Home Blog Page 8578

రూ.2 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజి కోరిన పరిశ్రమలు

కరోనా వైరస్‌ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను, పారిశ్రామికరంగాన్ని ఆదుకొనేందుకు పన్నులను, వడ్డీరేట్లను తగ్గించడంతోపాటు రూ.2 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కరోనా వైరస్‌ వల్ల తలెత్తిన మందగమనం, సరఫరాల వ్యవస్థలో తలెత్తిన సమస్యలతో వ్యాపారాలకు భారీ విఘాతం కలిగిందని, రియల్‌ ఎస్టేట్‌, పౌరవిమానయానం, పర్యాటకం, ఆతిథ్యం లాంటి రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ పేర్కొన్నారు.

ఈ విపత్కర పరిస్థితి నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు జీడీపీలో 1 శాతం (రూ.2 లక్షల కోట్ల) మొత్తాన్ని ఆధార్‌ ఆధారిత ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం ద్వారా ఆర్థిక ఉద్దీపనల రూపంలో అందజేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో సీఐఐ విజ్ఞప్తి చేసింది. దేశంలోని ప్రతి పౌరునికి రూ.5 వేలు, ప్రత్యేకించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు రూ.10 వేల చొప్పున ఈ ఉద్దీపనలను అందజేయాలని సూచించింది.

‘ప్రజల్లో ఆర్థిక భయాలను తొలిగించాలన్న లక్ష్యంతో మేము ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం ద్వారా ప్రజలకు డబ్బు అందజేయగలిగితే నిజంగా వారికి ఎంతో మేలుచేసినట్టే. ముఖ్యంగా దీనివల్ల సమాజంలోని అట్టడుగు వర్గాలవారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది’ అని బెనర్జీ తెలిపారు. దీర్ఘకాలిక మూలధన లాభాలపై వసూలు చేస్తున్న 10 శాతం పన్నును తొలిగించడంతోపాటు మొత్తం డివిడెండ్‌ పన్నును 25 శాతంగా ఖరారుచేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ప్రధానికి రాసిన లేఖలో సీఐఐ కోరింది.

ఇలా ఉండగా, కరోనా కాటుతో కుదేలైన వివిధ రంగాలను ఆదుకొనేందుకు సాధ్యమైనంత త్వరలో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. కరోనా వైరస్‌ వ్యాప్తితో దేశంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించేందుకు ఆమె నాలుగు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. నాలుగు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పౌరవిమానయాన, పశుసంవర్ధక, పర్యాటక, ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల) శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ భేటీలో వివిధ అంశాలపై చర్చించామని, ఆయా శాఖల నుంచి తమకు వచ్చిన సూచనలను క్రోడీకరిస్తున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఆర్థికశాఖ శనివారం అంతర్గత సమావేశాన్ని నిర్వహించనున్నదని ఆమె చెప్పారు.

ఆర్థిక ప్యాకేజీని ఎప్పుడు ప్రకటిస్తారని విలేకర్లు ప్రశ్నించగా.. దీనికి గడువును నిర్దేశించడం కష్టమని, సాధ్యమైనంత త్వరలో ప్యాకేజీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఇంకా ఏర్పాటుచేయలేదని, దీన్ని అత్యవసరంగా ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొనే తాము సమావేశాన్ని నిర్వహించామని చెప్పారు.

గెలిచి ఓడిన బిజెపి

మధ్య ప్రదేశ్ రాజకీయాలు ఇంకో కర్ణాటకని గుర్తుకుతెచ్చాయి. ఈ చదరంగంలో కాంగ్రెస్ ఓడి బీజేపీ గెలిచింది. రేపోమాపో తిరిగి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి కావటం ఖాయం. ఈ సారి ఇందుకు ప్రధాన కారణం జ్యోతిరాదిత్య సింధియా. తిరిగి మధ్యప్రదేశ్ లో అధికారాన్ని దొడ్డిదారిన చేజిక్కించుకోవటానికి ఒక రాజ్య సభ సీటు, కేంద్రం లో మంత్రి పదవి ఇవ్వటానికి ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చటంతో బీజేపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవటం మనం చూస్తున్నాము. వరసగా మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీ ప్రభుత్వాలు పరుల పాలుకావటంతో డీలా పడిన శ్రేణులకు ఇది ఓ టానిక్కే . అంతవరకూ అధికారపు ఆటలో విజయంగానే చూడాలి. కాకపోతే మొదట్నుంచీ ఇటువంటి కాంగ్రెస్ రాజకీయాలను వ్యతిరేకించి మోడీకి మద్దతిచ్చిన వారిలో ఈ రాజకీయ క్రీడపై అంత ఉత్సాహం లేనిమాట నిజం.

రాజకీయాల్లో రాను రాను పార్టీలమధ్య అంతరాలు తగ్గిపోతున్నాయి. జాతీయవాదం పేరుతోనో , బూటకపు సెక్యూలరిజానికి వ్యతిరేకతపేరుతోనో అధికారదాహ రాజకీయాలను సమర్ధించుకోవటం ప్రజాస్వామ్యవాదానికి చేటుచేస్తుందని మర్చిపోవద్దు. నిజమే భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వాన కాశ్మీర్ విషయం లో,దేశ రక్షణ విషయం లో అలాగే గుర్తింపు రాజకీయాల పేరుతో ఇన్నాళ్లు జరుగుతున్న ఓటు బ్యాంకు రాజకీయాల్ని విడనాడి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవటం లో కాంగ్రెస్ కి భిన్నంగా పనిచేస్తుంది. దానితోపాటు దేశ ఆర్ధికవిధానాల్లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని ఆర్ధికవ్యవస్థ బలోపేతానికి కృషిచేసినమాట కూడా ఎవరూ కాదనలేరు. అంతమాత్రాన అధికార రాజకీయాల్లో విలువలకు తిలోదకాలివ్వటం చాలా నిరాశ కలిగిస్తుంది. అధికారదాహ  రాజకీయాల్లో కాంగ్రెస్ కి బీజేపీ కి తేడా లేదనే భావన ప్రజల్లో రావటం కూడా చూస్తున్నాము. గుజరాత్ లో ఒక రాజ్యసభ సీటు కోసం బెంగళూరు లో క్యాంపు రాజకీయాలు నడపటం దగ్గర్నుంచి కర్ణాటక పవర్ పాలిటిక్స్ వ్యవహారం దాకా బీజేపీ కూడా కాంగ్రెస్ కి ఏమాత్రం తీసిపోని రాజకీయాలే నడిపింది. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో కూడా అదే జరిగింది. మహారాష్ట్ర లో శివసేన చేసింది అవకాశవాదమని చెప్పేనైతిక హక్కు బీజేపీ కోల్పోయింది. పవర్ పాలిటిక్స్ అన్ని పార్టీలు ఒకటే ననే భావం ప్రజల్లో నెలకొంది. ఎందుకంటే ప్రజలు ఇప్పటికీ దేశరాజకీయాల్నీ సునిశితంగా పరిశీలిస్తున్నారని మరిచిపోవద్దు. లేకపోతే లోక్ సభ కు ఒకలాగా అసెంబ్లీ కి ఇంకో లాగా ఓట్లు వేయరు.

మోడీ-అమిత్ షా ద్వయం బీజేపీ ని అధికారం లోకి తీసుకొచ్చినమాట నిజం. ముఖ్యంగా 2014 లో ప్రజలు కాంగ్రెస్ అవినీతి పరిపాలనతో విసిగిపోయి మోడీ అధికారం లోకి రావాలని కోరుకున్నారు. 2019 లో జాతీయవాదం, దేశ రక్షణ ప్రధాన అంశాలుగా ముందుకొచ్చిన నేపథ్యంలో మోడీ కి తిరిగి పట్టం గట్టారు. ఇప్పటికీ మోడీ అంటే అభిమానం ప్రజల్లో వుంది. ఆ స్థాయిలో వున్న రాజకీయ నాయకుల్లో స్వంతానికి ఎంతోకొంత జేబులోవేసుకునే వాళ్ళే ఎక్కువ. సోనియా గాంధీ పరివారం అందుకు ఉదాహరణ. కానీ మోడీ నిజాయితీపరుడని ఈరోజుకీ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. కానీ ఈ అధికార రాజకీయ క్రీడలు చూస్తుంటే అవినీతి రాజకీయాలకి బీజేపీ కూడా అతీతమేమీ కాదని అర్ధమవుతుంది. కాకపోతే కాంగ్రెస్ అధినాయకత్వం లాగా మోడీ వ్యక్తిగతంగా అవినీతి మరకలు లేవు కానీ అధికారదాహ  రాజకీయాలకోసం అవినీతి రాజకీయాలు మాత్రం చేస్తున్నారనేది కళ్ళకు కనబడుతుంది. అంటే అధికారం కోసం ఎక్కడిదాకైనా వెళ్లటాన్ని ఏమనాలి? దీర్ఘకాలంలో ఇది ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుంది. మోడీ-అమిత్ షా ఈ అధికార రాజకీయ క్రీడని ఆపకపోతే ఇవ్వాళ వున్న గుడ్ విల్ రేపు బేడ్ విల్ గా మారుతుందని మరిచిపోవద్దు. ఇప్పటివరకు మోడీ-అమిత్ షా బాలన్సుషీట్ లో ప్లస్ పాయింట్లు ఎక్కువగా వున్నాయి కాబట్టి గుడ్ విల్ వుంది. కాలం గడిచేకొద్దీ పవర్ పాలిటిక్స్ డామినేట్ చేస్తే బాలన్సుషీట్ తారుమారవటం ఖాయం. ఇలా మాట్లాడుతున్నందుకు బీజేపీ శ్రేణులకు ఇబ్బందిగా వున్నా రెండో వైపు అభిప్రాయాన్ని వినటం అలవాటుచేసుకుంటే ప్రజల గుండెచప్పుడు అర్ధమవుతుంది. వచ్చే నాలుగు సంవత్సరాల్లో బీజేపీ మరో కాంగ్రెస్ పార్టీ కాకుండావుండాలంటే విలువలకు ప్రాధాన్యమిచ్చే రాజకీయాల్ని చేయాలి. అప్పుడే నిజమైన ప్రజా పార్టీగా మనుగడసాగిస్తుంది. ప్రజాస్వామ్య పరిరక్షణలో బీజేపీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ….. సెలవు.

ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫిరెన్సు

దేశానికి కరోనా వైరస్‌ తాకిడి పెరగడం తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కారోన రక్కసికి సంబంధించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫిరెన్సు లో మోడీ పలు సూచనలు సలహాలు ఇవ్వనున్నారు.

భారతదేశంలో కరోనా వైరస్ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే వైరస్ సోకిన వారి సంఖ్య 200 దాటింది, వారిలో ఐదుగురు మరణించారు.

దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన పిఎం మోడీ మార్చి 22 న ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు బహిరంగ కర్ఫ్యూ విధించాలని దేశవాసులకు విజ్ఞప్తి చేశారు.

టెక్నాలజీతో కారోనాకి చెక్!

కరోనా వైరస్ ని నియంత్రించడాని వీలున్న ప్రతి మార్గాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వదలడం లేదు. కారోన కట్టడికి అవసరమైన అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిపై దేశ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం కోసం తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక వాట్సాప్‌ హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. ‘MyGov Corona help desk’ పేరుతో ఏర్పాటైన ఈ వాట్సాప్‌ హెల్ప్‌ డెస్క్‌ ద్వారా ప్రజలు కారోన వైరస్‌ కు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా తెలుసుకోవచ్చు. ప్రస్తుత వాట్సాప్‌ యూజర్లు అందరికీ ఈ హెల్ప్‌ డెస్క్‌ అందుబాటులో ఉండనుంది.

ఈ హెల్ప్‌ డెస్క్‌ సేవలు వినియోగించుకోవాలనుకునే వారు 9013151515 నెంబర్‌ను తమ ఫోన్లలో కాంటాక్ట్స్‌ లిస్టులో ఫీడ్‌ చేసుకుని, దాన్నుంచి ‘MyGov Corona help desk’ కు మెసేజ్‌ పంపించాలి. కరోనా వైరస్‌ కు సంబంధించి వదంతులు, తప్పుడు వార్తలు ప్రచురితమైనప్పుడు, అబద్ధపు పుకార్లు ప్రచారమైనప్పుడు ప్రజలు నిజానిజాలు తెలుసుకోవడానికి ఈ హెల్ప్‌ డెస్క్‌ ఉపయోగపడనుంది. వైరస్‌ విస్తరణపై ప్రజలను అలర్ట్‌ చేయడంలో, ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను తెలియజేయడంలో కూడా ఈ డెస్క్‌ కీలకపాత్ర పోషించనుంది.

Zaara Yesmin Hot Photos

Amala Paul 2nd Marriage Photos

Esha Gupta Latest Hot Pics

మార్చ్ 31 దాకా టాలీవుడ్ బంద్

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా వైరస్ విపత్తు అరికట్టే క్రమం లో తెలంగాణ ప్రభుత్వం మార్చ్ 31 వరకు థియేటర్ల మూసివేతకు తీసుకొన్న నిర్ణయానికి సంసిద్ధత ని వ్యక్తం చేస్తూ మార్చ్ 15 వ తారీఖున హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లోఉన్న ఫిలిం ఛాంబర్ లో టి ఎఫ్ సి సి సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశం లో మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ) , నిర్మాతల మండలి మరియు సినీ రంగం లోని ఉద్యోగుల సమాఖ్య యొక్క 24 శాఖల ప్రతినిధులు కలిసి మార్చ్ 21 వ తారీకు వరకు తమ తమ షూటింగ్ లను నిలిపి వేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది .

కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా టి ఎఫ్ సి సి మరియు నిర్మాతల మండలి ఈ షూటింగ్ నిలిపివేత కార్యక్రమము ఈ నెల 31 వ తారీకు వరకు పొడిగించాల్సిన అవసరం గుర్తించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది . తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాల సలహా మేరకు రెండు రాష్ట్రాల లోని అన్ని సినిమా థియేటర్ లు కూడా మార్చ్ నెలాఖరు వరకు నిరవధికంగా మూసివేయడం జరుగుతుంది . ఇక తదనంతర పరిణామాలను రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు తీసుకోవడం జరుగుతుంది ఆ విషయాలన్నీ ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుందని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ తాజాగా విధుల చేసిన తన ప్రకటనలో పేర్కొంది .

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సీఎం గుర్రు

స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం ద్వారా గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అవి వాయిదా పడటంతో ఆయన తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఎన్నికల కోసం క్షేత్ర స్థాయిలో ప్రణాళికలు రచించింది. అందులో భాగంగానే ఎన్నికల్లో విజయం సాధించని నియోజకవర్గాల మంత్రులు వెంటనే రాజీనామాలు చేయాల్సి ఉంటుందని సీఎం హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యేలకు అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. అధిష్టానం అలాంటి నిర్ణయం ప్రకటించడంతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. యథేచ్ఛగా హింసకు తెర తీశారు. ఎక్కడికక్కడ అరాచకాలు సృష్టించడంతో జెడ్పీటీసీలు 652 స్థానాల్లో 126, 9, 696 ఎంపీటీసీల్లో 2, 362 స్థానాల్లో ఏకగ్రీవం చేయగలిగారు. ఒక్క కడప జిల్లానే తీసుకుంటే 50 జెడ్పీటీసీల్లో 38, 553 ఎంపీటీసీల్లో 439 స్థానాలు ఏకగ్రీవం కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల్లో ఓటింగ్ జరగక ముందే ఇన్ని స్థానాలను ఏకగ్రీవం చేసుకోవడంతో పాటు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో సిద్ధంగా ఉన్న వైసీపీకి ఎన్నికలు ఆరు వారాలు వాయిదా పడటం ఇబ్బంది కరంగా మారింది. అధికారం చేపట్టిన పది నెలల్లో ఎన్నో సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నా ఏనాడూ ప్రెస్ మీట్ పెట్టని ముఖ్యమంత్రి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన వెంటనే నిర్వహించడం విశేషం.

ఎన్నికల వాయిదాకు ప్రతిపక్షాల మద్దతు:

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి జరుగుతున్న హింసాత్మక సంఘటనలు, ప్రభుత్వం, పోలీసుల పక్షపాత వైఖరులను ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంతో పాటు ఇతర పార్టీలు బీజేపీ, జనసేన, సీపీఐ ఖండిస్తూ వస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఈ ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్ళాయి. ప్రజల ప్రాణాల కన్నా ఎన్నికలు ముఖ్యం కాదనేది ఈ పార్టీల వాదనగా ఉంది. మరోవైపు ఇళ్ల పట్టాల పంపిణీ, కొత్త రేషన్ కార్డుల జారీ పేరుతో ప్రజల్లో ఆశలు కల్పించి ఎన్నికల్లో ఓట్లు పోగేసుకోవాలనుకుంటున్న వైసీపీకి వాయిదా పడటం సుతరామూ ఇష్టం లేదు.

తప్పులను కప్పి పుచ్చుకునేందుకే:

మూడు రాజధానులు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన వంటి అంశాలపై ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా, ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా.. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు సమర్థిస్తున్నారని చెప్పుకోవాలని వైసీపీ వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానుల ప్రతిపాదన చేయడానికి ప్రధాన కారణం టీడీపీని దెబ్బ తీయడానికేనన్న విషయం అందరికీ తెలిసిందే. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రజలు అంగీకరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని గెలిపించారన్న వాదనను తెరపైకి తీసుకురావాలని ఆ పార్టీ భావించింది. టీడీపీకి పట్టున్న అన్ని పంచాయతీల్లో ఎన్నికలు నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం అదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి, జక్కంపూడి పంచాయతీ, తదితర ప్రాంతాలకు అసలు ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల చేయలేదు. దీని వెనుక అసలు ఆలోచన అదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

టీడీపీకి వలసలతో ఎదురుగాలి..

రాష్ట్రంలో టిడిపికి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైసిపి అధికారం చేపట్టిన నాటి నుంచి టీడీపీ సీనియర్ నాయకులు ఒక్కొక్కరిగా ఆ పార్టీని విడిచి వెళ్లిపోవడంతో అధినేత చంద్రబాబు నాయుడులో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. బాబు ఒక నాయకుడు వెళితే వంద మంది నాయకులు తయారు చేస్తానని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందే కొందరు టిడిపి నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకోగా, ఎన్నికల అనంతరం వైసీపీ అధికారంలోకి రావడంతో జంపు జిలానీల సంఖ్య మరింత పెరిగింది. వైసీపీ ప్రభుత్వం టిడిపి నేతలపై పెడుతున్న కేసులు, ఇతర వేధింపుల కారణంగా టిడిపి సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరికొందరు నాయకులు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని చూసిన టిడిపిలోని ఇతర నాయకులు ఇబ్బందులను తెచ్చుకోవడం ఎందుకని వైసీపీ నేతలతో ముందే మంతనాలు జరిపి ఆ పార్టీలో చేరుతున్నారు.

ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, శమంతకమణి, కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ టిడిపి కన్వీనర్ సతీష్ రెడ్డి తదితరులు గత కొద్ది రోజుల్లో టిడిపిని విడిచి వైసిపి తీర్థం పుచ్చుకున్న వారిలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ని బలహీనపరచడం మే లక్ష్యంగా పెట్టుకున్న వైసిపి ఈ వలసలను  ప్రోత్సహిస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడివాడ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన దేవినేని అవినాష్ పార్టీలో చేర్చుకుని విజయవాడ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించడం ఇందుకు నిదర్శనం. అదేవిధంగా గన్నవరం టిడిపి ఎమ్మెల్యే గా ఉన్న వల్లభనేని వంశీని పార్టీలో చేర్చుకో వద్దని నియోజకవర్గ కన్వీనర్ వెంకట్రావు, పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేసిన అధినేత పట్టించుకోలేదు. సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు మాకు టచ్లో  ఉన్నారని ప్రకటించగా, మంత్రులు సైతం 15 మంది టిడిపి ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని బహిరంగంగా ప్రకటించారు. ఈ వలసలు అడ్డంపెట్టుకుని టీడీపీని బలహీన పరచాలని వైసిపి ప్రయత్నిస్తుండగా, టిడిపి ఆత్మరక్షణలో పడింది.

● అంతర్గత విభేదాలు ఒక కారణమే:

టీడీపీలో ఉన్న ఆ పార్టీ నాయకులు వైసీపీలో చేరటానికి అధికార పార్టీ నిర్వహిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ ఒక అంశం కాగా, టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ వైఖరి, చుట్టూ ఉన్న కోటరి కారణంగా ఉన్నాయి. గత ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి టిడిపిలోకి వలస వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి సీనియర్లను పక్కన పెట్టడం, ఎన్నో ఏళ్లుగా టిడిపి కోసం పని చేసిన తగిన గుర్తింపు ఇవ్వకపోవడం, వారి సూచనలు, సలహాలు పట్టించుకోక పోవడంతో వీరంతా అధికార పార్టీ వైపు చూస్తున్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బంది పాలు చేసినా టిడిపి పార్టీ జోక్యం చేసుకోకపోవడం తో పాటు, అధినేత, ఇతర నాయకులు ఎటువంటి మద్దతు ఇవ్వకపోవడంతో కోడెల తీవ్ర మనస్థాపానికి గురైనట్లు వాదనలు వినిపించాయి. ఈ వైఖరిని పార్టీ నేతలు కొందరు తప్పుబడుతున్నారు. గత ఐదేళ్ల పాలనలో టిడిపి ప్రభుత్వం చేసిన పొరపాట్లను సరిదిద్దుకోలేకపోవడానికి, ఎన్నికల్లో గోర పరాజయానికి చంద్రబాబు, లోకేష్ ల చుట్టూ ఉన్న కోటరీ ని కారణంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విసుగు చెందిన టిడిపి సీనియర్ నాయకులు వారిని, వారి ఆస్తులను రక్షించుకోవడం కోసం అధికార పార్టీ కి జై కొడుతూ ఆ పార్టీలో చేరుతున్నారు. ఈ వలసల కారణంగా టిడిపి తన ప్రభావాన్ని కోల్పోతుంది.

జగన్ కి దెబ్బ మీద దెబ్బ

ఏపీ స్థానిక ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లిన జగన్ సర్కార్ కి షాక్ తగిలింది. అది మారువకముందే ఇప్పుడు మరో దెబ్బ తగిలింది. కర్నూలుకు కార్యాలయాల తరలింపు ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనల్లో భాగంగా..కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా..న్యాయ విభాగం పరిధిలోకి వచ్చే శాఖలను కర్నూలును తరలించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలకు కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ జీవోల జారీ విషయంలోనూ వివాదం నెలకొని ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పూర్తి సమాచారం లేకుండానే ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక అధికారి సూచన మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగింది. ఈ జీవోల పైన హైకోర్టులో దాఖలైన పిటీషన్ల పైన ప్రభుత్వ వివరణ కోరింది. ప్రభుత్వం నుండి సమాధానం వచ్చిన తరువాత హైకోర్టు కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందినా..మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపాలని ఛైర్మన్ ఆదేశించారు. దీని పైన రాజకీయంగా వివాదం నెలకొని ఉంది. ఇప్పటి వరకు కమీటీల ఏర్పాటు సైతం జరగలేదు. దీంతో..నాలుగు నెలల సమయం తరువాత ఇక సెలెక్ట్ కమిటీకి వెళ్లాల్సిన అవసరం లేదని..సాంకేతికంగా ఆ బిల్లులు ఆమోదం పొందినట్లేనని ఏపీ ప్రభుత్వ కొత్త వాదన తెర మీదకు తెచ్చింది. అయితే, టీడీపీ మాత్రం ఈ వాదనతో విభేదిస్తోంది. ఈ పరిస్థితుల్లో కర్నూలుకు న్యాయ పరమైన విభాగాల తరలింపుకు ఇచ్చిన ఉత్తర్వుల పైన హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి.

ఆ గాయకుడు ‘పాడిందే పాట’

మగువ మగువా పాటతో మరోసారి విజయ బావుటా ఎగరేసిన గాయకుడు సిద్ శ్రీరామ్ పరిస్థితి పట్టిందల్లా బంగారం లా తయారైంది . ఈ మధ్య కాలంలో సింగర్ గా సిద్ శ్రీరామ్ పాడిన ప్రతి పాట సంచలనం గా మారుతోంది రీసెంట్ గా ఈ గాయకుడు పాడిన . ‘ఉండిపోరాదే ..’ .. ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే .. ‘ .. ‘సామజ వర గమన’ .. ‘నీలి నీలి ఆకాశం .. ‘ వంటి పాటలు ఆయన స్థాయిని ఆకాశానికి పెంచుతూ వచ్చాయి. సిద్ శ్రీరామ్ గాత్రంలో ఉన్న ప్రత్యేకత ఆయనకి యూత్ లో అభిమానుల సంఖ్యను పెంచుతూ వస్తోంది. ఆయన పాడిన పాటలు హిట్ కావడం .. అలాగే ఆయా సినిమాల్లో సక్సెస్ శాతం ఎక్కువ ఉండటం శ్రీరామ్ కి కలిసొచ్చే అంశాలుగా మారిపోయాయి.

కొత్తగా ఒక సినిమా వస్తుందంటే అందులో సిద్ శ్రీరామ్ పాడిన పాట ఒక్కటైనా ఉందా అని ఎదురు చూస్తున్నారు.శ్రోతలు .అలా కనీవినీ ఎరుగని రీతిలో తన గళానికి క్రేజ్ పెరగడంతో, సిద్ శ్రీరామ్ తన పారితోషికాన్ని పెంచడం జరిగింది . ఇపుడు సిద్ శ్రీరామ్ ఒక్కో పాటకి 5 లక్షలను తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది సాధారణంగా సింగర్స్ పారితోషికాన్ని డిమాండ్ చేసే సందర్భాలు తక్కువ. అలాంటి స్థితిలో తమకి ఇచ్చే తక్కువ మొత్తం కూడా ఇవ్వని సందర్భాలు ఉన్నాయని కొంతమంది సింగర్స్ బాధ పడటం కూడా జరిగింది. అలాంటి పరిస్థితుల్లో సిద్ శ్రీరామ్ పారితోషికాన్ని డిమాండ్ స్థాయికి వెళ్లడం నిజంగా విశేషమే.
Every body has his own day

పవన్ కళ్యాణ్ చిత్రంలో లేడీ విలన్ గా ఆ హీరోయిన్

మిలీనియం ప్రారంభం లో ‘యువకుడు’ చిత్రం తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన భూమిక చావ్లా చాలా తక్కువ టైం లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పు పొందింది.. 2001 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన “ఖుషీ ” చిత్రం లో నటించిన భూమిక చావ్లా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపొయింది ఆ తరవాత మహేష్ బాబు తో ఒక్కడు చిత్రం , వెంకటేష్ తో వాసు , జూనియర్ ఎన్ టి ఆర్ తో సింహాద్రి సినిమాల్లో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకొంది. అదే సమయంలో ‘తకిట తకిట ‘ చిత్రం తో నిర్మాతగా మారింది. తర్వాత వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరమైంది. ఈ మధ్య రీ ఎంట్రీ ఇచ్చింది. నాని హీరో గా నటించిన “ఎంసీఏ” చిత్రంలో నాని వదిన పాత్రలో నటించి మెప్పించిన భూమిక ఆ తర్వాత యు టర్న్ ,సవ్యసాచి , రూలర్ చిత్రాల్లో నటించింది. అలా అడపాదడపా పాత్రలను అందిపుచ్చుకుంటున్న భూమిక ఇప్పుడు నెగెటివ్ టచ్ ఉన్నపాత్రలో నటించనుంది.

