Home Blog Page 8632

నిధులు విడుదల చేయండి.. ప్రత్యేక హోదా గూర్చి ఆలోచించండి

ఢిల్లీలో జరిగిన అఖిలపక్షం సమావేశంలో భాగంగా వైసీపీ పలు అంశాలను లేవనెత్తారు. రాష్ట్రానికి సంబంధించి తొమ్మిది అంశాలను లేవనెత్తినట్లు అలాగే మరోసారి ప్రత్యేక హోదా ప్రస్తావన తెచ్చినట్లు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. రెవెన్యూ లోటు గ్రాంట్ కింద.. రాష్ట్రానికి రావాల్సిన రూ.18,969 కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా.. వెనకబడిన జిల్లాలకు రూ. 23 వేల కోట్లు.. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 3,283 కోట్ల రూపాయలను కేంద్రం రీయింబర్స్మెంట్ చేయాలని అడిగినట్లు చెప్పారు. అంతేకాకుండా.. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 55,548 కోట్లను ఆమోదించాలని… క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ గ్రాంట్ కింద రూ. 47,424 కోట్లు ఇవ్వాలని సమావేశంలో ప్రస్తావించామన్నారు.

దుగ్గరాజపట్నం పోర్ట్‌కి బదులుగా రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని.. రాష్ట్రానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు కల్పించాలని… అంతేకాకుండా.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.

ప్లాస్టిక్‌ బాటిల్‌ మింగిన పాము.. వీడియో వైరల్

ప్లాస్టిక్ పొల్యూషన్ మనుషులకే గాక ఇతర జీవాలకు కూడా హానికరంగా మారుతోంది. వాటిని పొరబాటున మింగిన వీటి పని ఖతం అయినట్టే ! అయితే ఒక్క కోబ్రాల విషయంలో మాత్రం కాదట.. ఇందుకు నిదర్శనంగా ఓ కోబ్రా మింగేసిన ప్లాస్టిక్ బాటిల్ ని మళ్ళీ ఎంచక్కా బయటకి విసిరేసింది. పర్వీన్ కస్వాన్ అనే ఓ ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన ఓ వీడియో ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. ఈ బాటిల్ ను మింగి ఉబ్బిన కడుపుతో ఉన్న ఈ సర్పం కాసేపటికే దాన్ని మళ్ళీ ఆట్టే నోటి ద్వారా తిరిగి బయటకు ‘ కక్కేసింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వంటివి వైల్డ్ లైఫ్, ఇతర జాతి జంతువులకు కూడా ఎంతో హానికరమని ఆ ఆఫీసర్ అంటున్నాడు. ఇక్కడో కొత్త విషయం చెప్పుకోవాలి. సరీసృపాల్లో ఒక్క కోబ్రా మాత్రమే తాను మింగిన వస్తువులను మళ్ళీ వెలుపలికి విసర్జించగలవని ఆయన చెబుతున్నాడు. ఇతర జంతువులేవీ ఇలా చేయజాలవని ఆయన పేర్కొన్నాడు. ఈ వీడియోను 25 వేలమంది చూసి నోళ్లు వెళ్ళబెట్టగా.. టన్నులకొద్దీ లైక్స్ వచ్చి పడ్డాయి.

విజయవాడలో బీజేపీ, జనసేన కీలక మీటింగ్.. వేడెక్కుతున్న ఫ్యాన్స్…

 

జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఢిల్లీ టూర్ ముగించుకొని ఆగమేఘాల మీద వైజాగ్ చేరుకొని, అక్కడి నుంచీ కాకినాడ వెళ్ళి, అక్కడ జనసేన, వైసీపీలకి మధ్య జరిగిన గొడవలలో గాయపడిన తన జనసేన కార్యకర్తలని పరామర్శించారు. పరమర్సలు అనంతరం వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఘటన తాలూకు డ్యామేజ్ చెప్తూనే ఆవేశపూరితమైన ప్రసంగం చేసారు.

 

ఇదిలాఉంటే ఈ ప్రసంగం మధ్యలోనే పవన్ కళ్యాణ్ ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ టూర్ లో ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడాను అంటూనే.. టూర్ వెనుక అసలు కారణం మాత్రం చెప్పలేదు. దాంతో కార్యకర్తలకి బుర్ర హీటెక్కింది. ఇక్కడ జరిగన ప్రతీ విషయం కేంద్రం దృష్టిలో పెట్టా ఇక కేంద్రమే అన్నీ చూసుకుంటుంది అన్నట్టుగా పవన్ వ్యాఖ్యలు ఉండటం కొంత ఆసక్తిని రేకెత్తించాయి. మరో అడుగు ముందుకు వేసిన పవన్ సభకి నమస్కారం తెలిపే సమయంలో త్వరలో అంటే 16 న విజయవాడలో బీజేపీ తో కీలక మీటింగ్ ఉంటుందని చెప్పారు.

 

16 తేదీ కనుమ రోజున బీజేపీ, జనసేన కీలక మీటింగ్ అని ప్రకటించగానే ఎవరి బుర్రలు వారి వారి స్థాయికి తగ్గట్టుగా ఆలోచనలో పడ్డారు. కొంతమందికైతే జనసేన అధినేతకి ఏపీలో పార్టీని నడపలేమనే క్లారిటీ వచ్చింది కాబట్టి , ఇక ఈ మీటింగ్ అనంతరం జనసేన ని బీజేపీలో విలీనం చేసేస్తారా అనే సందేహం వచ్చిందట. ఇంకొంతమంది ఇకపై ఏపీలో వైసీపీని ఎదుర్కోవడానికి బీజేపీ తో కలిసి నడవడానికి రెండు పార్టీలు ఏకం అవ్వడానికే ఆ మీటింగ్ అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ఎవరి అభిప్రాయం వారిదే అయినా పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే 16 వరకూ వేచి చూడాల్సిందే..

జగన్ వల్లే తాగడం మానేసాను..!

ఏపీ సీఎం జగన్ పాలనపై ప్రతిపక్షాలు విమర్శల దాడి చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో.. మాత్రం అంతగా వ్యతిరేకత లేదనే చెప్పొచ్చు..

ఆదిలాబాద్ కోర్ట్ సంచలన తీర్పు.. సమత దోషులకు ఉరి

తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన సమత హత్యాచారం ఘటన సంచలనం సృష్టించినం సృష్టించిన విషయం తెలిసిందే..అయితే సమత అత్యాచారం చేసి హత్య చేసిన షేక్ బాబు (ఏ1), షాబుద్దీన్ (ఎ2), మఖ్దూం (ఏ3) దోషులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించింది. నవంబర్ 24 వ తేదీన సమతపై నిందితులు షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూంలు అత్యాచారం చేసి హత్య చేసారు. ఈ ఘటనతో ఆదిలాబాద్ ప్రాంతం మొత్తం నిరసనలు వెల్లువెత్తాయి. అదే సమయంలో దిశ ఘటన కూడా జరగడంతో ప్రభుత్వం, సమత కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది.

Latest News: యువతిపై అత్యాచారం చేసిన గుంటూరు ఎస్సై

ఈ కేసులో కోర్టు సాక్షులను విచారించి ఫైనల్ గా ఈరోజు తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో సమత తరపు బంధువులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమత కేసులో న్యాయం జరిగిందని అంటున్నారు. ఈ కేసు తరువాత ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని న్యాయవాదులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, నిర్భయ విషయంలో ఆలస్యం జరిగినట్టుగా జరగకుండా వీలైనంత త్వరగా వీరిని ఉరి తీయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Read More: భార్య కోరికను తీర్చబోయి.. ప్రాణాలు పోగుట్టుకున్న భర్త

జగన్ తో వల్లభనేని వంశీ రహస్య భేటీ… జగన్ తో కలిసి హెలికాఫ్టర్ లో ప్రయాణం

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ సంక్రాంతి పండుగ కార్యక్రమాల్లో భాగంగా నిన్న భోగి పర్వదినాన మంత్రి కొడాలి నాని పిలుపు మేరకు గుడివాడ లో జరిగిన ఎడ్ల పందాలను చూడడానికి వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే… కానీ నిన్న జరిగిన పండగ వాతావరణంలో రాజకీయంగా ఒక ముఖ్య సంఘటన జరిగింది. అదేమిటంటే … ఎడ్ల పందాలు ముగిసిన అనంతరం వైస్ జగన్ గుడివాడ నుండి తిరుగు ప్రయాణంలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశిని తనతో స్వయంగా హెలికాఫ్టర్ లో తన నివాసానికి తీసుకువెళ్ళారంట.. 45 నిముషాలపాటు ఇరువురు కలిసి చర్చించుకున్నట్టు సమాచారం…

 

ఈ భేటీ దేని కోసం అన్న విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. ఇప్పటికే వల్లభనేని వంశీ టీడీపీకి దూరమయ్యారు. కానీ వైసీపీలో మాత్రం చేరలేదు. అలా చేరితే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. మళ్లీ ఉప ఎన్నిక వస్తుంది. ఆ సమయంలో గెలుపోటములు ఎలా ఉంటాయో చెప్పలేం.. అందుకే వంశీ ఈ విషయంలో రిస్క్ ఇంకా తీసుకోవడం లేదు. అయితే ఇదంతా జగన్ వ్యూహంలో భాగంగానే జరుగుతోందని ఓ టాక్ ఉంది. అందుకే తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏం చేయాలన్న దానిపై వల్లభనేని వంశీ జగన్ తో చర్చించి ఉంటారని భావిస్తున్నారు.

 

మరోవైపు తాజాగా రాజధాని మార్పు అంశం.. కృష్ణా జిల్లా రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతోందన్న అంశంపైనా జగన్, వల్లభనేని వంశీ మధ్య చర్చ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మరి ఈ చర్చల సారాంశం ఏంటన్నది మాత్రం ఆసక్తికరంగా ఉంది. త్వరలోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ హాట్ టాపిక్ అవుతోంది.

వైరల్: ఆఫీసులోకి వచ్చి దాడిచేసిన పాము

ఆఫీసులోకి వచ్చి దాడిచేసిన పాము

రాజధాని కొట్లాటలో రైతుల బలి

 

రాజధాని ప్రకంపనలు రోజు రోజుకీ రంజుగా మారుతున్నాయి. ఒకవైపు చంద్రబాబు అనుకూల ప్రచార సాధనాలు, మరోవైపు జగన్ అనుకూల ప్రచార సాధనాలు పోటాపోటీగా వార్తలను, వీడియోలను పోస్ట్ చేస్తు న్నారు. రెండూ చూస్తే బుర్ర వేడెక్కి బీపీ పెరగటం ఖాయం. అయితే ఇప్పటికే చాలామంది ఎటో ఒకవైపు మొగ్గు చూపటం జరిగిపోయింది కాబట్టి వాళ్లకు నచ్చిన ఛానల్ చెప్పినదాన్నే మనసులోకి ఎక్కించుకుంటున్నారు. ఆరోగ్యరీత్యా అదేమంచిదేమో మరి. లేకపోతే అటు ఇటు వాయింపుడుతో బుర్ర వేడెక్కి మంచమెక్కటం ఖాయం.

 

చానళ్ళు ఇప్పటికే చాలావరకు రెండు వర్గాలుగా డివైడ్ అయిపోయాయి కాబట్టి చూసేవాళ్ళు ఆ చానళ్ళు చూపించేది గుడ్డిగా నమ్మేయటంలేదు. ఉదాహరణకు ఈటీవీ , టివీ 5, ఏబియెన్ ఆంధ్ర జ్యోతి ప్రసారం చేసిందాన్ని అందరూ ఒకే దృష్టితో చూడటంలేదు. ఇప్పటికే అమరావతి వైపు మొగ్గు చూపిన వాళ్ళు కళ్ళార్పకుండా చూస్తే మిగతా వాళ్ళు క్రిటికల్ గా చూడటం అలవాటు చేసుకున్నారు. అలాగే సాక్షి ఛానల్ ప్రసారం చేసేది జగన్ అనుకూలురు కళ్ళార్పకుండా చూస్తే మిగతా వాళ్ళు వాళ్ళ పార్టీ ప్రచారంగా భావిస్తున్నారు.

 

టీవీ 9 , ఎన్ టీవీ లు రెండు వాదనలను సమానంగా ప్రసారం చేయటానికి ప్రయత్నం చేయటంతో అటూ ఇటూ పూర్తిగా మొగ్గని వాళ్ళు వాటినే ఎక్కువగా చూస్తున్నారు. కొన్ని చానళ్ళు కేవలం తెలంగాణ వార్తలకే పరిమితం కావటంతో అవి ఆంధ్రాలో పెద్దగా చూడటంలేదు. ఆ కోవలో వి 6, టి న్యూస్ వస్తాయి. మిగతా చానళ్ళు పెద్దగా రేటింగ్స్ లేవు కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక పత్రికల విషయానికి వస్తే పాపులర్ పత్రికలు ఈనాడు, ఆంధ్ర జ్యోతి ఒకవైపు, సాక్షి ఇంకో వైపు పోటాపోటీగా వార్తలు రాస్తున్నాయి. ఈనాడు ప్రతిరోజూ అమరావతి ఎందుకు కావాలో పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు గుప్పిస్తుంటే పోటీగా సాక్షి ఎందుకు మూడు రాజధానులు కావాలో వండి వారుస్తుంది. చివరకు ఈ యుద్ధం ప్రజలమధ్యకన్నా ఛానళ్లు, పత్రికల మధ్యగా మారింది.

 

మరి ఈ మధ్యలో రైతుల పరిస్థితేమిటి? వాళ్ళేం పాపం చేశారు? రాజకీయాలను పక్కన పెట్టి వాళ్ళను గురించి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు 33 వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చి ఇప్పుడు వాళ్ళ పరిస్థితేమిటో తెలియక మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. జగన్ ప్రభుత్వం వాళ్ళను ఇన్నాళ్లు రోడ్డుమీద నిలబెట్టటం క్షమించరాని నేరం. వాళ్ళఆశలు నిరాశలైనందుకు ఏమి చేయాలో తెలియని పరిస్థితి. అమరావతి రాజధాని కాకపోతే వాళ్లకు ఏవిధంగా న్యాయం చేస్తారో జగన్ ఇప్పటికే చెప్పి వుండాల్సింది. దాదాపు నెలరోజులు రోడ్లమీదకు వచ్చి ఇంట్లో ఆడవాళ్లు, పిల్లలు టెంటుల్లో గడపటం ప్రభుత్వాన్ని నడిపే పెద్దలకు సిగ్గుగా అనిపించటంలేదా? మీ రాజకీయ నిర్ణయం ఏమైనా గాని రైతులకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా జగన్ కు లేదా? రైతుల దగ్గరకు ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్లకు ధైర్యం చెప్పి మీకు ఎటువంటి నష్టం లేకుండా నేనున్నానని ఎందుకు చెప్పలేదో అర్ధం కావటంలేదు. ఇది బాధ్యతా రాహిత్యం. రైతుల ఉసురు పోసుకోవటం శోభగా అనిపించదు . రైతులు భోళా మనుషులు. దగ్గరకు తీసుకొని మాట మాటా కల్పి ధైర్యం చెప్పివుంటే ఇక్కడిదాకా వచ్చేదికాదు. రైతులందరూ చంద్రబాబు నాయుడు మద్దతుదారులనుకోవటం పొరపాటు. వాళ్ళ ఆవేదనలో అర్థముంది, న్యాయముంది, బాధవుంది. సహృదయంతో చేరదీసి వాళ్లలో విశ్వాసం కల్గించాల్సిన బాధ్యత జగన్ మోహన్ రెడ్డిది. ఈ విషయంలో ప్రభుత్వాధిపతిగా జగన్ పూర్తిగా విఫలమయ్యాడు.

 

ఇద్దరి కొట్లాట మధ్య రైతులు బలికావటం బాధాకరం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. జనవరి 20వ తేదీదాకా వేచివుండకుండా రైతుల్ని పిలిచో , దగ్గరకు వెళ్ళో వాళ్లకు ఉపశమనం కల్గించాలి. ఇది ప్రభుత్వాధినేతగా కనీస బాధ్యత. ఆ పని ప్రభుత్వం చేయకపోవటంతో వాళ్లకు ఒకవైపు రాజకీయంగా మొగ్గటం తప్ప వేరే దారిలేకుండా పోయింది. ఇప్పటికైనా జగన్ మోహన రెడ్డి పెద్దమనసుతో రైతుల సమస్యను మీ రాజకీయ నిర్ణయంతో ముడిపెట్టకుండా వెంటనే పరిష్కరిస్తాడని ఆశిద్దాం.

మండలి రద్దు: ఇరుకున్న మోడీ సర్కారు

ప్రస్తుతం ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడిన విషయం అందరికి తెలిసిందే.. అందుకు రాజధాని మార్పు ప్రధాన కారణం. ఈ నేపధ్యలో రెండు పార్టీల మధ్య అగ్గి రాసుకుంది. ఏపీకి మూడు రాజధానులు ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలకు నిద్ర కరువైంది. అందుకు తగినట్లుగా జగన్ సర్కార్ అడుగులు వేస్తుండటంతో.. చంద్రబాబు సైన్యం మరీ ఫైర్ అవుతున్నారు. రాజధాని విషయం ఇప్పుడు ఢిల్లీకి చేరే పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలను ఒక్కసారి విశ్లేషిద్దాం..

Read More: బాబుగారు దొరికేసారు…వీడియో చూపించి మరి ఉతికేసారు!

ఒక “రాష్ట్ర శాసనమండలి రద్దు” తేలికైన విషయమేమి కాదు. అందుకు కొన్ని విధి విధానాలను పాటించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో కేబినెట్ ఆమోదం, అసెంబ్లీలో చర్చ, మెజారిటీ సభ్యుల ఆమోదం అనంతరం కేంద్ర కేబినెట్ ఆమోదం, లోక్ సభలో బిల్లు పాస్ అవ్వాలి.. చివరిగా రాష్ట్రపతి ఆమోద ముద్ర పడాలి. ఆ ప్రాసెస్ లో ఎక్కడ తేడా జరిగినా.. మండలి రద్దు, రద్దు అయినట్లే..

అయితే ఇక్కడే ఇంకో తిరకాసు ఉంది. కేంద్రాన్ని ప్రసన్నం చేసుకుంటే. వారు అనుకున్నది త్వరగానే సాధింకోవచ్చు. అనగా మండలి రద్దు కావాలన్నా, రద్దును ఆపాలన్నా.. కేంద్రం చేతుల్లోనే ఉంది. కాబట్టి మోడీగారి దర్శనం అవసరం. అందుకు రెండు పార్టీల నేతలు తెగ ఆరాటపడుతున్నట్లు సమాచారం.

Read More: తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఎన్టీఆర్ బాటలో జగన్?

గతంలో మోడీ తీసుకున్న అన్ని నిర్ణయాలకు వైసీపీ జై కొట్టింది. మరోవైపు బీజేపీ మొదటి నుంచి రాజధాని మార్పుపై టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతూ.. వస్తుంది. అలాగే ఏపీలో పాగా వేయాలని బీజేపీ, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇన్ని పరిస్థితుల మధ్య “ఏపీ శాసన మండలి రద్దు” ఆ తర్వాత “రాజధాని మార్పు”పై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. అని అందరిలో ఆసక్తి నెలకొన్నది. ఒకరకంగా చెప్పాలంటే మోడీ సర్కారు కి ఇది ఒక గడ్డు సమస్య.

Read More: శాసనమండలి రద్దు కావాలంటే.. ఇది ప్రాసెస్

జగన్ దెబ్బకు…’అబ్బా..’అంటున్న టీడీపీ నేతలు!

 

వైసీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీ నాయకులకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. జగన్ తీసుకునే ఒక్కో నిర్ణయం చంద్రబాబు సైతం తల పట్టుకునేలా చేస్తుంది. జగన్ ప్రవేశపెట్టె సంక్షేమ పథకాలు ప్రజల్లోకి దూసుకుపోతుంటే దిక్కుతోచని స్థితిలో టీడీపీ నాయకులంతా బిక్క మొహం వేస్తున్నారు.

 

ఒకవైపు పార్టీలోని నాయకులంతా ఖాళీ చేస్తుంటే…మరోవైపు జగన్ పథకాలు ప్రజల్లోకి వెళ్లి మంచి పేరు సంపాదిస్తున్నాయి. అటు పార్టీని బలోపేతం చేసుకోవాలా ఇటు జగన్ పధకాలని ప్రజల్లోకి వెళ్లకుండా ఆపాల అనే గందరగోళంలో బాబుగారు సతమతమవుతున్నారు. దీనికి తోడు రాజధాని విషయం బాబుగారికి పెద్ద సమస్య అయిపోయింది. కొన్న భూములు ఎక్కడ ధర తగ్గుతాయో అని రాజధాని తరలింపు ఆపాలని నానా తంటాలు పడుతున్నాడు.

 

జగన్ మాత్రం హాయిగా నవ్వుతూ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఈ రాజధాని ఉద్యమాలు అతనికి చీమ కుట్టినట్టుగా కూడా లేవేమో…ఈరోజు చిత్తూరు మీటింగులో కూడా చక్కగా నవ్వుతూ కూర్చుంన్నాడు.

 

బాబుగారు ఐదు సంవత్సరాలు కష్టపడి వేసుకున్న లెక్కలన్నీ ఒక్క దెబ్బతో చెల్లాచెదురు చేసాడు. లెక్కలన్నీ పారదర్శకంగా ఉంటె ఎవరేం చేయలేరు కానీ మన బాబుగారి లెక్కలో కావలసినన్ని బొక్కలు ఉన్నాయి. ఇంకా జగన్ మాత్రం ఏం చేస్తాడు చెప్పండి అన్నిటిని బయటికి తీయటం తప్ప. బాబుగారు చేసిన అన్ని పథకాలు మీద సమీక్షలు అవసరమైన అన్ని చోట్ల రివర్స్ టెండరింగు పద్దతి.

 

ఇన్ని చేస్తుంటే బాబుగారు మాత్రం కుదురుగా ఎలా ఉంటాడు, జగన్ ని ఆపటానికి సాధ్యమైనంత వరకు కష్టపడుతున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే జగన్ కేసులు ఎప్పుడు పూర్తి అవుతాయా..ఎప్పుడు జైలుకి వెళ్తాడా…అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

WATCH: టీడీపీ రాజేంద్రప్రసాద్ ని బండ బూతులు తిట్టిన వంశీ

వల్లభనేని వంశీ మీడియాతో జరిగిన ప్రెస్ మీట్ అనంతరం , టీవీ 9 నిర్వహించిన లైవ్ షోలో ప్రముఖ టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ ని బండ బూతులతో ఎలా నోరు మూయించాడో చూడండి…

హడావుడిగా ఏపీలో 3 జిల్లాల ఏర్పాటు కారణం ఇదే..

ఏపీలో ప్రస్తుతం ఉన్న 13జిల్లాలకు మరో మూడు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. అరకు, మచిలిపట్నం, గురజాల ప్రాంతాలను జిల్లాలుగా ప్రకటించింది.

Read More: ‘గూగుల్ పే’ కస్టమర్లకు గుడ్ న్యూస్..

గతంలోనే ఆంధ్రప్రదేశ్ లో 26జిల్లాల ప్రతిపాదన ఉన్నప్పటికీ.. ప్రస్తుతం మూడు జిల్లాలను ఏర్పాటుచేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. అయితే కృష్ణ జిల్లాలో మచిలీపట్నం కాదు, విశాఖపట్నంలో ఉన్న మచిలీపట్నం, గుంటూరులో ఉన్న గురజాల మరియు వైజాగ్ దగ్గర్లో ఉన్న అరకు అనే కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

Read More: మండలి రద్దు: కేంద్రంలో కొత్త చట్టం.. జగన్ కి షాక్!

అయితే ఏర్పాటు చేయనున్న ఈ మూడు జిల్లాలలోనే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నట్లు ఈమధ్య ప్రభుత్వం ప్రకటించింది. ఇలా ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చెయ్యాలంటే 600 కోట్ల దాకా ఖర్చవుతుంది. ఐతే బాగా వెనకబడిన జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తే వీటి ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 60 శాతాన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అంటే మూడు కాలేజీలకి కలిపి మొత్తం రూ.1800 కోట్లు అవుతుందనుకుంటే మెడికల్ కౌన్సిల్ నుండి 1080 కోట్లు వస్తాయి. ఫలితంగా ప్రభుత్వానికి అయ్యే ఖర్చు రూ.720 కోట్లే అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు. అప్పులు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఈ క్రమంలో రాయతీ పొందేందుకు ఆ మూడు ప్రాంతాల్నీ జిల్లాలుగా మార్చనున్నట్లు తెలిసింది.

Read More: రాక్షసుడిగా నాని కొత్త లుక్.. అదిరిపోయిందిగా

జగన్ జైలుకి వెళ్తే….సీఎం ఎవరు ?

 

ఒకవైపు ఆంధ్ర రాష్ట్రం మొత్తం రాజధాని సెగతో అట్టుడుకి పోతుంటే..మరోవైపు ఒక కొత్త చర్చ నడుస్తుంది, అదేంటంటే ఒకవేళ నేరం రుజువయ్యి జగన్ జైలుకి వెళ్లాల్సివస్తే తదుపరి సీఎం ఎవరు అనే చర్చ జనాల్లో విస్తృతంగా జరుగుతుంది.

 

జగన్ అక్రమ ఆస్తుల కేసు ఎప్పటినుంచో విచారణలో ఉంది. కొన్ని సంవత్సరాలుగా వాదోపవాదానలతో కేసును నెట్టుకొస్తున్నాడు. జగన్ కి వ్యక్తిగత హాజరు మినహాయింపుపై ఇప్పటికే సిబిఐ ధర్మాసనం కన్నెర్ర చేసింది. కచ్చితంగా విచారణకి వచ్చి సహకరించాల్సిందిగా ఆదేశించింది. ఎందుకో ఇంకొన్ని రోజుల్లో దీనికి ముగింపు పడుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి.

 

చట్టానికి ఎవరు చుట్టాలు కారు, అందరూ సమానమే. అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఒక సాధారణ పౌరుడైన నేరం రుజువైతే జైలుకి వెళ్లాల్సిందే. లాలూ ప్రసాద్ యాదవ్,

చిదంబరం, జయలలిత లాంటి పెద్ద వాళ్ళే వెళ్లారు. మరి అలాంటప్పుడు ఒక సీఎం హోదాలో ఉన్న జగన్ కి ఇది తేరుకోలేని దెబ్బె. పది సంవత్సరాలు శ్రమించి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి, కనీసం పట్టుమని పది నెలలుకూడా కాకముందే జైలుకి వెళ్లాల్సివస్తే ఇంకేమైనా ఉందా… సరే కాలం కలిసిరాక వెళ్తే… మరి అప్పుడు పార్టీని బలంగా నిలబెట్టేది ఎవరు..? ఎవరిని నమ్మి పార్టీ బాధ్యతని అప్పగించాలి..?

 

అందరిలో ఉన్న పెద్ద ప్రశ్న సీఎం స్థానాన్ని ఇంట్లో వాళ్ళకి ఇస్తాడా లేక పార్టీలో పెద్దలైన వారికి ఇస్తాడా అని. ఇంట్లో వాళ్ళకే ఇచ్చే ఉదేశ్యం ఉంటె విజయమ్మకే ఇవ్వాలి, అప్పుడే పార్టీలో ఎలాంటి కుమ్ములాటలు రాకుండా ఉంటాయి.

 

ఒకవేళ ఆ సమయం వచ్చేసరికి ఎవరైనా పెద్ద తలకాయకి సీఎం కుర్చీ మీద మోజుపుడితే మాత్రం అది అంతర్గత కుమ్ములాటలకి దారితీస్తుంది. 151 సీట్లతో బలంగా ఉన్న పార్టీ వర్గాల వారీగా విడిపోతుంది. అధికారంలో ఉన్న పార్టీకి సరైన నాయకుడు లేకపోతే అ పార్టీ విచ్చిన్నం అయిపోతుంది.

 

పార్టీని బలంగా నిలబెట్టాలంటే జగన్ తీసుకునే నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకొని పార్టీని నిలబెడతాడో వేచిచూడాలి. ఏమి చేసినా సరే క్యాడర్ కి నమ్మకం పోకుండా ఉండాలి, అప్పుడే పార్టీ అనేది కూలి పోకుండా ఉంటుంది.

కొత్త మలుపు తిరిగిన వైఎస్‌ వివేకానంద హత్య కేసు

వైఎస్‌ వివేకానంద హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ వివేక కుమార్తె హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు కొత్తగా నాలుగో పిటిషన్‌ వైఎస్‌ వివేకా కుమార్తె సునీతమ్మ దాఖలు చేశారు. అయితే అన్ని పిటిషన్లను ధర్మాసనం ఇవాళ విచారించనుంది.

Read More: ఏపీలో 3 జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం

జనసేన-బీజేపీ:తాటి చెట్టు క్రింద మజ్జిగ తాగుతున్న పవన్..!?

<p>పూర్వ కాలంలో ఒక నానుడి ఉండేది.. “మల్లన్నా.. మల్లన్నా.. నువ్వు తాటి చెట్టు క్రింద కూర్చొని కల్లు తాగుతున్నావా..? అని అడిగితే.. లేదురా.. ఎల్లన్న, “నేను చల్ల తాగుతున్నా..” అన్నాడట. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. పక్కా.. హిందూ భావజాలం ఉన్న బీజేపీ తో పొత్తు పెట్టుకొని, ” మా పార్టీలో మత ప్రస్తావన లేదు అంటే ఎలా నమ్మాలి..? అసల విషయం ఏమిటంటే.. మతాలకు భిన్నంగా, కులాలకు అతీతంగా, అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తూ.. అన్ని సంప్రదాయాలను గౌరవిస్తూ.. అవినీతి రహిత రాజకీయాలను ప్రజలకు చూపించాలని, ఎన్నో ఆశలతో, ఆశయాలతో, సరికొత్త విధి విధానాలతో బలమైన సంకల్పంతో మర్చి 14, 2014లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “జనసేన” అనే పార్టీని స్థాపించిన విషయం అందరికి తెలిసిందే.. అనేక ఆటుపోట్లను ఎదురుకొని ఇప్పటి వరకు పార్టీని నడిపించారు. కానీ ఈ మధ్య కాలంలో పవన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ పార్టీని ఒక మతానికి దగ్గర చేసినట్లుగా తెలుస్తుంది. ఒక మతానికి ఆ పార్టీని ఆపాదించడం అనేది రాత్రికి రాత్రే జరిగిన తంతు కాదు. ఒక్కసారి గతంలోకి వెళ్తే.. పూర్తి వివరాలు బయటకు వస్తాయి.</p>

<p>Read More: <a href=”https://oktelugu.com/telugu-news/janasena-bjp-alliance-apkutami-upayogalu-uses-to-bjp-pawan-33356/” style=”font-size:18px; font-weight:bold; color:blue;”>పవన్ కి అండ బీజేపీ – బీజేపీకి దండ పవన్</a></p>

<p>2019 నవంబర్ లో హిందూ పుణ్య క్షేత్రాల్లో అన్య మత ప్రచారం పెరుగుతున్న తీరును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. విజయవాడ పుష్కర ఘాట్‌లో సామూహికంగా బాప్టిజమ్ ఇవ్వడాన్ని తప్పుబడుతూ జనసేన ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఈ విషయంపై ఆ సమయంలో తెలుగు రాష్ట్రాలలో పెద్ద దుమారమే రేగింది. అనేకమంది క్రైస్తవులు, పవన్ తీరును ఖండించారు. అదే సమయంలో పార్టీ స్థాపనకు సహకరించిన వారు, పవన్ తో చాలా సన్నిహితంగా ఉన్న ( ఆలివర్ రాయ్, రాజురవితేజ్ వంటి) కొంతమంది జనసేన అభ్యర్థులు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోవడం జరిగింది. ఈ సంఘటనలతో “జనసేన పార్టీ, క్రైస్తవులకు విరుద్ధం” అనే ముద్రవేశారు. </p>

<p>Read More: <a href=”https://oktelugu.com/telugu-news/janasena-political-journey-pawan-rajakiya-prasthanam-route-of-jsp-bjp-33314/” style=”font-size:18px; font-weight:bold; color:blue;”>జనసేనాని రాజకీయ ప్రస్థానంపై విశ్లేషణ</a></p>

<p>అలాగే ఈ మధ్య కాలంలో జనసేన విడుదల చేసే కొన్ని అధికారిక పోస్టులకు “జై జగన్మాత” అనడం కూడా జరుగుతుంది. దీనికి తోడు బీజేపీతో పొత్తుపెట్టుకోవడం కూడా జరిగింది. ఈ పోత్తు వల్ల దేశంలో ఎక్కువ శాతం వ్యతిరేకించే.. సిఏఏ, ఎన్ఆర్సి వంటి బిల్లులకు మద్దతు ప్రకటించడం, ఆ విషయంపై బహిరంగంగా మాట్లాడటం జరుగుతుంది. తత్ఫలితంగా.. “జనసేన పార్టీ, ముస్లిములకు వ్యతిరేకం” అనే ముద్రవేశారు.</p>

