Home Blog Page 8503

ట్రాఫిక్‌ ఫ్రీ నగరంగా రాజధాని.. మాస్టర్ ప్లాన్!

దేశ వ్యాప్తంగా మూడోవ దశ లాక్ డౌన్ లో కేంద్ర సడలింపుల నేపథ్యంలో చేయాల్సిన పనులు, పలు అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్‌ ప్రాజెక్టులపై మంత్రి కేటిఆర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు అధికారులు మరింత వేగంగా ముందుకు పోవాలి.  ఇది వర్కింగ్‌ సీజన్‌.. ఒక నెలపాటు పనులు చేయవచ్చు. జూన్‌ నుంచి వర్షాలు వస్తాయి. హైదరాబాద్‌ ను ట్రాఫిక్‌ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యం. దేశంలో లాక్‌ డౌన్‌ ను చక్కగా వినియోగించుకున్న  రాష్ట్రంగా తెలంగాణకు మంచి గుర్తింపు లభించింది. మే నెలలో మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. లింక్‌ రోడ్లలో ఆటంకాలు ఉన్న చోట భూసేకరణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నిర్వాసితుల పట్ల మానవీయ కోణంలో వ్యవహరించాలని’ మంత్రి సూచించారు.

‘జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న లింక్‌ రోడ్ల వెడల్పు 120 అడుగులు ఉండాలి. ఎస్‌ఆర్‌డీపీ, లింక్‌, సర్వీస్‌ రోడ్లను పొడిగించేందుకు హెచ్‌ఎండీఏ, ఇతర విభాగాలతో సమన్వయం చేసుకోవాలి. భవిష్యత్‌ అవసరాలు, పెరిగే ట్రాఫిక్‌ రద్దీని అంచనా వేసి పనులు చేపట్టాలి. హైదరాబాద్‌ నగర మాస్టర్‌ ప్లాన్‌ ను అప్‌ డేట్‌ చేస్తాం. రైల్వే అండర్‌ పాస్‌లు, రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలతో పాటు, కొత్త ప్రాజెక్టులకు కూడా అవసరమైన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను’ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.

వలస కూలీల ఇక్కట్లు.. కాంక్రీట్ కలిపే ట్రక్కులో..

దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల్లో కొంతమంది కాలినడకన మరికొందరు సైకిళ్లపై స్వస్థలాలకు పయనమవుతున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో మరికొంత మంది సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు కాంక్రీట్‌ కలిపే వాహనం లో ప్రయమిస్తూ.. పోలీసులకు చిక్కారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ లో చోటుచేసుకుంది. మహారాష్ట్ర నుంచి లక్నోకు వెళ్తున్న కాంక్రీట్‌ ట్రక్కులో ప్రయాణిస్తున్న 18 మందిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఉమాకాంత్‌ చౌదరి తెలిపారు. ఇండోర్‌ లో తనిఖీ చేయగా డోమ్‌ లోపల ఉన్నవారు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారని వెల్లడించారు.

ఈ క్రమంలో మార్గమధ్యలోనే కొంతమంది మరణించారు. మరికొంత మంది ఆకలి బాధతో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వలస కూలీలను సొంతూళ్లకి పంపడానికి శుక్రవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే పలు రాష్ట్రాలు ఇంకా అనుమతులు ఇవ్వకపోవడంతో వలస కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల్ని రాష్ట్రంలోకి రావడానికి అనుమతించిన కర్ణాటక వంటి రాష్ట్రాలు… సొంతూళ్లకి రావాలని అనుకుంటున్న వారు ఎవరైనా ప్రయాణ ఖర్చులు వాళ్లే భరించుకోవాలని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా..  అరుణాచల్‌ ప్రదేశ్‌ కు చెందిన దాదాపు 18 వేల మందిని ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ శనివారం తెలిపారు.

బికినీ వేసేందుకు రెడీ అంటున్న ‘అందాల రాక్షసి’


లావణ్య త్రిపాఠికి టాలీవుడ్లో చాలా పేర్లు ఉన్నాయి. సొట్టబుగ్గల సుందరి.. అందాల రాక్షసి అని అభిమానులను ఈ భామను ముద్దుగా పిలుచుకుంటున్నారు. పక్కింటి అమ్మాయిలా కన్పించే ఈ భామ ‘అందాల రాక్షసి’ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ఆమె నటనకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ఈ సినిమాలో భారీ విజయం సాధించడంతో తెలుగులో బీజీగా స్టార్ గా మారిపోయింది. అయితే ఇటీవల వరుసగా కొన్ని పరాజయాలు రావడంతో ఈ అమ్మడు ఆచితూచి సినిమాలను చేస్తుంది.

ఒక్కరి నుండి 100 మందికి సోకిన కరోనా వైరస్

ఇక కెరీర్ ముగిస్తుందనుకునే సమయంలో నానితో కలిసి ‘భలేభలే మగాడివోయ్’, కింగ్ నాగార్జునతో కలిసి ‘సొగ్గాడే చిన్నినాయానా’ సినిమాలు విజయం అందించాయి. వీటి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రిలీజైన్ ‘అర్జున్ సురవరం’ మంచి విజయం సాధించడంతో లావణ్య మళ్లీ బీజీగా స్టార్ గా మారిపోయింది. కొన్నేళ్లుగా టాలీవుడ్ మూవీల్లో నటిస్తున్నప్పటికీ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. దీంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాల అరబోతకు తెరతీసింది. అంతే మంచి కథ దొరికితే బికినీలో అందాల అరబోతకు సిద్ధమేనని ప్రకటించడంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయి.

