Home Blog Page 8364

రూ.5 కోట్లు లంచం తీసుకున్న తహసీల్దార్?


రెవెన్యూ శాఖలో అధికారుల అవినీతి విషయంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణా రాష్ట్రంలో కీసర తహసీల్దార్ రూ.కోటి లంచం వ్యవహారం వెలుగులోకి వచ్చిన కొద్ది రోజుల్లో ఏపీలో ఇటువంటి వ్యవహారమే వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో చేతులు మారిన లంచం ఎంతో తెలిస్తే ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. రూ. 5 కోట్లు చేతులు మారాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

Also Read: Even Jr NTR has zero stamina to make TDP a Blockbuster?

నెల్లూరు జిల్లాలోని కలువాయి మండల తహసీల్దార్ గతంలో పని చేసిన మానికల ప్రమీల వెయ్యి ఎకరాలకు సంబంధించిన భూముల రికార్డులను తారుమారు చేశారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు వినతి ప్రతాన్ని సమర్పించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో గతంలోనే భూముల విషయంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. టిడిపి ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ ను అడ్డుపెట్టుకుని కొద్ది నెలల కిందట అసైన్డ్ భూములకు ఎన్ఓసి లు పొంది అక్రమంగా రిజిస్ట్రేషన్ లు చేయించిన సంఘటనపై కొద్ది రోజుల కిందట పలు ఆరోపణలు వచ్చాయి. నెల్లూరు ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఇందుకు మూలమనే వాదనలు వినిపించాయి.

Also Read: Yet another Rude Shock for Jagan from SC!

తెలంగాణాలో కీసర తహసీల్దార్ రూ.కోటి లంచం తీసుకున్నారనే విషయం వెలుగులోకి రావడంతో ఆశ్చర్యానికి గురవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలను నెల్లూరు జిల్లాలో కలువాయిలో పని చేసిన తహసీల్దార్ ఏకంగా రూ.5 కోట్లు లంచం తీసుకోవడం విశేషం. ఈ వ్యవహారాలను పరిశీలిస్తే భూముల విషయంలో ప్రభుత్వం ఎన్ని నూతన విధానాలు తీసుకువస్తున్నా రెవెన్యూ సిబ్బంది మాత్రం లంచాలు తీసుకోకుండా పని చేయడం లేదు. మరోవైపు గతంలో రూ.10 నుంచి లక్షల్లో లంచాలు తీసుకునే అధికారులు ఇప్పుడు కార్పోరేట్ సంస్థల నిర్వాహకులతో కుమ్మక్కై ఏకంగా రూ.కోట్లలోనే లంచాలు తీసుకోవడం భూముల యజమానులను ఆందోళనకు గురి చేస్తుంది.

కేసీఆర్ సై అంటున్నాడు..! మరి జగన్ నై అంటాడా…?

AP CM Jagan Mohan Reddy Praises Telangana CM KCR | Espicyfilms.com

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 7 వ తారీఖు నుండి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రారంభించాలని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు ఏర్పాటు చేసి కనీసం ఇరవై రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ కరోనా సమయంలో అసెంబ్లీ సమావేశాలు అనేవి అత్యంత కీలకమా అని అనుమానం రావచ్చు కానీ కరోనా ఉన్నా.. ఏ ఉపద్రవం వచ్చి జనాలను ముంచేసినా… వాటిని ఆపడానికి అవకాశం లేదు. ప్రత్యామ్నాయ పద్ధతులు ఎంచుకుని ప్రజాస్వామ్య ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే కోవిడ్ నివారణ నిబంధనలకు తగ్గట్టు భౌతిక దూరాన్ని పాటిస్తూ… సీటింగ్ ఏర్పాటు చేసి సమావేశాలను నిర్వహించాలని చూస్తున్నారు.

Also Read: కరోనా ఎఫెక్ట్.. ఇంటికే గణేశుడు పరిమితం..!

సాధారణంగా వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ మాసంలో నిర్వహిస్తూ ఉంటారు. అవి కూడా ఎక్కువ రోజులపాటు జరుగుతూ ఉంటాయి. పార్లమెంటు సమావేశాలు కూడా అటుఇటుగా ఇదే సమయంలో జరగాల్సి ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఇక ఎప్పటి నుంచి నిర్వహించాలనుకుంటున్న విషయంపై వారు ఇంకా వెల్లడించనేలేదు. అసలు అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు కనిపించట్లేదు. 

కరోనా కారణంగా భౌతికదూరం పాటిస్తూ నిర్వహించాల్సిన సమావేశాల కోసం చాలా ముందుగానే చాలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కనీసం ఒక నెల రోజుల ముందే అసెంబ్లీ లో ప్రస్తావించిన అంశాలను…. తీసుకుని రావాల్సిన తీర్మానాల గురించి హోంవర్క్ మొదలుపెడతారు ఎవరైనా. మరి ఏపీ సర్కారు అందుకు భిన్నంగా ఏమైనా ప్రవర్తించేందుకు సన్నాహాలు చేస్తోందా అన్న అనుమానం అందరిలో కలుగుతోంది.

Also Read: కారులో ముగ్గురు ఉండగానే తగలబెట్టేశాడు… విజయవాడలో దారుణం!

.ఇక ఈ విషయానికి వస్తే…. ఇప్పటికే మూడు రాజధానుల విషయం అటూ ఇటూ కాకుండా మధ్యలో ఆగిపోయింది. అసెంబ్లీలో అలాంటి అంశాన్ని లేవనెత్తి అక్కడ టైం వేస్ట్ చేసేటువంటివి అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి పూర్తి సన్నద్ధత తో ముందుకు వెళ్లాల్సిన ప్రభుత్వమే అందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం చూస్తుంటే…. ఇది ఏదో తేడా వ్యవహారంలాగానే ఉందని విశ్లేషకులు అంటున్నారు. కెసిఆర్ వచ్చే నెల ఏడో తేదీన ముహూర్తం పెట్టుకున్నాడు. ఎంతకాదన్నా వచ్చే నెలలోనే సమావేశాలు ఏపీలో కూడా అయిపోవాలి.  మరి జగన్ ఏమి ఆలోచిస్తున్నట్లు?

కారులో ముగ్గురు ఉండగానే తగలబెట్టేశాడు… విజయవాడలో దారుణం!

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ఉదంతం మర్చిపోకముందే ఇప్పుడు మరో ఘోరం చోటుచేసుకుంది. అయితే ఇది ప్రమాదం కాదు… హత్యాయత్నం! బెజవాడలో జరిగిన హత్యాయత్నం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ముగ్గురు వ్యక్తులు కారు లో ఉండగానే మరో వ్యక్తి కారు పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా నిందితుడు పరారీలో ఉన్నాడు. విజయవాడ డీఎస్పీ హర్షవర్ధన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Also Read: కేసీఆర్ సై అంటున్నాడు..! మరి జగన్ నై అంటాడా…?

ఇక వివరాల్లోకి వెళితే నగరంలోని ప్రముఖ నోవాటెల్ హోటల్ వద్ద జరిగిన ఈ సంఘటనలో ముందుగా ఆగి ఉన్న కారు వద్ద నలుగురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఇక స్థానికులు అందించిన సమాచారం ఏమిటంటే వీరు నలుగురూ ఒక ల్యాండ్ విషయమై కారులో కూర్చుని మాట్లాడుకుంటున్నారట. ఈ నలుగురి పేర్లు కృష్ణారెడ్డి, గంగాధర్, నాగమల్లి, వేణుగోపాల్ రెడ్డి గా గుర్తించారు. అయితే వాదన మధ్యలో వేణుగోపాల్ రెడ్డి ఏమైందో ఏమో తెలియదు కానీ బయటికి వచ్చి కార్ డోర్ లాక్ చేశాడు. వెంటనే కారు పై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Also Read: దెబ్బకి జగన్ పరువంతా పోయింది..! “నిండా మునిగిపోయాడు”

అంతే…. కారు డోర్ లాక్ చేసి ఉండడంతో మంటల్లో చిక్కుకొని లోపల ఉన్నవారంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పి వీరిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో నాగమల్లి, కృష్ణారెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనలో కారు మాత్రం పూర్తిగా దగ్ధమైంది. వీరి మధ్య పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా లేదా ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో వచ్చిన గొడవల వల్ల నే వేణుగోపాల్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడ్డాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే వేణుగోపాల్ రెడ్డి పరారీలో ఉన్నాడు. పోలీసులు సమాచారం అందుకున్న పిమ్మట ఈ సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు

దెబ్బకి జగన్ పరువంతా పోయింది..! “నిండా మునిగిపోయాడు”

కొద్ది రోజుల క్రితం ఆ భూముల్లో పేదలకు ఇల్లు ఇస్తున్నారని దీని వెనక వైసీపీ భారీ కుంభకోణం ఉందని విపక్షాలు గొంతెత్తి నినదించాయి. 10 లక్షలు ఖరీదు చేసే భూమి కి 40 లక్షలకు పైగా చెల్లిస్తున్నారని…. ఇందులో చాలా పెద్ద కుంభకోణం జరిగిందని.. ప్రభుత్వానికి భూములను వైసీపీ నేతలు వారి జేబులు నింపుకునేందుకు అమ్ముతున్నారు అని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని ఆవ భూముల విషయంలో ఇలా చాలా పెద్ద చర్చ జరిగింది.

Also Read: కారులో ముగ్గురు ఉండగానే తగలబెట్టేశాడు… విజయవాడలో దారుణం!

కానీ అధికార పార్టీ నేతలు ప్రభుత్వ అధికారులు చెప్పింది ఏమిటంటే… “అవి ఆవ భూములు కావు…. పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఈ భూములను ప్రత్యేకంగా ఎంపిక చేశాం. అవసరమైతే ఎత్తు పెంచుతాము.. మట్టి పోయిస్తాము..” అన్నారు. ఈ విషయమై ప్రభుత్వ శాఖల మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఇక ఈ సమయంలో జగన్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. వారి పరువు అంతా గోదావరిలో కొట్టుకుపోయింది.

గోదావరికి వరద వచ్చింది. ఆ భూముల్లో కి పెద్ద ఎత్తున నీళ్లు వచ్చేసాయి. మోకాలిలోతు కొన్ని చోట్ల.. మనిషి నిలువెత్తు మునిగిపోయే కొన్ని చోట్ల నీళ్లు దర్శనమిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసిన భూముల్లోనే ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు అసలు ఆవ భూములే తమ లిస్టు లో లేవని…. అవి ఆవ భూములు భూములు కాదని వారంతా ఒక్కసారిగా నోట్లో మూసేశారు.

Also Read: కేసీఆర్ సై అంటున్నాడు..! మరి జగన్ నై అంటాడా…?

“పేదలంటే మీకు అంత చులకన అయిపోయిందా….? అసలు ఇలాంటి చోట్ల పేదలు ఎలా ఉండగలుగుతారు? నగరాలకు పట్టణాలకు దూరంగాగానే కాకుండా ఆఖరి గ్రామాలకు సైతం దూరంగా భూములను కొన్ని కొన్ని చోట్ల ఎంపిక చేశారు. వాటిల్లో చాలావరకు ముంపు ప్రాంతాలు ఉన్నాయని ఇప్పుడు విపక్షాలు మరింత తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. ఒక్క గోదావరి నీటి ముంపుతో జగన్ ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు…. ఆవ భూములేనని అంతా వాదిస్తున్నారు. దెబ్బకు నిండా మునిగిపోవడంతో ఒక్కసారిగా ప్రభుత్వం ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అన్నది బయటపడింది…. వారి పరువు అంతా పోయింది.

చంద్రబాబు అప్పుడలా… ఇప్పుడిలా..!

Chandrababu Naidu

Chandrababu Naidu
రాష్ట్రంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. హై కోర్టు న్యాయమూర్తుల ఫోన్ లు ట్యాప్ అవుతున్నట్లు వెలుగులోకి వచ్చిన వెంటనే మరి కొందరు ప్రముఖులు తమ ఫోన్ లు ట్యాపింగ్ కు గురవుతున్నట్లు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ప్రతి అంశంలోను ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వాదన వినిపిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్లు కేంద్ర న్యాయ శాఖకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రతిపక్షనేత చంద్రబాబు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ సంస్థతో దర్యాప్తు చేయించాలని ప్రధానికి లేఖ రాశారు.

Also Read: జగన్ దగ్గరకు సీక్రెట్ లిస్ట్..! వణికిపోతున్నారు

ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రధానికి లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎటువంటి ఆధారాలు లేకుండా తన ఫోన్ ట్యాప్ అవుతుందని బాబు ప్రధానికి లేఖ రాయడంపై ఇటు వైసీపీ నేతులు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోను బాబుపై వైఖరిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 40 ఏళ్లు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ట్యాపింగ్ కు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

చంద్రబాబు వైఖరి సిఎం కుర్చీలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మరో రకంగా ఉంటుందనేది ఇప్పటికే పలు అంశాల్లో స్పష్టం అయ్యింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోను మరోసారి స్పష్టం అయ్యింది. చంద్రబాబు అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు 2017లో తమ ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారని శాసనసభలోను, బయట వెల్లడించారు. ప్రభుత్వమే ఈ కుట్రకు పాల్పడుతుందని విమర్శించారు. అప్పుడు బాబు ఈ వ్యవహారంపై ఎటువంటి విచారణకు ఆదేశించలేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరపాలని కేంద్రాని లేఖ రాయడం విశేషం.

Also Read: అమరావతి విషయంలో జగన్ కు చుక్కెదురు..! షాకిచ్చిన సుప్రీం

న్యాయమూర్తులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై న్యాయ వ్యవస్థ ఉపేక్షించే అవకాశం లేదు. ఏ వ్యకి ఫోన్ అయినా ట్యాప్ చేయడానికి పోలీసులకు అవకాశం ఉన్నా… కొన్ని అనుమతులు తీసుకుని నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులు, ఏజన్సీలు ఫోన్ లు ట్యాప్ చేయడం నేరమనే విషయం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంపై రాజకీయంగా లబ్ధిపొందాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారనే వాదనలు వినిపిస్తున్నాయి.

మిస్టర్ కూల్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడా?

MS Dhoni

MS Dhoni
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్.ధోని అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున సాయంత్రం అనుహ్యంగా ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించి అందరిని షాక్ కు గురిచేశాడు. అయితే ధోని మాత్రం తన రిటైర్మెంట్ పై చాలా కూల్ గా ఇన్ స్ట్రాగ్రాములో పెట్టుచేసి క్రికెట్లో తనకున్న ‘మిస్టర్ కూల్’ నామాన్ని సార్థకం చేసుకున్నాడు. ధోని రిటైర్మెంట్ కావడంతో ఆయన తర్వాత ఏం చేయబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Also Read: రఘురామా.. నీ పోస్టు పోవడం ఖాయమేనా?

మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ఆడే సమయంలోనే రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం జోరుగా సాగింది. అయితే అప్పుడు ధోని బీజీగా ఉండటంతో వాటిపై ఆయన పెద్దగా స్పందించలేదు. అయితే తాజాగా ధోని రిటైర్మెంట్ ను ప్రస్తావిస్తూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమ్మణ్య స్వామి చేసిన సంచలన ట్వీట్ చేశాడు. ‘మహేంద్ర సింగ్‌ ధోనీ క్రికెట్ నుంచి మాత్రమే రిటైర్ అయ్యారని.. మిగతా వాటి నుంచి కాదని.. కష్టాలను ఎదురించే సత్తా ఆయనకు ఉందని.. టీమిండియాకు ధోని అందించిన నాయకత్వతీరు ప్రజలకు ఎంతో అవసరముందని.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ధోని పోటీచేయాలి’ అంటూ ట్వీట్ చేశాడు.

Also Read: కరోనా ఎఫెక్ట్.. ఇంటికే గణేశుడు పరిమితం..!

ఎంపీ సుబ్రమ్మణ్యస్వామి ధోనిపై చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. రాజకీయ, క్రీడావర్గాల్లో ఆయన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. త్వరలో రానున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ధోనీ బరిలోకి దిగుతాడని పుకార్లు విన్పిస్తున్నాయి. ధోనిని బీజేపీలోకి రప్పించేందుకు ఇప్పటికే అధిష్టానం ప్రయత్నం చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ధోనీ గతంలోనే కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యాడని పలువురు గుర్తు చేస్తున్నారు. కాగా బీజేపీ ఎంపీ తనపై చేసిన ట్వీట్ పై ధోనిపై ఎలా రియాక్టవుతాడో వేచి చూడాల్సిందే..!

రఘురామా.. నీ పోస్టు పోవడం ఖాయమేనా?

Rama Krishnam Raju

Rama Krishnam Raju
నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కాళ్ల కిందకు నీళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ఆయన పోస్టుకు ఎసరు వస్తోందట.. త్వరలోనే రఘురామకు గట్టి ఎదురుదెబ్బ తగులబోతోందని సమాచారం.

రఘురామకృష్ణం రాజును వైసీపీ నుంచి బహిష్కరించిన వెంటనే ఆయన బీజేపీలో చేరాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ వైసీపీ అధిష్టానం వ్యూహాత్మకంగానే పార్టీ నుంచి రఘురామను సస్పెండ్ చేయకుండా నాన్చుతోంది. అదే సమయంలో ఆయన ఎంపీ హోదాను తొలిగించి ఆయనను డమ్మీ చేసే ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

Also Read: జగన్ ది బుర్రా.. లేక ఖర్ఖానాన?

బీజేపీతో వైసీపీ అధిష్టానానికి దగ్గరి సంబంధాలున్నాయి. ఈ క్రమంలోనే రాఘురామకృష్ణం రాజు తన ఎంపీ సీటును కోల్పోయేలా చేసేందుకు వైసీపీ పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. వైసీపీ పూర్తిగా రాజకీయంగా రఘురామను చావుదెబ్బ తీసే ప్రణాళికను రచిస్తున్నట్టు సమాచారం.

ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు లోక్ సభ స్పీకర్ తోపాటు బీజేపీ పెద్దలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. అయితే రఘురామ కంటే ఒక రాష్ట్రాన్ని పాలించే వైసీపీ పార్టీకే బీజేపీ అధిష్టానం ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలోనే ఒక్క రఘురామ లాంటి ఎంపీ కంటే.. వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలే ముఖ్యమని భావిస్తోంది. వైసీపీకి ఆరుగురు రాజ్యసభ ఎంపీలు ఉండడం కూడా బీజేపీ ఇటువైపే మొగ్గానికి కారణమవుతోంది.

Also Read: జగన్ దగ్గరకు సీక్రెట్ లిస్ట్..! వణికిపోతున్నారు

అంతేకాకుండా వైసీపీ, బీజేపీ ఉమ్మడి శత్రువు టీడీపీ. ఇప్పుడు రఘురామ టీడీపీ తరుఫునే రాజకీయం చేస్తున్నారు. దీంతో బీజేపీ నాయకులు వైసీపీ కోరిక మేరకు రఘురామ ఎంపీ సీటుపై స్పీకర్ ద్వారా వేటు వేసేందుకు డిసైడ్ అయ్యారని ఢిల్లీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రాబోయే కొద్దిరోజుల్లోనే రఘురామకృష్ణం రాజు తన ఎంపీ స్థానాన్ని కోల్పోబోతున్నారని వైసీపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే రఘురామ డమ్మీ అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

నిత్యానంద బొమ్మతో సొంత కరెన్సీ ముద్రణ.. ఎక్కడంటే?

