Homeమిర్చి మసాలామాటలతో మాయ చేసిన బుగ్గన రాజేంద్రనాథ్!

మాటలతో మాయ చేసిన బుగ్గన రాజేంద్రనాథ్!

 

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రారంభమైన నేపథ్యంలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ… తన మాటలతో అందరిని ఆకట్టుకున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయం ముగ్గింపుకు తెచ్చే ఉద్దెశంతో ప్రభుత్వం మూడు రోజుల పటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.

 

పోయిన అసెంబ్లీ సమావేశాలలో చివరి రోజు జగన్ చేసిన ఒక ప్రకటన రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఒక పధకం ప్రకారం వైసీపీ ప్రభుత్వం రాజధానిని తరలించే ప్రయత్నంలో విజయం సాధించిందనే చెప్పవచ్చు. ఇందులో భాగంగా ఇవ్వాళా ప్రభుత్వం రెండు కీలక బిల్లులని సభలో ప్రవేశ పెట్టింది.

 

మొదట బుగ్గన బిల్లుని ప్రవేశ పెడుతు తన ప్రసంగం మొదలుపెట్టాడు. బిల్లు విషయమై మాట్లాడుతు తన వాక్ చాతుర్యంతో అందరిని ఆలోచింప చేసాడు. గడచిన కాలంలో ఉత్తరాంధ్ర ఇంకా రాయలసీమ ప్రాంతాలకి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించాడు. చరిత్రని ప్రస్తావిస్తూ అధికార వికేంధ్రీకరణ ఎందుకు అవసరమో తెలియచేసాడు. శ్రీ బాగ్ ఒడంబడిక, శివ రామ కృష్ణన్ కమిటీ చేసిన సూచనలని ప్రస్తావిస్తూ…ఇటీవల కాలంలో చేసిన జిఎన్ రావు ఇంకా బీసీజీ సర్వేలను బట్టబయలు చేసాడు. తన మాటలు వింటున్న అందరూ గుట్టుచప్పుడు చేయకుండా కూర్చున్నారు.

 

ఇక ఇన్సైడర్ ట్రేడింగ్ విషయమై టీడీపీ నాయకులకి చమటలు పట్టించాడు. చంద్రబాబుతో మొదలు పెట్టి బినామీల దాక అందరి పేర్లు చదివి వినిపించాడు. దీంతొ టీడీపీ నాయకులు తమ అభ్యంతరం వ్యక్త పరిచారు. బుగ్గన మాటలు విన్న ఎవరైనా సరే వాటిని ఒప్పుకోక తప్పదు… ఆలా ఉంది మరి తాను చేసిన ప్రసంగం.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular