Home Blog Page 8466

తమిళ గెటప్ లో అదరగొట్టిన చిరంజీవి

mega star chiranjeevi

mega star chiranjeevi
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గవర్నర్ తమిళ సై పుట్టిన రోజు కావడంతో ఆమెకు ట్వీటర్లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెల్సిందే. మంగళవారం సాయంత్రం రాజ్ భవన్లో గవర్నర్ దంపతులను చిరు దంపతులు ప్రత్యేకంగా కలిసి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. నిన్న ఉదయం సోషల్ మీడియాలో విషెస్ చెప్పిన చిరంజీవి సాయంత్రం గవర్నర్ తో బేటీకావడంతో అటూ రాజకీయ, ఇటూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాక చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. అభిమానులతో ముచ్చటించడంతోపాటు సినీ, రాజకీయ ప్రముఖుల బర్తేడ్ లకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈక్రమంలో తమిళ సై కు జన్మదిన ట్వీటర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపగా ఆమె స్పందిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. ఆరోజు సాయంత్రమే సాయంత్రం చిరు దంపతులు గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి రోటిన్ భిన్నంగా కన్పించడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

మెగాస్టార్ చిరంజీవి పంచె.. షర్టుతో సగటు తమిళుడి మాదిరి గవర్నర్ వద్దకు వెళ్లారు. సాధారణంగా తమిళులు తమ సొంత రాష్ట్రం, మాతృభాషపై ఎక్కువ అభిమానాన్ని చూపిస్తుంటారు. చిరుకు ఈ విషయం తెలుసు కాబట్టే వూహాత్మకంగా అలా వెళ్లారనే టాక్ విన్పిస్తుంది. ఇటీవల కాలంలో చిరు టాలీవుడ్లోని సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బేటీ అయి చర్చించారు. షూటింగులు ప్రారంభమయ్యేలా ఇండస్ట్రీని పలువురితో కలిసి కేసీఆర్ తో చర్చించిన సంగతి తెల్సిందే. కేసీఆర్ డైరెక్షన్ మేరకు చిరంజీవి నాయకత్వంలో షూటింగులను ప్రారంభించేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి మెగాస్టార్ బేటీ కాబోతున్నారు.

చిరంజీవి అటూ రాజకీయ నాయకులతో, ఇండస్ట్రీలోని పెద్దలతో సన్నిహితంగా ఉంటూ ఇండస్ట్రీగా పెద్దదిక్కుగా మారుతున్నారు. కాగా చిరంజీవి గవర్నర్ తమిళ సై ను మర్యాదపూర్వకంగా కలిశారా? లేదా రాజకీయంగా ఏమైనా చర్చించారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

హరీష్ రావుకు కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు

Harish Rao Birthday

Harish Rao Birthday
టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు పుట్టిన రోజు నేడు. 48వ పుట్టిన రోజున జరుపుకుంటున్న ఆయనకు రాజకీ య, సినీ ప్రముఖులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి ముందుండి పోరాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. సాగునీటి ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తి చేసేందుకు కృషి చేశారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు.

ఇదిలా ఉంటే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన బావా అయిన హరీష్ రావుకు తనదైన శైలిలో ట్వీటర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అందరినీ ఆకట్టుకున్నారు.

‘గౌరవనీయులైన ఆర్థిక మంత్రి, మంచి పనిమంతుడు, డైనమిక్ హరీశ్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు.. జీవితాంతం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా బావా.. నిత్యం ప్రజా సేవలో తరించిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.. రాజకీయంగానైనా ప్రభుత్వ రంగంలోనైనా నీతో కలిసి పనిచేయడం గొప్పగా భావిస్తున్నా’ అంటూ హరీష్ రావుతో దిగిన రెండు ఫొటోలను కేటీఆర్ ట్వీట్ చేశారు. గతేడాది కూడా కేటీఆర్ హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది ఆయన పుట్టిన నాటికి కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి పదవులు దక్కలేదు. గతేడాది జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్న హరీష్ రావు నేడు కరోనా కారణంగా సెలబ్రేషన్స్ చేసుకోవడం లేదని ప్రకటించారు.

తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు హరీష్ రావు అంటూ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు. కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని.. ఈ సమయంలో అందరం స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. కార్యకర్తలు ఎలాంటి సెలబ్రేషన్స్ నిర్వహించవద్దని అభిమానులను హరీష్ రావు కోరారు

ఆ బిల్లును వెనక్కి తీసుకోండి..మోడీకి కేసీఆర్ లేఖ!