సడలింపుపై కేసీఆర్ వైఖరి!

ప్రస్తుతం ఈ అమ్మడు యంగ్ హీరో సందీప్ కిషన్ సరసన ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ చిత్రంలో నటిస్తుంది. ఇందులో హాకీ క్రీడాకారిణి నటించనుంది. స్పోర్ట్స్ ప్లేయర్ గా కన్పించేందుకు ఈ అమ్మడు రోజు హాకీ నేర్చుకుంటోంది. అంతేకాకుండా కార్తీకేయ హీరోగా నటిస్తున్న ‘చావుకబురు చల్లగా’ మూవీలో నటించనుంది. తమిళంలో ఓ మూవీలో నటిస్తుంది. ప్రస్తుతం సినిమాలతోపాటు వెబ్ సీరిస్ హవా నడుస్తుండటంతో మంచి స్క్రీప్ట్ దొరికితే నటించేందుకు సిద్ధమేనంటూ ప్రకటించింది. ‘అందాల రాక్షసి’ బికినీ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

కేంద్ర బృందం తీరుపై బండి సంజయ్ ఫైర్


తెలంగాణలో కరోనా వైరస్ కట్టడి ప్రయత్నాలు, లాక్ డౌన్ అమలు తీరు పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం ఇక్కడి పరిస్థితుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన్నట్లు మీడియాలో వచ్చిన కధనాల పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాలుగు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించిన ఆ బృందం కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సాక్ష్యాధారాలతో సహా తాము అందజేసిన అంశాలను కూడా తమ నివేదికలో చేర్చలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర హోమ్ కార్యదర్శికి ఒక లేఖ వ్రాసారు. ఆ బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని ఆరోపిస్తూ, వాస్తవాలు తెలుసుకోవడానికి మరో కేంద్ర బృందాన్ని పంపించాలని డిమాండ్ చేశారు.

కర్నూలు జిల్లాలో కర్ఫ్యూ

కరోనా యొక్క ప్రభావాన్ని తక్కువ చేసి చూపించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. తక్కువ మరణాలు, తక్కువ కేసులు చూపించేందుకు వాస్తవాలను కప్పిపుచ్చుతున్నదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి పరీక్షలు చేయడం లేదని, వ్యాధి కారక మూలాలు తెలుసుకునే ప్రయత్నాలు చేయడం లేదని సంజయ్ ధ్వజమెత్తారు.

పూర్తి కోవిడ్ ఆసుపత్రిగా మార్చిన గాంధీ ఆసుపత్రిలోనే అరకొర సదుపాయాలు ఉన్నాయని మండిపడ్డారు. ముఖ్యంగా అక్కడ పారిశుధ్య పరిస్థితులు సక్రమంగా లేవని, తగినన్ని మరుగుదొడ్లు లేవని, చాలావరకు గదులు, వార్డులకు ప్రత్యేక బాత్‌రూమ్‌లు లేదని వివరించారు. శిక్షణ పొందిన ఆరోగ్య నిపుణులు, సహాయక సిబ్బంది సరిపడా లేరని స్పష్టం చేసారు.

లాక్ డౌన్ పొడిగింపు: లాభమా? నష్టమా?

కేంద్ర ప్రభుత్వ ప్రోటోకాల్‌ను అనుసరించడం లేదని సంజయ్ పేర్కొంటూ ఈ సందర్భంగా కరోనాతో మృతిచెందిన సి ఎస్ శాస్త్రి అనే 80 ఏళ్ళ వృద్ధుడి ఉదంతాన్ని ప్రస్తావించారు. కరోనా అనుమానంతో ఏప్రిల్ 12 న గాంధీ ఆసుపత్రికి వెడితే, పరీక్ష తర్వాత అతన్ని నెగెటివ్‌గా ప్రకటించారు. నాలుగు రోజుల తరువాత అదే వ్యక్తిని మరొక ఆసుపత్రిలో (నిమ్స్) పరీక్షించినప్పుడు పాజిటివ్ గా ప్రకటించారని సంజయ్ తెలిపారు.

దానితో తిరిగి గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా, అక్కడ ఏప్రిల్ 26 న తుది శ్వాస విడిచారని తెలిపారు. అయితే కేంద్ర బృందంపై ఇచ్చిన నివేదికలలో అతని మరణం చూపలేదని సంజయ్ వెల్లడించారు.

ఈ ఉదంతం, ప్రభుత్వ ఉద్దేశాన్ని అనుమానించడానికి అవకాశం ఇస్తుందని స్పష్టం చేశారు.

ఈ ఫోన్ నెంబర్లు వలస కూలీల కోసం!

దేశంలో మహమ్మారి విజృంభన నేపథ్యంలో అనుకోకుండా విధించబడిన లాక్ డౌన్ వల్ల వివిధ రాష్ట్రాలలో లక్షల మంది వలస కూలీలు చిక్కుకుపోయారు. తాజాగా వారిని తమ తమ సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రైల్వే శాఖ శ్రామిక్ అనే ప్రత్యేక రైళ్లను వలస కూలీల కోసం వెయ్యడంతో… ఎక్కడెక్కడో ఉన్న వారంతా… తమ సొంత రాష్ట్రాలకు బయల్దేరుతున్నారు. ఐతే… ఇలా వెళ్లేవారు… తమ పేర్లను నమోదు చేయించుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం… ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నోడల్ అధికారుల్ని ఏర్పాటు చేశాయి. సొంత రాష్ట్రాలకు వెళ్లే వలస కూలీలు, విద్యార్థులు, యాత్రికులు, పర్యాటకులు ఈ నోడల్ అధికారుల మొబైల్ నంబర్లకు కాల్ చేసి… మాట్లాడవచ్చు.

  • తెలంగాణ: సందీప్కుమార్ సుల్తానియా: 07997950008
  • ఆంధ్రప్రదేశ్: ఎంటీ కృష్ణబాబు : 09177611110
  • గుజరాత్‌లో ఏపీ, తెలంగాణ, ఇతర దక్షిణాది రాష్ట్రాల వారి కోసం: పి.భారతి, 9978408545,
    వి.చంద్రశేఖర్, 9845044606
  • జార్ఖండ్‌ లో ఆంధ్రప్రదేశ్ వాళ్ల కోసం:
    అమితాబ్ కౌశల్, 9431160011
  • కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారి కోసం:
    ఎన్వీ ప్రసాద్ 9448146360
    మాలినీ కృష్ణమూర్తి 9480800026
  • మధ్యప్రదేశ్‌ లో ఏపీ, తెలంగాణ వారి కోసం:
    వి.కిరణ్ గోపాల్ – 9425163993
  • రాజస్థాన్‌ లో ఆంధ్రప్రదేశ్ వారి కోసం:
    జంగా శ్రీనివాసరావు- 9929799297
  • మహారాష్ట్రలో ఉన్న వారి కోసం :
    నితిన్ కరీర్ – 022-22027990
  • తమిళనాడులో వారి కోసం:
    అతుల్య మిశ్ర- 9940341445

సురేష్ ప్రొడక్షన్స్ వారి సినిమాలు ఆగిపోలేదు


కరోనా ప్రభావం తో ఎన్నో షూటింగులు ఆగిపోయాయి.కొన్ని సిన్మాలయితే ఏకంగా ఆగి పోయాయి. భారీ బడ్జట్ తో నిర్మించే చిత్రాలు ముందు ముందు తగ్గిపోవచ్చు ఆ క్రమంలో సురేశ్ బాబు నిర్మాతగా .. రానా ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో 100 కోట్ల బడ్జట్ తో నిర్మాంచాలి అనుకొన్న ‘హిరణ్య కశిప’ చిత్రం ఆగిపోనుందని వార్తలొచ్చాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించిన ఈ చిత్రం ఫై లాక్ డౌన్ ఎఫెక్ట్ పడిందనీ, అందువలన సురేశ్ బాబు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేస్తాడని అంతా అనుకొన్నారు .

కర్నూలు జిల్లాలో కర్ఫ్యూ…

అలాంటి ఊహాగానాలకు తెరదించుతూ తాజాగా సురేశ్ బాబు తమ ప్రాజెక్ట్ ల వివరాలు వివరించడం జరిగింది. ఆ క్రమంలో ‘హిరణ్య కశిప’ ప్రాజెక్టు ఆగిపోలేదనీ .. తమ బ్యానర్లోనే ఆ సినిమా రూపొందుతుంది అన్నారు. అలాగే తమ బ్యానర్లో రానున్న ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఫస్టు కాపీ వచ్చేసిందని చెప్పారు. ‘ అలాగే వెంకటేష్ హీరోగా నిర్మిస్తున్న అసురన్ రీమేక్ `నారప్ప ` ఇంకా 25 శాతం చిత్రీకరణ మిగిలి ఉందనీ, రానా హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో రాబోతున్న ‘విరాటపర్వం’ చిత్రం ఇంకా 8 రోజుల షూటింగు మిగిలి ఉందని అన్నారు. అలాగే అల్లరి ఫేమ్ రవిబాబు దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘క్రష్’ సినిమా కూడా ఐదారు రోజుల వర్క్ మాత్రమే మిగిలివుందని చెప్పి అందరి అనుమానాలకు తెరదించారు.

దమ్ముంటే అరెస్ట్ చేయండి…ఎమ్మెల్యే సవాల్…!


నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీలపై తీవ్రంగా స్పందించారు. లాక్ డౌన్ కారణంగా నియోజకవర్గంలోని ప్రజలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో సామాజిక దూరం పాటించకపోవడం వివాదాస్పదంగా మారింది. తాజాగా ఎమ్మెల్యే చేపడుతున్న నిత్యావసర సరుకులు, కూరగాయల పంపిణీకి హాజరైన ఉద్యోగులను సస్పెండ్ చెస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.

కర్నూలు జిల్లాలో కర్ఫ్యూ

దీంతో ఎమ్మెల్యే దమ్ముంటే నన్ను అరెస్టు చేయండంటూ బహిరంగంగా సవాల్ విసిరారు. సస్పెన్షన్ ఉత్తర్వులను ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువెళతానాని చెప్పారు. తనతోపాటు జిల్లాలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను, మంత్రి అనిల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీల వ్యవహారాన్ని దృష్టి పెట్టాలని మంత్రి అనిల్ కుమార్ కు సూచించారు. పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీలో సామాజిక దూరం పాటించకపోవడంతో గతంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డిపై కేసు నమోదు చేశారు. దీంతో పోలీసు స్టేషన్ వరండాలో కూర్చుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఎస్పీ, కలెక్టర్ లకు ఎమ్మెల్యేకు మద్య దూరం పెరిగింది. ఈ వ్యవహారాన్ని సి.ఎం.ఓ కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లి కలెక్టర్, ఎస్పీలపై చర్యలకు ఎమ్మెల్యే డిమాండ్ చేయనున్నట్లు తెలిసింది.

పొడిగింపు సొంత నిర్ణయం కాదు!


దేశంలో మే 17 వరకు లాక్ డౌన్ పొడిగింపు అన్నది ఏకాభిప్రాయం తర్వాత తీసుకున్న నిర్ణయమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అన్ని రాష్ట్రాలతో కలిసి కరోనాపై యుద్దం చేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా జోన్ ల వర్గీకరణ జరుగుతోందని ఆయన చెప్పారు. కేసులు ఎక్కువగా రెడ్ జోన్ ల నుంచే వస్తున్నాయని ఆయన వివరించారు. కంటైన్ మెంట్ జోన్లలో కర్ఫ్యూ తరహా వాతావరణం ఉండాలి. వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధించాలని ఆయన సూచించారు.

26 జిల్లాల్లో 28 రోజులుగా ఒక్క కేసూ నమోదు కాలేదు. 40 జిల్లాల్లో గత 21 రోజులుగా కేసు కూడా నమోదు కాలేదు. కొత్త కేసులు వస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం అని ఆయన వివరించారు. వలసకార్మికుల కోసం నిన్న ఒక్క రోజే ఆరు రైళ్లు నడిపాం. వలస కార్మికులను తరలించేందుకు ఇవాళ్టి నుంచి 300కు పైగా రైళ్లు నడుపుతాం.టిక్కెట్ ధర ఏభై గా నిర్ణయించడం జరిగిందని, దానికి దూరంతో సంబందం లేదని ఆయన చెప్పారు. దీనిని రాష్ఠ్ర ప్రభుత్వాలు లేదా ఆయా కంపెనీలు చెల్లించాలని ఆయన అన్నారు.

కర్నూలు జిల్లాలో కర్ఫ్యూ?


రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు వారం రోజులుగా గణనీయంగా పెరుగుతున్నాయి. అత్యధిక కేసులు ఉన్న జిల్లాగా కర్నూలు నిలిచింది. జిల్లాలో ప్రతి రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదు అవడంతో ప్రస్తుతం 436 కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మరణించగా, 66 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 360 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తొలుత పట్టణ ప్రాంతాలకే పరిమితం అయిన వైరస్ క్రమేణా గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. జిల్లాలో పాజిటివ్ కేసుల కట్టడికి జిలా కలెక్టర్ వీరపాండ్యన్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా అదుపులోకి రావడం లేదు. లాక్ డౌన్ కర్నూలులో సత్పలితాన్ని ఇవ్వలేదు. దీనికి కారణం లాక్ డౌన్ సక్రమంగా అమలు అవకపోవడమేనని తెలుస్తోంది.

ఒక్కరి నుండి 100 మందికి సోకిన కరోనా వైరస్

ఈ పరిస్థితుల్లో జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు తీడుకోవాల్సిన చర్యలు ఎంటనేది ఇప్పుడు అందరి తలలను తొలిచేస్తోంది. లాక్ డౌన్ ఫలించక పోవడంతో కర్ఫ్యూ తప్ప మరో మార్గం లేదని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో కర్ఫ్యూ ఎప్పటి నుంచి అమలు చేయాలి, ఎక్కడెక్కడ అమలు చేయాలనే అంశంపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో కర్నూలు నగరంలో అత్యధికంగా 200 కేసులు, నద్యాల పట్టణంలో 88 పాజిటివ్ కేసులు, పట్టణాలు, సమీప గ్రామాల్లో మిగిలిన కేసులు నమోదయ్యాయి.

లాక్ డౌన్ 3.0లో మందుబాబులకు శుభవార్త!

రెండు రోజుల కిందట జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ కర్నూలు నగరంలోని రెడ్ జోన్లో పర్యటించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో లాక్ డౌన్ సక్రమంగా చేయలేకపోవడంపై అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే వైరస్ ను కట్టడి చేయడం సాధ్యం కాదని అధికారులకు తేల్చిచెప్పారు. జిల్లాలో కరోనాను కట్టడి చేయాలంటే కర్ఫ్యూ మినహా మరో మార్గం లేదనే భావిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నరసరావుపేటలో నాలుగు రోజులుగా పూర్తి స్థాయి లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు అనుమతించడం లేదు. ఎక్కడ సుమారు 100 కేసులు వరకు నమోదయ్యాయి.

నాగ చైతన్య సినిమా ఉంటుంది అంటున్న పరశురామ్


`గీత గోవిందం’ ఘన విజయం తో దర్శకుడు పరశురామ్ కి పలు ఆఫర్స్ వచ్చాయి. వాటిలో రెండు సినిమాలను మాత్రమే పరశురామ్ ఒకే చేయడం జరిగింది. అందులో మొదటిది నాగ చైతన్య హీరోగా నటించే చిత్రం కాగా, రెండోది మహేష్ బాబు హీరోగా నటించే చిత్రం. నిజానికి పరశురామ్ నాగ చైతన్య చిత్రం మొదలు పెట్టాల్సి ఉంది. అయితే ఊహించని విధంగా మహేష్ బాబు నుండి పిలుపు రావడం తో నాగ చైతన్య చిత్రాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఈనెల 31న కృష్ణ పుట్టినరోజు కానుకగా మహేష్ బాబు చిత్రం యొక్క అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా ఈ చిత్రం లో మహేష్ బాబు రేంజ్ కి తగ్గట్టుగా అన్ని అంశాలు ఉంటాయని దర్శకుడు పరశురామ్ చెప్పడం జరిగింది .ఇదొక అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని కూడా చెప్పడం జరిగింది .

ఒక్కరి నుండి 100 మందికి సోకిన కరోనా వైరస్

ఇక పరుశురాం దర్శకత్వంలో నాగ చైతన్య హీరో గా మూవీ ఉండదని అంతా అనుకొన్నారు. ఇదే విషయం దర్శకుడు పరుశురాం ని అడిగితే.. నాగ చైతన్య చిత్రం ఆగిపోలేదు , మహేష్ బాబు మూవీ అనంతరం నేను చేయ బోయే సినిమా అదే అని స్పష్టత ఇచ్చాడు.

అందరికీ చూపించాలంటే ఎలా? బోల్డ్ బ్యూటీ హాట్ కామెంట్


రాధికా ఆప్టే.. పెద్దగా పరిచయం అక్కర్లేనీ పేరు. ఈ బ్యూటీ నటన ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కన్పించినా ఆమెకు బోల్డ్ సీన్లతోనే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే రాధికా ఆప్టే తన సినిమాల్లో అందాల అరబోతకు ఏమాత్రం వెనుకాడదు. దీంతో ఆమెకు కుర్రకారులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. సన్నివేశం డిమాండ్ చేస్తే నగ్నం నటిచేందుకు కూడా రాధిక ఆప్టే సిద్ధమే అని ప్రకటించింది. అంతేకాకుండా ‘అహల్య, బద్లాపూర్’ వంటి వెబ్ సీరిస్ లో నగ్నంగా నటించే సంచలనం సృష్టించింది. అయితే ఈ అమ్మడు తాజాగా దర్శకులపై సంచలన కామెంట్లు చేయడం ఆసక్తికరంగా మారింది.

ఒక్కరి నుండి 100 మందికి సోకిన కరోనా వైరస్

వెండితెరపై నగ్నంగా నటించేందుకు తనకేమీ అభ్యంతరం లేదని పలుమార్లు బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే ఇటీవల కాలంలో దర్శకులు కేవలం తనను న్యూడ్ సీన్స్ కోసం సంప్రదిస్తున్నారని మండిపడుతోంది. తాను ఏ కథకు పడితే ఈ కథను చేయనని.. అలాగే సినిమాలో పాత్ర డిమాండ్.. సన్నివేశం ఆధారంగానే తాను నగ్నంగా నటిస్తానని చెప్పుకొచ్చింది. కేవలం నగ్నంగా నటించేందుకు తాను చిత్రపరిశ్రమలోకి రాలేదంటూ ఫైర్ అయింది. తన వద్దకు వచ్చే డైరెక్టర్లు ఇది గుర్తుంచుకోవాలంటూ హితవు పలికింది.

సడలింపుపై కేసీఆర్ వైఖరి!

ఈ భామ తెలుగులో ‘రక్తచరిత్ర’, బాలయ్య కు జోడీగా ‘లెజండ్’, ‘లయన్’ మూవీల్లో నటించి మెప్పింది. ప్రస్తుతం ఈ భామ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చూస్తూ అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటోంది. విదేశీ బీచుల్లో బికినీలతో షికార్లు చేసిన పిక్స్ షేర్ చేస్తూ సమ్మర్ ను మరింత హీటెక్కిస్తుంది. ఎల్లప్పుడు కాంట్రవర్సీలతో అందరి దృష్టిని ఆకర్షించే రాధిక ఆప్టే ఈసారి దర్శకులపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది.

త్రిషలాగే చిరుకు హ్యండిచ్చిన కాజల్!


కొరటాల శివ-మెగాస్టార్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ మూవీపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. గతేడాది దసరాకు ప్రారంభమైన ఈ మూవీ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. గతకొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటుండగా సడన్ గా కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ నిలిపి వేయాల్సి వచ్చింది. అయితే ఈ మూవీ నుంచి వరుసగా హీరోయిన్లు తప్పుకుంటడంతో మెగా అభిమానులు ఒకింత కలవరానికి గురవుతున్నారు.

లాక్‌ డౌన్‌3.0 లో నిబంధనలు ఇవే!

‘ఆచార్య’ మూవీతో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా తొలుత వెటరన్ హీరోయిన్ త్రిషను అనుకున్నారు. ఆమె కూడా కొన్నిరోజులు షూటింగ్లో పాల్గొంది. అయితే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమయ్యేనాటికి ‘ఆచార్య’ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష సోషల్ మీడియాలో ప్రకటించింది. క్రియేటీవ్ డిఫరెన్సెస్ వల్ల ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు బాంబ్ పేల్చింది. దీంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో త్రిషపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేశారు. సినిమాలు లేనప్పటికీ త్రిష బలుపు చూపించించదంటూ ఓ రేంజ్లో ఫైరయ్యారు. త్రిష ఈ మూవీ నుంచి తప్పుకోవడంపై మెగాస్టార్ కూడా స్పందించారు. త్రిషకు మణిరత్నం మూవీలో ఆఫర్ వచ్చిందని డేట్స్ అడ్జస్ట్ చేయలేక తప్పుకుందని క్లారిటీ ఇచ్చారు.

వైకాపా క్రూర రాజకీయానికి కోడెల బలి: చంద్రబాబు

ఈనేపథ్యంలో త్రిష స్థానంలో ‘చందమామ’ కాజల్ అగర్వాల్ ఎంపికైంది. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ-150’లో కాజల్ నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో కాజల్ ఎంపికపై మెగా అభిమానులు ఒకింత సంతోషం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలోనే కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ మూవీ సమయంలో కాజల్ మరో తమిళ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరికి జూన్ నుంచి డేట్స్ అడ్జస్ట్ చేసిందని సమాచారం. తమిళ మూవీ కోసం ఇప్పటికే అమ్మడు అడ్వాన్స్ కూడా తీసుకుందట. ఈ నేపథ్యంలో మెగాస్టార్ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

‘ఆచార్య’ మూవీ తిరిగి ప్రారంభమయ్యే సమయంలో కాజల్ హ్యండివ్వడంతో కొత్త హీరోయిన్ వేట దర్శకుడు కొరటాల శివ పడినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రారంభమయ్యే నాటికి మరో కొత్త భామ చిరుకు జోడీగా కన్పించడం ఖాయంగా కన్పిస్తుంది. చిరుకు జోడీగా నటించే బంపరాఫర్ ఏ హీరోయిన్ కు దక్కుతుందో వేచి చూడాల్సిందే..!

ఒక్కరి నుండి 100 మందికి సోకిన కరోనా వైరస్


లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి పక్షం రోజుల వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేని గుంటూరు జిల్లా, నరసరావుపేట లో ఇప్పుడు ఈ వైరస్ 125 మందికి  వ్యాప్తి చెందింది.

కేవలం నేరమయ నిర్లక్ష్యం కారణంగా, భౌతిక దూరం పాటించక పోవడంతో ఒక వ్యక్తి నుండే వందమందికి ఈ వైరస్ వ్యాప్తి చెందడం గమనార్హం. మొదట కరోనా కేసు వచ్చినప్పుడు అటు అధికారులు, ఇటు ప్రజలు పట్టించుకొనక పోవడంతో ఇప్పుడు అగ్గిరాజేసిన్నట్లు మొత్తం పట్టణాన్ని కాటేస్తున్నది. నెలరోజులుగా పట్టణ ప్రజలను అతలాకుతలం చేస్తున్నది.

వైకాపా క్రూర రాజకీయానికి కోడెల బలి: చంద్రబాబు

ఇప్పటికి 125 పాజిటివ్‌ కేసులు బయటపడగా, ప్రకటించాల్సిన కేసులు మరికొన్ని ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. గత నెల తొమ్మిదో తేదీన నరసరావుపేటలోని వరవకట్టలో నివసించే కేబుల్‌ కార్మికుడు మొదటగా కరోనా పాజిటివ్‌తో మృతి చెందాడు. అతను కేంద్రంగా ఇప్పటికే సుమారు వందమందికి ఈ వైరస్ వ్యాప్తి చెందింది.

గుంటూరు నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా ఇతనికి వైరస్‌ సోకినట్టు పోలీసులు నిర్ధారించారు. గుంటూరు వ్యక్తికి ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన వ్యక్తుల నుంచి కరోనా సోకిందని తేల్చారు. ఇతను నరసరావుపేట వరవకట్టకు రావటంతోనే వైరస్‌ వ్యాప్తి చెందింది.

పాజిటివ్‌ లక్షణాలు కనిపించగానే కేబుల్‌ కార్మికుడు చికిత్స పొందుతూ ఇంటి వద్దనో, ఆస్పత్రిలోనో ఉంటే సరిపోయేది. కానీ, ఆయన ఇతరులను కలిశాడు. ఈ క్రమంలో ఆయనకు సన్నిహితంగా ఉండే హోంగార్డుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది.

లాక్ డౌన్ 3.0లో మందుబాబులకు శుభవార్త!

హోంగార్డు కాలికి ఇన్‌ఫెక్షన్‌ రావడంతో గత నెల 9వ తేదీకి ముందు నరసరావుపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. ఇతనికి కరోనా పాజిటివ్‌ అని తెలియక వైద్యం అందించిన వైద్యులు కూడా కరోనా బారినపడ్డారు.

ఈ ఆస్పత్రి ద్వారా 14 మందికి వైరెస్‌ వ్యాప్తి చెందింది. వీరిలో ఐదుగురు వైద్యులు ఉన్నారు. మిగతావారు అక్కడ పనిచేసే స్టాఫ్‌ కాగా ఒక మహిళ చికిత్స పొందిన రోగి కుటుంబ సభ్యురాలు. ఈ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న పలువురికి కూడా వైరస్‌ సోకింది.

ఈపూరు మండలం కొండ్రముట్ల, మాచర్ల మండలం గిద్దలూరు ప్రాంతాలకు చెందినవారు ఈ ఆస్పత్రిలో చికిత్స పొందటం వలన సుమారు ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇలా వరవకట్ట, ప్రైవేట్‌ ఆస్పత్రి కేంద్రంగా మారటంతో ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు కరోనా కోరలు చాచింది.

వరవకట్టను వైరస్‌ పరీక్షల కోసం జల్లెడ పడుతున్నారు. దాదాపు 540 మందిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. కరోనా పరీక్షల కోసం 450 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించారు. వరవకట్టలోనే ఇంకా పది కేసులకు పైగా ఉన్నట్టు అధికారులు చెపుతున్నారు. అయితే వీటిని ప్రకటించాల్సి ఉంది.

లాక్‌డౌన్ సడలిస్తే తీవ్ర పరిణమాలు: డబ్ల్యూహెచ్ఓ


కరోనా ప్రబలిన దేశాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేస్తుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుందని ఇలాంటి సమయంలో లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వొద్దని సూచించింది. ఆయా దేశాలు లాక్‌డౌన్ సడలింపులపై ఆయా దేశాలు ఒకటి రెండుసార్లు బాగా ఆలోచించుకోవాలని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగ సీనియర్ అధికారి డాక్టర్ మైక్ ర్యాన్ అన్నారు. ఇప్పటికే లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చిన చాలా దేశాల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయని ఆయన హెచ్చరించారు. వైరస్ ప్రభావంలేని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరగాయని తెలిపారు. ఇలాంటివి ఆఫ్రికా, మధ్య ఆసియా ప్రాంతాల్లో ఎక్కువగా చోటుచేసుకున్నాయని ఆయన తెలిపారు.

లాక్‌డౌన్ తో కుప్పకూలుతున్న ప్రింట్ మీడియా

కరోనా వైరస్ ను లాక్‌డౌన్, సామాజిక దూరంతోనే కట్టడి చేయగలమని ఆయన తెలిపారు. జనాభా ఎక్కువగా భారత్, అమెరికా దేశాలు లాక్‌డౌన్ ఆంక్షలు సడలిస్తే తీవ్ర పరిణమాలుంటాయని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం అన్నిదేశాలు కరోనా మహమ్మరి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయని తెలిపారు. ఆయాదేశాలు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కితాబిచ్చారు. ఇదిలా ఉంటే భారత్ లో మరోరెండు వారాలు లాక్‌డౌన్  పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. అయితే లాక్‌డౌన్ రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కొన్ని సడలింపులు చేసింది. రెడ్ జోన్లను పూర్తిగా కట్టడి చేస్తూ ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో పలు దేశాలు లాక్‌డౌన్  అమలులో సడలింపు చేస్తుండటంపై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

తమిళ చిత్రంలో విలన్ గా ఆర్ ఎక్స్ 100 హీరో


ఆర్ ఎక్స్ 100 చిత్రం తో ఓవర్ నైట్ గుర్తింపు తెచ్చుకొన్న హీరో కార్తికేయ. ఆ చిత్రం తరవాత కార్తికేయ హీరో గా గత ఏడాది మూడు చిత్రాలు విడుదల చేయడం జరిగింది .” హిప్పీ’, ‘గుణ 369 ‘, ‘ 90 ఎం ఎల్ ” సినిమాలు ఆయన నుండి వచ్చాయి. ఐతే వాటిలో ‘గుణ 369’ మాత్రమే ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కార్తికేయ హీరో గా అల్లు అరవింద్ జీ ఏ 2 బ్యానర్ లో ” చావు కబురు చల్లగా ” సినిమా చేస్తున్నాడు కాగా ఆ చిత్రం .షూటింగ్ కూడా మొదలైంది. లాక్ డౌన్ కారణం గా ఆగింది .

లాక్‌ డౌన్‌3.0 లో నిబంధనలు ఇవే!

కాగా కార్తికేయ తమిళ్ స్టార్ హీరో అజిత్ సినిమాలో విలన్ రోల్ చేస్తున్నాడంటూ ఆ మధ్య ఓ వార్త బయటి కొచ్చింది. కాగా ఆ న్యూస్ నిజమేనని తెలుస్తోంది . మే ఒకటో తారీఖున అజిత్ పుట్టినరోజు సందర్భంగా కార్తికేయ నటించే విషయం వెల్లడయింది `.ఖాకీ ‘ (కార్తీ చిత్రం ) ఫేమ్ ‘ హెచ్ వినోత్ ‘ దర్శకత్వంలో అజిత్ “వాలిమై ” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు .ఇక ఆ మూవీలో కార్తికేయ విలన్ గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది . కాగా గత ఏడాది నాని హీరోగా నటించిన ‘ గ్యాంగ్ లీడర్ ‘ చిత్రం లో కూడా కార్తికేయ విలన్ గా నటించడం జరిగింది .

వైకాపా క్రూర రాజకీయానికి కోడెల బలి: చంద్రబాబు


వైకాపా క్రూర రాజకీయానికి కోడెల మృతి ఒక ఉదాహరణగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్వం, అపన్నులకు అండగా నిలిచి భరోసా ఇచ్చే గుండె ధైర్యం కోడెల శివప్రసాదరావు సొంతమని చెప్పారు. కోడెల జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేశారు. రూపాయి డాక్టరుగా పేదలకు అందించిన వైద్యసేవలే కోడెలను ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రమ్మని పిలిచేలా చేశాయన్నారు. ప్రజల్లో కోడెలను పల్నాటి పులిగా నిలిపాయన్నారు. అలాంటి వ్యక్తి కుటుంబంపై 19 కేసులు పెట్టి, వైకాపా నేతలంతా కాకుల్లా పొడుచుకుతిన్నారని మండిపడ్డారు. మానసికంగా కుంగదీసి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని దుయ్యబట్టారు. ఈరోజు కోడెల శివప్రసాద్‌ జయంతి సందర్భంగా ఆయన ప్రజా సేవలను మననం చేసుకుందామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

లాక్‌ డౌన్‌3.0 లో నిబంధనలు ఇవే!

మరోవైపు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ 74వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్‌లో కోడెల శివరాం రక్తదానం చేశారు. నరసరావుపేట ప్రజల కోసం తన ఆసుపత్రిని, ఇంటిని క్వారంటైన్ సెంటర్‌కు ఇస్తామని శివరాం తెలిపారు. నరసరావుపేట, సత్తెనపల్లి ప్రజలకు తమ సహకారం ఎల్లప్పుడు ఉంటుందని కోడెల శివరాం తెలిపారు.

లాక్‌డౌన్ సడలింపులు తెలంగాణలో అమలవుతాయా?


దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో కేంద్రం మరోసారి లాక్డౌన్ పొడగింపుకే మొగ్గుచూపింది. ఇప్పటికే మే 4వరకు లాక్డౌన్ అమలు చేస్తున్న కేంద్రం మరో రెండువారాలపాటు లాక్డౌన్ పొడగించింది. దీంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ మే 17వరకు అమలు కానుంది. లాక్డౌన్ 3.0లో దేశంలోని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో పలు షరతులతో కూడిన అనుమతులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేంద్రం సడలింపులు రాష్ట్రంలో ఈమేరకు అమలవుతాయేనేది చర్చనీయాంశంగా మారింది. కేంద్రం నిర్ణయంపై కేసీఆర్ ఏవిధంగా ముందుకెళుతారనేది ఆసక్తికరంగా మారింది.

లాక్‌ డౌన్‌3.0 లో నిబంధనలు ఇవే!

లాక్డౌన్ 2.0లో కేంద్రం ఇచ్చిన లాక్డౌన్ మినహాయింపులను తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేయలేదు. కేంద్రం మే 3వరకు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించగా కేసీఆర్ మాత్రం మే 7వరకు లాక్డౌన్ పొడగించారు. కేంద్రం ఇచ్చిన సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వెల్లడి కావాల్సి ఉంది. అయితే కేంద్రం లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయక తప్పనిసరిగా మారింది. ఈ సడలింపుల్లో బస్సుల రాకపోకలు, మద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కీలకంగా మారాయి. వీటి అమలులో సామాజిక దూరం పాటించడం అమలు సాధ్యమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నారు. వీటి అమలు విషయంలో కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ కానుంది. ఈ నేపథ్యంలో కేంద్రం సడలింపులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 5న జరిగే క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

లాక్ డౌన్ పొడిగింపు: లాభమా? నష్టమా?

తాజాగా సమాచారం కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ తో ముందుకెళ్లేందుకే కేసీఆర్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మే 5న పూర్తి క్లారిటీ రానుంది. ప్రస్తుతానికి తెలంగాణ కరోనా కట్టడిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన వారంరోజులుగా కరోనా కేసులు సింగిల్ డిజిట్ దాటకపోవడం గమనార్హం. కాగా శుక్రవారం తెలంగాణ కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యారు. వీటితో కలుపుకొని రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,044 చేరింది. వీరిలో 464మంది కరోనా నుంచి కోలుకున్నారు. 552 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో 28మంది మృతిచెందారు.