Swami Nithyananda

Swami Nithyananda
వివాదాలకు కేరాఫ్ గా నిలిచే నిత్యానంద స్వామి పెను సంచలనం సృష్టించబోతున్నాడు. ఇప్పటికే నిత్యానంద కైలాసం పేరుతో సొంత దేశం ఏర్పాటు చేసుకున్న సంగతి తెల్సిందే. అందరు హిందువులే ఉండే తొలి దేశంగా కైలాసం నిలిచింది. తాజాగా నిత్యానంద స్వామి తన దేశంలో సొంతంగా రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేయడంతోపాటు తన బొమ్మతో కరెన్సీని తీసుకురాబోతున్నాడు. వినాయక చవితి నుంచి తన బొమ్మతో ఉన్న కరెన్సీ అందుబాటులోకి రాబోతుందని ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Also Read: కరోనా ఎఫెక్ట్.. ఇంటికే గణేశుడు పరిమితం..!

నిత్యానంద ఇప్పటికే తన బొమ్మతో కూడిన కరెన్సీ అన్ని దేశాల్లో చెలమణి అయ్యేలా ఆయా దేశాల బ్యాంకులతో చట్టబద్ధంగా ఎంఓయూ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 22న కైలాసంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస్ ను ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నాడు. ఈ బ్యాంకు నుంచి ముద్రణ అయ్యే కరెన్సీ కైలాస దేశంలోపాటు ఆయా దేశాల్లో చెలమణి అవుతుందని నిత్యానంద చెబుతున్నాడు. ఇక కరెన్సీ రూపు రేఖలు, విధి విధానాలను 22న ప్రకటిస్తానని నిత్యానంద పేర్కొన్నాడు.

కాగా నిత్యానందపై భారతదేశంలో అనేక కేసులు ఉన్నాయి. బెంగూళూరు కేంద్రంగా నిత్యానంద ప్రధానంగా ఆశ్రమం కార్యకలాపాలను కొనసాగించాడు. అయితే నిత్యానందపై వ్యభిచారం.. పిల్లల అక్రమ నిర్బంధం.. మహిళల అదృశ్యం.. అపహరణ వంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై పలు కేసులు నమోదుకాగా కొంతకాలం కర్ణాటకలోని రామనగర జైల్లో నిత్యానంద జైలు శిక్ష అనుభవించాడు. అనంతరం బెయిల్ మీద బైటకొట్టాడు. ఇక గుజరాత్‌ లోని తన ఆశ్రమంలో తమ పిల్లలను అక్రమంగా నిర్బంధించినట్టు పలువురు ఫిర్యాదు చేశారు.

Also Read: జగన్ ది బుర్రా.. లేక ఖర్ఖానాన?

ఈ సమయంలోనే నిత్యానంద దేశం విడిచి ఈక్వాడార్ కు పరారయ్యారు. ఆ దేశానికి సంబంధించిన ఓ దీవీని కొనుగోలు చేసి కైలాస దేశంగా మార్చాడు. ఇక తాజాగా సొంత కరెన్సీ.. సొంత బ్యాంకు ఏర్పాటు చేసి వార్తల్లో నిలిచాడు. అయితే గతంలో నిత్యానందతో నటి రంజని రసలీలల వీడియో అప్పట్లో బయటికి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి ఆయనను రాసలీలలా నిత్యానంద స్వామిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం నిత్యానంద బొమ్మతో కూడిన కరెన్సీ నెట్టింట్లో వైరల్ అవుతుండటం నెటిజన్లు సైటర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

జగన్ ది బుర్రా.. లేక ఖర్ఖానాన?

AP people are saying that CM Jagan is wrong ..?
AP people are saying that CM Jagan is wrong ..?

CM Jagan

2014లో ఏపీలో చంద్రబాబు.. తెలంగాణలో కేసీఆర్ సీఎంలుగా ఉండేటప్పుడు.. ప్రతీసారి కేసీఆర్ కొత్త పథకం ప్రవేశపెట్టడం.. దాన్ని చంద్రబాబు పేరు మార్చేసి కాపీ కొట్టి అమలు చేయడం జరిగేది. కానీ ఇప్పుడు 2019లో జగన్ సీఎం అయ్యాక.. ఆయన పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. అదే క్రమంలో పారదర్శకతో ప్రజలకు చేరువ అవుతున్నాయి. జగన్ పథకాలనే కేసీఆర్ అమలు చేయాల్సిన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

Also Read: అమరావతి విషయంలో జగన్ కు చుక్కెదురు..! షాకిచ్చిన సుప్రీం

ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో అత్యంత అవినీతిమయమైనది ఏదంటే ఖచ్చితంగా రెవెన్యూ శాఖే. ఆ శాఖలో కిందినుంచి పైదాకా అన్ని వ్యవహారాల్లోనూ తడపనిదే ఏపని కాదు.. ఇటీవలే ఓ భూకొనుగోల్ మాల్ లో కీసర తహసీల్దార్ ఏకంగా రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కవ్వడం సంచలనమైంది. ఈ క్రమంలోనే రెవెన్యూశాఖలో మరో విప్లవాత్మక నిర్ణయంతో అవినీతికి అడ్డుకట్ట వేసి సంచలనం సృష్టించారు సీఎం జగన్.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా మరోసారి సంచలన నిర్ణయాలు, పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఇక ఏపీలో ఇప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియలను వీడియోలో నమోదు చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్లలో పెద్ద ఎత్తున అవినీతిని అరికట్టడానికి ఇలా వీడియోలు తీసి పారదర్శకత పెంచడం.. దాంతోపాటు ప్రజలకు లంచాలు ఇవ్వకుండా అడ్డుకోవడం ప్రధాన ధ్యేయంగా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు.

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వీడియో తీసే పైలెట్ ప్రాజెక్టును ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు విస్తరిస్తారు.

Also Read: జగన్ దగ్గరకు సీక్రెట్ లిస్ట్..! వణికిపోతున్నారు

ఈ మేరకు వీడియో రికార్డింగ్ సదుపాయంతోపాటు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించింది. ఈ నిర్ణయం ఏపీలో రెవెన్యూశాఖలో అవినీతిని అరికడుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

-ఎన్నం

కరోనా ఎఫెక్ట్.. ఇంటికే గణేశుడు పరిమితం..!

Ganesh Puja

Ganesh Puja
అందరు అనుకున్నట్లేగానే.. కరోనా ఎఫెక్ట్ గణేశ్ ఉత్సవాలపై పడింది. దీంతో ప్రతియేటా ఘనంగా జరిగే నవరాత్రి ఉత్సవాలను ఈసారి ఇంటికే పరిమితం కానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా విజృంభణ కారణంగా అనేక పండుగలు కళతప్పాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఘనంగా నిర్వహించే శ్రీరామ నవమి, ఉగాది, రంజాన్ పండుగలు కళతప్పిపోయాయి. ఇక భాగ్యనగరానికే వన్నెతెచ్చే బోనాల పండుగ కూడా కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన సంగతి తెల్సిందే.

Also Read: తెలంగాణకు కేంద్రం భారీ నిధులు.. అయినా టెస్టులు తక్కువే?

తాజాగా వినాయక చవితి ఉత్సవాలను కూడా ఇంటికే పరిమితం కానున్నాయి. ఈమేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వినాయక ఉత్సవాలపై క్లారిటీ ఇచ్చారు. సోమవారం మాసాబ్ ట్యాంకులోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలో హైదరాబాదు, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు అంజనీ కుమార్, సజ్జనార్, మహేష్ భగవత్, మహానగర పాలక సంస్థ కమిషనర్ లోకేష్ కుమార్, భాగ్యనగర ఉత్సవ కమిటీ నిర్వహాకులు తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలపై మంత్రి తలసాని క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితులు నెలకొన్న కారణంగా గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. ఈసారి గణేష్ ఉత్సవాలను ప్రజలకు ఇళ్లల్లోనే శాస్త్రోకత్తంగా నిర్వహించుకోవాలని సూచించారు. కరోనా పరిస్థితులు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం తరుఫున దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాల్లో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నవరాత్రులు పూర్తయ్యే వరకు వినాయక విగ్రహాలను పూజలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Also Read: ఓవైపు కరోనా.. మరోవైపు వానలు.. దేనికి సంకేతం?

ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగే గణేష్ ఉత్సవాలు ఈసారి కళతప్పనున్నాయి. నిమజ్జనం రోజున గణనాథులను ఆటపాటలతో గంగమ్మ ఒడికి చేర్చడం ఆనవాయితీగా వస్తోంది. గణేష్ ఉత్సవాలకు సంబంధించి హైదరాబాద్‌ పోలీసులు కూడా ప్రజలకు పలు సూచనలు చేశారు. వినాయక చవితి వేడుకలు, మొహరం ఒకేసారి వస్తున్నాయని తెలిపారు.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రద్దీ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలు పెట్టడానికి అనుమతులు లేవన్నారు.

ప్రజలు ఇళ్లలోనే వినాయక విగ్రహాలను పెట్టి పూజలు చేసుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ మీరు.. మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని ఆయన ట్వీటర్లో ట్వీట్ చేశారు. అయితే అందరి విఘ్నాలను దూరంచేసే విఘ్నరాజుకే కరోనా విఘ్నం ఏర్పడటం శోచనీయాంగా మారిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

బన్నీ మూవీలో సాహో భామ ఐటం సాంగ్‌?

Shraddha Kapoor

Shraddha Kapoor
సెన్సిబుల్‌ డైరెక్టర్ సుకుమార్ తీసే ప్రతి సినిమాలో, ప్రతి సన్నివేశంలో పర్ఫెక్షన్‌ కనిపిస్తుంది. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్‌ సీక్వెల్‌ ఏదైనా చాలా జాగ్రత్తగా, ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా చూసుకుంటాడు సుక్కూ. అందుకే ఈ లెక్కల మాస్టారు సినిమాలో ప్రతి ఫ్రేమ్‌, ప్రతీ సన్నివేశం లెక్క తప్పకుండా ఉంటుంది. ఇక, తన ప్రతి మూవీలో ఓ ఐటం గ్యారంటీ. పైగా అది మామూలుగా ఉండదు. ఆర్యలో ఆ అంటే అమలాపురం నుంచి రంగస్థలంలో జిగేల్‌ రాణి వరకూ ప్రతి పాటను ప్రత్యేకంగా మరలిచాడు. ఐటం సాంగ్స్‌కు కేరాఫ్‌గా నిలిచాడు. ఆ ఐటం నంబర్లో స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌ ఉంటే దాని ఊపే వేరు. సుక్కూ క్రియేటివిటీకి బన్నీ మార్కు స్టెప్పులు తోడైతే ఏ పాట అయినా సూపర్ హిట్‌ అవ్వాల్సిందే.

Also Read: ప్రభాస్‌, మహేశ్‌, పవన్‌ కావాలంటున్న బోల్డ్‌ బ్యూటీ!

ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో ‘పుష్ప’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ చిత్రంలో కూడా సుక్కూ తన మార్కు ఓ స్పెషల్‌ సాంగ్‌ను ప్లాన్‌ చేశాడు. ఈ పాట కోసం పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. పాయల్‌ రాజ్‌పుత్‌ను ఓకే చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ, బన్నీ పక్కన ఓ రేంజ్‌ ఉన్న హీరోయిన్‌ అయితే సూటవుతుందని సుకుమార్భావిస్తున్నాడు. పైగా, ఇది పాన్‌ ఇండియా మూవీ. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో విడుదల కానుంది. కాబట్టి అందరికీ పరిచయం ఉన్న ఓ హీరోయిన్‌తో ఐటం‌ సాంగ్‌ చేయించాలని సుక్కూ నిర్ణయానికి వచ్చాడట.

Also Read: ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ అప్పుడే మొదలెట్టారు.. !

ఈ క్రమంలో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్ను సంప్రదించారట. ప్రభాస్‌ సరసన ‘సాహో’లో నటించిన శ్రద్ధాకు ఇప్పటికే టాలీవుడ్‌ గురించి తెలుసు. ఐటం సాంగ్‌లో ఆమె నర్తిస్తే ‘పుష్ప’ హిందీ మార్కెట్‌కు కూడా ప్లస్‌ అవుతుందని యూనిట్‌ ఆశిస్తోంది. ఇదే విషయాన్ని శ్రద్ధ ముందు ఉంచితే ఆమె కూడా సంసిద్ధత వ్యక్తం చేసిందట. శ్రద్ధ ఒప్పుకుంటే బన్నీతో కలిసి ఆమె స్టెప్పులు ప్రేక్షకులను అలరించడం ఖాయం. ఏ కారణం వల్ల అయినా శ్రద్ధ కాదంటే బాలీవుడ్‌లో మరో యువ నటి ఊర్వశి రౌటెలా పేరును కూడా సుక్కూ పరిశీలిస్తున్నాడట. కాగా, గంధం చెక్కల స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ‘పుష్ప’లో బన్నీ సరసన రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ డైరెక్టర్.

ఆర్ఆర్ఆర్ కు రైటర్  రాజమౌళి భార్య.. మరి సాయి మాధవ్‌?

