి తో ఇబ్బందయ్యింది. పదవి కి రాజీనామా చేసి వస్తేనే పార్టీలోకి చేర్చుకుంటామని ఇంతకుముందే ప్రకటించటంతో వైస్సార్సీపీ లోకి మారలేరు. మారాలంటే తెలుగుదేశం ఎమ్మెల్సీ ల్లో మూడింట రెండు వంతులు కలిసికట్టుగా మారాలి. అది సాధ్యంకాకపోవచ్చు. అందుకే ముందు గొయ్యి వెనక నుయ్యి లాగా అయ్యింది తెలుగుదేశం ఎమ్మెల్సీల పరిస్థితి. ఈ లోపల మీకేమీకాదని చంద్రబాబు హామీ ఇస్తున్నాడు. ఒకవేళ అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేసినా కేంద్రం సహకరించిందని చెబుతున్నాడు. అయితే అది ఎమ్మెల్సీలను పూర్తిగా నమ్మించలేకపోతుంది. అందుకే ఎమ్మెల్సీలు చాలా టెన్షన్ లో వున్నారు. వాళ్లకు చంద్రబాబు హామీ మీదకన్నా జగన్ కక్షసాధింపు మీద గురి వుంది. దానితో వాళ్ళందరూ పైకి గంభీరంగా వున్నా లోలోపల ఏంచేయాలో తెలియక సతమతమవుతున్నారు. వచ్చే రెండు రోజుల్లో ఏమైనా జరగకపోతుందా అని ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్సీలది త్రిశంకుస్వర్గం.

ఫస్ట్ డెత్.. కరోనా సోకి చనిపోయిన భారతీయుడు

కరోనా వైరస్ సోకి త్రిపురకి చెందిన భారత యువకుడు చనిపోయాడు. ఈ ఘటన మలేసియాలో జరిగింది. భారతదేశానికి చెందిన వ్యక్తి కరోనా సోకి చనిపోవడం ఇదే తొలిసారి.

వివరాల్లో కి వెళ్తే.. త్రిపురకి చెందిన యువకుడు మనీరు హుస్సేన్ ఇటీవల మలేసియా వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న రెస్టారెంట్ లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇటీవల కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకున్నాడు. కరోనా వైరస్ టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది. అయితే మనీరు ని ప్రత్యేకంగా ఉంచి వైద్యం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

జగన్ దూకుడికి… జై కొడుతున్న జనాలు

 

పార్టీ ఆవిర్భం నుంచి ఎన్నో సవాళ్లు ఎదురుకొని… 2019 ఎన్నికల్లో అధికారం చేజిక్కిచుకున్న జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ తగ్గకుండా తాను ఎన్నికల ముందు ప్రకటించిన విధంగానే నవ రత్నాలను ఆమలు చేస్తూ వెళ్తున్నాడు. నాడు నేడు అనే పథకంతో పాఠశాలలు మరియు ప్రభుత్వ ఆసుపత్రుల మరమ్మత్తు ఒక గొప్ప ఆలోచన.

 

తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక్కో కార్యక్రమము ఆలస్యం లేకుండా ప్రవేశ పెడుతున్నాడు. ఒక పక్క చెప్పినవి చేస్తూనే ఇంకో పక్క చెప్పని కొత్త కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తూ ప్రత్యర్థి పార్టీలకు చమటలు పట్టిస్తున్నాడు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఎండగడుతూ…టీడీపీ నాయకుల బెండు తీస్తున్నాడు. ఎవరికీ వారు మేము ఉత్తములమీ అని చెప్పుకుంటూ జనాలలో చలామణి అవుతుంటే….వాళ్ళ బాగోతాలు మొత్తం సమీక్షల పేరుతో జనల ముందు ఉంచుతున్నాడు.

 

Read More:
అమరావతిలో పవన్ కళ్యాణ్ కు 62 ఎకరాలు?

 

ఆటో డ్రైవర్లకి, చేనేత కార్మికులకి, బడి పిల్లలకి, మత్సకారులకి ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం కింద ఆర్ధిక సహాయం చేస్తూ వెళ్తున్నాడు. అసలే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. దీనికి తోడు వరుస పథకాలు అమలు చేస్తుంటే….డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయా అని విశ్లేశకులు సైతం తల గోక్కుంటున్నారు.

 

గోరంత చేసి కొండంత చెప్పుకునే టీడీపీ నాయకులు…అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే జగన్ చక చక పనులు చేస్తుంటే చూసి తట్టుకోలేక పోతున్నారు.

 

Read More:
జగన్, వ్యక్తిగతంగా హాజరు కావసిందే.. :ఈడీ కోర్టు

 

గతంలో ఇసుక సమస్య తార స్థాయికి చేరినా… కొన్ని రోజులకి దాన్ని పరిష్కరించాడు. ఇప్పుడు కూడా రాజధానుల విషయంలో కొంత వ్యతిరేకత ఉన్న కొన్ని రోజుల్లో అది సర్దుకు పోతుందనే నమ్మకంతో ఉన్నాడు జగన్. ఈ ఒక్క విషయం మినహాయించి దాదాపు అన్ని విషయాలలో జనాల్లో మంచి మార్కులే కొట్టేసాడు. ఒక్క అవకాశం ఇవ్వండి చేసి చూపిస్తా అన్న మాటకి…ప్రస్తుతం చిన్నల నుంచి పెద్దల దాక అందరితో శభాష్ అనిపించుకున్నాడు.

 

Read More:తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఎన్టీఆర్ బాటలో జగన్

కెసిఆర్ కి చురకలేసిన అసదుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెరాసతో ఎంతో కొంత మంచిగానే ఉంటూనే మరో వైపు చురకలు అంటిచారు. బీఎస్- ఎంజీబీఎస్ మధ్య హైదరాబాద్ మెట్రో మార్గాన్ని సీఎం కేసీఆర్ ఈ నెల 7న (రేపు) ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఇదే విషయాన్ని హైదరాబాద్ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ కెసిఆర్ కి చురకంటిచారు.

“జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలు నిర్మాణం ఓకే.. మరి ఫలక్ నుమా సంగతేంటి అని, దక్షిణ హైదరాబాద్ విషయానికొచ్చేసరికి మీ దగ్గర నిధులు ఉండవు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు”

నిజానికి మూడో దశ మెట్రో రైలు జేబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో మార్గం పూర్తయ్యింది. ‘దార్ ఉల్ ఫిషా’ నుంచి ఫలక్ నుమా వరకు మెట్రో నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

జగన్ పాలన బాగుంటే సినిమాలు చేసుకుంటా అన్నవుగా..తథాస్తు!

 

కొన్ని రోజుల క్రితం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు….అవేంటంటే.. జగన్ పరిపాలన బాగా అందిస్తే వెళ్లి సినిమాలు చేసుకుంట అన్నారు. ఆలా అన్నారో లేదో నిన్న ఉదయం కొత్త సినిమా షూటింగులో ప్రత్యక్షమయ్యారు. పవన్ ఎప్పటినుంచో ఈ సినిమా చేస్తునట్టు ఊహాగానాలు వినిపించాయి. వాటి అన్నిటిని నిజం చేస్తూ నిన్న సినిమా షూటింగులో పాల్గొన్నారు.

 

దానికి ఇప్పుడు నెటిజన్లు మరియు ప్రత్యర్థి పార్టీ వాళ్లు ఎద్దేవా చేస్తున్నారు. జగన్ పాలనా నచ్చిందేమో… అన్నట్టే పవన్ మళ్ళీ సినిమాలు చేసుకుంటున్నారు అని తెగ ట్రోల్ చేస్తున్నారు.

 

నిజమే కదా మరి…పవన్ అన్న మాటలు సరిగ్గా సరిపోయాయి కదా. పాలనా బాగుంటే తిరిగి సినిమాలు చేసుకుంటా అన్నారు… ఇప్పుడు సినిమా చేస్తున్నారు అంటే పాలనా బాగున్నట్టే అర్ధం కదా. మరి జగన్ పాలనా పవన్ ని సంతృప్తి పరిచిందేమో….ఎవరికి తెలుసు మన పవర్ స్టార్ ఎవరికీ అర్ధం కాడు మరి…!

పవన్ సినిమాలలో నటిస్తే తప్పేంటి..?: ఉండవల్లి

2019 ఎన్నికలలో జనసేనకి ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ.. ప్రజల కోసం, ప్రజా సమస్యల పై పోరాటానికి సిద్దపడ్డ పవన్ కళ్యాణ్, ఆ తర్వాత, రాజకీయాల్లో చాలా బిజీ అయ్యారు. అందులో భాగంగానే.. అనేక ప్రజా సమస్యలపై తనదైన శైలిలో విరుచుపడ్డారు. ఇసుక సమస్య, ఇంగ్లిష్ మీడియం సమస్యలపై ఒకానొక టైంలో జగన్ సర్కార్ ని ఉక్కిరి బిక్కిరి చేసిన విషయం కూడా తెలిసిందే..

Read More: జనసేన-బీజేపీ:తాటి చెట్టు క్రింద మజ్జిగ తాగుతున్న పవన్..!?

ఆ తర్వాత కొన్ని అనుకోని సంఘటనల వల్ల జనసేన నుంచి కొంతమంది వ్యక్తులు వెళ్లిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో జనసేన, బీజేపీతో పొత్తు, అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలపై మొగ్గు చూపడంతో జనసేనకు చెందిన లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం జరిగింది. దీంతో అసలు పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించడం సరైన నిర్ణయమేనా..? అనే అంశంపై చర్చ తెరపైకి వచ్చింది. దీని పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

గతంలో జయప్రకాశ్ నారాయణ, పవన్ నిర్ణయాన్ని సమర్ధించగా తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా పవన్ సినిమాల్లో నటించే నిర్ణయం సరైందే.. అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఆదే విధంగా జనసేన-బీజేపీ పొత్తు గూర్చి మాట్లాడుతూ.. పొత్తులకు సిద్ధాంతాలతో పనేముందని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

Read More: జనసేనాని రాజకీయ ప్రస్థానంపై విశ్లేషణ