Kcr modi

విద్యుత్‌ చట్టానికి కేంద్రం ప్రతిపాదించిన సవరణల బిల్లులో ప్రజా ప్రయోజనాలు కానీ, విద్యుత్‌ పంపిణీ సంస్థల ప్రయోజనాలు కానీ లేవు. అయితే ప్రజా ప్రయోజనాల రీత్యా ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి అని సిఎం కేసీఆర్ ప్రధాని మోడిని కోరారు. రాష్ర్టాల అధికారాలను హరించే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ప్రతిపాదిత విద్యుత్‌ సవరణ బిల్లు2020పై రాష్ర్టాల అభిప్రాయాలు తెలుపాలని కేంద్రం కోరిన నేపథ్యంలో సిఎం కెసిఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోడికి లేఖ రాశారు. ప్రభుత్వం తరఫున తమ ఆందోళనను, బిల్లు వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ.. బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు తేల్చిచెప్పారు.

కేసీఆర్ ‌ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. బిల్లులో పేర్కొన్నట్టుగా రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలిని కేంద్రం నియమించే సెలెక్షన్‌ కమిటీ ఎంపికచేయడం సరైనది కాదు. ఈ రకమైన చర్య రాష్ర్టాలకు విద్యుత్‌ రంగంలో ఉన్న అధికారాలను హరించడమే అవుతుంది. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం.. అందులోనూ రాష్ర్టాల యంత్రాంగం పనితీరును నేరుగా ప్రభావితంచేసే విద్యుత్‌ లాంటి అంశంపై కేంద్రం పార్లమెంట్‌ చట్టం తీసుకురావడం సమంజసంకాదు. ఇది రా జ్యాంగ స్ఫూర్తికి, ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతమే అవుతుంది. ఈ వైఖరిని మేము వ్యతిరేకిస్తున్నాం. నేషనల్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీలాంటి పాలసీని రాష్ట్ర ప్రభుత్వాల స్పష్టమైన ఆమోదంతో తీసుకొనిరావాలి. తూతూ మంత్రంగా సంప్రదించడం సరైనది కాదు. దేశంలోని ప్రతి రాష్ర్టానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కొన్ని రాష్ర్టాల్లో జల విద్యుత్‌ కు అవకాశం ఉన్నది. మరి కొన్నింటిలో పవన విద్యుత్‌.. ఇంకొన్నింటిలో సౌరవిద్యుత్‌తోపాటు భూమి అందుబాటులో ఉన్నాయి. రాష్ర్టాలు తమకు ఉన్న వనరులు, అవసరాల నేపథ్యంలో పాలసీని రూపొందించాలి. ఇలాంటి విభిన్న పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా.. విధానాల రూపకల్పనలో రాష్ర్టాలకు స్వేచ్ఛ ఉండాలి.నేషనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎన్‌ఎల్డీసీ) దేశవ్యాప్తంగా విద్యుత్‌ షెడ్యూలింగ్‌ చేసే శక్తిమంతమైన సంస్థగా బిల్లులో పేర్కొన్నారు.

జగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు కేసీఆర్ ప్లాన్

CM KCR Vows to Stop Andhra Irrigation Project

Andhra Irrigation Project

ఇన్నాళ్లు సంయమనం.. ఇక ఆ స్టేజీ దాటిపోయింది. ఏపీ సీఎం జగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రెడీ అయిపోయారు. నీళ్ల పంచాయితీలో తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్న జగన్ ను లెక్కలతో కొట్టాలని రెడీ అయిపోయారు. ఈ మేరకు పకడ్బందీ ప్రణాళికతో జగన్ ముందరికాళ్లకు బంధం వేసేందుకు భారీ స్కెచ్ గీసినట్టు అర్థమవుతోంది.

కృష్ణా, గోదావరి జలాలపై ఇప్పటికే రెండు రాష్ట్రాలు కేంద్రానికి, బోర్డులకు ఫిర్యాదులు చేసుకున్నారు. సుప్రీం కోర్టుకు ఎక్కాయి. ఇన్నాళ్లు సోదరభావంతో జగన్ తో సాన్ని హిత్యం నెరిపిన కేసీఆర్ ఇక ఉపేక్షించకూడదని డిసైడ్ అయినట్టు తెలిసింది.. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి రాయలసీమకు నీళ్లను భారీగా తీసుకెళ్లడానికి.. తెలంగాణ నీటిని మళ్లించడానికి చూస్తున్న ఏపీ సీఎం జగన్ కు ఝలక్ ఇచ్చేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు ఇదే విషయమై కృష్ణ బోర్డు మీటింగ్ లో తమ వాదనను గట్టిగా వాదించాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు.

ప్రగతి భవన్ లో ఇరిగేషన్ అధికారులతో సమావేశమైన కేసీఆర్ వారికి కీలక సూచనలు చేశారు. తెలంగాణ వాటాగా గోదావరిలో 954 టీఎంసీలు కేటాయించారని.. వాటిని కూడా తాము వాడుకోవడం లేదని మీటింగ్ లో చెప్పాలని కేసీఆర్ ఇంజినీర్లకు సూచించారు. కేటాయింపులకు మించి తాము ఒక్క చుక్క కూడా ఎక్కువ వాడుకోవడం లేదని వాదించాలని కీలక సూచనలు చేశారు.

ఏపీ ఆరోపణలను ఎండగట్టేలా కేసీఆర్ ప్లాన్ రూపొందించినట్టు తెలిసింది.. తెలంగాణ వాదన నెగ్గేలా సలహాలిచ్చారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుపై విషయమై ఉమ్మడి ఏపీలో సర్వే చేయలేదని.. సంగమేశ్వరం కూడా పూర్తిగా కొత్తదేనని ఇంజినీర్లు వాదించాలని కేసీఆర్ సూచించారు. అదే కృష్ణా నదిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఉమ్మడి ఏపీలోనే అనుమతి వచ్చాయని.. వైఎస్ హయాంలోనే శంకుస్థాపనలు చేసిన విషయాన్ని వాదించాలని.. జగన్ ను వాళ్ల నాన్న చేసిన శంకుస్థాపనలతోనే ఇరుకునపెట్టాలని అధికారులకు కీలక సూచన చేసినట్టు సమాచారం.

కృష్ణ బోర్డు సమావేశంలో వట్టిసీమ ద్వారా గోదావరి జలాలను మళ్లిస్తున్నారని.. కాబట్టి కృష్ణ నదిలో 45 టీఎంసీలును తెలంగాణ దక్కేలా బోర్డుపై ఒత్తిడి తేవాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. ఇప్పటికే ఏపీ పరిమితికి మించి ఆంధ్రప్రదేశ్ నీటిని వాడుకుంటోందని.. మిగులు జలాలను తీసుకెళ్తామని దబాయిస్తున్నారని వాదించాలని కేసీఆర్ సూచించారు.

జగన్ చేపట్టిన కొత్త ప్రాజెక్టులను ముందుకు కదలకుండా చేయాలని కేసీఆర్ ఈ ప్లాన్ చేసినట్టు తెలిసింది. గోదావరి, కృష్ణ బోర్డు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ సుధీర్ఘంగా సమావేశం నిర్వహించి ఏపీ సీఎం జగన్ కు ఝలక్ ఇచ్చేందుకు భారీ ప్లాన్ రెడీ చేసినట్టుగా తెలుస్తోంది.

–నరేశ్ ఎన్నం

తీరంలో ‘నిసర్గ’ అల్లకల్లోలం!

Nisarga Cyclone
In this Wednesday, June 12, 2019, file photo, a waves crashes as people stand on boats on the Arabian Sea coast in Veraval, Gujarat, India. Indian authorities evacuated tens of thousands of people on Wednesday as a severe cyclone in the Arabian Sea approached the western state of Gujarat, lashing the coast with high winds and heavy rainfall. (AP Photo/Ajit Solanki, File)

Nisarga Cyclone

అరేబియా సముద్రంలో నిసర్గ తుఫాను వేగంగా దూసుకొస్తోంది. రత్నగిరి తీరంలో ఇప్పుడు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. భారీ వర్షం కూడా పడుతోంది.

చుట్టూ మూడు సముద్రాలు ఉండటంతో… భారత్‌ కి తుఫాన్ల ముప్పు బాగానే ఉంటోంది. ఇటీవల అంఫన్ అలా వచ్చి వెళ్లగా… ఇప్పుడు అరివీర భయంకరంగా నిసర్గ తుఫాను వచ్చేస్తోంది. ఇది ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరం దగ్గర ఉన్న హరిహరేశ్వర్ దగ్గర తీరం దాటుతుందని అంచనా వేశారు. అయితే.. ఇది చిన్న తుఫానేమీ కాదు. పైగా చాలా బలంగా ఉంది. ఇది తీరం దాటేటప్పుడు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. అంటే తీవ్రత చాలా ఎక్కువే. చెట్లు కూలిపోయే ప్రమాదం ఉంది. కరెంటు స్తంభాలు ఒరిగే ఛాన్స్ ఉంది. ఇళ్ల పైకప్పులు కూడా ఎగిరిపోతాయని, సముద్రం ప్రస్తుతం అల్లకల్లోలంగా ఉందని అధికారులు అంటున్నారు.

ఇష్యూలోకి ఎన్టీఆర్ ను లాగిన పవన్ హీరోయిన్

Meera Chopra lodges complaint against NTR fans https://www.thehansindia.com/cinema/tollywood/meera-chopra-lodges-complaint-against-ntr-fans

Meera Chopra lodges complaint against NTR fans  https://www.thehansindia.com/cinema/tollywood/meera-chopra-lodges-complaint-against-ntr-fans

లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రెటీలు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ ఉంటున్నారు. క్వారంటైన్లో తమ అనుభవాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ తో ‘బంగారం’ మూవీలో నటించిన మీరా చోప్రా ట్వీటర్లో అభిమానులతో లైవ్ చాట్ చేశారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. ఓ అభిమాని మీకు తెలుగులో ఏ హీరో అంటే ఇష్టమని ప్రశ్నించాడు. దీనికి ఆమె మహేష్ బాబు పేరు చెప్పింది. అనంతరం ఎన్టీఆర్ గురించి ఓ అభిమాని ప్రశ్నించాడు. దీనికి ఆమె ‘నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదని.. నాకు ఎన్టీఆర్ కంటే మహేష్ అంటేనే ఇష్టమని’ సమాధానం ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం ఇష్టమొచ్చిన రీతిలో బూతుపురాణం విప్పారు.

రెండ్రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెతోపాటు ఆమె తల్లిదండ్రులను కూడా తీవ్రపదజాలంతో దూషిస్తుండటంపై మీరా చొప్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే ఎన్టీఆర్ ను కూడా ఇష్యూలోకి లాగింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చను ఎన్టీఆర్ కు ట్యాగ్ చేస్తూ పోస్టుచేసింది. ‘నాకు ఎన్టీయర్ కంటే మహేష్ బాబు అంటేనే ఎక్కువ ఇష్టం అన్నందుకు ‘వేశ్య’, ‘పోర్న్‌స్టార్’, ‘తిరుగుబోతు’ అంటూ బూతులు తిడుతున్నారని.. గ్యాంగ్‌రేప్ చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారని.. ఆమె తల్లిదండ్రులకు కూడా అసభ్య పదజాలంతో మెసేజ్‌లు పెడుతున్నారని ట్వీటర్లో పోస్టు చేసింది. ఇలాంటి ఫ్యాన్స్ తో మీరు విజయవంతమైనట్టు భావిస్తున్నారా? మీరు నా ట్వీట్‌కు స్పందిస్తారని అనుకుంటున్నా’ అంటూ మీరా ట్వీట్ చేసింది.

రెండ్రోరోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రాను టార్గెట్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. చివరికి మీరా చొప్రా సైబర్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆన్ లైన్లో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీరాకు సింగర్ చిన్మయి, ఇతర నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ఇష్యూలో స్పందించాలని మీరా చొప్రా ఎన్టీఆర్ ను కోరింది. అయితే దీనికి ఎన్టీఆర్ ఇంతవరకు ఆమెకు ఎలాంటి రిప్లయ్ ఇవ్వలేదు. ఈ ఇష్యూపై ఎన్టీఆర్ ఎలా రియాక్టవుతాడో వేచి చూడాల్సిందే..!

ఎక్సైజ్ సిబ్బందిపై దాడి..!


మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అధికారులకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలింపు అడ్డుకోవడం పెద్ద తలనొప్పిగా మారగా, మరోవైపు రాష్ట్రంలో తయారవుతున్న కాపుసారా అరికట్టడం అంతకంటే పెద్ద సమస్యగా తయారైంది. ఈ క్రమంలో అధికారులు సారా తయారీదారుల చేతుల్లో దాడులకు గురవుతున్నారు.

గుంటూరు జిల్లా మాచర్ల మండలం హస్నాబాద్ తండాలో ఎక్సైజ్ అధికారులు సారా తయారీదారులు దాడి చేసిన ఘటన
చోటు చేసుకుంది. విజయపురిసౌత్ ఎస్ ఐ పాల్ రవీందర్ ఇచ్చిన సమాచారం ప్రకారం హస్నాబాద్ తండాలో నాటుసారా అక్రమంగా తయారు చేస్తున్న బట్టి లపై దాడి చేసి 20 లీటర్ ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు అదే గ్రామంలో 7,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

రెండు ఘటనలతో ఆగ్రహించిన సారా తయారీదారుల వర్గం ఎక్సైజ్ అధికారులపై ఊహించని రీతిలో దాడికి దిగింది. సుమారు 100 మంది వ్యక్తులు గుమిగూడారు. అయితే వీరిలో సుమారు 15 మంది వ్యక్తులు రాళ్ళతో మాచర్ల ఎక్సైజ్ సీఐ కొండారెడ్డి తో పాటు సిబ్బంది, కారును దాడి చేశారు. దీనితో కొండారెడ్డి తో పాటు సిబ్బందికి గాయాలు కాగా కారు సైతం అద్దాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న విజయపురి సౌత్ ఎస్ ఐ హస్నాబాద్ తండా గ్రామానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

మెట్రో రైళ్ళు ప్రారంభం.. ఎప్పట్నుంచి అంటే..