RRR-Rajamouli
RRR-Rajamouli
బాహుబలి సిరీస్ తర్వాత అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పేరు దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. ఆ మూవీతో తెలుగు సినిమా పరిధిని విస్తృతం చేశాడాయన. బాహుబలి రెండు పార్టుల కోసం దాదాపు ఐదేళ్లు కష్టపడిన మన జక్కన్న.. మరో భారీ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ఆర్ఆర్‌’. (రౌద్రం, రణం, రుధిరం) తీస్తున్నారు.   జూనియర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.  అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు.  మన్యం అడవుల్లోని అల్లూరి సీతారామరాజు, ఆదిలాబాద్‌‌ అడవుల్లోని కొమురం భీమ్ విప్లవ వీరులుగా మారకముందు కలుసుకుంటే ఎలా ఉండబోతోందనే ఫిక్షన్‌‌ స్టోరీని తెరపై  ఆవిష్కరించబోతున్నాడు జక్కన్న. ఆలియా భట్‌, హాలీవుడ్‌ నటి ఒలీవియా  మోరిస్‌ హీరోయిన్లు. బాలీవుడ్‌ స్టార్ హీరో  అజయ్‌ దేవగణ్‌, శ్రియా  కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్‌ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్‌ చేసి అల్లూరి పాత్ర టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది.
 తెలుగు, హిందీ సహా ఐదు భాషల్లో రిలీయ్యే ఈ చిత్రం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది. కానీ, కరోనా కారణంగా షూటింగ్స్‌ ఆగిపోవడంతో ఈ సినిమా వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకొచ్చే చాన్సుంది.  కాగా, ఈ చిత్రం గురించి తాజాగా ఆసక్తికర సమాచారం తెలిసింది. రాజమౌళి భార్య రమ ఈ సినిమాకు డైలాగ్స్‌ సమకూరుస్తున్నట్టు సమాచారం. సాధారణంగా రాజమౌళి సినిమాలకు ఆయన కుటుంబం మొత్తం పని చేస్తుంది. తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తారు. అన్న ఎంఎం కీరవాణి సంగీతం ఇస్తారు. కీరవాణి భార్య వల్లి,  రాజమౌళి కొడుకు కార్తికేయ ప్రొడక్షన్‌ బాధ్యతలు చూస్తారు. రమ కాస్ట్యూమ్‌ డిజైనర్గా పని చేయడం అనవాయితీ. అయితే, ఈ పాన్‌ ఇండియా సినిమా కోసం రమ తొలిసారి కలం చేతపట్టిందట.  ఆర్ఆర్ఆర్ కోసం ఆమె డైలాగ్స్‌ రాస్తున్నట్టు సమాచారం.
అయితే, ఈ సినిమాకు మాటల రచయితగా ఇప్పటికే స్టార్ రైటర్ సాయి మాధవ్‌ బుర్రా పని చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ అల్లూరి పాత్ర టీజర్లో ఆయన కలం నుంచి వచ్చిన మాటలు అదిరిపోయాయి. మరి, బుర్రా ఉండగా.. రమ డైలాగ్స్ రాయడం ఎందుకు? అన్న చర్చ మొదలైంది. ఒకవేళ సాయి మాధవ్‌ తప్పుకున్నాడా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అదే సమయంలో కేవలం కొన్ని సన్నివేశాలకు మాత్రమే రమ డైలాగ్స్‌ ఇస్తున్నారని అంటున్నారు. బాహుబలి 1లో సైతం ఇంటర్వెల్‌ వార్ సీక్వెన్స్‌కు మరో డైరెక్టర్ దేవా  కట్టాతో డైలాగ్స్‌ రాయించుకున్నారు రాజమౌళి. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడట. లాక్‌డౌన్‌ టైమ్‌లో ఆర్ఆర్ఆర్ స్క్రిప్టులో ఆయన కొన్ని మార్పులు చేశారని, వాటి కోసమే కొత్తగా మాటలు రాయిస్తున్నారన్న అభిప్రాయాలు వస్తున్నాయి. మరి,  తన భార్య రాసే డైలాగ్స్‌ను ఏ పాత్రకు, ఏ సన్నివేశానికి వాడుతారనేది ఆసక్తికరం. కాగా, ఈ మధ్యే కరోనా మహమ్మారిని జయించిన రాజమౌళి కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలోని తమ ఫామ్‌హౌజ్‌లో ఉంటోంది.  ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించే సన్నాహకాల్లో ఉన్నారు జక్కన్న.

ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ అప్పుడే మొదలెట్టారు.. !

Prabhas-NagAshwin
Prabhas-NagAshwin
టాలీవుడ్‌ యంగ్‌ రెబర్ స్టార్ ప్రభాస్‌ ఇప్పుడు గ్లోబల్ స్టార్. బాహుబలి సూపర్ హిట్‌ తర్వాత అతని స్టార్డమ్‌ ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. మన డార్లింగ్‌ సినిమాల కోసం ఇప్పుడు దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్‌కు ఎంతో మంది అభిమానులు పెరుగుతూనే ఉన్నారు. బాహుబలి 1,2 తర్వాత అతను చేసిన ‘సాహో’ తెలుగులో అంతగా ఆడకపోయినా.. హిందీలో మంచి మార్కులు కొట్టేసింది. ఫారిన్‌లో కూడా ఆ మూవీకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇంతటి ఫాలోయింగ్‌ ఉండడంతో  ప్రభాస్‌తో  సినిమా తీసేందుకు దర్శకులు, నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఎంత ఖర్చైనా పెట్టేందుకు రెడీ అవుతున్నారు. రెబల్‌ స్టార్ విస్తృత మార్కెట్‌ దృష్ట్యా ఎంత పెట్టుబడి పెట్టినా డబుల్‌ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ బడా నిర్మాత అశ్వినీ దత్‌.. డార్లింగ్‌తో  ఓ భారీ బడ్జెట్‌ మూవీ ప్లాన్‌ చేసిన సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై రానున్న ఈ చిత్రానికి ఆయన అల్లుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే  కథ, స్ర్కిప్టు పనులు పూర్తవడంతో ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

‘మహానటి’తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న నాగ్.. ప్రభాస్‌ కోసం ఓ సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామాను సిద్ధం చేశారు. ఈ మూవీలో ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ దీపిక పడుకోన్‌ నటించనుంది. ఆమె కోసం ఏకంగా రూ. 25 కోట్లు, ప్రభాస్‌కు వంద కోట్ల పారితోషికం ఇచ్చారట అశ్వినీదత్‌.  ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం ప్రభాస్‌ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్టు తాజా సమాచారం. ప్రభాస్, నాగ్‌ అశ్విన్‌ తరచూ వర్క్‌షాప్స్‌లో పాల్గొంటున్నారట. ఈ మూవీలో ప్రభాస్‌ క్యారెక్టర్, ఆ పాత్ర డైలాగ్స్‌ భిన్నంగా ఉంటాయని టాక్‌. అందుకోసం డార్లింగ్‌ ఇప్పటి నుంచే డైలాగ్‌ మాడ్యులేషన్‌పై దృష్టి పెట్టాడని టాక్. తొందర్లోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం  ఉంది.

కాగా,  ప్రభాస్‌ ప్రస్తుతం రాధేశ్యామ్‌ మూవీలో నటిస్తున్నాడు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్‌ మూవీ పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందని టాక్. హీరో ప్రభాస్‌, హీరోయిన్‌ పూజా హెగ్డే  రెండు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఈ మధ్యే చిత్రం ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేయగా భారీ స్పందన వచ్చింది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్‌ను తొందర్లోనే తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. ఇది పూర్తయితే నాగ్‌ అశ్విన్‌ మూవీపైనే ప్రభాస్‌ పూర్తిగా దృష్టి పెట్టనున్నాడు.

సురేష్ రైనా రిటైర్మెంట్లో ‘లాజిక్’ ఇదేనా?

Suresh-Raina-Retirement

Suresh-Raina-Retirement
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెల్సిందే. అంతర్జాతీయ క్రికెట్ కు నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ధోని ఇన్ స్ట్రాగ్రాములో పోస్టు చేసిన ఐదు నిమిషాల్లోనే ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించి అందరిని షాక్ గురిచేశాడు. అయితే తాను ఎందుకు రిటైర్మెంట్ చేయాల్సి వచ్చిందో అందరికీ అర్థమయ్యేలా లాజిక్ తో వివరించి సురేష్ రైనా అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.

మహేంద్ర సింగ్ ధోని 39ఏళ్ల వయస్సులో రిటైర్మెంట్ ప్రకటించగా సురేష్ రైనా మాత్రం 33ఏళ్లకే క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఇంకో ఐదారేళ్లు క్రికెట్ ఆడే సత్తా రైనాలో ఉన్నప్పటికీ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే వీరిద్దరు కూడా ముందుగా అనుకోని రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. వీరిద్దరు కూడా ఇంచుమించుగా ఒకేసారి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు.

ధోనీ 2004లో డిసెంబర్ 23న చిట్టగాంగ్ వేదికగా బంగ్లాదేశ్‌ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక  సురేష్ రైనా 2005 జూలై 30న శ్రీలంక మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆరేడు నెలల వ్యత్యాసంలోనే వీరిద్దరు ఒకేసారి ఎంట్రీ ఇచ్చి.. తాజాగా ఒకేసారి రిటైర్మెంట్ ఇచ్చారు. రిటైర్మెంట్ నిర్ణయం తాము ముందుగానే అనుకున్నట్లు పేర్కొన్నాడు. దీనికి ఓ లాజిక్ వివరణ కూడా ఇచ్చాడు.

ఆగస్టు 15న భారత్ 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంది. ధోని జెర్సీ నెంబర్ 7కాగా.. తనది 3నెంబర్ జర్సీ అని చెప్పాడు. ఈ రెండు కలిపితే 73 అవుతాయని తెలిపాడు. 73 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గుర్తుచేసేలా ధోని రిటైర్ అయిన వెంటనే తాను రిటైర్మెంట్ ప్రకటించినట్లు చెప్పాడు. తాను రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇంతకన్నా మంచి సమయం వేరే లేదని రైనా పేర్కొనడం గమనార్హం.  తాను అంతర్జాతీయ క్రికెట్లో రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఐపీఎల్ ఆడుతానని చెప్పాడు.

ప్రభాస్‌, మహేశ్‌, పవన్‌ కావాలంటున్న  బోల్డ్‌ బ్యూటీ!

Payal Rajput

Payal Rajput
టెలివిజన్‌ రంగం నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన నటి పాయల్‌ రాజ్‌పుత్‌. తెలుగులో తన తొలి చిత్రం ‘ఆర్ఎక్స్‌ 100’ లో అందలు ఆరబోసి యూత్‌ హార్ట్‌ బీట్‌ పెంచింది. దాంతో పాటు నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరోయిన్‌ క్యారెక్టర్లో అద్భుతంగా నటించింది. అందం, అభినయం రెండూ ఉన్నా మొదటి సినిమాతోనే ఆమెపై బోల్డ్‌ హీరోయిన్‌ అనే ముద్ర పడింది. మళ్లీ అలాంటి పాత్రలే ఆమె ముందుకొచ్చాయి. కెరీర్ ఆరంభంలో ఉండడంతో వాటిని కాదనలేకపోయిందామె.  ‘ఆర్డీఎక్స్ ‌ లవ్‌’ అనే చిన్న సినిమాలో  మరింత బోల్డ్‌గా కనిపించింది. పాయల్‌తోనే ఆ సినిమాకు గుర్తింపు వచ్చింది. కానీ, కంటెంట్‌ లేకపోవడంతో ఆ  చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ చిత్రాల్లో కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి టాలీవుడ్‌లో నిలదొక్కుకుంది ఈ ఢిల్లీ భామ. ముఖ్యంగా రవితేజ సరసన డిస్కో రాజాలో బధిర యువతిగా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

వెంకటేశ్‌, రవితేజ లాంటి పెద్ద హీరోలతో నటించడంతో మరిన్ని అవకాశాలు వస్తాయని పాయల్‌ భావించింది. అందుకోసం పంజాబీ సినిమాలను సైతం కాదనుకొని తెలుగు, దక్షిణాదిపై దృష్టి పెట్టింది. తేజ దర్శకత్వం వహించిన ‘బుల్‌రెడ్డి’ అనే  ఐటమ్‌ సాంగ్‌లో మెప్పించి తాను ఏదైనా చేయగలనని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. కానీ, ఇప్పటికీ సెకండ్‌ హీరోయిన్, చిన్న ప్రాజెక్టులే ఆమె ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి.  ‘ఏంజెల్’ అనే సినిమాతో తమిళ్‌లో అరంగేట్రం చేయనున్న పాయల్  తెలుగులో ‘నరేంద్ర’ అనే మూవీలో నటిస్తోందామె. అలాగే,  ఓ వెబ్‌ సిరీస్‌కు కూడా ఓకే చెప్పింది. దాంతో, ఆమె డిజిటల్‌ మీడియాలో కూడా ఎంట్రీ ఇవ్వనుంది. లాక్‌డౌన్‌ టైమ్‌లో గృహహింస కథాంశంతో ‘ఎ రైటర్’ అనే షార్ట్ ఫిల్మ్‌ చేసి మెప్పించింది. దాంతో,  ఏ మాధ్యమంలో చేసినా, ఎలాంటి పాత్ర ఇచ్చినా దానికి తాను న్యాయం చేస్తానని అంటోంది‌. అదే సమయంలో  పాయల్‌ పెద్ద కలలు కంటోంది. చిన్న సినిమాలు, కుర్ర  హీరోలతో కాకుండా టాలీవుడ్‌లో బడా హీరోల సరసన నటించాలని కోరుకుంటోంది. ప్రభాస్‌, మహేశ్‌ బాబు, పవన్‌ కళ్యాన్ లతో  పని చేయాలని ఆశగా ఉందని ఇటీవలే తన మనసులో మాట బయట పెట్టింది. ఇప్పటికే వెంకటేశ్‌, రవితేజతో నటించిన పాయల్‌ ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి మరి.

అమరావతి విషయంలో జగన్ కు చుక్కెదురు..! షాకిచ్చిన సుప్రీం

Supreme Court shocks Jagan

న్యాయస్థానాల నుండి ఇప్పటికే అనేకసార్లు మొట్టికాయలు తిన్న జగన్ సర్కార్ తన విపరీత ధోరణి మాత్రం మార్చుకోవడం లేదు. రాజధాని అమరావతి లో వేరే ప్రాంతాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే దిశగా వైఎస్ జగన్ సర్కార్ 107 జీవో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అమరావతి రైతులు హైకోర్టులో సవాలు చేయడంతో హైకోర్టు రాజధాని తరలింపు పై స్టే విధించింది. ఇక హైకోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చిన స్టే ను ఎత్తివేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది.

Also Read: దెబ్బకి జగన్ పరువంతా పోయింది..! “నిండా మునిగిపోయాడు”

ఇక ఈ విషయమై నేడు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఎప్పటిలాగే…. అందరూ అనుకున్నట్టుగానే జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన స్టే ను ఎత్తివేయాలని ఆదేశాలను తాము ఇవ్వలేమని పేర్కొంటూ ఈ విషయమై మరలా హై కోర్టును ఆశ్రయించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను నిర్ధాక్షణ్యంగా కొట్టివేసింది. రాజధాని రైతులు చాలా ఖచ్చితంగా ఉంది 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసమే భూములు ఇచ్చామని…. రాజధాని నిర్మాణం కోసం ఉపయోగించాల్సిన అవసరాలకు కాకుండా వేరే వాటికి భూములను వినియోగించడం సిఆర్డిఎ చట్టం ప్రకారం కుదరదని అమరావతి రైతులు అంటున్నారు.

Also Read: కారులో ముగ్గురు ఉండగానే తగలబెట్టేశాడు… విజయవాడలో దారుణం!

ఇదిలా ఉంటే…. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై గవర్నర్ ఆమోదముద్ర వేశారు. అయితే హైకోర్టు మాత్రం దీనిపై ఈ నెలాఖరు వరకు స్టే విధించింది. ఈ దెబ్బతో రెండు రోజుల క్రితం చేద్దామనుకున్న విశాఖ రాజధాని శంకుస్థాపన వాయిదా వేయవలసి వచ్చింది. ఇక తమ వైఫల్యాలను సమీక్షించకుండా ప్రజల బాగోగుల గురించి ఆలోచించకుండా… మొండి పట్టుదలతో ప్రతిసారి కోర్టు తీర్పుపై సవాల్ చేయడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని నిపుణులు అంటున్నారు.

హిందీ ఇస్మార్ట్‌ ఫిక్స్.. హీరో ఎవరంటే?

ranbir-kapoor-will-be-seen-ismart-shankar-hindi-remake

ranbir-kapoor-will-be-seen-ismart-shankar-hindi-remake
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు, హీరో రామ్‌ పోతినేనికి పునర్జన్మలాంటి మూవీ  ఇస్మార్ట్ శంకర్.  వరుస ఫెయిల్యూర్స్‌లో ఉన్న పూరి, రామ్‌  కాంబినేషన్లో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఊహించని విజయం సాధించింది. భారీ వసూళ్లు రాబట్టడంతో పాటు ఈ ఇద్దరి కెరీర్లో బ్లాక్‌ బస్టర్ హిట్‌గా నిలిచింది. పూరి, రామ్‌తో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేష్‌కు మంచి పేరు వచ్చింది. మొమోరీ ట్రాన్స్‌ప్లాంట్‌ అనే కాన్సెప్ట్‌కు తన మార్కు లవ్‌, యాక్షన్తోపాటు  కమర్షియల్‌ హంగులు జోడించి పూరి తీసిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ కాన్సెప్ట్‌ బాలీవుడ్‌ను కూడా మెప్పించింది. దాంతో, ఇస్మార్ట్‌ శంకర్ మూవీని బాలీవుడ్‌లో రీమేక్‌ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రం రీమేక్‌ రైట్స్‌ సొంతం చేసుకుంది.

ఈ రీమేక్‌కు బాలీవుడ్‌ యువ నటుడు రణ్‌బీర్ కపూర్ హీరోగా ఎంచుకున్నట్టు సమాచారం. తొందర్లోనే ఈ మూవీని పట్టాలెక్కించాలని చూస్తున్నారు. నవంబర్ నుంచే షూటింగ్‌ మొదలు పెట్టాలని మూవీ మేకర్స్‌ భావిస్తున్నారట. రెండేళ్ల క్రితం వచ్చిన ‘సంజు’తో రణ్‌బీర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సీనియర్ హీరో సంజయ్‌ దత్‌ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా అది. అందులో అచ్చుగుద్దునట్టు సంజయ్‌ను తలపించిన రణ్‌బీర్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. కరణ్‌ మల్హోత్రా దర్శకత్వంలో యాక్షన్‌ మూవీ ‘సంషేరా’లో నటిస్తున్నాడు. అలాగే, అమితాబ్‌, నాగార్జునతో కలిసి ‘బ్రహ్మాస్త్ర’లో కూడా  కీలక పాత్ర పోషిస్తున్నాడు. కరోనా కారణంగా  కొన్ని నెలల పాటు చిత్రీకరణ ఆగిపోయింది. ఈ మధ్యే తిరిగి షూటింగ్‌ ప్రారంభమైంది. ‘సంషేరా’ షూటింగ్‌ చివరి దశలో ఉండడంతో అది పూర్తవగానే నవంబర్లో ఇస్మార్ట్‌ రీమేక్‌ షూట్‌ను ప్రారంభించే చాన్సుంది. ఈ మూవీపై తొందర్లోనే అధికారిక ప్రకటనతో పాటు  డైరెక్టర్, హీరోయిన్ల పేర్లు వెల్లడించే అవకాశం ఉంది