
ఒక వంక దేశంలో కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతున్నా పరిష్టితులు అదుపు తప్పడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భరోసా వ్యక్తం అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే ఈ నెల 14 తర్వాత లాక్ డౌన్ పొడిగించే ఆలోచన లేదని కేంద్ర ప్రస్తుతం స్పష్టం చేయడంతో తిరిగి జన జీవనం త్వరలో సాధారణ స్థితికి చేరుకోవచ్చనే భరోసా ఏర్పడుతున్నది.
అందుకు స్పష్టమైన సంకేతం ఇస్తూ ఈనెల 15 నుంచి రైల్వే, విమాన బుకింగ్లు తిరిగి ప్రారంభం కావచ్చనే సంకేతాలు ఇస్తున్నారు. ‘‘ఏప్రిల్ 15 నుంచి ఐఆర్సీటీసీ నుంచి టిక్కెట్ బుకింగ్స్ అనుమతిస్తాం. లాక్డౌన్ 14 వరకే ఉంది. అందుకే క్రమక్రమంగా తిరిగి పని ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది” అని రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ముందుగా ప్యాసింజర్స్ రైళ్లను మెళ్లిగా ప్రారంభిస్తామని చెబుతున్నారు. అయితే ప్రయాణికుల ప్రయాణాలు మాత్రం ఏప్రిల్ 15 నుంచే ప్రారంభం కాకపోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు విమాన సర్వీసుల బుకింగ్ కూడా ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తున్నది.
ఇండిగో, స్పైస్ జెట్, గో ఏయిర్ లాంటి సంస్థలు తమ బుకింగ్లను ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది. అయితే ఆ సంస్థలు మాత్రం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు.
ఇప్పటి వరకు దేశం మొత్తం మీద 50 మృతులు నమోదు కాగా, మొత్తం కేసులు 1,764 నమోదయ్యాయి. నిజాముద్దీన్ కార్యక్రమంలో పాల్గొన్నవారికే ప్రస్తుతం ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.




ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబయిలోని ధారావి. కిక్కిరిసి ఉండే అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ల మధ్య, ఇక్కడ లక్షల మంది పేద ప్రజలు నివాసం ఉంటుంటారు. ఇక్కడ జనసాంధ్రత అత్యధికం కాగా, పారిశుద్ధ్యం అంతంతమాత్రం. ధారావిలో ఓ యువకుడు కరోనా సోకి మరణించగా, మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉంది. ధారావి వంటి ప్రాంతంలో కరోనా ప్రబలితే, కరోనా వ్యాప్తిని అడ్డుకునే పరిస్థితి ఉండదని అధికారులు భయపడుతున్నారు.


సినిమా రంగంలో రాణించాలంటే టాలెంట్ తో పాటు అదృష్టాన్ని కూడా వెంట తెచ్చుకోవాలి లేకపోతె ఇక్కడ సక్సెస్ దొరకదు. ఎందరో మేధావులు , ప్రతిభ కల ఆర్టిస్టులు అవకాశాలు లేక , రాక మరుగునపడి పోయారు. ఇపుడు అలాంటి పరిస్థితే మన తెలుగు అమ్మాయి ఎదుర్కొంటోంది .




మహమ్మారిపై అలుపెరగని పోరాటం జరుపుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అండగా వైద్యులు, శాస్త్రవేత్తలు, ఆర్ధికవేత్తలతో కూడిన 30 మంది నిపుణుల బృందం నిర్విరామంగా అవసరమైన సమాచారాన్ని సమకూరుస్తూ సహాయకారిగా ఉంటున్నది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా మహమ్మరి క్రమంగా అన్నిదేశాలకు పాకింది. ప్రపంచ వ్యాప్తంగా 8లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలోనే కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా 1,998 కరోనా కేసులు నమోదుగా 58మంది చెందారు. 148మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు.
గత నెలలో న్యూఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన మత ప్రార్థనలకు 7,600 మంది భారతీయులు, 1,300 మంది విదేశీయులు హాజరైనట్టు గుర్తించామని, దీంతో దాదాపు 9 వేల మంది ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రమాదం అంచున ఉన్నారని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. ఇండియాలో అతిపెద్ద కరోనా హాట్ స్పాట్ ఈ ప్రార్థనలు జరిగిన మసీదేనని అభిప్రాయపడ్డ కేంద్రం, వైరస్ సోకిన వారి సంఖ్య 9 వేలకు మించే ఉండవచ్చని పేర్కొంది.


కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భార్య హీరోయిన్ రాధిక అన్న సంగతి అందరికీ తెల్సిందే. గతంలో పలు సినిమాల్లో గ్లామర్ పాత్రల్లో నటించి రాధిక హీరోయిన్ గా మెప్పించింది. అయితే కుమారస్వామితో పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. వీరిద్దరి ఓ పాప కూడా ఉంది. అయితే తాజాగా ఆమె మళ్లీ సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుమారస్వామి సీఎంగా ఉన్న సమయంలోనే ఆమె మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 132 కు చేరింది. వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం బుధవారం రాత్రి పది గంటల అనంతరం 21 కొత్త కేసులు నమోదైనట్లు స్టేట్ కరుణ నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాలో 20, నెల్లూరు జిల్లాలో 20, ప్రకాశం జిల్లాలో 17, కడప జిల్లాలో 15, కృష్ణా జిల్లాలో 15, పశ్చిమ గోదావరి జిల్లాలో 14, విశాఖపట్నం జిల్లాలో 11, తూర్పుగోదావరి జిల్లాలో 9, చిత్తూరు జిల్లాలో 8, అనంతపురం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 1 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా కారణంగా ఇంతవరకు మరణాలు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కు యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. పూరి జగన్మాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో రామ్ సరసన నటించి మెప్పించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టందుకోవడంతో టాలీవుడ్లో బీజీగా స్టార్ గా మారింది. తాజాగా కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ లన్నీ బంద్ అవడంతో ఈ ఇస్మార్ట్ బ్యూటీ ఇంటికే పరిమితమైంది. నిన్నటిదాకా హాట్ డ్యాన్సులతో కుర్రకారును ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా కేకులు తయారు చేస్తూ ఆకట్టుకుంటోంది.
కరోనా వైరస్ నుంచి మానవాళిని కాపాడే ఔషదాన్ని తాము తయారు చేశామని అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న ‘డిస్ట్రిబ్యూటెడ్ బయో’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ జాకబ్ గ్లాన్ విల్లె వెల్లడించారు. గతంలో సార్స్ వైరస్ ను నిర్వీర్యం చేసేందుకు ఉపయోగించిన యాంటీ బాడీస్ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. ఐదుగురితో కూడిన తన బృందం కరోనా వైరస్పై విజయం సాధించిందని, సార్స్ ను అంతం చేసిన యాంటీ బాడీస్ కరోనాపైనా పని చేశాయని, డాక్టర్ జాకబ్ పేర్కొన్నారు.


కరోనా వైరస్ కట్టడికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు టిక్టాక్ భారీ విరాళం ప్రకటించింది. కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులకు సుమారు నాలుగు లక్షల హజ్మత్ సూట్లు, రెండు లక్షల మాస్కులు సమకూర్చేందుకు సిద్ధమైంది. వీటి విలువ సుమారు వంద కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. కరోనాను ఎదుర్కొనేం దుకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరులో వైద్యులు ముందు వరుసలో ఉన్నారని, వారు సురక్షితంగా ఉండటం అత్యవసరమని టిక్టాక్ సంస్థ తెలిపింది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగు లక్షల ప్రత్యేక హజ్మత్ సూట్లు, రెండు లక్షల మాస్కులు వైద్యులకు అందించాలని నిర్ణయిం చినట్లు తెలిపింది. కేంద్ర జౌళి శాఖ సహకారం తో తాము నిర్ణీత ప్రమాణాలతో కూడిన సూట్లు, మాస్కులు సిద్ధం చేశామని, వీటిని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు అందజేయను న్నామని టిక్టాక్ వివరించింది. ఇప్పటికే ఫేస్ బుక్, గూగుల్ వంటి సంస్థలు విరాళాలు ప్రకటించాయి. దీంతో టిక్ టాక్ భారీ విరాలన్ని దేశానికి అందించడానికి ముందుకు రావడం స్వాగతించాల్సిన విషయం.