
రాష్ట్రంలో ఎన్పిఆర్ను అమలు చేయబోమని కడప సభలో సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించినా ఆచరణలో అధికారులు మాత్రం దాన్ని అమల్లోకి తెచ్చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారికంగా మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా ఎన్పిఆర్ వివరాల నమోదు పూర్తి చేశారు. ఇదంతా రాష్ట్రంలో ఎన్పిఆర్ జరగదని సిఎం సహా మంత్రులు, ప్రభుత్వ సలహాదారులందరూ ప్రకటి స్తున్న సమయంలోనే అమలు చేయడం విశేషం.
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు తాము ఎన్పిఆర్ను అమలు చేయబోమని చెప్పిన సమయంలోనే మరోవైపు దానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగిపోయాయి. అధికారులు, సిబ్బంది విధులు ఏమిటి?, ఎలా చేయాలనే అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. అధికారికంగా విధివిధానాలపై చర్చించారు.
దీనిలో భాగంగా పలు కీలక ప్రశ్నలు వేయనున్నారు. ఆన్లైన్ పద్దతిలో ఈ సర్వే జరగనుంది. దీనికోసం సాధారణ పరిపాలన శాఖ నోడల్ ఏజన్సీగా వ్యవహరించనుంది. ఈ సర్వేలో ముఖ్యంగా ప్రజల జీవన విధానంతోపాటు వారి ఆహార అలవాట్లపైనా వివరాలు నమోదు చేయనున్నారు. మొత్తం 34 ప్రశ్నల్లో మీ ఆహార అలవాట్లు ఏమిటి? అనేది కూడా కీలకమైన ప్రశ్నగా పొందుపరిచారు.
ముఖ్యంగా కులం, మతం, వారెక్కడ నుండి
వలసొచ్చారు అనే అంశాలు ప్రశ్నోత్తరాల్లో ప్రధానంగా ఉన్నాయి. ఎన్ఆర్సికి సంబంధించిన ప్రక్రియ మొత్తం ఉపాధ్యాయులు చేపట్టనున్నారు. తొలుత ఇంటి యజమానికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకుంటారు. వ్యక్తిగత ఆస్తులు, వాహనాల వివివరాలకు ఒక ప్రశ్నాపత్రం ఇవ్వనున్నారు.
ఇంట్లో మౌలిక సదుపాయాల గురించి మరో ప్రశ్నాపత్రం ఈ రెండిటికీ కలిపి 34 ప్రశ్నలు ఉండనున్నాయి. వీటిల్లో ముఖ్యంగా ఆహారం ఏమి తింటారు, ఇంట్లో గదులెన్ని, సొంత ఇళ్లా, అద్దె ఇళ్లా, ఆస్తులు, మతం, ఎస్సి, ఎస్టి, భాష, సాహిత్యం, విద్య, ఆర్థిక కార్యకలాపాలు ఏమిటి, వలసలు, సాంతన సాఫల్యత తదితర అంశాలన్నీ ఉండనున్నాయి. వీటితోపాటు వారసత్వ వివరాలనూ వెల్లడించాల్సి ఉంటుంది.
జాతీయ జనాభా పట్టికను ఏడాది కాలంలోనే పూర్తి చేయనున్నారు. ఎన్పిఆర్ విషయంలో ఎటువంటి లోపాలూ లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అలాగే మానసికంగా ధృడత్వంగానూ ఉండేలా ఎన్యూమరేటర్లకు తగు శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు.
జనగణన, ఎన్పిఆర్కు సంబంధించిన వివరాలను తీసుకునేందుకు ఆరు భాషల్లో పత్రాలు రూపొందించినట్లు సెన్సస్ డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. దీనికోసం పట్టణాలను బ్లాకులుగా నిర్ణయించారు.







తెలుగు సినీ పరిశ్రమకు శ్రీమంతుడు, జనత గ్యారేజ్, రంగస్థలం వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్. ఈ నిర్మాణ సంస్థ అధినేతలు నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి మరియు మోహన్ చెరుకూరి 




మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. చిరంజీవి 152వ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘గోవింద ఆచార్య’, లేదా ‘ఆచార్య’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తారని ప్రచారం జరుగుతుంది. చిరంజీవి-మహేష్ బాబుల మధ్య ఎంతో సన్నిహిత్యం ఉంది. అంతేకాకుండా కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ ‘భరత్ అనే నేను’లో నటించి బాక్సాఫీస్ అందుకున్నాడు. దీంతో ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాలని దర్శకుడు కోరగా మహేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి-మహేష్ బాబు మధ్య కొన్ని సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది.


విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఫైటర్’. పూరి జగన్మాథ్ దర్మకత్వంలో విజయ్ దేవరకొండ తొలిసారి నటిస్తున్నాడు. ‘ఫైటర్’ మూవీలో విజయ్ సరసన నటించిన హీరోయిన్ల విషయంలో చాలా పేర్లు విన్పించాయి. ముఖ్యంగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించనున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా చిత్రబృందం హీరోయిన్ పేరు ఖారారు చేసింది. ‘ఫైటర్’ మూలో విజయ్ దేవరకొండకు జోడిగా బాలీవుడ్ భామ అనన్యా పాండే నటించనుంది. ఈ మేరకు విజయ్ దేవరకొండ, పూరి జగన్మాథ్, చార్మి, అనన్యా పాండే షూటింగ్లో పాల్గొన్న ఫొటోను చిత్రబృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది.











టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవలే ‘అల.. వైకుంఠపురములో’ మూవీతో బాక్సాఫీసు రికార్డులు సృష్టించాడు. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లలో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. మహేష్ బాబు నటించిన ‘సరిలేరునికెవ్వరు’, రజనీకాంత్ ‘దర్బార్’లను తట్టుకొని పాజిటివ్ దక్కించుకుంది. తెలుగు, మళయాళంతోపాటు యూకేలోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది. తెలుగులో నాన్ బహుబలి రికార్డు దక్కించుకుంది. దీంతో ఈ మూవీని బాలీవుడ్లో తీసేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఈ మూవీని బాలీవుడ్లోనూ త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.