<p>పైన తెలిపిన కారణాల వల్ల, క్రైస్తవుల, ముస్లింల మనోభావాలను దెబ్బ తీసే విధంగా పవన్ ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తుంది. అటు క్రైస్తవులకు, ఇటు ముస్లింలకు జనసేన విరుద్ధమో.. కాదో అనేది అప్రస్తుతం. కానీ, ఆ పార్టీ హిందూ సిద్ధాంత పార్టీ అనే ముద్రను వేసుకోవాల్సి వచ్చింది.</p>

<p><strong>ఇది కూడా చదవండి: </strong><a href=”https://oktelugu.com/telugu-news/jsp-bjp-janasena-bjp-pawan-modi-amith-shah-2024-elections-33310/”>అమిత్ షా ఆఫర్.. పట్టుకున్న పవన్
</a></p>

ఆంధ్రా అంతా…జగన్నాటకం!

 

జగన్ తీసుకున్న సంచలమైన నిర్ణయం అమరావతి ప్రాంతాన్ని కుదిపివేస్తుంది. పైన ఉన్న జగన్ బాగానే ఉన్నారు కానీ కింద ఉన్న నాయకులకు మాత్రం ఇది పెద్ద సమస్యగా మారింది. వారికి అడుగడుగునా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఈరోజు మాచర్ల ఎమ్మల్యే రామకృష్ణ రెడ్డిని నడి రోడ్డుపై ఆపి అతని సెక్యూరిటీని కొట్టారు. అంతటితో ఆగకుండా ఎమ్మల్యేకి హాని చేసే క్రమంలో కారును ధ్వంసం చేసారు. అయన పోలీసుల సహాయంతో అక్కడనుండి పరారయ్యారు.

 

ఎమ్మెల్యేని కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందని ఒక్కసారి అన్వేషిస్తే మనకి కొన్ని నిజాలు కళ్ళముందే కనిపిస్తాయి. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేసినప్పటినుంచి రాష్టం మొత్తం అయోమయంలో పడింది. రాజధాని ఎక్కడ వస్తుందని ఎవరికీ స్పష్టమైన అవగాహన లేదు. నిజం చెప్పాలంటే కొందరు వైసిపి నాయకులకే దీని మీద సరైన సమాచారం లేదు.

 

జిఎన్ రావు కమిటీ ఇంకా బీసీజీ కమిటీ మూడు రాజధానులకే మొగ్గు చూపిన, అసలైన హై పవర్ కమిటీ ఏమి తెలుస్తుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. హై పవర్ కమిటీ కూడా మూడు రాజధానులవైపే మొగ్గు చూపిన ఆశ్ఛర్యపోవాల్సిన పనిలేదు. జగన్ మదిలో ఒకటనుకుంటే కచ్చితంగా సాధించే తీరతాడు. విపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా జగన్ నిర్ణయాన్ని మార్చటం ఎవరితరం కాదు. ఒక్క మాట ఇచ్చాడంటే దాని కోసం ఎంత దూరమైన వెళ్తాడు.

 

మరి అంత గట్టిగ రాజధాని మార్చాలనుకున్నప్పడు ఒక స్పష్టత ఇవ్వటానికి ఎందుకు జంకుతున్నాడో…ఎవరికీ అర్థంకాని పరిస్థితి. అమరావతి ప్రాంతంమొత్తం ప్రభుత్వ వ్యతిరేక నినాదంతో అట్టుడుకుతుంటే, ఎందుకు నాయకులూ ఎవరు స్పష్టమైన ప్రకటన చేయట్లేదో అంతుచిక్కని మర్మం.

 

అటు విశాఖపట్నం వాళ్ళకి కర్నూలు వాళ్ళకి కూడ తెరెవెనుక ఏదో పెద్ద నాటకం నడుస్తుందనే అనుమానం ఉంది. రాష్ట్రంలో ఏ ప్రాంతం వారికి సరైన సమాధానం లేనపుడు లోలోపల చాల భయాంధోళనలు వెల్లువెత్తుతాయి. చాలామందికి వైసీపీ వాళ్ళు భూముల వేటలో ఉన్నారనే అనుమానం కూడ ఉంది. అమరావతిలో భూములన్ని అమ్ముడుపోయాయి గనుక కొత్త ప్రాంతంలో భూములని వాళ్ళ పేరు కింద సమకూర్చుకునే పనిలో ఉన్నారనే అనుమానం ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా లాభం లేనిదీ పైసా పని కూడా చేయరుకదా…!

 

మరి ఇన్ని ఆలోచనల మధ్య ప్రజలు అనుకునే ఒకేఒక్క మాట….. “అంతా జగన్నాటకం”.