Today 24 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై ముఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈరోజు తీసుకునే నిర్ణయాలకు వారి కెరీర్ దశ తిరగనుంది. మరికొన్ని రాష్ట్ర వ్యాపారులకు అపారమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే వారు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. వ్యాపారులు ప్రత్యర్థులపై కనీసం ఉంచాలి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడుతారు. ఈ సమయంలో తోటి వారి సహాయంతో వీటిని పూర్తి చేస్తారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండడమే మంచిది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. అయితే ప్రాజెక్టులు పూర్తి చేయడానికి వారి మద్దతును పొందాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు అనేక రంగాల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునే వ్యాపారులు పెద్దలను సంప్రదిస్తారు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల అండదండలతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి గురువుల సహాయం ఉంటుంది పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తోటి వారి సహాయంతో ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. కొన్ని ప్రయాణాలు ఈరోజు అనుకూలంగా ఉండకపోవచ్చు. అందువల్ల వాయిదాలు వేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈరోజు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. అనుకోకుండా ఇంట్లోకి ధన లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉండడంతో అదనపు ఆదాయాన్ని పొందుతారు. వీరు చేసిన కొన్ని పనులకు ప్రోత్సాహంతో పాటు పదోన్నతులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషంగా గడుపుతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు అప్పుల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుంది. అయితే పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తి విషయంలో విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు కొత్త బాధ్యతలు అందుతాయి. వ్యాపారులు లాభాలు పొందాలంటే కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల అండదండలతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉంటుంది. ఉద్యోగులు కొన్ని ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడంతో ప్రశంసలు అందుకుంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపానులు వస్తాయి. కొన్ని సమస్యలు పరిష్కారం కావడంతో మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థుల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. పాత సమస్యల నుంచి బయటపడతారు. అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు. వ్యాపారులకు ప్రత్యర్థులు ఆటంకాల సృష్టించే అవకాశం ఉంది. కొన్ని శుభవార్తలు విని అవకాశం ఉంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఉద్యోగులు కార్యాలయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విదేశాలకు వెళ్లేందుకు అన్ని అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన పనులు సాధించే క్రమంలో ఇతరుల సహాయం తీసుకుంటారు. పెండింగు పనులను పూర్తిచేయాలి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.
ఎన్డీఏ కు టిడిపి గుడ్ బై.. ప్రధానికి లోకేష్ చెప్పింది అదే!
Nara Lokesh: తెలుగుదేశం ఎన్డీఏ కు దూరం కావాలని భావించిందా? కేంద్రంలో అనిశ్చితి తేవాలని చూసిందా? ఇందుకు ముంబైలో ప్రయత్నాలు జరిగాయా? ఓ మాజీ ఉపరాష్ట్రపతి తో పాటు ఒక పారిశ్రామికవేత్తను చంద్రబాబుతో పాటు లోకేష్ కలిశారా? ఇదే రూమర్ గతంలో వెలుగు చూసింది. నిన్నను కూడా మరోసారి ప్రస్తావనకు వచ్చింది. మంత్రి నారా లోకేష్ నిన్ననే ఢిల్లీలో ఓ నేషనల్ మీడియా కాంక్లేవుకు హాజరయ్యారు. అక్కడే ఈ రూమర్ ప్రస్తావన మరోసారి వచ్చింది. అసలు అటువంటి ప్రయత్నం జరిగిందా అని జర్నలిస్ట్ ప్రశ్నించేసరికి.. లోకేష్ నుంచి భిన్నమైన స్పందన వచ్చింది. అసలేం జరిగింది? దాన్ని తెర వెనుక ఉన్న పరిణామాలు ఏంటి అనేది వివరించారు లోకేష్. ఆ వెంటనే తాను ప్రధాని మోదీ అపాయింట్మెంట్ తీసుకుని కలుసుకున్న విషయాన్ని కూడా వెల్లడించారు.
* గత పరిణామాల దృష్ట్యా..
గతంలో కూడా చంద్రబాబు ఎన్డీఏకు గుడ్ బై చెప్పారు. 2014లో తొలిసారిగా ప్రధాని అయ్యారు నరేంద్ర మోడీ. నాడు ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామి. అయితే విభజన హామీలకు సంబంధించిన అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి విభేదాలు వచ్చాయి. ప్రత్యేక హోదా విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సవాల్ చేసేసరికి ఆ ట్రాప్ లో పడ్డారు చంద్రబాబు. అలా ఎన్డీఏ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేశారు. జాతీయస్థాయిలో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అలా రాజకీయంగా 2019 ఎన్నికల్లో నష్టపోయారు. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూలంగానే బిజెపితో ఉన్న మంచి స్నేహాన్ని చెడగొట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో మాత్రం పవన్ పుణ్యమా అని మళ్లీ అంతా కలిశారు. కేంద్ర పెద్దలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కేంద్రం సైతం రాజకీయంగా, రాష్ట్ర ప్రయోజనాలపరంగా పెద్దపీట వేస్తోంది ఏపీకి. ఈ తరుణంలో చంద్రబాబు మరోసారి ఎన్డీఏకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు మొన్న ఆ మధ్యన ప్రచారం నడిచింది.
* ఆయన రాజీనామాతో..
మొన్న మధ్యన ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు. ఆయన స్వతంత్రంగా వ్యవహరిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం ఆయన పై ఒత్తిడి చేసి రాజీనామా చేయించందన్నది ఒక విమర్శ. జగదీప్ బిజెపి వ్యక్తి కాదు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారు కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేశారు. అయితే అనూహ్యంగా ఉపరాష్ట్రపతి అయ్యారు ఈ దేశానికి. కానీ బిజెపి ఆదేశాలు కాకుండా తన సొంత అజెండాతో ముందుకు వెళ్లారు. ఇది ఎంత మాత్రం కేంద్ర పెద్దలకు రచించలేదు. అందుకే ఆయన పై ఒత్తిడి చేయించి రాజీనామా చేయించినట్లు వార్తలు వచ్చాయి. అలా రాజీనామా చేసిన జగదీప్ ను చంద్రబాబుతో పాటు లోకేష్ కలిసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఆయన కోరిక మేరకు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధపడినట్లు కూడా టాక్ నడిచింది.
* ప్రధానికి వివరణ..
అయితే టిడిపి ఎన్ డి ఏ కు గుడ్ బై చెబుతుందన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో జోరుగా సాగుతున్న వేళ.. మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తీసుకుని ఆయనను కలిశారు. ముంబైలో మాజీ ఉపరాష్ట్రపతిని కలిసింది నిజమేనని ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర ఒప్పుకున్నారు. అది రాజకీయ భేటీ కాదని.. యాదృచ్ఛిక సమావేశం అని చెప్పుకొచ్చారు. అటువంటి ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. అయితే లోకేష్ వివరణ ఇచ్చేసరికి ప్రధాని నరేంద్ర మోడీ నవ్వేశారట. గత అనుభవాల దృష్ట్యా మళ్లీ గ్యాప్ వస్తుందన్న ఆందోళన లోకేష్ లో ఉంటే… ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం కొట్టి పారేశారు. రాజకీయాల్లో ఉన్నాక ఎవరినైనా కలిసేందుకు అవకాశం ఉంటుందని.. అందులో ఎంత మాత్రం తప్పు లేదని.. తాము సైతం క్రాస్ చెక్ చేసామని చెప్పుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. దీంతో ఊపిరి పీల్చుకున్నారు లోకేష్. నిన్న కాంక్లేవ్ లో అదే విషయాన్ని చెప్పారు మంత్రి నారా లోకేష్.