ఈ విషయాన్ని భూమిక స్వయం గా చెప్పింది. గతంలో మిస్సమ్మ చిత్రంలో నెగటివ్ గా నటించి మెప్పించిన భూమిక ఇపుడు మరోసారి తన లోని విలనిజం చూపించబోతోంది. మిస్సమ్మ చిత్రం లో కొంత మేర విలనిజం చూపించింది, అయితే ఇప్పుడు తాను చేయబోతున్న సినిమాలో పూర్తిస్థాయి విలనిజాన్ని చూపించబోతున్నట్లు తెలిపింది. అయితే తాను ఏ సినిమాలో ఆ పాత్రను చేస్తున్నాననే సంగతి మాత్రం ఇప్పుడే చెప్పలేను అంటూ మాట దాట వేసింది .

చాలా మంది హీరోయిన్ ల మాదిరి గానే డిఫరెంట్ పాత్రలు చేయాలన్న తలంపు తో భూమిక కూడా విభిన్న పాత్రలో నటించనుంది . మరి భూమిక ఏ సినిమాలో నెగెటివ్ పాత్రలో తెలుసా;…. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వం లో రాబోతున్న పిరియాడికల్ మూవీ లో .. కాగా .ఈ చిత్రానికి ఖుషి ఫేమ్ ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తుండటం మరో విశేషం.
Changing according to times

రాజధాని తరలింపు కుదరదన్న హైకోర్టు

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కర్నూలుకు కార్యాలయాలు తరలింపుపై ప్రభుత్వానికి కోర్టు షాకిచ్చింది. కర్నూలుకు కార్యాలయాలు తరలింపు జీవోను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు ఈ జీవోను ధర్మాసనం సస్పెండ్ చేసింది.

ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. దానికి అనుగుణంగా విశాఖలో ఎగ్జిక్వూటివ్ కేపిటల్, కర్నూలులో జుడీషియల్ కేపిటల్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా జీవో 13ను ప్రభుత్వం విడుదల చేసింది.

ముఖ్యంగా కోర్టు సంబంధిత, న్యాయపరమైన అన్ని కార్యాలయాలను కర్నూలుకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్ కమిషన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ విభాగాలు జీఐడీలో భాగంగా ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. ఈ రెండు శాఖలు కూడా సెక్రెటేరియట్‌లో భాగంగా ఉన్నాయి. అయినప్పటికీ వీటిని న్యాయపరమైన విభాగాలుగా ప్రభుత్వం ముడిపెట్టి తరలించాలని నిర్ణయించింది.

ఈ నేపథ్యంలోనే ఈ శాఖలను కర్నూలుకు తరలించి అక్కడ ఆఫీస్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కొద్ది రోజుల క్రిందట అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం జీవో 13ను సీఎస్ నీలం సాహ్నీ విడుదల చేసినట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు..

అయితే ఈ జీవోలో సీఎస్ సంతకం లేకపోవడం… అదేవిధంగా ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ రాజధాని పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక్కడి నుంచి ఏ విధంగా కార్యాలయాలు తరలిస్తున్నారు? జీఐడీలో భాగంగా ఉన్న విజిలెన్స్ కమిషరేట్‌ను తరలించడానికి వీలులేదంటూ పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు.

అప్పట్లో ధర్మాసనం ఈ తీర్పును రిజర్వులో పెట్టింది. శుక్రవారం ఈ కేసుపై కోర్టు తీర్పును వెలువరించింది. జీవో 13ను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే స్థలాభావం కారణంగా అమరావతి నుంచి తరలిస్తున్నామని ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. ప్రభుత్వ వాదనలను హైకోర్టు తోసిపుచ్చినట్లు తెలుస్తోంది.

ఇక్కడ స్థలాభావం ఉంటే అమరావతికి పక్కనే కార్యాలయాలు ఏర్పాటు చేయాలి కానీ.. కర్నూలు తరలించడం వల్ల ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం కోర్టు వ్యక్తం చేసినట్లు సమాచారం.

మరో సీక్వెల్ చిత్రం రెడీ అయ్యింది

థ్రిల్లర్ చిత్రాలకు, హారర్ చిత్రాలకు సీక్వెల్ చిత్రాలు తీయడం ఎప్పటినుంచో వస్తున్నదే …2015లో వచ్చిన రాజుగారి గది చిత్రానికి 2017 లోఒకటి , 2019 లో మరొకటి సీక్వెల్ చిత్రాలు వచ్చాయి. అలాగే 2018 లో అడవి శేష్ నటించిన గూఢచారి చిత్రానికి త్వరలో సీక్వెల్ రాబోతుంది ఇక రీసెంట్ గా వచ్చిన “హిట్ ” చిత్రానికి కూడా త్వరలో సీక్వెల్ రాబోతుంది. ఆ వరుసలో నాని నటిస్తున్న చిత్రానికి కూడా సీక్వెల్ రాబోతుంది. నాని హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ :” వి” రాబోతుంది . ఈ సినిమాలో నాని గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నటించగా..సుధీర్ బాబు అతన్ని పట్టుకోవాలనుకునే ఐపీయస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. దిల్ రాజు , శిరీష్ నిర్మాతలుగా రూపొందుతున్న ఈ చిత్రం లో నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.నిజానికి ఈ సినిమాను ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా ప్రభావం కారణంగా వాయిదా పడింది.

దరిమిలా ” వి ” చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి సమాయత్తమవుతున్నారు. కాగా. విశ్వసనీయ సమాచారం మేరకు నాని, దిల్ రాజు కలిసి ” వి” సినిమాకు సీక్వెల్ ని రెడీ చేయాలనుకుంటున్నారట. ” వి ” సినిమా క్లైమాక్స్ కూడా సీక్వెల్ ఉంటుందని చెబుతూ హింట్ ఇస్తూ ఎండ్ అవుతుందట ..అయితే ప్రస్తుతం నాని బిజీ కాబట్టి “వి ” సీక్వెల్ వచ్చే ఏడాదిలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి .
Sequels are safe at box office

తెలంగాణలో 10వతరగతి పరీక్షలు వాయిదా


కారోన వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలను వాయిదా వేయనున్నట్లు అధికారులు తెలిపారు.

రేపు జరుగనున్న పరీక్ష యధావిధిగా జరుగుతుంది కానీ ఈ నెల 23 నుంచి జరిగే పరీక్షలను వాయిదా వేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలమేరకు 23 నుంచి 30వరకు జరిగే పరీక్షలను వాయిదా వేసి ఏప్రిల్ 1 నుంచి మరలా రీషెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం

సీఎం పదవికి కమల్‌నాథ్‌ రాజీనామా

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవికి కమల్‌నాథ్‌ ఎట్టకేలకు రాజీనామా చేశారు. దానితో గత నెలరోజులుగా జరుగుతున్న రాజకీయ డ్రామాకు తెరపడిన్నట్లు అయింది. గవర్నర్‌ లాల్జి టాండన్‌ను కమల్‌నాథ్‌ రాజ్‌భవన్‌లో కలిసి రాజీనామా సమర్పించారు.

శుక్రవారం సాయంత్రం నాటికి అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి.. రాజీనామాలు చేయడంతోకమల్‌నాథ్‌ సర్కార్‌ మైనార్టీలో పడిపోయిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సరిపడ బలం లేకపోవడంతో శుక్రవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ లాల్జీ టాండన్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాజీనామా చేసిన 22 మంది ఎమ్యెల్యేలలో ఆరుగురు మంత్రుల రాజీనామాలను ముందుగానే ఆమోదించిన స్పీకర్ 16 మంది రాజీనామాలను గురువారం రాత్రి ఆమోదించారు. దానితో కాంగ్రెస్ మైనారిటీలో పడింది.

కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాషాయ దళంలో చేరడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. కాగా సీఎంగా ‍ప్రమాణం చేసిన 15 నెలల్లోనే ఆయన రాజీనామా చేయడం గమనార్హం.

‘‘బెంగళూరులో ఎమ్మెల్యేలను నిర్బంధించడం వెనుక ఉన్న అసలు నిజమేంటో దేశ ప్రజలు త్వరలోనే తెలుసుకుంటారు. అసలు నిజం బయటికి వస్తుంది. ప్రజలు వాళ్లను క్షమించరు. ప్రజలు నాకు ఐదేళ్లు పరిపాలించమని అధికారం ఇస్తే.. నన్ను ఎప్పుడు దించాలా అని బీజేపీ కుట్రలు పన్నుతూ వచ్చింది..’’ అని ఆరోపించారు. గత 15 ఏళ్లుగా బీజేపీ చేయలేని అభివృద్ధిని తాను 15 నెలల్లో చేసి చూపించానని కమల్‌నాథ్ పేర్కొన్నారు.

‘‘అత్యాశపరులైన మా ఎమ్మెల్యేలతో బీజేపీ చేతులు కలిపింది. మా ఎమ్మెల్యేలను కర్ణాటకలో నిర్బంధించారు. రాష్ట్ర ప్రజలకు బీజేపీ నమ్మక ద్రోహం చేసింది. మా ప్రభుత్వ పతనం కోసం బీజేపీ ఎదురుచూసింది. మధ్యప్రదేశ్‌ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశా. రాష్ట్రానికి కొత్త రూపు ఇవ్వడానికి ప్రయత్నించాను. 15 ఏళ్లలో చేయలేని పనులను 15 నెలల్లో చేశాను..’’ అని ఆయన తెలిపారు.