Metro trains

Metro trains

కరోనా వ్యాప్తి, లాక్‌ డౌన్ నేపథ్యంలో ఆగిన హైదరాబాద్ మెట్రో రైళ్లు.. ఈ నెల మూడో వారం నుంచి పున: ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. పలు రవాణా వ్యవస్థలకు సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో త్వరలోనే వీటి రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలున్నట్లు మెట్రోరైలు వర్గాలు తెలిపాయి. ఎల్బీనగర్‌-మియాపూర్, జేబీఎస్‌-ఎంజీబీఎస్, నాగోల్‌-రాయదుర్గం రూట్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో అందుబాటులో ఉండగా.. మూడు బోగీలు గల మెట్రో రైలులో దాదాపు వెయ్యి మంది దాకా ప్రయాణం చేయవచ్చు. అయితే, కోవిడ్-19 నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటించాల్సి ఉన్నందున 50-60 శాతం ప్రయాణికులతోనే నడవనున్నాయి. ఒక్కో రైలులో 500 నుంచి 600మందిని మాత్రమే అనుమతించనున్నారు.

బోగీల్లో భౌతిక దూరం పాటించేలా తెల్లటి రౌండ్‌ సర్కిల్స్‌ ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. మెట్రో స్టేషన్లలో ఎస్కలేటర్లు, లిఫ్టుల బటన్లను చేతితో తాకే అవసరం లేకుండా కాలివేళ్లతో టచ్‌ చేస్తే పనిచేసే ఆధునిక టెక్నాలజీ వినియోగించాలని యోచిస్తున్నారు. బోగీల్లో ప్రయాణికులు పట్టుకొని నిల్చునే హ్యాండిల్స్‌ ను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయనున్నారు. ప్రయాణికులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నారు.

డాక్టర్ సుధాకర్ పై కేసు పెట్టిన సిబిఐ..!


ప్రభుత్వ మత్తు వైద్యుడు సుధాకర్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. హైకోర్టు ఆదేశాలతో కేసు విచారణ చేపట్టిన సీబీఐ విశాఖ పోలీసులు సమర్పించిన వివరాలతో సుధాకర్ పై కేస్ నమోదు చేశారు. దీంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని అన్ని వర్గాలలో చర్చ జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తూ నడి రోడ్డు మీద ప్రజాప్రతినిధుల్ని దూషించడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులను దూషించడం, ఓ కానిస్టేబుల్ మొబైల్ ను కింద పడేయడం తనకున్న అధికారాలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేశారన్నది ఎఫ్.ఐ. ఆర్ లో పేర్కొంది. కేసు వివరాలను తన వెబ్సైట్ లోనూ పొందుపరిచింది.

విశాఖ పోర్టు ఆసుపత్రికి సమీపంలో సుధాకర్ ను అరెస్టు సందర్భంగా మే 16వ తేదీన చోటు చేసుకున్న సంఘటనపై 23 మంది సాక్షుల సమాచారంతో పాటు 130 పేజీలతో కూడిన సీడీ ఫైల్ ను సీబీఐకి ఫోర్త్ టౌన్ పోలీసులు అందజేశారు. అదేవిధంగా లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు డాక్టర్ సుధాకర్ పై సెక్షన్ 188 నమోదు చేశారు.

మరోవైపు సుధాకర్ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. ఈ కేసులో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా సుధాకర్ ను కొట్టడం, కాలితో తన్నడం, చేతులు వెనక్కి మెలిపెట్టి కట్టేసి ఎండలో రోడ్డుపై పడుకోపెట్టడం చర్యలకు పాల్పడ్డారు. విచారణకు సిబిఐ సంబంధించిన రిపోర్టును హైకోర్టుకు అందించాల్సి ఉంది.

తెలంగాణలో భారీ వర్షాలు కురిసే జిల్లాలు ఇవే..

Heavy rains

Heavy rains

తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాలలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.

మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘నిసర్గ’ తుపాను మహారాష్ట్ర, గుజరాత్, గోవా తీరాలపై విరుచుకుపడనుందనే భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. ముంబైకి సమీపంలో ఈ తుపాను బుధవారం తీరం దాటే అవకాశముందని ఐఎండీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తుపాను ప్రభావంపై మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

‘నిసర్గ’ తుఫాన్ పై మోడీ ట్వీట్!

modi

Modi tweet

‘నిసర్గ’ తుపాన్ పై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని మోడీ ట్వీట్ చేశారు. నిసర్గ తుపాన్ ఉత్తర మహారాష్ట్ర, పక్కనే ఉన్న దక్షిణ గుజరాత్ మధ్య హరిహరేశ్వర్, దమన్ వద్ద తీరం దాటనున్నట్టు భారత వాతావరణశాఖ(ఐఎండి) అధికారి, ముంబై వాతావరణశాఖ డిప్యూటీ డైరెక్టర్ కెఎస్ హోసాలికర్ తెలిపారు. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ ‘నిసర్గ’ 12 గంటల్లో తీవ్ర తుపాన్‌ గా మారనున్నట్టు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలనుద్దేశిస్తూ.. దేశంలోని పశ్చిమ తీరంలో నెలకొన్న తుపాన్ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని, సురక్షితంగా ఉండటానికి వీలైన జాగ్రత్తలన్నీ తీసుకోవాలని ప్రధాని ప్రజలకు సూచించారు. అలాగే, తుపాన్ పరిస్థితిపై ఐఎండి అధికారులతో ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్ప పీడనం వల్ల తుపాన్ రానున్నట్టు అధికారులు ప్రధానికి వివరించారు.

తుపాన్ హెచ్చరికలతో ఇప్పటికే 10 ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను తీర ప్రాంతాలకు తరలించినట్టు మహారాష్ట్ర ముఖమంత్రి కార్యాలయం(సిఎంఓ) తెలిపింది. తమ రాష్ట్రంలో మొత్తం 16 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలున్నట్టు సిఎంఓ తెలిపింది. ముంబై నగరంతోపాటు శివారు ప్రాంతాలైన థానే, పాల్ఘర్, రాయిగడ్, రత్నగిరి, సింధుదర్గ్ జిల్లాలను అప్రమత్తం చేసినట్టు తెలిపింది. సహాయక చర్యల సందర్భంగా కోవిడ్19 విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించినట్టు సిఎంఓ తెలిపింది.

జగన్ ఆ భేటీ నిర్వహించింది అందుకేనా?


ఢిల్లీ పర్యటన రద్దవడంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం గురువారం జరగాల్సిన కీలక భేటీని ముందుగా నిర్వహించారు. అందులో భాగంగా పలు ముఖ్యమైన అంశాలపై పార్టీ ముఖ్య నాయకులు, మంత్రులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఢిల్లీపర్యటన రద్దవడంతో వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయ సాయిరెడ్డి, మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, కొడాలి నాని తదితరులతో ఈ భేటీ నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టు తీర్పులతో పాటు ఎన్నికల కమిషనర్, ఢిల్లీ టూర్ రద్దు అయిన వ్యవహారం, ఇతర పలు అంశాలపై కీలక చర్చ జరిగాయి.

హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు వస్తున్న నేపథ్యంలో పరిస్థితిపై సమీక్షించారు. ఎస్.ఈ.సి విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తే కొత్త ఎస్.ఈ.సిని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఎవరిని నియమించాలనే అంశంపై చర్చించారు.
రాష్ట్రంలో విద్యుత్ చార్జీల విషయంలో విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారం, తదితర అంశాలపై చర్చించారు. ఇప్పటికే విద్యుత్ సరఫరా సంస్థలు వివరాలు తెలియజేస్తూ వీడియోలు, కరపత్రాలు విడుదల చేశాయని మంత్రి బాలినేని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.

లాక్ డౌన్ సందర్భంగా ఆర్ధికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రంపై ఏ విధంగా వత్తిడి తేవాలనే అంశంపై ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో బోర్డు దృష్టికి తీసుకువెళ్ళాల్సిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయని సమాచారం.

కొద్దీ రోజుల కిందట టిడిపి ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతారని వార్తలు వచ్చినా, చేరలేదు. ఎందుకు సీఎం అంగీకారం తెలపలేదని వార్తలు వచ్చాయి. చేరికాలకు బాలినేని సారధ్యం వహిస్తున్న నేపథ్యంలో బాలినేని ఈ అంశంపై సీఎం దృష్టికి తీసుకువెళ్లి చర్చించారు. వైసీపీలోకి వచ్చే ఎమ్మెల్యేలు ఎవరైనా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలిచి రావాలని జగన్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత చేరికలపై నిర్ణయం తీసుకోవాలని భావించినా, అనుకోకుండా రద్దు కావడంతో ఆయా అంశాలపై ముందుగానే చర్చించారు. దీంతో త్వరలో చేరికలపై స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

లాక్డౌన్ తర్వాత స్టార్ హీరోయిన్ పెళ్లి?

nayanthara

nayanthara

లేడి సూపర్ స్టార్ నయనతార పెళ్లి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. లాక్డౌన్ అనంతరం నయనతార పెళ్లి చేసుకోబోతుందని కోలివుడ్లో విస్కృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ బ్యూటీ ప్రేమాయణం నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. శింబు-నయనతార ప్రేమాయణం.. వీరిద్దరు విడిపోవడం అప్పట్లో ఆసక్తిని రేపింది. ఆ తర్వాత కోరియోగ్రఫర్ ప్రభుదేవా-నయనతారలు ప్రేమ వ్యవహారం పెళ్లిపీఠల వరకు వెళ్లింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదుగానీ వీరిద్దరు పెళ్లిపీఠలెక్కకుండానే బ్రేకప్ చెప్పేశారు.

ఆతర్వాత ముచ్చటగా మూడోసారి నయనతార ప్రేమలో పడింది. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో గత కొన్నేళ్లుగా ప్రేమయాణం నడుపుతోంది. వీరిద్దరికి సంబంధించి ఫిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు కావాల్సినంత ఎంటటైన్మెంట్ చేస్తుంటారు. లాక్డౌన్ అనంతరం విఘ్నేష్ శివన్-నయనతార పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్స్ ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. లాక్డౌన్ లేనట్లయితే ఈపాటికే వీరిద్దరి పెళ్లి జరిగిపోయేదని కోలీవుడ్లో టాక్ విన్పిస్తుంది.

ఇటీవల కాలంలో నయనతార గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుంది. హోమ్లీ క్యారెక్టర్, లేడి ఓరియేంటెడ్ మూవీలను చేస్తూ పోతుండటంతో త్వరలోనే నయనతార పెళ్లి పీఠలెక్కనుందని వార్తకు బలం చేకూరినట్లయింది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా వీరిద్దరు ఇంటికే పరిమితమయ్యారు. లేకుంటే ఈపాటికి ఏ విదేశాల్లో చక్కర్లు కొడుతుండేవారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం కోలివుడ్లో బహిరంగ రహస్యమే. దీంతో త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈసారైనా నయన్ పెళ్లి పీఠలెక్కుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే..!

ముందుగా షూటింగ్ ప్రారంభించనున్న RRR

rrr shooting

RRR Shooting

జూన్ నుంచే టాలీవుడ్లో షూటింగులను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లిమిటెడ్ మెంబర్లతో షూటింగులకు ప్రారంభించేందుకు టాలీవుడ్ దర్శక, నిర్మాతలు సన్నహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ముందుగా స్టార్స్ లేకుండా సినిమాలను తెరకెక్కించేందుకు దర్శకులు సిద్ధమవుతున్నారు. ముందుగా టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కున్న RRR మూవీ షూటింగ్ ప్రారంభించనుందని తెలుస్తోంది. ఈమేరకు దర్శకుడు రాజమౌళి సినిమాను ఏవిధంగా ప్రారంభించాలి? ఎవరెవరు ఏయే పనులు చేయాలి? ఎంతమంది సెట్లో ఉండాలి? ఎంత సమయంలో షూటింగ్ ముగించాలని అనే వాటిపై ఇప్పటికే ఓ ప్లాన్ రూపొందించినట్లు సమాచారం.

ఈమేరకు అతి త్వరలోనే RRR మూవీ ప్రారంభించబోతున్నారని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది. తొలుత మూవీకి సంబంధించి సెట్స్, ప్యాచ్ వర్క్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. కొందరు క్యారెక్టర్ ఆర్టిసులతో మూవీ షూటింగులను ప్రారంభిస్తారట. ఆ తర్వాత పరిస్థితిని బట్టి హీరోలు షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. ముందుగా హీరోలు లేకుండా ఉండే సన్నివేశాలను పూర్తి చేసి ఆ తర్వాత అవసరాన్ని వీరిని రంగంలోకి దింపనున్నారట. కాగా ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తున్నారు.

అల్లూరి సీతరామరాజుగా రాంచరణ్, కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కన్పించబోతున్నారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ షూటింగ్ ప్రారంభించాకే మిగతా దర్శకులు కూడా ఈ తరహాలో షూటింగులను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. RRR మూవీ టాలీవుడ్ దర్శకులకు షూటింగులపై దిక్సూచిగా మారింది. దీంతో RRR షూటింగు ఎప్పుడు ప్రారంభం అవుతుందా? అని అభిమానులతోపాటు టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఆసక్తితో ఎదురుచూస్తోంది.

