
భారత్ లో కరోనా వైరస్ ను కట్టడిచేయడం కోసం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం.ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. అయినప్పటికీ వేల సంఖ్యలో కార్మికులు, వలస కూలీలు నగరాల నుంచి తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు రోడ్లపైకి వస్తున్నారు. దీంతో ఢిల్లీలోని పలుప్రాంతాలు ప్రజలతో కిక్కిరిసిపోయాయి.దీనిపై కేంద్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ పరిస్థితికి కారణమైన ఢిల్లీ ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మరో ఇద్దరు ఉన్నతాధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అమలుపరచడంలో ఈ అధికారులు అలసత్వం ప్రదర్శించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ రవాణాశాఖ అదనపు ముఖ్యకార్యదర్శితో పాటు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలపై వేటు వేసినట్లు వెల్లడించింది. వీరితోపాటు రాష్ట్ర హోంశాఖ అదనపు ముఖ్యకార్యదర్శి, సీలంపూర్ సబ్-డివిజినల్ మెజిస్ట్రేట్లను షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.




కరోనా వైరస్ భాదితులకు అండగా టాలీవుడ్ ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ కి ఇంకా విరాళాలు వస్తూనే ఉన్నాయి. టి వి స్టార్ చమ్మక్ చంద్ర , డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయి వంటి వారు కూడా తమకు తోచిన రీతిలో సాయం చేస్తూ ముందుకొస్తున్నారు. ఇంకా అనేక మంది ఉడతా భక్తిగా సి సి సి కి అండగా ఆర్ధిక సాయం చేస్తున్నారు.ఇదిలా ఉండగా మెగా ఫ్యామిలీ నుంచి మరోసారి విరాళం చేసేందుకు బన్నీ ముందుకొచ్చాడు.
తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే లాక్డౌన్ చర్యలు చేపట్టింది. కరోనా మహమ్మరి విషయంలో ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు చేపడుతుంది. దీంతో పలువురు ప్రముఖులు తెలంగాణ సహాయనిధికి తమవంతు సహాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. సోమవారం ఒక్కరోజే తెలంగాణ సీఎం సహాయనిధికి ఇప్పటివరకు 13కోట్ల విరాళాలు వచ్చినట్లు సమాచారం.
విజయవాడ సమీపంలోని కంచికచర్ల లో దారుణం చోటు చేసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు విధించిన లాక్ డౌన్ కారణంగా కన్న తల్లిని చివరి చూపు చూడడానికి కుమార్తెకు అవకాశం లభించలేదు. హృదయ విధారకమైన ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే కంచికచర్ల కు చెందిన రామతులశమ్మ(80) నిన్న సాయంత్రం అనారోగ్యం తో మృతి చెందింది. ఆమె కుమార్తె గుంటూరు నగరంలోని ఏ.టి అగ్రహారం లో నివాసం ఉంటుంది. తల్లి మరణవార్త విని తల్లడిల్లిపోయిన ఆమె తల్లిని చివరిసారిగా చూసుకునేందుకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గుంటూరు పోలీసులు, రెవెన్యూ అధికారులను అనుమతి కోరగా వారు అంగీకరించలేదు.
ప్రపంచం అంతా కరోనా వైరస్ దాటికి విలవిల్లాడి పోతోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి అమెరికా , ఇటలీ , స్పెయిన్ , ఇరాన్ , దక్షిణ కొరియా, జర్మనీ వంటి దేశాలను వణికిస్తోంది ఇక ఇండియా లో కూడా కరోనా ప్రభావం బాగానే ఉంది అని చెప్పాలి. ఇంతవరకు సుమారు 1100 మందికి పైగా కరోనా బాధితులు లెక్క తేలగా 31 మంది దాకా మరణించారు .ఇదిలా ఉండగా మన దాయాది దేశమైన పాకిస్తాన్ లో కూడా కరోనా వైరస్ ప్రభావం బాగానే ఉంది.
రామ్ చరణ్ సరసన ధృవ చిత్రం లో నటించి సూపర్ సక్సెస్ అందుకొన్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ తరవాత ఎందుకో వెనుక బడింది. ధృవ చిత్రం అరవాత “విన్నర్ , రా రండోయ్ వేడుక చూద్దాం , స్పై డర్, జయ జానకి నాయక , ఎన్ టి ఆర్ కథానాయకుడు , మన్మధుడు 2 ” వంటి ఆరు చిత్రాలు చేస్తే వాటిలో ఒక్క `రా రండోయ్ వేడుక చూద్దాం ` మాత్రమే యావరేజ్ అయ్యింది . దాంతో అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి.
‘ఆర్ఆర్ఆర్’ మూవీలో మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురంభీంగా, అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ భామ ఓలివీయా, రాంచరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తున్నారు.
భారత దేశంలోనే ప్రతిష్టాకరమైన పరిశోధన సంస్థ హైదరాబాద్ సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దానితో రేపటి నుంచి సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ప్రతీరోజూ వెయ్యిమందికి పరీక్షలు చేసే సామర్థ్యం సీసీఎంబీలో ఉన్నది.
లాక్డౌన్ నేపధ్యంలో ప్రజలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోలు రూమ్ నుండి నిత్యం పర్యవేక్షిస్తున్నామని ప్రత్యేక అధికారి, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమీషనర్ పి.ఎస్. ప్రద్యుమ్న తెలిపారు. విజయవాడలో సోమవారం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోలు రూం వద్ద వివరాలు వెల్లడిస్తూ… కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ అమలవుతున్న పరిస్థితులలో ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత రాకుండా చూడటానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనల ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రతినిత్యం సమీక్షిస్తున్నారన్నారు. అందులో భాగంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోలు రూమును విజయవాడలో ఏర్పాటుచేశామన్నారు. కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో మార్కెటింగ్ కమీషనర్ పి.ఎస్. ప్రద్యుమ్న, చేనేత జౌళి శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా, సీనియర్ ఐపిఎస్ అదికారులు వినీత్ బ్రిజ్ లాల్, హరికృష్ణ, విశాల్ గున్నీ, మార్కెటింగ్ సెక్రటరీ మదుసూదనరెడ్డి తదితరులు అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రతి జిల్లాలో కూడా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇటువంటి కమాండ్ కంట్రోలు రూములు ఏర్పాటుచేస్తామన్నారు. కమాండ్ కంట్రోల్ రూం నుండి నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్న వాహనాలకు ఎటువంటి ఆటంకం లేకుండాను, వ్యాపారులు అధిక ధరలకు అమ్మకుండా 24 గంటలు పర్యవేక్షిస్తున్నామన్నారు. సమస్యలు ఫిర్యాదులు తెలియజేయడానికి 1902 టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటుచేశామని ఇది 24/7 పనిచేస్తుందన్నారు. సరకు రవాణా చేస్తున్న వాహనాలకు ఏవైనా సమస్యలు ఎదురైనా, వ్యాపారులు అధిక ధరలకు అమ్ముతున్నా 1902 నెంబరుకు ఫోన్ చేస్తే వాటిని వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఆదివారం వరకు 1563 ఫిర్యాదులు అందాయని వాటిలో 1353 పరిష్కరించామన్నారు. ఆర్టిజిఎ లో వాటి స్టేటస్ ఎప్పటి కప్పుడు చూసుకోవచ్చని తెలిపారు. నిత్యావసర వస్తువులకు సంబంధించిన వాహనాల రాకపోకలలో రాష్ట్రంలోగాని లేదా ఇతర రాష్ట్రాలలోగాని ఏవైనా ఇబ్బందులుంటే తెలియజేస్తే తక్షణం స్పందించి పరిష్కరిస్తామన్నారు.




మొత్తం ప్రపంచాన్ని కకావికలం కావిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ ఆర్ధిక మందగమనంకు దారితీస్తున్నట్లు ఇప్పటికే ఐఎంఎఫ్ ప్రకటించింది. దానితో భారత్ ఆర్ధిక వ్యవస్థపై కూడా దుష్ప్రభావం చూపుతున్నది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో లాక్ డౌన్ అమలవుతుండగా అత్యవసర సేవలలో నిమగ్నమై ఉన్న ప్రవేటు వ్యక్తులతో సహా, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా కోసం ప్రభుత్వం కోవిడ్ 19 అత్యవసర పాస్ ను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయానికి సంబంధించి స్పష్టమైన అదేశాలు చేయగా, అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా కోవిడ్ -19 అత్యవసర పాస్ ప్రైవేట్ రంగ కర్మాగారాలు, కార్యాలయాలు, సంస్థలలో పనిచేసే ఉద్యోగుల కోసం జారీ చేస్తారు. వ్యవసాయ, సహకార (MKTG II) విభాగం 26.03.2020 తేదీన జారీ చేసిన జిఓ ఆర్ టి నెంబర్ 289 లో జాబితా చేర్చబడిన వస్తు సేవల ఉత్పత్తి, సరఫరాలో నిమగ్నమై ఉన్న వారందరూ ఈ పాస్ పొందేందుకు అర్హులే. పాస్ కోసం సంస్థ యజమాని తనతో సహా ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సంస్థ సిబ్బందిలో ఇరవై శాతం మాత్రమే పని చేయడానికి అర్హులు అయినందున కనిష్టంగా 5, గరిష్టంగా ఇ-పాస్ జారీ నిబంధనలు, షరతులకు లోబడి మంజూరు చేస్తారు.
అపజయాలే మన విజయానికి మెట్లు అన్న చందంలో కెరీర్ ఆరంభంలో వరుస అపజయాలు ఎదుర్కొన్న పూజా హెగ్డే ఇప్పుడు వరుస విజయాలు దక్కించుకొంటోంది. దరిమిలా ఊపిరి సలపనంత బిజీ గా మారింది. ప్రస్తుతం తెలుగు తెరపై పూజ హెగ్డే హవా నడుస్తోంది. ‘అరవింద సమేత’ ఆ తరవాత `మహర్షి` వంటి విజయాల తర్వాత తన విజయ పరంపర కొనసాగిస్తూ ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకొంది ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 162 కోట్ల కు పైగా షేర్ సాధించి బాహుబలి 2 చిత్రం తరవాతి స్థానం ఆక్రమించింది.


దేశంలోకి ప్రవేశించిన కరోనా మహమ్మరిని తరిమికొట్టేందుకు కేంద్రం లాక్డౌన్ చేపట్టింది. దీంతో వ్యాపార, వాణిజ్య, తదితర సంస్థలను మూతపడ్డాయి. కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ లన్నీ వాయిదాపడ్డాయి. థియేటర్ల మూతపడ్డాయి. దీంతో పలువురు సినీ స్టార్లు సోషల్ మీడియాలో కరోనా నివారణకు తమవంతు బాధ్యతగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ స్టార్లు కరోనాపై సోషల్ మీడియాలో వీడియో సాంగ్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతోంది.