Home Blog Page 8363

లెజెండరీ సింగర్ కరోనాని జయిస్తున్నారు !


లెజెండరీ సింగర్ సినీ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం పై తాజా అప్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు ఎస్పీ శైలజగారు. బాలుగారికి వెంటిలేషన్ తొలిగించారని.. ఆయన ఆరోగ్యం పై డాక్టర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని.. రోజురోజుకు అన్నయ్య ఆరోగ్యం కుదటపడుతూ ఉందని.. అన్నయ్య కోసం ప్రార్ధనలు చేసిన అందరికీ కృతజ్ఞతలని.. ఎస్పీ శైలజగారు స్పష్టం చేశారు. మొత్తానికి బాలుగారు ఆరోగ్యం కుదుటపడటంతో ఆయన కోట్లాది అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన స్పృహలోకి వచ్చారని మరికొద్ది రోజుల చికిత్స తర్వాత ఆయన పూర్తిగా కోలుకుంటారని డాక్టర్స్ కూడా చెప్పడంతో అందరూ ఆనందంగా ఫీల్ అవుతున్నారు.

Also Read: మల్టీస్టారర్ రాక పై ఫేక్ రూమర్స్ !

అయితే నిన్న రాత్రి బాలుగారు ఆరోగ్యం అత్యంత విషమంగా మారిందనే విషయం బయటకు రావడంతో ఆయన అభిమానులతో పాటు యావత్తు సినీ లోకమంతా తీవ్ర ఆందోళనకు గురైయ్యారనే విషయంతో పాటు, బాలుగారి ఆరోగ్యం విషమించినట్లు చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రి నిర్వాహకులు నిన్న రాత్రి విడుదల చేసిన అప్ డేట్ ను కూడా మేము ఈ ఉదయం రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాలుగారి ఆరోగ్యం పై లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఆయన త్వరగా కోలుకుంటున్నారు.

Also Read: బ్రేకింగ్ : ‘ప్రభాస్’ నుండి బిగ్ అనౌన్స్ మెంట్ !

ఇప్పటికే బాలుగారి ఆరోగ్యం పై ప్రముఖుల సైతం తమ అభిమాన గాయకుడు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ బలంగా కోరుకోనుకున్నారు. అలాగే లక్షలాది అభిమానులు బాలుగారి ఆరోగ్యం కోసం చేసిన పూజలు కూడా ఫలించాయి. బాలుగారు సంపూర్ణ ఆరోగ్యంతో కరోనాని జయిస్తున్నారు. ఇది సంగీత ప్రపంచానికి ఎంతో శుభవార్త.

ఏపీ రాజధానిపై సుప్రీంలో కీలక పరిణామం.. వెనుక కథేంటి?


ఏపీలో మూడు రాజధానుల కేసు విచారణలో భాగంగా ఇవాళ సుప్రీం కోర్టులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఏపీ గవర్నర్ ఆమోదించిన ఈ మూడు రాజధానుల బిల్లులపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. అయితే ఈ కీలకమైన ఏపీ తలరాతను మార్చే పీటీషన్ కావడంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేతోపాటు ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, వి.రామసుబ్రహ్మణియన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటీషన్ విచారిస్తోంది.

Also Read: ఫోన్ ట్యాపింగ్: చంద్రబాబుకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన జగన్

అయితే విచారణ సందర్భంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ లేవనెత్తిన ఓ అభ్యంతరంతో విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.

సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఏ తీర్పులకైనా అత్యున్నత బాధ్యతాధికారి. అయితే ఆయన కూతురునే రంగంలోకి దింపారు అమరావతి రైతులు. సుప్రీంలో 3 రాజధానులపై వాదించేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే కూతురు కావడం గమనార్హం. బాబ్డే కూతురు ఏపీ రాజధాని రైతుల తరుఫున వాదిస్తున్నట్టు న్యాయవాది రంజిత్ కుమార్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో తాను ఈ విచారణను నుంచి తప్పుకుంటున్నట్టు బాబ్డే ప్రకటించారు. ఈ కేసును వేరే బెంచ్ కు బదిలీ చేయాలని సుప్రీం రిజిస్ట్రార్ ను ఆదేశిస్తూ బుధవారానికి విచారణను వాయిదా వేశారు.

రైతుల తరుఫున కింది కోర్టుల్లో వాదిస్తున్న లాయర్ తన కూతురే కాబట్టి ఈ కేసులో తాను ఇచ్చే ఆదేశాలపై ఆ ప్రభావం పడకుండా జస్టిస్ బాబ్డే ఇలా నిక్కచ్చిగా వ్యవహరించారు.

Also Read: రూ.5 కోట్లు లంచం తీసుకున్న తహసీల్దార్?

ఏపీ తలరాతను మార్చే కీలక కేసు కావడంతో ధర్మాసనం కూడా రాగద్వేశాలకు అతీతంగా ఈ కేసు నుంచి తప్పుకుంది. సుప్రీం చీఫ్ జస్టిస్ బాబ్డే సంచలన నిర్ణయంతో ఈ కేసు విచారణపై ప్రభావం పడకుండా చూసుకున్నారు.

అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైన కేసులో సుప్రీం చీఫ్ జస్టిస్ కూతురునే రాజధాని రైతులు లాయర్ గా పెట్టుకోవడం వెనుక ఏదైనా మతలబు ఉందా అన్న అనుమానాలను వైసీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కేసును మేనేజ్ చేసి అనుకూలంగా తీర్చు తెచ్చుకోవడానికే ఇలా చేశారా అన్న అనుమానాలు లేకపోలేదు. ఏది ఏమైనా ఇలా కీలక కేసు నుంచి చీఫ్ జస్టిస్ బాబ్డే తప్పుకోవడం నిజంగానే గొప్ప పరిణామంగా కనిపిస్తోంది. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది వేచిచూడాలి..

కరోనా వైరస్ వాళ్లకు వ్యాపించదు.. ఎందుకంటే?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాలుస్తోంది. ప్రతిరోజూ అంచనాలకు అందని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ పై శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు సీటిల్ నుంచి చేపల బోటులో ప్రయాణం చేసిన ముగ్గురికి కరోనా ఎందుకు సోకట్లేదని పరిశోధనలు చేయగా కొత్త విషయం తెలిసింది.

వాళ్లకు అప్పటికే కరోనా సోకి కోలుకున్నారని… కరోనా సోకినా వాళ్లకు ఆ విషయం తెలియలేదని… ఒకసారి కరోనా సోకిన వారికి మరోసారి వైరస్ సోకట్లేదని తేల్చారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో భారీ స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని… అందువల్లే వాళ్లు కరోనా బారిన పడట్లేదని శాస్త్రవేత్తలు తేల్చారు. సీటీల్ నుంచి 122 మంది వెళ్లిన బోటులో 104 మందికి ఒక వ్యక్తి నుంచి కరోనా సోకింది.

యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, మెడికల్ క్లినికల్ వైరాలజీ లాబొరేటరీ అసిస్టెంట్ డైరెక్టర్ అలెగ్జాండర్ గ్రెనింజర్ కరోనా నుంచి కోలుకున్న వారికి వైరస్ సోకుతుందా…? లేదా…? అనే విషయాలపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని తెలిపారు. బోటులో 18 మందికి కరోనా సోకలేదని…. వారిలో 15 మంది ఎవరితో సన్నిహితంగా మెలగలేదని శాస్త్రవేత్తలు చెప్పారు. ముగ్గురికి మాత్రం అప్పటికే కరోనా సోకి తగ్గడంతో వైరస్ నిర్ధారణ కాలేదని… దీంతో కరోనా సోకిన వాళ్లకు మళ్లీ వైరస్ సోకే అవకాశాలు లేవని తెలుస్తోందని అభిప్రాయపడ్డారు.

బ్రెయిన్ స్ట్రోక్‌ అరికట్టే ఆహారం ఇదే!

ఈ మధ్య కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ వల్ల బాధ పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏ వ్యాధి వచ్చినా భరించడం సాధ్యం అవుతుందేమో కానీ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కలిగే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారు పడే బాధ వర్ణణాతీతం. ఎంతటి మనిషినైనా బ్రెయిన్ స్ట్రోక్ అటు శారీరకంగా ఇటు మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. మన శరీరంలోని రక్తనాళాలలో అవరోధాలు ఏర్పడితే బ్రెయిన్ స్ట్రోక్ సమస్య వస్తుంది.

మెదడుకు జరిగే రక్త సరఫరాలో అంతరాయం కలిగితే బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడతాం. గుండె జబ్బులు, మధుమేహం, రక్త పోటు, ఊబకాయం, పొగ త్రాగటం, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు బ్రెయిన్ స్ట్రోక్ కు ముఖ్య కారణాలు. ముఖం వేలాడిపోవడం, చేతుల్లో ఇబ్బంది, మాట్లాడటంలో ఇబ్బంది, సమతౌల్యం కోల్పోవడం, తీవ్రమైన తలనొప్పి, కళ్లు తిరగడం, చూపు మందగించటం బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు.

చాలా సందర్భాల్లో బ్రెయిన్ స్ట్రోక్ లాంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడితే మనిషి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే మన డైట్ లో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు. ప్రతిరోజూ పాలు, పెరుగు, జున్ను, పండ్లు మన ఆహారంలో భాగం కావాలి. కోడిగుడ్లు, కూరగాయలను తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిలో ఉండే ఫైబర్ బ్రెయిన్ స్ట్రోక్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

వామ్మో.. కొత్తగా 10 రెట్లు పవర్‌ఫుల్ కరోనా వైరస్!

ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. ప్రతిరోజూ అంచనాలకు అందని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. శాస్త్రవేత్తల అధ్యయనాల్లో ఈ వైరస్ కు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో శాస్త్రవేత్తల పరిశోధనల్లో కరోనా వైరస్ లలో 60 రకాలు ఉన్నాయని… ఈ వైరస్ లు వాతావరణ పరిస్థితులను బట్టి తమ రూపురేఖలను మార్చుకుంటాయని తేలింది.

తాజాగా మలేషియా శాస్త్రవేత్తలు అలా రూపాంతరం చెందిన కరోనా వైరస్ ను కనిపెట్టారు. భారత్ కు వెళ్లి మలేషియాకు తిరిగొచ్చిన వ్యక్తిలో రూపాంతరం చెందిన వైరస్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆయన నుంచి మరికొందరికి వైరస్ సోకింది. అయితే శాస్త్రవేత్తలు ఆ వ్యక్తికి సోకిన రూపాంతరం చెందిన వైరస్ చాలా ప్రమాదకరమని… 10 రెట్లు వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతుందని తేల్చారు. రూపాంతరం చెందిన వైరస్ లను వ్యాక్సిన్లు చంపగలవో లేదో చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ రూపాంతరం చెందిన వైరస్ కు d614g అనే పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. అమెరికా, యూరప్ లలో రూపాంతరం చెందిన వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని మలేషియా హెల్త్ జనరల్ డైరెక్టర్ నూర్ హిషమ్ అబ్ధుల్లా తెలిపారు. ప్రజల సహకారం లేనిదే కరోనాను కట్టడి చేయలేమని… ప్రజలు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫోన్ ట్యాపింగ్ వెనుక ఐఎఎస్ అధికారి?


రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్ఛనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం వెనుక ఒక ఐఎఎస్ అధికారి ముఖ్యపాత్ర పోషించారనే వాదనలు వినిపిస్తున్నాయి. హై కోర్టు న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ పై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం విధితమే. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఈ రోజు విచారణ నిర్వహించారు. ఇది కేవలం ఒక పత్రికలో వచ్చిన కథనం మాత్రమేనని ప్రజా ప్రయోజన వ్యాజ్యం కిందకు ఇది రాదని ప్రభుత్వం తరుపు న్యాయవాదులు వాధించారు. పత్రిక యాజమాన్యాన్ని పార్టీగా చేర్చాలని కోరారు. ధర్మాసనం ఆ వాదనలతో ఏకీభవించలేదు.

Also Read: మల్టీస్టారర్ రాక పై ఫేక్ రూమర్స్ !

హై కోర్టులో ధర్మాసనం పిటీషనర్ తరుపు న్యాయవాది శ్రావణ్ కుమార్ ని ట్యాపింగ్ కు సంబంధించి ఆధారాలు సమర్పించాలని కోరింది. ఈ వ్యవహారం వెనుక ఐఎఎస్ అధికారి ఉన్నారని పిటీషనర్ తరుపు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. ఆ అధికారి ఎవరనేది చెప్పమని కోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని ధర్మాసనానికి విన్నవించారు. న్యాయమూర్తులపై ప్రభుత్వం టార్గెట్ చేసిందని, గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు మూలంగా చెప్పవచ్చని తెలిపారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పోస్టులు, నిమ్మగడ్డ కేసులో తీర్పు ఇచ్చినప్పడు మంత్రి, ఎంపీ చేసిన వ్యాఖ్యలు, ఇతర అంశాలను ప్రస్తావించారు. ట్యాపింగ్ వెనుక ప్రభుత్వం ఉందని వాదించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సర్వీసు ప్రోవైడర్ కౌంటర్ అఫిడవిట్ 20వ తేదీలోగా దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వ వాదనలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

Also Read: బ్రేకింగ్ : ‘ప్రభాస్’ నుండి బిగ్ అనౌన్స్ మెంట్ !

పిటీషనర్ తరుపు న్యాయవాది శ్రావణ్ కుమార్ కోర్టుకు సమర్పించే అఫిడవిట్ లో ట్యాపింగ్ వెనుక ఉన్న ఐఎఎస్ అధికారి వివరాలు, ఇతర ఆధారాలు సమర్పించాల్సి ఉంది. దీంతో ఇప్పుడు ఐఎఎస్ అధికారుల్లో ఈ వ్యవహారం కలకలం చోటు చేసుకుంది. దీని వెనుక ఉన్న ఐఎఎస్ ఎవరనే అంశం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. ఈ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నా హై కోర్టు తీవ్రంగానే పరిగణిస్తుంది. విచారణలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ తరుపు న్యాయవాది వాదలను వినిపిస్తుండగా మీరు ఏం చేసినా మేము చూస్తూ కూర్చోవాలా అంటూ వ్యాఖ్యానించింది. మీరు విచారణ ఎందుకు జరపలేదని ప్రశ్నించింది. దీంతో న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ ను హై కోర్టు తీవ్రంగానే పరిగణిస్తుందనే విషయం స్పష్టం అవుతుంది.

ప్రధానికి లేఖతో బాబు అబాసు పాలయ్యారా?


ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించిన ప్రతిపక్షనేత చంద్రబాబు తానే ఇరకాటంలో పడ్డారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీకి బాబు లేఖ రాశారు. ఈ లేఖలో ముందుగా ప్రధాని ఘనతను గొప్పగా చెప్పిన చంద్రబాబు అనంతరం ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు ఈ వ్యవహారం కాలరాస్తుందని ట్యాపింగ్ పై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు ఈ లేఖ బీజేపీ నాయకులకు అస్త్రంగా మారింది.

Also Read: ఫోన్ ట్యాపింగ్: చంద్రబాబుకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన జగన్

టీడీపీ, బీజేపీ రెండు పార్టీలు 2014 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. మంత్రివర్గంలోను రెండు పార్టీలు భాగం పంచుకున్నాయి. తాను గొప్ప రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నానని భావించిన బాబు… మూడేళ్ల అనంతరం బీజేపీతో తెగతెంపులు చేసుకుని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలకు బీజేపీని శత్రువుగా చూపుతూ ప్రధాని, బీజేపీపై కీలకమైన వ్యాఖ్యలు మీడియా సమావేశాల్లో చేశారు. ఒక సందర్భంగా ప్రధాని కుటుంబం లేదని, ఆయన భార్యను వదిలేశాడని వ్యక్తిగత విమర్శలు చేశారు.

Also Read: కారులో ముగ్గురు ఉండగానే తగలబెట్టేశాడు… విజయవాడలో దారుణం!

దీంతో ఇప్పడు బీజేపీ రాష్ట్ర ఉఫాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చంద్రబాబు వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. 2018 నుంచి 2019 మే వరకూ చంద్రబాబు ప్రధానిపై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. అవేంటంటే ‘‘నీకు కుటుంబం, బంధాలు లేవు, మా హక్కులు కాలరాశారు. మా అభివృద్దిని చూసి ఓర్వలేకపోతున్నారు. నీ కంటే నేనే ముందు సీఎం అయ్యాను, గుజరాత్ ని ఏం అభివృద్ది చేశావు? మీ రాష్ట్రం కంటే దక్షిణ భారత దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. మీకు మేము బానిసలం కాదు. మీరు పని చేసే పిఎం కాదు, మాకు పని చేసే ప్రధాని కావాలి’’ ఈ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తడం అవకాశవాదానికి నిదర్శనంగా పేర్కొన్నారు. ప్రధాని మోడీకి, బీజేపీకి మతిమరుపు లేదని ట్విట్ చేశారు. ట్యాపింగ్ పై ప్రధానికి లేఖ రాసి వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించిన బాబును బీజేపీ ఎండగట్టేస్తుంది.

ప్రభాస్ ‘ఏ- ఆదిపురుష్’ స్టోరీ అండ్ బడ్జెట్ సీక్రెట్స్ !


డార్లింగ్ ప్ర‌భాస్ కాస్త నేషనల్ స్టార్ ప్రభాస్ గా మారేసరికి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల‌తో.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ రేంజ్ ని పెంచుతూ పోతున్నాడు. ప్రభాస్ సినిమా అంటే.. ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల టాలెంట్ కి గుర్తింపు అన్నట్టుగా భావిస్తున్నారు బాలీవుడ్ జనం. ప్రస్తుతం నాగ్ అశ్విన్ తో ప్ర‌భాస్ చేస్తున్న తన 21వ సినిమాకే బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ క్రియేట్ అయింది అనుకుంటే.. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్ తో మరో భారీ సినిమాని ప్ర‌క‌టించి.. బాలీవుడ్ స్టార్స్ కి కూడా పోటీ ఇచ్చేలా ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

Also Read: మల్టీస్టారర్ రాక పై ఫేక్ రూమర్స్ !

అసలు ప్రభాస్ ప్రకటించిన “ఏ- ఆది పురుష్” అనే టైటిలే కొత్తగా ఉంది. పైగా ఈ చిత్రాన్ని దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారట. నిజంగా బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ఏ బాలీవుడ్ స్టార్ తోనో చేయకుండా, సౌత్ హీరోతో చేయడం నిజంగా ప్రభాస్ స్టార్ డమ్ కి దక్కిన గౌరవమే. పైగా ఈ సినిమాని 3డి విజువ‌ల్ గ్రాఫిక్స్ తో ఒక మ‌హ‌దాద్భుతంగా తెర‌కెక్కించి దేశంలోని అన్ని భాష‌లతో స‌హా విదేశాల్లోనూ అనువాదం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా స్టోరీ పై అలాగే ప్రభాస్ క్యారెక్టర్ పై అప్పుడే ఒక ఇంట్రస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది.

హాలీవుడ్ మూవీ `ది ఇమ్మోర్ట్స్ ఆఫ్ మెలుహా` సినిమాలోని మెలుహ పాత్రల శైలిలో ప్రభాస్ పాత్ర సాగుతోందట. ఇంతకీ ఈ మెలూహ అంటే నాగుల ర‌హ‌స్యం అన్నమాట. ఇప్ప‌టికే రిలీజైన పోస్టర్ లోని ఒక లుక్ చూస్తుంటే.. మెలూహ త‌ర‌హా లుక్ లానే అనిపిస్తుంది. అయితే ప్రభాస్ ఈ సినిమాలో మూడు పాత్రాల్లో కనిపిస్తాడని.. మెలుహా ల్యాండ్స్ లో సాగే ఈ క‌థ‌లో శివుని పాత్రలో ప్రభాస్ ను విజువ‌ల్ వండ‌ర్ గా చూపించబోతున్నారని.. అలాగే శివుని పూజించే మెలుహ‌న్స్ క‌థాంశమే ఈ సినిమా అని, అయితే ప్రభాస్ యోధుడు పాత్రతో పాటు మహాదేవుడి పాత్రలోనూ కనిపిస్తాడని తెలుస్తోంది.

Also Read: ఆర్ఆర్ఆర్ కు రైటర్ రాజమౌళి భార్య.. మరి సాయి మాధవ్‌?

అలాగే రామాయ‌ణ ఇతిహాసంలోని ఒక ముఖ్యమైన ఘట్టం ఆధారంగా ఈ సినిమాలోని చాలా భాగం ఉంటుందనే ప్ర‌చారం కూడా వినిపిస్తోంది. అందుకే పోస్టర్ లో హనుమాన్ గెటప్ పెట్టారట. పైగా ప్ర‌భాస్ ఈ చిత్రంలో హనుమాన్ పాత్ర‌లో కనిస్తాడ‌ని.. కాకపోతే ప్రభాస్ హనుమాన్ గా సినిమాలో కొద్దిసేపు మాత్రమే కనిపిస్తాడని.. పూర్తిగా రామాయ‌ణ క‌థ కాదు కాబట్టి.. అందులోని ఓ సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్ ని తీసుకుని.. సెకెండ్ హాఫ్ లో వచ్చే కీలకమైన సీక్వెన్స్ లో ఆ హనుమాన్ ఎపిసోడ్ పెడతారని తెలుస్తోంది.

గొప్పతనంలో మెగాస్టార్.. మె..గా..స్టా..రే ?


గత ఐదు నెలలు నుండి కరోనా మహమ్మారితో తీవ్ర సంక్షోభం.. నిస్సహాయతలో కొట్టుమిట్టాడుతున్న సినీ కార్మికుల ఆర్ధిక ఇబ్బందులు.. అతలాకుతలం అయిపోతున్నా జీవితాలు.. వీరందరికీ దేవుడు ఇప్పుడు మెగాస్టార్ మాత్రమే. సినిమా జనం పస్తులు పడకుండా వారి ఆకలి కన్నీళ్లు తుడుస్తున్నాడు మెగాస్టార్. కడుపు ఆకలి గోల గురించి కృష్ణా నగర్ లో కథలు కథలుగా వినిపించాల్సిన ట్రాజెడీ కథలకు.. మెగాస్టార్ హ్యాపీ ఎండింగ్ ఇస్తున్నారు. ఆపదలో ఆదుకుని గుప్పెడు సాయం చేసేవాడే దేవుడు అయితే, మెగాస్టార్ దేవుడే. ఒక పూట భోజనం పెడితేనే గొప్ప పని చేసినట్టుగా ఫీల్ అయ్యే జనం ఉన్న ఈ రోజుల్లో దాదాపు నాలుగు నెలలు నుండి సుమారు 11 వేలమందికి ఆకలి తీరుస్తున్నాడు మెగాస్టార్.

Also Read: బ్రేకింగ్ : ‘ప్రభాస్’ నుండి బిగ్ అనౌన్స్ మెంట్ !

కరోనా నుండి తెలుగు సినీ కార్మికులకు ఉపశమనం కలిగించడానికి కరోనా క్రైసిస్ ఛారిటీ పెట్టారు మెగాస్టార్. ఇప్పటికే రెండు సార్లు సరుకులు ఇచ్చిన మెగాస్టార్, ఈ రోజు మళ్ళీ మూడోసారి కూడా కార్మికులకు సరుకులను పంపణి చేస్తున్నారు. కష్టకాలంలో ఆయన చేస్తున్న ఈ సేవకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఈ విషయంలో మెగాస్టార్ కి సినీ కార్మికులు జీవితాంతం రుణపడి ఉంటారు. అలాగే ఫండ్స్ ఇచ్చిన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, బన్నీ, బాలయ్య, ప్రభాస్, నాగార్జున, నారా రోహిత్, కార్తికేయ, కొరటాల శివ, వినాయక్ , విశ్వక్ సేన్ లాంటి ప్రముఖులను కూడా ప్రత్యేకంగా అభినందించి తీరాలి.

Also Read: గాన గంధర్వుడి ఆరోగ్యం అత్యంత విషమం !

సినిమా ఇండస్ట్రీలో అందరూ ఎప్పుడూ ఒక్కటిగా ఉండరు అంటారు, నిజమే కావొచ్చు.. కానీ.. జనం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం అందరూ ఒక్కటై సాయం చేయడం అభినందనీయం. మెగాస్టార్ సార‌థ్యంలో నడుస్తోన్న ఈ క‌రోనా క్రైసిస్ చారిటీ కష్టాల్లో ఉన్న సినీకార్మికుల్ని గుర్తించి ఇలాగే ఆదుకోవాలని ఆశిద్దాం. అయితే ఏ క్రాఫ్ట్ లో మెంబర్ కాని వేల మంది సినీ కార్మికులకు మొదటి నుండి ఎలాంటి సాయం అందట్లేదనే విషయం, ఇప్పటికే వీరి పరిస్థితి అగమ్యగోచరంగా ఉందనే విషయం మెగాస్టార్ కి చేరాలి. వీరికి కూడా మెగాస్టార్ నుండి సాయం అందాలని కోరుకుందాం.

“చంద్రబాబు ని ఎందుకు బిజెపి ఏమీ అనకూడదు…?” ఈ ఏడుపు ఎవరిది?

BJP poll manager Somu Veerraju questions Telugu Desam's interest ...

ఇప్పటివరకూ ఏపీ బీజేపీ సోము వీర్రాజు నూతన అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అయితే చాలామంది అధికారపక్షాన్ని ప్రశ్నించడం మానేసి ప్రతిపక్షం పై వీరి అజమాయిషీ ఏంటి అని…. ఎన్నో స్టేట్మెంట్ లు ఇవ్వటం మొదలు పెట్టారు. అయితే వాటన్నింటికి ఇప్పుడు నేరుగా బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు సమాధానం ఇచ్చారు.

రాష్ట్రం ఇప్పటి వరకూ చంద్రబాబు డైరెక్షన్ లోనే అంతా సాగిందని…. ముందుగా అంతటి మహోన్నత నాయకుడు ఎన్టీఆర్ ను మోసం చేసి తెలుగుదేశం పార్టీకి తన ముఖచిత్రాన్ని అంటించుకున్న చంద్రబాబు ఆ తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి చేత ఒక పత్రిక, ఒక మీడియా సంస్థను పెట్టించే స్థితి దాకా తీసుకుని వచ్చారని…. అలాంటి బాబుని తాము ఎందుకు ఏమీ అనకూడదు…? అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసే అవకాశవాద రాజకీయాలు…. ఈ మాటలు వింటున్న వారికి కనిపించడం లేదా అని ప్రశ్నించిన వీర్రాజు…. 2004లో తమతో కూటమికి సముఖత చూపించిన వారు 2014లో కేంద్రంలో తాము బలపడగా…. అప్పుడు వారే ఎగబడి తమతో జతకట్టేందుకు వచ్చారని ఆయన స్పష్టం చేశారు.

https://www.facebook.com/somuveerrajubjp/videos/808241173047874/

బాబుకి ఉగ్గుపాలతోనే అబద్ధాలను పట్టారని…. వాటన్నింటికీ మనం రోజులు  ఇన్ని ‘ఊ’ కొడుతూ ఉన్నామని చురకలు అంటించారు. 2014 లో మా కారణంగా గెలిచి ఆ తర్వాత సోనియా, రాహుల్ భుజాన చేతులు వేసిన చంద్రబాబు ఎంతో నిస్సిగ్గుగా మళ్లీ బీజేపీ తో కలవడానికి ప్రయత్నించడం ఏమిటని…. అటువంటి వ్యక్తిని విమర్శించడం ఎలా తప్పు అవుతుందని వీర్రాజు అడిగారు. ఇక చాలామంది బిజెపి చివరికి ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు అయినా తప్పక చంద్రబాబు తో కలుస్తుంది అన్న మాటలకి చివరికు జరిగేది ఏమిటో చూసేందుకు శాంతంగా వేచి ఉండాలని హితవు పలికారు.

అలాగే గతంలో కూడా బిజేపి కి వాజ్ పయ్ ద్వారా కేంద్రంలో మంచి ఓటు బ్యాంకు వచ్చిన తర్వాతే.. బాబు తమతో జత కట్టాడు అని…. అందుకు ముందు, ఆ తర్వాత బాబు సందర్భానుసారంగా ప్లేటు మార్చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశాడు. ఇక ఇలా ప్రతిసారి వారు తమ అవసరం కోరుకోవడమే తప్పించి…. తమకు వారి అవసరం ఏమీ లేదని స్పష్టం చేసి బాబు చేసే ఇటువంటి కుట్రపూరిత రాజకీయాలను తిప్పికొట్టడం తప్పు అని అనడం ఏమిటో తనకు అర్థం కావడం తన వాదనను ముగించారు.

మా సత్తా చూపించేందుకు ఈ సమయం చాలు : సోము వీర్రాజు

AP BJP MLC Somu Veerraju not a favourite of all

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతనాధ్యక్షుడు సోము వీర్రాజు గత కొద్ది రోజుల నుండి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ జర్నలిస్ట్ సాయి తో వీర్రాజు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి పార్టీ స్టాండ్ ఏమిటి…. అసలు వారు ఏ వ్యూహంతో బరిలోకి దిగుతున్నారు అన్న విషయాలపై వివరణ ఇచ్చారు. వాటిలో మచ్చుకు కొన్ని…

బిజెపి ప్రతిపక్షంగా రాష్ట్రంలో ఎదగాలనుకుంటుందా లేదా నేరుగా అధికారపక్షం స్థానాన్నే కైవసం చేసుకోవడమే వచ్చే ఎన్నికలలో టార్గెట్ గా పెట్టుకుందా అన్న ప్రశ్నకు సోము వీర్రాజు ఎంతో నమ్మకంగా…. మేము రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిపక్షంగా వ్యవహరించాలని నిర్ణయించుకుని.. ఆ తర్వాత అధికార పక్షాన్ని ఆ స్థానం నుండి దించివేసే దిశగా అడుగులు వేసినట్లు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే తాము ఒక పార్టీ గా మరింత బలపడుతున్నామని… తమ వ్యూహాలు తమకు ఉన్నాయని… ఒక సంవత్సరంలో బిజెపి పార్టీ ని అందరూ మరింత గుర్తించే స్థాయికి వారు ఎదగనున్నట్లు తెలిపారు.

https://www.facebook.com/somuveerrajubjp/videos/808241173047874/

ఇక బీజేపీ రాజ్యసభ సభ్యుల్లో పార్టీ పట్ల…. రాష్ట్ర పార్టీ ప్రయోజనాల ద్వంద్వ వైఖరి ఉంది అన్న ఆరోపణలపై వీర్రాజు స్పందించారు. ద్వంద్వ వైఖరి అనేది ఏనాటికి ఉండదని…. అందరూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే…. ప్రజల అవసరాల మేరకే నడుచుకుంటారు కానీ భిన్నాభిప్రాయాలు అనేవి ఎక్కడైనా ఉంటాయని… పర్సనల్ అభిప్రాయాలను పక్కన పెడితే పార్టీ అంతా కలిసి తీసుకున్న స్టాండ్ కి ఎప్పుడూ వారి నేతలు మద్దతు పలుకుతూనే ఉన్నారు అని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి తమకు చాలా వ్యూహాలు ఉన్నాయని… కేవలం అతికొద్ది కాలంలోనే తమ శక్తిని నిరూపించుకుంటామని అన్నారు. ఒక సంవత్సరం తర్వాత ఏపీ బిజేపీ వేరొక లెవల్ లో ఉంటుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

జర్నలిస్టు సాయి మాట్లాడుతూ అధికార పక్షానికి 51 శాతం ఓటు బ్యాంకు… ప్రతిపక్షానికి 41 శాతం ఓటు బ్యాంకు ఉన్న దశలో బిజెపి వారు ఎవరి ఓటుబ్యాంకు ని టార్గెట్ చేస్తున్నారని అడిగారు. ప్రస్తుతం బీజేపీ ఓటు బ్యాంకు చాలా తక్కువగా ఉంది అని ఆయన గుర్తు చేసిన నేపథ్యంలో… రెండు పార్టీల నుండి తాము సమాన శాతంలో ఓట్లను కొల్లగొట్టగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇంటర్వ్యూ ఆద్యంతం సోము వీర్రాజు మాటల్లోనే ఖచ్చితత్వం, ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనపడ్డాయి. మొత్తానికి ఏపీ బీజేపీ రాష్ట్రంలో ఇప్పటికే టీడీపీని పూర్తి స్థాయిలో రూపుమార్పగా…. ఇప్పుడు వీర్రాజు మాటలతో రానున్న రోజుల్లో అనేక కొత్త వ్యూహాలతో అధికారపక్షం మీదకి వెళుతుందని అర్థమవుతుంది.

ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన హోమంత్రి అమిత్ షా..!

కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా మరోసారి ఆస్పత్రిలో చేరారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన అమిత్ షా ఇటీవలే వైరస్ నుంచి కోలుకున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ నిర్ధారణ అయింది. అయితే వైరస్ నుంచి కోలుకున్న కొన్ని రోజులకే ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరడం గమనార్హం. ఎయిమ్స్ ప్రత్యేక వైద్యులు బృందం అమిత్ షా ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది.

రాత్రి 2 గంటల సమయంలో అమిత్ షా ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఎయిమ్స్ ప్రత్యేక వైద్యుల బృందం అమిత్ షా ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. ఢిల్లీలోని మేదాంత హాస్పిటల్‌లో అమిత్ షా కరోనా కోసం చికిత్స తీసుకోగా ఈ నెల 14వ తేదీన ఆయనకు కరోనా నెగిటివ్ నిర్ధారణ అయింది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు అమిత్ షా ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు.

గడిచిన మూడు నాలుగు రోజుల నుంచి ఒళ్లు నొప్పులు సహా ఇతర సమస్యలతో అమిత్ షా ఇబ్బందులు పడుతున్నాడని సమాచారం. ఎయిమ్స్ ఆస్పత్రి వర్గాలు తాజాగా పోస్ట్ కోవిడ్ చికిత్స కోసం ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలిపాయి. ఆయన ఆస్పత్రి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన తరువాత హోం ఐసోలేషన్ లో ఉండాలని నిర్ణయం తీసుకున్న అమిత్ షా మరోసారి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆస్పత్రిలో చేరారు.

కీసర ఎమ్మార్వో కేసులో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల టార్గెట్ రేవంతేనా?


కీసర ఎమ్మార్వో నాగరాజు అవినీతి కేసులో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల ఓ వివాదంలో కీసర తహసీల్దార్ నాగరాజు రూ.1.1కోట్ల లంచం తీసుకుంటూ పట్టుబడటం తెలంగాణలో సంచలనంగా మారిన సంగతి తెల్సిందే. 19ఎకరాల 39గుంటల భూమికి సంబంధించిన భూ సమస్యను పరిష్కరించేందుకు తహసీల్దార్ రూ.1.1కోట్ల లంచం డిమాండ్ చేశారు. తహసీల్దార్ లంచం తీసుకుంటుండగా పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు నాగరాజుతోపాటు వీఆర్ఏ సాయిరాజ్ ను అరెస్టు చేశారు. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి భారీగా నగదు, ఇతర ఆస్తికి సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించిన సంగతి తెల్సిందే.

Also Read: కేసీఆర్ సై అంటున్నాడు..! మరి జగన్ నై అంటాడా…?

ఈ కేసులో లంచమే 1.1కోట్లు ఉండటం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ కేసులో ప్రభుత్వమే రేవంత్ రెడ్డిని ఇరికించే ప్రయత్నాలు చేసినట్లుగా ప్రభుత్వం పకడ్బంధీ ప్రయత్నాలు చేసిందని ప్రచారం జరుగుతోంది. నాగరాజుతో డీల్ చేసుకునేందుకు యత్నించిన సదరు వెంచర్ అధినేతతో ఎంపీ రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ కేసులో రేవంత్ రెడ్డిని ఇరికించాలనే ప్రభుత్వం యత్నించిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారాన్ని ముందే గుర్తించి రేవంత్ ఈ వ్యవహారంలో పెద్దగా పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం ప్లాన్ బెడిసికొట్టినట్లు తెలుస్తోంది.

అయితే ఈకేసులో రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా వ్యవహరించిన అంజిరెడ్డి కారులో దొరికిన లెటర్ హెడ్స్ ఆధారంగా రేవంత్ ను బదానం చేసి అతడికి పీసీసీ పీఠం రాకుండా ప్రభుత్వం కాంగ్రెస్ నేతలకు సహకరిస్తుందనే టాక్ విన్పిస్తోంది. ఈమేరకు కాంగ్రెస్ సీనియర్లంతా రహస్య సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని రేవంత్ కు పీసీసీ దక్కకుండా కాంగ్రెస్ సీనియర్లు పావులు కదుపుతున్నారని సమాచారం. అంజిరెడ్డి కారులో దొరికిన ఎంపీ లెటర్ హెడ్‌లను బహిరంగ పర్చాలంటూ వీహెచ్ వంటి నేతలు డిమాండ్ చేస్తుండటం వెనుక సీఎం కేసీఆర్ హస్తం ఉందనే గుసగుసలు విన్పిస్తున్నాయి. రేవంత్ వ్యతిరేక వర్గం ఈ వ్యవహరంలో ఒక్కటే టీపీసీసీ చీఫ్ పదవీ రాకుండా ప్లాన్ చేస్తున్నారనే టాక్ విన్పిస్తుంది.

Also Read: బీజేపీ పాలన మరీ.. ప్రశ్నిస్తే కేసులు, జైలుకే.?

టీపీసీసీ చీఫ్ పదవీపై కన్నేసిన నేతలతోపాటు రేవంత్ వ్యతిరేకవర్గం ఒక్కటవుతోంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, వీహెచ్ నేతలంతా ఇప్పటికే రహస్యంగా భేటి నిర్వహించి రేవంత్ కు పీసీసీ రాకుండా ప్లాన్ చేస్తున్నారట. ఈ వ్యవహారంలో తాత్కాలికంగా గ్రూపు కట్టడం మానాలని నిర్ణయించుకున్నారట. పీసీసీ చీఫ్ పదవీ రేవంత్ కు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో రేవంత్ ఇటీవల ప్రభుత్వంపై దూకుడుగా వెళుతున్నారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే కీసర వ్యవహారంలో రేవంత్ ను కాంగ్రెస్ నేతలే ఇరుకునపెట్టి అతడికి పీసీసీ దక్కకుండా ప్లాన్ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఓవైపు ప్రభుత్వం.. మరోవైపు కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ టార్గెట్ చేస్తుండటంతో ఆయన ఏం చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.

టాలెంటెడ్ డైరెక్టర్ కి తీవ్ర అవమానం !


సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే విలువ. టైం కలిసి రాక ఒక సినిమా పరాజయం పాలైతే.. ఇక ఆ సినిమా డైరెక్టర్ ఎంత టాలెంటెడ్ అయినా సరే.. అంత తొందరగా ఆ డైరెక్టర్ కి అవకాశాలు రావు అని శ్రీకాంత్ అడ్డాల కెరీర్ ను చూస్తే అర్ధం అవుతోంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా అసురన్ సినిమాని తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేస్తున్నా.. శ్రీకాంత్ అడ్డాలకు ఈ సినిమా అంత తేలిగ్గా ఏం రాలేదు. బ్రహ్మోత్సవం ప్లాప్ తరువాత శ్రీకాంత్ కి ఈ సినిమా మొదలుపెట్టడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది. అదీ వెంకటేష్ సహాయంతో. వెంకీ పూనుకోకపోతే శ్రీకాంత్ ఇంకా ఖాళీగా ఉండేవాడేమో.

Also Read: బ్రేకింగ్ : ‘ప్రభాస్’ నుండి బిగ్ అనౌన్స్ మెంట్ !

ఇండస్ట్రీ మొత్తం నమ్మకం మీదే నడుస్తోంది అంటారు గానీ, అసలు ఇండస్ట్రీలో లేనిదే నమ్మకం.. లేకపోతే ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి చక్కటి కుటుంబ కథా చిత్రాలను తీసిన డైరెక్టర్ ను సెకెండ్ లెవల్ స్టార్ హీరోలు కూడా నమ్మకపోవడం.. పైగా ఏడాది నుండి తిప్పించడం ఎంత అవమానం. ఈ టాలెంటెడ్ దర్శకుడికి మంచి చిత్రాలు తీస్తాడనే మంచి పేరు ఉన్నా.. ఎందుకో ఫామ్ లో ఉన్న ఓ హీరో మాత్రం శ్రీకాంత్ కథను ఏడాది నుండి తిరస్కరిస్తూనే ఉన్నాడు. అలా అని సినిమా చెయ్యను అనడం లేదు. కథలో ఈ మార్పు చేయండి, ఆ మార్పు చేయండి అంటూ అనవసరమైన సలహాలు ఇస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.

Also Read: గాన గంధర్వుడి ఆరోగ్యం అత్యంత విషమం !

ఇప్పటికే కథ మీద మూడేళ్లు పని చేసాడు శ్రీకాంత్ అడ్డాల. దానికి తోడు లాక్ డౌన్ తో కలిసి వచ్చిన నాలుగు నెలల ఖాళీ సమయాన్ని కూడా ఈ కథ కోసమే వెచ్చించాడు. ఆ న్యాచురల్ స్టార్ మాత్రం కథ బాగుంది, మనం సినిమా చేయబోతున్నాం అని మాత్రం చెప్పడం లేదు. ఎప్పుడూ వెళ్లి కథ చెప్పినా.. కథలో కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేసుకున్నాక ముందుకు వెళ్దాం అంటున్నాడట. నిజానికి అవి డౌట్స్ కాదు, నారప్ప హిట్ అవుతుందా ప్లాప్ అవుతుందా అని అనుమానం. అందుకే ఆ హీరో ఏదొకటి చెప్పి.. సినిమాని మాత్రం కన్ఫర్మ్ చేయట్లేదు. ఇప్పటికైనా శ్రీకాంత్ అడ్డాల లాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ హీరోల చుట్టూ తిరగడం మానేయాలి. కొత్త వాళ్ళతోనైనా సినిమాలు చేసుకుంటూ పోవాలి. అప్పుడే ఈ హీరోలు దిగి వస్తారు.

ఫోన్ ట్యాపింగ్: చంద్రబాబుకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన జగన్


ఫోన్ ట్యాపింగ్.. టీడీపీ, దాని అనుకూల మీడియా లేవనెత్తిన ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు అధికార జగన్ ప్రభుత్వం మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. చంద్రబాబు మారు మాట్లాడకుండా గట్టి జవాబును ఏపీ డీజీపీ ద్వారా అందించింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు తాజాగా డీజీపీ లేఖ రాయడం సంచలనమైంది. ఇందులో ఏపీ పోలీసులు జోక్యం చేసుకోవడం అనూహ్య మలుపుగా రాజకీయవర్గాలు అభివర్ణిస్తున్నాయి.

Also Read: రూ.5 కోట్లు లంచం తీసుకున్న తహసీల్దార్?

అసలు వివాదం ఏంటంటే.. ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ప్రధాని నరేంద్రమోడీకి తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏపీలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పేర్కొన్న చంద్రబాబు.. రాజ్యాంగంలోని 19,21 ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లు ట్యాపింగ్ కు గురి అవుతున్నట్లు చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

కాగా చంద్రబాబు లేఖపై ఏకంగా ఏపీ రాష్ట్ర డీజీపీ స్పందించి కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబుకు ఆయన ప్రతి లేఖ రాశారు. వైసీపీ నేతలు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారనడానికి సాక్ష్యాధారాలు ఉంటే తమకు అందజేయాలని కోరారు. టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు రాసిన నేపథ్యంలో డీజీపీ ఈ సవాల్ చేయడం సంచలనమైంది. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి తాము కఠిన చర్యలు తీసుకుంటామని.. సమగ్ర దర్యాప్తు చేస్తామని.. దర్యాప్తుకు సహకరించాలని డీజీపీ తాజాగా చంద్రబాబుకు లేఖ లో కౌంటర్ అటాక్ చేశారు.

కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని గౌతమ్ సవాంగ్ గుర్తు చేశారు. అయితే ఆ గుర్తు తెలియని వ్యక్తులు తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1985, ఐటీ యాక్ట్ 2000 ప్రకారం సున్నితమైన అంశమని.. తాము దర్యాప్తు చేయడానికి సిద్ధమని డీజీపీ స్పష్టం చేశారు.

Also Read: కేసీఆర్ సై అంటున్నాడు..! మరి జగన్ నై అంటాడా…?

ఇక చివరగా ఫోన్ ట్యాపింగ్ పై ప్రధానికి లేఖ రాసిన చంద్రబాబు.. తమకు సాక్ష్యాధారాలు అందజేయాలని.. తాము దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలకు ఏకంగా అధికార పార్టీ కానీ… సీఎం జగన్ కానీ స్పందించకుండా ప్రభుత్వ అత్యున్నత అధికారి డీజీపీ రంగంలోకి దిగి చంద్రబాబును.. ఆయన మీడియాను ఇరుకునపెట్టడం రాజకీయవర్గాల్లో సంచలనమైంది. త్వరలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ గుట్టును ఏపీ పోలీసులు ఛేదిస్తారని అంటున్నారు. ఇది టీడీపీ వేసిన ప్లాన్ అయితే చంద్రబాబు ఇరుకునపడడం ఖాయమంటున్నారు. ఈ వివాదంపై ట్విట్టర్ లో స్పందించిన బీజేపీ నేత, మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణరావు.. ‘చంద్రబాబుకు ఇది మాస్టర్ స్ట్రోక్ ’ గా అభివర్ణించారు.

బీజేపీ పాలన మరీ.. ప్రశ్నిస్తే కేసులు, జైలుకే.?


మొన్న కత్తి మహేష్.. నేడు నటి మాధవీలత.. బీజేపీని.. హిందుత్వంను ప్రశ్నిస్తే కేసులు.. జైలుకే.. గత కాంగ్రెస్ పాలనకు.. ఇప్పటి బీజేపీ పాలనకు తేడా ఏంటంటే వాక్ స్వాతంత్ర్యం. అప్పుడు ఏం మాట్లాడినా లౌకిక వాదం అంటూ వదిలేశారు. కానీ ఇప్పుడు మాట్లాడితే జైలుకు పంపుతున్నారు.

బీజేపీ గెలిచిందే హిందుత్వ ఎజెండా మీద.. వారిది జాతీయవాదం.. హిందుత్వం పునాదులు అనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: కేసీఆర్ సై అంటున్నాడు..! మరి జగన్ నై అంటాడా…?

ఇటీవల హిందువులపై కామెంట్ చేసి.. దేవుళ్లపై తన అభిప్రాయాన్ని చెప్పిన వివాదాస్పద క్రిటిక్ కత్తి మహేష్ పై కేసు నమోదు కాగా.. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

ఇక తాజాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నటి మాధవీలత .. తన ఫేస్ బుక్ లో హిందువులపై కామెంట్ చేసిందని సమాచారం. అయితే ఈ కామెంట్స్ తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని హైదరాబాద్ వనస్థలిపురంకు చెందిన గోపీకృష్ణ అనే విద్యార్థి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సోమవారం నటి మాధవీలతపై 295-ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు.

Also Read: కరోనా ఎఫెక్ట్.. ఇంటికే గణేశుడు పరిమితం..!

ఇంతకుముందు కూడా హిందుత్వంపై చాలా మంది కామెంట్ చేసినా కేసుల వరకు పరిస్థితి వెళ్లలేదు. కానీ ఇప్పుడు కేసులు నమోదవుతుండడం చర్చనీయాంశమైంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక హిందుత్వ, జాతీయవాదం దేశంలో పెరిగిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదని మేధావులు చెబుతున్నారు. ఒకప్పుడు వాక్ స్వాతంత్య్రానికి ఎక్కువగా విలువనిచ్చే ఈ దేశంలో ఇప్పుడు ఒక వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు, అరెస్ట్ ల దాకా వ్యవహారం వెళుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మల్టీస్టారర్ రాక పై ఫేక్ రూమర్స్ !


గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న వార్త.. నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు కలయికలో రాబోతున్న మల్టీస్టారర్ ‘వి’ చిత్రం ఓటిటిలోకి రాబోతుందని. ఈ వార్త పై నిజం ఉందో లేదో తెలియకుండానే రూమర్స్ ను జనం మీదకు తెగ వదిలేస్తున్నారు రాతల రాయుళ్లు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ రూమర్లలో కనీస నిజం కూడా లేదని తెలుస్తోంది. నిజానికి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ఈ సినిమాకి భారీ మొత్తం ఆపర్ చేసినా ‘వి’ మూవీ మేకర్స్ మాత్రం ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారు. నేరుగా థియేటర్ ల్లో రిలీజ్ చేసి… ఆ తరువాత డిజిటల్ రైట్స్ ను అమ్ముకోవచ్చు అనేది మేకర్స్ ప్లాన్.

Also Read: బ్రేకింగ్ : ‘ప్రభాస్’ నుండి బిగ్ అనౌన్స్ మెంట్ !

అప్పుడు థియేటర్ల రెవిన్యూతో పాటు డిజిటల్, శాటిలైట్ రైట్స్ కు అదనంగా డబ్బులు వస్తాయి. అదే నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే.. థియేటర్ల రెవిన్యూని పోగొట్టుకున్నట్టే. అందుకే ఎంత భారీ ఆఫర్ వచ్చినా.. మేకర్స్ మాత్రం కమిట్ అవ్వట్లేదు. ఇక ఈ సినిమా కథకు ముగింపు లేదని.. అంటే సినిమా ముగిసిన చోట నుండే మరో కొత్త కథ స్టార్ట్ అయ్యేలా ఇంద్రగంటి తన కథను రాసుకున్నాడని తెలుస్తోంది. బహుశా ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన ఇంద్రగంటికి ఉండి ఉండొచ్చు. కానీ అది సాధ్యం అయ్యే పనేనా. ఇప్పటికే నాని, సుధీర్ బాబుల మధ్య ఇగో సమస్యలు వచ్చాయని.. అందుకే సినిమా ప్రమోషన్స్ లో కూడా సుధీర్ బాబు కనిపించట్లేదని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో ‘వి’ సినిమాకి సీక్వెల్ ఉండటానికి అవకాశం ఉన్నా నాని – సుధీర్ బాబు మళ్ళీ కలిసి పని చేస్తారా అంటే.. చెప్పలేం.

Also Read: బన్నీ మూవీలో సాహో భామ ఐటం సాంగ్‌?

ఒకవేళ ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే, సీక్వెల్ పై భారీ అంచనాలు ఉంటే.. అప్పుడు హీరోలు మళ్ళీ కలిసి పని చేసే అవకాశం ఉంటుంది. నువ్వా ? నేనా? అనేలా ఈ సినిమాలో యాక్ష‌న్ సీన్స్ చేసిన నాని, సుధీర్ బాబు మళ్ళీ కలిసి హ్యాపీగా పని చేస్తారు. ఏమైనా ఈ సినిమాలో.. నటనలో నాని డామినేట్ చేసినా.. యాక్షన్ సీక్వెన్స్ లో మాత్రం సుధీర్ బాబునే డామినేట్ చేస్తాడని.. సినిమాలో ఇద్దరి హీరోల పాత్రలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని తెలుస్తోంది. ఇంద్రగంటి అంటేనే వైవిధ్యం.. దానికి తోడు తన హీరోలను చాలా సహజంగా చూపిస్తాడనే నేమ్ ఉంది. అందుకే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. నిర్మాత దిల్‌రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లుగా ఈ సినిమా రానుంది.