తెలంగాణలో అంతరాష్ట్ర ప్రయాణికులకు కొత్త రూల్స్

Telangana

Telangana

తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు, ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ కి వచ్చే వారికి కేసీఆర్ సర్కార్ కొత్త ఆదేశాలను జారీ చేసింది. వేరే రాష్ట్రాలకు వెళ్ళే వారు ఇక నుండి డీ.జీ.పీ.కార్యాలయం నుండి పాసులు తీసుకొవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రా, కర్ణాటక, మహరాష్ట్ర రాష్ట్రాలకు ప్రయాణించే వారు మాత్రం తమ పేర్లను అక్కడి ప్రభుత్వాల యాప్ లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలకు కూడా వాహన పాసులను అడగడం లేదని వెల్లడించారు.

ఇప్పటి వరకు అంతరాష్ట్ర ప్రయాణాలకు డీ.జీ.పీ కార్యాలయం నుండి ప్రత్యేకంగా పాసులు జారీ చేసేది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తి వేస్తూ అంతర రాష్ట్ర ప్రయాణాలకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణాలకు ట్రాన్స్ పోర్ట్ పాసులను జారీ చెయడాన్ని పోలీసు శాఖ నిలిపి వేసింది.

అయితే, ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాల్సిన వారు స్పందన యాప్ ‌, కర్ణాటక రాష్ట్రానికి వెళ్లేవారు ఆ రాష్ట్రానికి చెందిన సేవా యాప్ లోనూ, మహరాష్ట్రకు వెళ్లే వారు ఆ రాష్ట్ర పోర్టల్‌ లో ప్రయాణికుల వివరాలను నమోదు చెయాల్సి ఉంటుందని అధికారులు స్పస్టంచెసారు

‘దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో అమలు!’

Pochaaram srinivas yadav

Pochaaram srinivas yadav

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోచారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత సిఎం కెసిఆర్‌ కే దక్కుతుందని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించామని, కాళేశ్వరం నీటిని అందించేందుకు పనులు జరుగుతున్నాయన్నారు.

ఆధార్ ఉంటే ఇకపై హెయిర్ కట్..!

Aadhaar card- Hair Cut

Aadhaar card- Hair Cut

చైనా వైరస్ దేశంలో రోజురోజుకు విభృంభిస్తుంది. దీంతో కేంద్రం లాక్డౌన్ కొనసాగిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ప్రస్తుతం దేశంలో జూన్ 30వరకు లాక్డౌన్ 5.0కొనసాగునుంది. కేంద్రం ఇటీవల కాలంలో అన్నిరంగాలకు భారీ సడలింపులను లిస్తూ ఆన్ లిక్ దిశగా వెళుతుంది. అయితే కొన్ని షరతులను విధిస్తుంది. ముఖ్యంగా వైరస్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఈ నిబంధనలను ఆయా ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో మహమ్మరి ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఈ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో అక్కడి ప్రభుత్వాలు కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు.

ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడటం వంటివి చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చింది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం సెలూన్ షాపుల్లో హెయిర్ కటింగ్ చేయించుకునే వాళ్లు తప్పనిసరిగా ఆధార్ తీసుకెళ్లాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఆధార్ కార్డు లేకుండా సెలూన్ షాపులకు వెళితే అక్కడ క్షవరం చేయరు. దీంతో కటింగ్ చేయించుకోవాలనే వ్యక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు ఆధార్ జిరాక్స్ వెంట తీసుకెళ్లాల్సిందే. లేకుండా కటింగ్ నిరాకరిస్తారు. తెలంగాణలో కటింగ్ షాపులకు వెళ్లేవారు వారి వెంట ఇంటి నుంచే టవల్ వెంట తీసుకెళుతున్నారు. టవల్ ఉంటే కటింగ్ చేయాలనే నిబంధన ఉంది.

సెలూన్ షాపుల ద్వారా వైరస్ ప్రబలే అవకాశం ఉండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాయి. ఎవరైనా వైరస్ బారిన పడితే ఆధార్ కార్డు సాయంతో వారిని గుర్తించడం సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. దీని ద్వారా త్వరగా కాంటాక్టులను కనుగోనడం ద్వారా ఎక్కువ మంది వైరస్ సోకకుండా అరికట్టవచ్చని తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో 23,495 కరోనా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 10,141 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వైరస్ తో 184 మంది మృతిచెందినట్లు సమాచారం. తమిళనాడు ప్రభుత్వం తాజా నిబంధనలు పట్ల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి.