
తెలంగాణలో ఆర్థిక పరిస్థితిపై కరోనా వ్యాప్తి తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో వ్యయాలు, అవసరాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనాలన్నింటిలోనూ కోత విధించాలని కేసీఆర్ నిర్ణయించారు.
మార్చి నెల నుంచే కోత వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం వేతనంపై( గ్రాస్ సాలరీ) కోత విధించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తుదపరి ఉత్తర్వులు వచ్చే వరకు కోత అమల్లో ఉంటుందని తెలిపింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సోమవారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించిన అనంతరం దీనికి ఆమోదం తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వం ముందుచూపుతో, అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కోతలుపోను మిగిలిన వేతనాలను విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.
ప్రభుత్వ ఉద్యోగుల్లో వివిధ కేటగిరీలకు చెందిన వారి జీతాల్లో నుంచి10 శాతం నుంచి 75శాతం వరకు కోత విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు
తెలంగాణలో మొత్తం 4,49,516 మంది ఉద్యోగులున్నారు. ఇందులో ప్రభుత్వ, ఒప్పంద ఉద్యోగులు 4,30,674 మంది. 2.5 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. ఉద్యోగులు, పింఛనర్లకు జీతభత్యాలు, పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.3,500 కోట్ల మేరకు వెచ్చిస్తోంది. తాజా కోత వల్ల ప్రభుత్వానికి రూ.1,700 కోట్ల మేర ఆదా అవుతాయని అంచనా వేస్తున్నారు.


ప్రస్తుతం ఉన్న కరోనా విపత్తు టైంలో తెలుగు సినీ కార్మికులను ఆదుకొనేందుకు మన టాలీవుడ్ అగ్ర తారలు మరియు సినీ పెద్దలు ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) కి విరాళాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లతో పాటు చిన్న నిర్మాతలు కూడా కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి)కు ఉదారంగా విరాళం ఇస్తున్నారు. ఆ క్రమంలో యువ నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది కూడా రూ .5 లక్షలు విరాళంగా ప్రకటించారు. కాగా సాహు గారపాటి, హరీష్ పెద్ది ఇద్దరూ కల్సి 2019 లో శివ నిర్వాణ దర్శకత్వంలో “మజిలీ” అనే సినిమా తీశారు. నాగ చైతన్య సమంత కలయికలో వచ్చిన ఈ మజిలీ చిత్రం సూపర్ హిట్ రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల మన్ననలు పొందింది. కాగా ఇదే బ్యానర్ లో వీళ్లిద్దరు నిర్మాతలుగా ప్రస్తుతం నాని ‘టక్ జగదీష్;’ అనే సినిమా రాబోతుంది.




కరోనా మహమ్మారి వ్యాపించడంతో ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు దారుణంగా పడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఏకంగా 18 ఏండ్ల కనిష్టానికి పడిపోయాయి. కానీ లాక్ డౌన్ కారణంగా ఆర్ధికంగా చితికి పోతున్న భారతీయులకు మాత్రం ఈ ప్రయోజనం అందడం లేదు.


కరోనా వైరస్ కారణంగా చిత్ర పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. షూటింగ్ లు డిలే అవుతున్నాయి. చాలా సినిమాలు విడుదల తేదీలు మార్చు కొంటున్నాయి. పరిస్థితి చూస్తుంటే సినిమా షూటింగ్ లు ఇప్పట్లో మొదలయ్యేలా లేవు .మరో రెండు నెలలు ఆలస్యం అయ్యేలా వున్నాయి. దీంతో రాజమౌళి సంక్రాంతికి విడుదల చేస్తానని చెప్పిన ఆర్.ఆర్.ఆర్. (రౌద్రం రణం రుధిరం ) సినిమా రిలీజ్ లేట్ అవుతుందని కొందరు ఊహించారు. సినిమా విడుదల వచ్చే వేసవికి ఉండొచ్చు అనుకొన్నారు.










బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సల్మాన్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్(38) హఠాన్మరణం చెందాడు. గడిచిన కొంతకాలంగా అబ్దుల్లా ఖాన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలోనే ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో అబ్దుల్లా చికిత్స పొందుతున్నాడు. సోమవారం రాత్రి పరిస్థితి విషమించడంతో అబ్దుల్లా ఖాన్ తుదిశ్వాస విడిచారు.

వలస కార్మికులు ఎవరిని కదలనీయవద్దని, వారెక్కడ ఉన్నారో అక్కడనే వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినా వారి పరిస్థితులలో పెద్దగా మార్పు కనబడటం లేదు. సుదూర ప్రాంతాలలో ఆకలితో అలమటించడం కన్నా, సొంత ఉరికి వెళ్లి, కాలో గంజో తాగుతూ ప్రాణం నిలబెట్టుకుందామని గ్రామాల బాట పట్టిన పలువురు దారిలోనే మృతు వాత పడుతున్నారు.
మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పట్ల ఎం.ఎన్. ఓ అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే కృష్ణాజిల్లా చల్లపల్లి ప్రాంతానికి చెందిన నాగరాణి (26) రెండు రోజుల కిందట కాలిన గాయాలతో మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుంది.
కరోనా ఎఫెక్ట్ ప్రభుత్వ ఉద్యోగులను తాకింది. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన సడలింపులతో ఊపిరి పీల్చుకున్న ఉద్యోగులకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు షాకింగ్ న్యూస్ ప్రకటనకు సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్ డౌన్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. రెవిన్యూ పూర్తిగా నిలిచిపోయింది. కరోనా సహాయ చర్యల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలు ఖాళీ అయ్యాయి. దీంతో కీలక నిర్ణయం దిశగా రెండు ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఏపీ తెలంగాణలోని దాదాపు 14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో మూడు శాఖల మినహా మిగిలినవారికి పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు వేతనాల్లో కోత విధించే దిశగా తుది కసరత్తు జరుగుతోంది.