Home Blog Page 80

మహేష్ బాబు తప్ప ఆ సినిమాను ఎవరు చేసిన ప్లాప్ అయ్యేదా..?

Mahesh Babu
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు తన ఎంటైర్ కెరియర్ లో చాలా విభిన్న తరహా సినిమాలను చేస్తూ వచ్చాడు. కెరియర్ స్టార్టింగ్ లోనే ప్రయోగాత్మకమైన సినిమాలను చేసి బొక్క బోర్లా పడ్డ మహేష్ బాబు ఆ తర్వాత కమర్షియల్ సినిమాల వైపే అడుగులు వేశాడు. సుకుమార్ దర్శకత్వంలో ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో కూడా భారీ ప్రయోగం చేసినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. అయినప్పటికి సుకుమార్ ఈ సినిమా చేసినందుకు గాను అతనికి చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. మొత్తానికైతే మహేష్ బాబు కెరియర్ లోనే ఇదొక బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది.

ఇక ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన శ్రీమంతుడు సినిమాని అంతకుముందు వేరే హీరోతో చేయాలని అనుకున్నారు. కానీ మహేష్ బాబు తోనే ఆ సినిమా చేయాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మహేష్ బాబు తో చేయడం వల్లే సూపర్ సక్సెస్ అయిందని వేరే హీరోలు చేసి ఉంటే అంత బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉండేది కాదని చాలామంది ఈ సినిమాని చూసిన సీనీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేశారు… ఇక ఏది ఏమైనా కూడా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు కూడా ఒక సోషల్ మెసేజ్ ను ఇస్తూ ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో ఆయన కూడా తన పంథాను మార్చి ప్రయోగాత్మకమైన సినిమాలను చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

పాన్ ఇండియాలో తన తోటి దర్శకులందరు ముందుకు దూసుకెళ్తుంటే ఆయన మాత్రం కొంతవరకు డీలా పడ్డాడు. కాబట్టి ఎలాగైనా సరే పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేసే సినిమాలు చేయడానికి పూనుకుంటున్నాడు. ఇక ఇప్పుడు బాలయ్య బాబుతో చేయబోతున్న సినిమా కూడా పాన్ ఇండియా నేపథ్యంలోనే తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది…

మరో మహిళతో భర్త దుకాణం.. ఈ భార్య గుడిలో ఏం చేసిందో తెలుసా..

Hyderabad Temple Incident
Hyderabad Temple Incident

Hyderabad Temple Incident: ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కుటుంబ పెద్ద ఏది చెప్తే అది శాసనంగా ఉండేది. ఫలితంగా మిగతా కుటుంబ సభ్యులు హద్దుల్లో ఉండేవారు. జాగ్రత్తగా మెసలుకునేవారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. ఎవరికి వారే అన్నట్టుగా మారిపోతుంది. దీనికి తోడు మనుషుల మధ్య బంధాలు దూరమవుతున్నాయి. తాత్కాలిక సంబంధాల కోసం శాశ్వతమైన బంధాలను దూరం చేసుకోవడానికి మనుషులు తెగబడుతున్నారు. స్థూలంగా చెప్పాలంటే విలువను కోల్పోయి జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ తరహా బంధాలు మరింత పెరిగిపోయాయి.

ఇటువంటి దారుణమైన సంబంధాల వల్ల ఘోరమైన ఘటనలు జరుగుతున్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి దోషులను శిక్షిస్తున్నారు. అయినప్పటికీ ఈ తరహా దారుణాలు ఆగడం లేదు. కొందరైతే భర్తలను హద్దులు పెట్టడానికి రకరకాల విధానాలు పాటిస్తున్నారు. చివరికి క్షుద్ర పూజలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇటువంటి సంఘటన హైదరాబాద్ నగర పరిధిలో చోటుచేసుకుంది.image.png

హైదరాబాద్ నగర శివారులో సూర్యగిరి ఎల్లమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రతిరోజు భక్తులతో సందడిగా ఉంటుంది. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించిన తర్వాత ఆలయ పరిసర ప్రాంతాల్లో వంటలు చేసుకుని తింటారు. ఈ ఆలయానికి ఒక మహిళ వచ్చింది. ఆమె వయసు 40 లోపు ఉంటుంది. అందరూ అమ్మవారికి మొక్కలు చెల్లిస్తుంటే ఆమె మాత్రం ప్రత్యేకంగా కూర్చుంది. చేతిలో కొబ్బరి చిప్పలు పట్టుకుంది. గాజులు, పసుపు, కుంకుమతో పూజలు చేసింది. చాలాసేపు అలానే కూర్చుంది. పైగా చిత్ర విచిత్రంగా చూపులు చూసింది. దీంతో ఆ ఆలయానికి వచ్చే భక్తులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆమెను సిబ్బంది అక్కడి నుంచి పంపించారు.

ఆ మహిళ భర్త కొంతకాలంగా వేరే మహిళతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇంటికి కూడా సరిగ్గా రావడం లేదు. భార్యను పట్టించుకోవడం లేదు. పిల్లల్ని కూడా సరిగ్గా చూడటం లేదు. దీంతో భర్త ప్రవర్తనతో విసిగి వేసారి పోయిన ఆమె ఇలా ఆలయానికి వచ్చింది. క్షుద్ర పూజల మాదిరిగానే పూజలు చేసింది. తన భర్త వివాహేతర సంబంధం నాశనం కావాలని అమ్మవారిని కోరినట్టు ఆమె అరుపుల ద్వారా తెలిసిందని మిగతా భక్తులు అంటున్నారు. ఆమె వ్యవహారానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

కాబోయే మొగుడిని ప్రియుడితో.. ఇది మరో ఇండోర్ ఘటన.. పోలీసుల దర్యాప్తులో దిమ్మతిరిగే వాస్తవాలు..

Ketan Agarwal Death
Ketan Agarwal Death

Ketan Agarwal Death: గత ఏడాది ఇండోర్ ప్రాంతానికి చెందిన వ్యాపారి రఘు వంశీ మేఘాలయలో హత్యకు గురయ్యాడు. అతడి మరణం వెనుక భార్య ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉండడంతో ఈ దారుణానికి పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఈ తరహా ఘటనలు మనదేశంలో తరచుగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ఘటన కూడా అటువంటిదే.

మహారాష్ట్రలోని పూణేలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ లోయలో పడి చనిపోయాడు. ఇతడిది సహజ మరణమని మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి రావడం మొదలైంది. కేతన్ అగర్వాల్ చనిపోవడం వెనక పెద్ద కుట్ర ఉందని.. దానికి పాల్పడింది ఒక కీలకమైన వ్యక్తి అని పోలీసులు తేల్చారు. దీంతో కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

కేతన్ అగర్వాల్ వయసు 26 సంవత్సరాలు. ఇతడు ఈనెల 18న అత్యంత చారిత్రాత్మకమైన లోహ గడ్ కోట వద్ద దాదాపు 500 అడుగులకు మించిన లోతు ఉన్న ఒక లోయలో పడి చనిపోయాడు. ఈ సంఘటన సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో పోలీసులు సమాచారం అందుకుని అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత దర్యాప్తు మొదలుపెట్టారు. కేతన్ కు సియా అనే అమ్మాయితో వివాహం కుదిరింది. ఇటీవల వారు సరదాగా గడిపేందుకు లోహగడ్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఫోటోలు దిగుతుండగా గాలులు వచ్చాయి. దీంతో లోయలో పడి చనిపోయాడని సియా పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు ఈ సంఘటనను ప్రమాదంగానే భావించారు.

పోలీసులు విచారిస్తున్నప్పుడు సియా సంబంధం లేకుండా సమాధానాలు చెప్పింది. దీంతో పోలీసులు అత్యంత లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే సియాకు మరొక వ్యక్తితో రిలేషన్ ఉంది. కేతన్ తో పెళ్లి ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. అందువల్లే అతడిని చంపడానికి కుట్ర చేసింది. బయటికి వెళ్దామని అతడిని లోహ గడ్ ప్రాంతానికి తీసుకెళ్ళింది. అక్కడికి సియా ప్రియుడు వచ్చాడు. వారిద్దరూ కలిసి కేతన్ ను లోయలోకి తోసి వేశారు. అతడు చనిపోయిన తర్వాత అసలు నాటకం మొదలుపెట్టారు. పోలీసుల దర్యాప్తులో ఈ నిజాలు తెలియడంతో సియా, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి.. జైలుకు పంపించారు.

కేతన అగర్వాల్ స్వస్థలం పూనేలోని గహుంజే ప్రాంతం. ఇక్కడికి స్థిరాస్తి వ్యాపారం ఉంది. ఒక వ్యాపార కంపెనీలో డైరెక్టర్ స్థాయిలో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇతడికి సియాతో ఎంగేజ్మెంట్ జరిగింది. అదే కాదు, వచ్చే నవంబర్ నెల 17న జరిగే పెళ్లిని అత్యంత వైభవంగా నిర్వహించడానికి 17 కోట్లతో ఉదయపూర్ ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ ను బుక్ చేశారు. అంతేకాదు బంధువులను తీసుకురావడానికి రెండు హెలికాప్టర్లు కూడా బుక్ చేశారు. అంతేకాదు ఈనెల 19న సియా జన్మదిన సందర్భంగా.. కాబోయే భార్యకు అద్భుతమైన కానుక ఇవ్వడానికి లోహ గడ్ కోటకు వెళ్లారు. అక్కడే కేతన్ తన ప్రాణాలు కోల్పోయాడు.

విజయ్ పుట్టినరోజును త్రిష మర్చిపోయిందా..ఇన్ స్టా లో ఈ ఫోటోలు ఏంటి.. అభిమానుల ఫ్యూజులు ఎగిరిపోయాయిగా..

Vijay Birthday
Vijay Birthday

Vijay Birthday: నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన పుట్టినరోజు జరుపుకున్నారు. టీవీకే నేతలు ఆయన జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానులు ఆయన జన్మదినాన్ని గొప్పగా నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ విజయ్ కి ఆయన నెచ్చలి త్రిష నుంచి ఎటువంటి బర్త్ డే విషెస్ రాలేదు. కనీసం ఆమె సోషల్ మీడియాలో కూడా ఎటువంటి పోస్ట్ చేయలేదు. దీనికి తోడు విజయ్ ని ఇన్ స్టా గ్రామ్ లో ఆమె అన్ ఫాలో చేసింది.

ఇటీవలి విజయ్ భార్య సంగీతతో కలిసి పోతున్నారని.. త్రిశతో దూరం జరుగుతున్నారని వార్తలు రావడం మొదలైంది. దీనిని సంగీత కూడా ఖండించలేదు. వీటికి బలం చేకూర్చే విధంగా త్రిష సోషల్ మీడియాలో విజయ్ ని అన్ ఫాలో చేసింది. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. దీనికి తోడు ఆయన పుట్టిన రోజు నాడు కనీసం త్రిష గ్రీటింగ్స్ కూడా చెప్పలేదు. దీంతో వీరిద్దరూ విడిపోయారని అందరూ ఒక అంచనాకొచ్చారు. ఇక మీడియాలో అయితే వార్తలు బీభత్సంగా పబ్లిష్ అయ్యాయి.

వీటన్నింటికీ త్రిష తెరదించారు. అంతేకాదు తన ఇన్స్టా గ్రామ్ లో ఒకే ఒక ఫోటో పోస్ట్ చేసి అందరి అంచనాలను తలకిందులు చేశారు. విజయ్ ముందు దాదాపు 5 ప్రత్యేకమైన కేకులను త్రిష ఏర్పాటు చేశారు. విజయ్ కూడా యువకుడి మాదిరిగా ప్రింటెడ్ షర్ట్ వేసుకున్నారు. ఆ కేకులను చూస్తూ మురిసిపోయారు.. అతడు మురిసిపోతుంటే త్రిష చిరునవ్వు చిందించారు. ఈ ఫోటోను త్రిష తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. విజయ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి లవ్ సింబల్ కూడా జోడించారు. అంతేకాదు 00.00 నెంబర్ యాడ్ చేశారు. అసలు ఈ నెంబర్ కు అర్థం ఏంటో తెలియక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.

విజయ్ ముఖ్యమంత్రి తర్వాత త్రిష ఇటీవల అతనితో కలిసి కనిపించారు. అజిత్ మాతృమూర్తి చనిపోవడంతో.. పరామర్శించడానికి విజయ్ తో కలిసి ఆమె వచ్చారు.. అంతకుముందు విజయ్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అతని అభినందించడానికి నేరుగా వెళ్లారు. అతని ఇంటి వద్ద చాలాసేపు గడిపారు. ఆ తర్వాత విజయ్ కి సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో త్రిష కనిపించారు. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వెనుక త్రిష కృషి కూడా ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరోవైపు ప్రభుత్వంలో త్రిష కీలకపాత్ర పోషిస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆమె టీవీకే కార్యకలాపాలకు.. ఇతర వ్యవహారాలకు దూరంగానే ఉంటున్నారు. తన సినిమా షూటింగ్లలో ఆమె పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన డ్రస్సులే వేసుకోండి అంటూ శివాజీ పై మంచు లక్ష్మి కౌంటర్లు..

Manchu Lakshmi
Manchu Lakshmi

Manchu Lakshmi: ప్రముఖ హీరో శివాజీ హీరోయిన్స్ ధరించే దుస్తులపై చేసిన కామెంట్స్ ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా రోజులుగా ఈ అంశంపై వివిధ కోణాల్లో చర్చలు జరుగుతూ వచ్చాయి. కొంతమంది శివాజీ ని తీవ్ర స్థాయిలో తప్పుబడితే , మరికొంతమంది మాత్రం శివాజీ కి సపోర్టు గా నిలిచారు. ఎక్కువ శాతం మంది శివాజీ కి సపోర్టు గా నిలిచారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ అంశం ముగిసిన అధ్యాయం అనుకుంటే పెద్ద పొరపాటే. సందర్భం వచ్చినప్పుడల్లా దుస్తుల గురించి సెలబ్రిటీలు మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు మంచు లక్ష్మి కూడా నేడు జరిగిన ఒక ఈవెంట్ లో ఈ అంశం పై స్పందించడం గమనార్హం. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆహా మీడియా లో త్వరలోనే ‘ఇండియాస్ ఫస్ట్ ఎవర్ Influencer రియాలిటీ షో’ ప్రారంభం కాబోతుంది. ఈ షో కి ఒక న్యాయ నిర్ణేతగా లక్ష్మి ప్రసన్న వ్యవహరిస్తుండగా , హోస్ట్ గా యాంకర్ రష్మీ వ్యవహరించబోతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కి హాజరైన మంచు లక్ష్మి , రిపోర్టర్ అడిగిన ఒక ప్రశ్న కు సమాధానం గా హీరోయిన్స్ వేసుకునే దుస్తుల ప్రస్తావన తీసుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘మహిళలు వారికి నచ్చిన దుస్తులు వేసుకునే స్వేచ్ఛ ఉంది. అందరికీ నచ్చే దుస్తులు వేసుకోవాలి అనే రూల్ లేదు. వాళ్లకు ఏది నచ్చితే అదే వేసుకోవచ్చు, దీనిపై మీడియా లో గత కొంతకాలంగా జరుగుతున్న సుదీర్ఘ చర్చ ని చూసి చాలా బాధపడ్డాను’ అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాదు ఇదే ఈవెంట్ లో ప్రముఖ బుల్లితెర సెలబ్రిటీ సుడిగాలి సుధీర్ గురించి యాంకర్ రష్మీ ని అడిగిన ప్రశ్నకు కూడా మంచు లక్ష్మి మీడియా రిపోర్టర్ పై చిరాకు పడింది, అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

సౌత్ సినిమాల్లో హీరోయిన్స్ ని అలా చూపించడం నాకు అసలు నచ్చేది కాదు - తమన్నా

Tamannaah Bhatia
Tamannaah Bhatia

Tamannaah Bhatia: సౌత్ లో సినిమాలు చేసి క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకోవడం , తద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టడం ఈమధ్య కాలం లో హీరోయిన్స్ కి సర్వ సాధారణం అయిపోయింది. కెరీర్ లో తదుపరి లెవెల్ కి వెళ్లే క్రమంలో బాలీవుడ్ కి వెళ్లడంలో తప్పు లేదు. కానీ అన్నం పెట్టిన అమ్మ రొమ్ము మీద కొట్టే విధంగా మాట్లాడడం చాలా తప్పు. ఇక సౌత్ లో ఎలాగో మనకు సినిమా అవకాశాలు రావు, బాలీవుడ్ లోనే మన కెరీర్ అని ఫిక్స్ అయిపోయిన హీరోయిన్స్ మాత్రమే ఇలా మాట్లాడుంటారు, అలాంటి హీరోయిన్స్ లో ఒకరిగా తమన్నా కూడా చేరడం దురదృష్టకరమైన విషయం. రీసెంట్ గా ఈమె సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ పై చేసిన కొన్ని కామెంట్స్ పెను దుమారమే రేపుతున్నాయి.

ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ ‘సౌత్ ఇండియా లో పురుషాధిపత్యం ఎక్కువ. హీరోయిన్స్ ని గౌరవంగా చూపించరు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఇండియన్ సినిమాల్లో పాటలు మరియు డ్యాన్స్ కి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇది నేను కెరీర్ ప్రారంభం లోనే గమనించాను. బాలీవుడ్ లో అయితే కేవలం నటన తెలిసిన హీరోయిన్స్ కొందరు అయితే, అందాలను ఆరబోత చేయడం తెలిసిన హీరోయిన్లు కొందరు ఉన్నారు. నటన , అందాల ఆరబోత రెండు చేయగల హీరోయిన్స్ మాత్రమే ఇండస్ట్రీ లో సూపర్ స్టార్స్ గా ఎదిగి ఎక్కువ కాలం కొనసాగుతుంటారు’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అంటూ తమన్నా నోటికి వచ్చినట్టు మాట్లాడుతోంది, మన సౌత్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు రావడం లేదా?, వచ్చి విజయం సాధించడం లేదా?, రీసెంట్ గా ‘మా ఇంటి బంగారం’ పెద్ద హిట్ అయ్యింది , అది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమానే కదా? అంటూ తమన్నా ని నిలదీస్తున్నారు.

తమన్నా ని సౌత్ ఇండియన్ దర్శక నిర్మాతలు చాలా గొప్పగా వాడుకునేవారు , ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేకపోయినా అవకాశాలు ఇచ్చారు ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చి పెద్ద స్టార్ ని చేశారు. కానీ బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత తమన్నా పరిస్థితి ఏంటి?, కెరీర్ ముందుకు సాగడం కోసం ఆమె అడల్ట్ రేటెడ్ రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నటిస్తోంది. ఎలా ఉండే తమన్నా , బాలీవుడ్ కి వెళ్ళగానే ఎలా మారిపోయింది?, రెండు ఇండస్ట్రీల మధ్య వ్యత్యాసం ఆమెకు ఈపాటికి అర్థం అయిపోయి ఉండాలి, కానీ బాలీవుడ్ దృష్టిలో పడేందుకు సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని తక్కువ చేయడం తల్లి పాలు తాగి రొమ్ము మీద కొట్టినట్టే అని అంటున్నారు నెటిజెన్స్.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో రామ్ చరణ్ భేటీ.. వీడియో వైరల్..

Ram Charan Narendra Modi Meeting
Ram Charan Narendra Modi Meeting

Ram Charan Narendra Modi Meeting: ‘పెద్ది’ మూవీ సక్సెస్ తో రామ్ చరణ్ పేరు నేషనల్ లెవెల్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మోత మోగిపోతోంది. ఎక్కడ చూసినా ఆయన కనిపిస్తున్నాడు , ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన పాటలు , ఆ సినిమాలోని డైలాగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ రేంజ్ ట్రెండింగ్ లో ఉండగానే , మరోసారి ఆయన సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాడు. నిన్న ముంబై లో జరిగిన ‘రిపబ్లిక్ సమ్మిట్ 2026’ ఈవెంట్ కి హాజరయ్యాడు. రామ్ చరణ్ తో పాటు దేశం లోని ప్రముఖులంతా ఈ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఇదే సమ్మిట్ లో రామ్ చరణ్ తో మీడియా ఇంటరాక్షన్ కూడా జరిగింది. ఈ సమ్మిట్ కి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొని పవర్ ఫుల్ స్పీచ్ ని అందించాడు.

ఆయన సమ్మిట్ కి రాగానే రామ్ చరణ్ కి కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వడం , అతని బాగోగులు అడిగి తెలుసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ప్రధాని , రామ్ చరణ్ కలయిక ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోయారు. రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎంత ఆప్తుడు అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, దేశం మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అనుభందం ఉంది అనేది తెలుసు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగాలేకపోతే, నేరుగా నరేంద్ర మోడీ నే ఆయన ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్ళాడు , ఆ స్థాయి అనుబంధం వీళ్లిద్దరి మధ్య ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ కూడా మోడీ తో ఆప్యాయంగా మాట్లాడడం చూస్తుంటే , మెగా ఫ్యామిలీ నరేంద్ర మోడీ దృష్టిలో అత్యున్నత స్థాయిలో ఉందనే విషయం స్పష్టం అవుతోంది.

చిరంజీవి తో కూడా మోడీ అనేక సందర్భాల్లో ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం రోజున , చిరంజీవి ని దగ్గరకు తీసుకొని ఫోటో దిగిన సందర్భాన్ని మెగా ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పుడు రామ్ చరణ్ తో మోడీ మీటింగ్ ని కూడా చాలా స్పెషల్ గా చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. సోషల్ మీడియా లో వైరల్ అయినటువంటి ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇకపోతే నేడు హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో ‘పెద్ది’ మూవీ విజయోత్సవ సభ జరగబోతుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు.

నందిని రెడ్డి తో సినిమా చేస్తే సమంత కి విడాకులు తప్పదా..? ఫ్లాష్ బ్యాక్ చూస్తే అలాగే అనిపిస్తోంది..

Samantha Nandini Reddy Movie Sentiment
Samantha Nandini Reddy Movie Sentiment

Samantha Nandini Reddy Movie Sentiment: టాలీవుడ్ లో కొన్ని సెంటిమెంట్స్ ని బలంగా నమ్మాల్సి ఉంటుంది. ఎందుకంటే అలాంటి సంఘటనలు రిపీట్ గా జరుగుతూ వస్తున్నాయి కాబట్టి. రీసెంట్ గానే సమంత , నందిని రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం విడుదలై డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి , ఇప్పుడు ట్రిపుల్ బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది బయ్యర్స్ కి లాభాల వర్షం కురిపించిన అతి తక్కువ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా చేరిపోయింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ నందిని రెడ్డి తో కలిసి సినిమా చేసినప్పుడల్లా సమంత జీవితం లో జరిగిన కొన్ని కీలక మార్పులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో జబర్దస్త్ , ఓ బేబీ, మా ఇంటి బంగారం చిత్రాలు వచ్చాయి.

జబర్దస్త్ చిత్రం లో సిద్దార్థ్ హీరో గా నటించాడు. ఈ సినిమా షూటింగ్ సమయం లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది. పెళ్లి వరకు కూడా వెళ్ళింది , వీళ్ళ జాతకాల్లో దోషాలు ఉంటే పూజలు చేయించుకొని వాటిని తొలగించే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఈ సినిమా విడుదల తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ, వీళ్లిద్దరి లవ్ బ్రేక్ అయ్యింది. పెళ్లి దాకా వెళ్లిన వీళ్ళ ప్రేమ వ్యవహారం ఇలా బ్రేకప్ అవ్వడం అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ గా నిల్చింది. ఇక సమంత , నందిని రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన రెండవ చిత్రం ‘ఓ బేబీ’. ఇందులో ఆమె మాజీ భర్త అక్కినేని నాగ చైతన్య గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఈ చిత్రం విడుదలై , సూపర్ హిట్ అయిన రెండేళ్లకు కొన్ని అనుకోని కారణాల వల్ల సమంత , నాగ చైతన్య దంపతులు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.

ఇప్పుడు రాజ్ నిడిమోరు ని పెళ్లాడిన తర్వాత సమంత తో మరోసారి నందిని రెడ్డి సినిమా చేసింది. అంటే భవిష్యత్తులో సమంత మరో మూవీ నందిని రెడ్డి తో చేసేలోపు , మరోసారి విడాకులు తీసుకొని వేరొకరిని పెళ్లి చేసుకుంటుందా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సమంత ప్రస్తుతం గర్భం దాల్చింది. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. కాబట్టి ఇప్పట్లో ఆమె సినిమాల్లో నటించే అవకాశం లేదు , భవిష్యత్తులో మరోసారి నందిని రెడ్డి తో చేసే అవకాశం కూడా లేదు కాబట్టి, వీళ్లిద్దరు ఎప్పటికీ కలిసే ఉంటారంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఐర్లాండ్ సిరీస్ నుంచి నితీష్ కుమార్ రెడ్డి ఔట్.. కారణమిదే

Nitish Kumar Reddy Injury
Nitish Kumar Reddy Injury

Nitish Kumar Reddy Injury: ఇటీవలి ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో టీమిండియా అదరగొట్టింది. ఏకైక టెస్ట్ మాత్రమే కాకుండా.. 3 వన్డేలు కూడా గెలిచి సత్తా చూపించింది. తద్వారా 2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందు ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంది. టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ తర్వాత తదుపరి ఐర్లాండ్ లో పర్యటించబోతోంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ ఆడుతుంది.

ఈ రెండు టోర్నీలకు సంబంధించి మేనేజ్మెంట్ ఇప్పటికే జట్టును ప్రకటించింది. ఈ రెండు సిరీస్ లు ప్రారంభం కాకముందే టీమ్ ఇండియాకు బ్యాడ్ న్యూస్ లు ఎదురయ్యాయి. దీంతో మేనేజ్మెంట్ ఆలోచనలో పడి.. వేగంగా నిర్ణయాలు తీసుకుంది. వాస్తవానికి ఇటీవల కాలంలో టీం ఇండియాలో ఇలా జరగలేదు. దీంతో మేనేజ్మెంట్ చాకచక్యంగా వ్యవహరించి.. సరికొత్త నిర్ణయాలు తీసుకుంది.

ఐర్లాండ్ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ ఆడుతుంది టీమ్ ఇండియా. ఈ సిరీస్ లు ప్రారంభం కాకముందే టీమ్ ఇండియా ప్లేయర్లకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. కీలకమైన ప్లేయర్లు గాయాల బారిన పడుతున్నారు. దీంతో వారు సిరీస్ లో నుంచి తప్పుకుంటున్నారు. ఇప్పటికే మాయాజాలికుడు వరుణ్ చక్రవర్తి టి20 జట్టు నుంచి తప్పుకున్నాడు. ఈ జాబితాలో ఇప్పుడు మళ్లీ తెలుగు యువకుడు చేరిపోయాడు. అతడే నితీష్ కుమార్ రెడ్డి. తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న అతడు టి20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఐర్లాండ్ మాత్రమే కాకుండా.. ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా అతడు ఆడే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో సూర్యాంష్ కు మేనేజ్మెంట్ చోటు ఇచ్చింది.

తొడ కండరాలు గాయంతో బాధపడుతున్న నితీష్.. పూర్తిస్థాయిలో సామర్థ్యం సంపాదించడానికి నాలుగువారాల సమయం పడుతుంది. ఆ తర్వాత తనను తాను నిరూపించుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. అందువల్లే అతడు ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ లకు దూరమయ్యాడు..సూర్యాంష్ కు చోటు దక్కిన నేపథ్యంలో అతడి గురించి చర్చ మొదలైంది.. ఇటీవల అతడు శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ట్రై సిరీస్ లో అదరగొట్టాడు.. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన అతడు ఐదు మ్యాచ్లలో 147 పరుగులు చేశాడు. బంతితో కూడా ఆకట్టుకున్నాడు.

సూర్యాంష్ 2024- 25 కాలంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టు తరఫున ఆడాడు. 131 పరుగులు చేశాడు.. మరోవైపు ఈ నెలలో 26 నుంచి 28 మధ్య ఐర్లాండ్లో టీమ్ ఇండియా పర్యటిస్తుంది. రెండు టి20 మ్యాచ్ లు ఆడుతుంది. అనంతరం వచ్చే నెల ఒకటి నుంచి 11వ తేదీల మధ్య ఇంగ్లాండ్ జట్టుతో టీం ఇండియా 5 t20 మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది.

కోర్టులో మహిళా లాయర్ చేతికి పోలీసుల బేడీలు.. విచారణలో దిగ్భ్రాంతికరమైన నిజాలు..

Fake Woman Lawyer Arrested
Fake Woman Lawyer Arrested

Fake Woman Lawyer Arrested: అది మధ్యప్రదేశ్.. నర్మదాపురం లోని కోర్టు.. అక్కడ ఫిర్యాదుదారులు.. న్యాయవాదులతో ఆ ప్రాంతం మొత్తం కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో అక్కడికి పోలీసులు ప్రత్యేక వాహనాలలో వచ్చారు. కోర్టు అన్నాక పోలీసులు రావడం సహజం. అక్కడికి వచ్చిన ఫిర్యాదారులు కూడా ఆ పోలీసులను చూసి పెద్దగా కంగారు పడలేదు. ఆ పోలీసులు నేరుగా న్యాయవాదులు ఉండే ఛాంబర్ వద్దకు వెళ్లారు. అక్కడ ఉపాధ్యాయ అనే పేరుతో ఉన్న ఒక మహిళ న్యాయవాదిని అరెస్ట్ చేశారు. దీంతో కోర్టులో వాతావరణం మొత్తం ఒక్కసారిగా కలకలం నెలకొంది.

ఒక మహిళా న్యాయవాదిని పోలీసులు అరెస్ట్ చేస్తే.. ఆమె కనీసం ప్రతిఘటించలేదు. పైగా ఆమె పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగలేదు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఆమె వారితో పాటు వెళ్లిపోయింది. న్యాయవాదులు.. పోలీసులను ప్రశ్నిస్తే.. ఆ తర్వాత వారు చెప్పిన నిజాలు షాక్ కు గురిచేశాయి. అంతేకాదు.. ఈ పరిణామాల వెనుక ఉన్న దారుణం అందరిని కలవరపాటుకు గురిచేసింది. ఇలా కూడా జరుగుతుందా.. ఒక మహిళ ఇలా కూడా చేస్తుందా అనే భయం కలిగింది.

పోలీసులు అరెస్ట్ చేసిన ఆ మహిళ న్యాయవాది అసలు పేరు రుబీనా షేక్. ఈమె ఉపాధ్యాయ పేరుతో న్యాయవాదిగా చలామణి అవుతుంది. రుబీనా చదువుకున్నది 8వ తరగతి వరకే. తాను ఉన్నత చదువులు చదివినట్టు.. న్యాయవాద విద్య అభ్యసించినట్టు అందరిని నమ్మించింది. ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి పేరు పొందిన న్యాయవాది దగ్గర ప్రాక్టీస్ మొదలు పెట్టింది.

తన దగ్గరికి వచ్చే మహిళలను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా డైవర్స్ కేసులను టేక్ అప్ చేసేది. వారికి విడాకులు వచ్చేలాగా కృషి చేసేది. ఆ తర్వాత వారిని క్రమంగా మాయమాటలు చెప్పి మార్చేది. అనంతరం వారికి మతం మార్చేది. ఇలా 175 మంది మహిళలను మతం మార్చింది. వారికి ముస్లిం యువకులతో పెళ్లి చేసింది. వాస్తవానికి దీనికి ఆమె లవ్ జిహాద్ అని పేరు పెట్టుకుంది.

ఇలా సాగిపోతున్న రూబీన వ్యవహారం ఒక యువతి ద్వారా బయటపడింది. ఆ యువతీకి వివాహం జరిగింది. భర్త తాకిడి తట్టుకోలేక విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె కేసును రూబీనా టేకప్ చేసింది. ఆమెకు మాయమాటలు చెప్పి మతం మార్చేందుకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని పసిగట్టిన ఆ యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె చెప్పిన వివరాలు మొత్తం సేకరించి.. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. ఇప్పటిదాకా హిందూ మహిళగా.. ఉపాధ్యాయగా ఒక రేంజ్ లో మహానటి పెర్ఫార్మన్స్ ఇచ్చింది రూబీనా.. లవ్ జిహాద్ ను విజయవంతంగా కొనసాగించింది. చివరికి ఒక యువతీ ద్వారా ఈమె బండారం బయటపడింది. నర్మదాపురంలో ఈ సంఘటన సంచలనం సృష్టించగా.. దేశవ్యాప్తంగా కలకలానికి కారణమైంది. ఇటువంటి మహిళల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

సుడిగాలి సుధీర్ గురించి రిపోర్టర్ అడగ్గానే చిరాకు పడిన రష్మీ.. వీడియో వైరల్..

Rashmi Sudigali Sudheer Viral Video
Rashmi Sudigali Sudheer Viral Video

Rashmi Sudigali Sudheer Viral Video: బుల్లితెర పై సుధీర్ , రష్మీ జంటకు యూత్ , ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుంది అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ని చూస్తే , ఎవరైనా లవర్స్ , కాబోయే భార్య భర్తలు అంటే నమ్మేస్తారు, ఆ రేంజ్ లో ఉంటుంది. కానీ ఒక్కసారి కూడా వీళ్లిద్దరు మేము లవర్స్ అనే విషయాన్నీ బహిరంగంగా ఇప్పటి వరకు చెప్పలేదు. అసలు రష్మీ తో నేను ఫోన్ లో మాట్లాడిన సందర్భాలు కూడా చాలా తక్కువని , కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే మేమిద్దరం బుల్లితెరపై అలా జంటగా కనిపిస్తామని , అంతకు మించి ఏమి లేదని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు సుధీర్ , రష్మీ కూడా అదే చెప్తూ వచ్చేది. కానీ ఆడియన్స్ మాత్రం అసలు నమ్మేవాళ్ళు కాదు. వీళ్లిద్దరు కలిసి ఒక షో లో కనిపించి ఐదేళ్లు దాటింది.

కానీ ఇప్పటికీ వీళ్ళిద్దరిని లింక్ చేస్తూ సోషల్ మీడియా లో కొన్ని పేజీలు పోస్టులు పెడుతూనే ఉంటున్నాయి. ఇకపోతే ఆహా మీడియా లో త్వరలోనే ‘ఇండియాస్ ఫస్ట్ ఎవర్ Influencer రియాలిటీ షో’ అనే ప్రోగ్రాం ప్రారంభం అవ్వబోతుంది. ఈ షో కి యాంకర్ గా రష్మీ వ్యవహరించబోతుండగా , మంచు లక్ష్మి జడ్జీగా వ్యవహరించబోతుంది. ఈ షో ప్రొమోషన్స్ కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రష్మీ , మంచు లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక రిపోర్టర్ రష్మీ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు ఫీల్ అవ్వనంటే ఒక ప్రశ్న అడుగుతాను’ అని అంటాడు. అప్పుడు రష్మీ మీరు అడిగే ప్రశ్న ని బట్టీ నేను ఫీల్ అవుతానా లేదా అనేది చెప్తాను అంటుంది. ‘మీ కో యాంకర్ సుడిగాలి సుధీర్ ఎన్నో అద్భుతమైన షోస్ చేసాడు. కానీ ఇక్కడ జరిగిన సందర్భాన్ని బట్టీ చూస్తుంటే మీరు అతని పేరు చెప్పడానికి కూడా ఆసక్తి చూపించలేదు. ఇందాక మీరు సమాధానం చెప్పి ఉండుంటే గెలిచేవారు , కానీ ఎందుకు అతని పేరు తీయడం ఇష్టం లేక సమాధానం చెప్పలేదు?’ అని అడుగుతారు.

అందుకు రష్మీ సమాధానం చెప్తూ ‘ఇష్టపడలేదు అనేది కాదు , ఇప్పుడు కేవలం మనం ఒక షో గురించి మాట్లాడడం కోసం ఇక్కడికి వచ్చాము , ఒక వ్యక్తి గురించి కాదు , అందుకే నేను చెప్పలేదు , అంతే తప్ప ఇష్టం లేక కాదు అనడం కరెక్ట్ కాదు’ అంటూ చెప్పుకొచ్చింది. అనంతరం మంచు లక్ష్మి మైక్ అందుకొని ‘మీకే బోరు కొట్టలేదా?, ఎంతసేపు సుధీర్ గురించే అడగాలా?, మీకు క్లిక్ బైట్ కోసం అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీకోసం అందిస్తున్నాము చూడండి.

రామ్ చరణ్ తేజ్ పీఆర్ టీమ్ ఇంత వీకా..

Ram Charan PR Team
Ram Charan PR Team

Ram Charan PR Team: ఇటీవల పెద్ద సినిమా అత్యంత గ్రాండ్ గా విడుదలైంది. పాజిటివ్ టాక్ కూడా సొంతం చేసుకుంది. ఆ సినిమా వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే ఆ సినిమా రేంజ్ లో మాత్రం కాదు. దీనంతటికీ ప్రధాన కారణం ఆ సినిమా పీఆర్ బృందం నిర్లక్ష్యం. సరిగ్గా ప్రచారం చేయలేకపోవడం.. సినిమా విడుదల రోజు హడావిడి చేసి.. ఆ తర్వాత చేతులెత్తేయడంతో పెద్ది అనుకున్న స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది.

పెద్ది సినిమా పీఆర్ టీమ్ నిర్లక్ష్యం అలా ఉంటే.. రామ్ చరణ్ ప్రజా సంబంధాలను (పబ్లి రిలేషన్) చూసే బృందం కూడా అలానే తగలబడింది. తాజాగా రామ్ చరణ్ రిపబ్లిక్ టీవీ నిర్వహిస్తున్న కాంక్లేవ్ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. దీనికి దేశ విదేశాలకు సంబంధించిన సెలబ్రిటీలు హాజరవుతూ ఉంటారు. అనేక అంశాల మీద తమ అభిరాన్ని చెబుతుంటారు.

ప్రస్తుత కాంక్లేవ్ కు రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ అనేక అంశాల గురించి ఆయన మాట్లాడారు. ప్రముఖంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమను మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని షేక్ చేసిన దురంధర్ సినిమా గురించి రాంచరణ్ మాట్లాడాడు. అయితే ఇక్కడే రామ్ చరణ్ పిఆర్ టీం చేసిన తప్పు ఆయనను మరోసారి పలచన చేసింది.

దురంధర్ సినిమా గురించి చెప్పుకుంటూ పోయిన రామ్ చరణ్.. ఒక విషయంలో నోరు జారారు. అది కాస్త ఆయన పిఆర్ టీం లేకితనాన్ని బయటపెట్టింది. దురంధర్ సినిమా మార్చి 19 విడుదలైంది. ఆ మరుసటి రోజు ఈ సినిమా గురించి రామ్ చరణ్ మాట్లాడారు.. ట్విట్టర్ ఎక్స్ లో అద్భుతమైన రివ్యూ ఇచ్చారు. సినిమా అద్భుతంగా ఉందని చెప్పారు. నటులు బ్రహ్మాండంగా నటించారని వివరించారు.

తాజాగా కాంక్లేవ్ లో రామ్ చరణ్ తాను దురంధర్ సినిమాను ఓటీటీలో చూశాను అని చెప్పారు. ఆయన మాట్లాడిన ఆ మాటలు సంచలనంగా మారాయి. సరిగ్గా మార్చి 20న తాను థియేటర్లో దురంధర్ సినిమా చూశానని చెప్పిన రామ్ చరణ్.. ఇప్పుడు మళ్లీ ఓటిటిలో చూసినట్టు చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే అప్పుడు రామ్ చరణ్ సినిమా చూడలేదా.. పి.ఆర్ బృందం రాసిచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా ట్వీట్ చేశారా అని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. నాడు రామ్ చరణ్ పాత ట్రీట్.. రిపబ్లిక్ టీవీలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను జతచేస్తూ మీమ్స్ సృష్టిస్తున్నారు. సెటైర్లు వేస్తూ విమర్శలు చేస్తున్నారు. రామ్ చరణ్ పిఆర్ టీం ఇంత వీకా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో రామ్ చరణ్ ఇటీవల ఖాళీగా ఉన్నాడేమో.. అందువల్లే మళ్ళీ సినిమా చూసి ఉంటాడని పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ రామ్ చరణ్ పిఆర్ టీం మరోసారి నవ్వుల పాలైంది. ఇటువంటి తప్పులు జరగకుండా మరోసారి ఆ బృందం చూసుకుంటుందా.. లేకుంటే ట్రోలర్లకు పని చెబుతుందా.. చూడాల్సి ఉంది.

 

 

బీచ్ లో మౌనీ అందాల అరాచకం

Mouni Roy beach look
Mouni Roy beach look

అడుగుపెట్టి ఏడాది కాలేదు.. అంతలోనే నెంబర్ వన్.. ఇది మన శ్రీ చరణి సత్తా

Sri Charani ICC T20 Rankings
Sri Charani ICC T20 Rankings

Sri Charani ICC T20 Rankings: సరిగ్గా గత ఏడాది ఈ సమయానికి ఆ అమ్మాయి ఇంకా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టలేదు. ఏడాదికాకముందే అంతర్జాతీయ క్రికెట్ మొత్తాన్ని షేక్ చేసింది. సరికొత్త ఆట తీరుతో అదరగొట్టింది. అంతేకాదు మువ్వన్నెల జాతీయ జెండాను రెపరెపలాడించింది. గొప్ప గొప్ప ప్లేయర్లు సాధించలేనిది.. సీనియర్ క్రికెటర్లు అందుకోలేనిది.. తాను సొంతం చేసుకుంది. అటు అంతర్జాతీయ స్థాయిలో భారత దేశానికి.. రెండు తెలుగు రాష్ట్రాలకు అద్భుతమైన పేరు తీసుకొచ్చింది. ఆ అమ్మాయి మరెవరో కాదు శ్రీ చరణి.

గత ఏడాది జూన్ 28న ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించింది శ్రీ చరణి. తొలి మ్యాచ్ లోనే సత్తా చూపించింది. ఆ తర్వాత మహిళల టి20 వరల్డ్ కప్ లో అదరగొట్టింది. మెలి తిరిగే బంతులు వేస్తూ ప్రత్యర్థి ప్లేయర్లకు చుక్కలు చూపించింది. చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించింది. అంతేకాదు టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలవడం లో ముఖ్యపాత్ర పోషించింది. ఆ తర్వాత ఆమె ఎదుగుదల మరింత జోరుగా సాగిపోయింది.

నాడు టి20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన
శ్రీ చరణిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెను సన్మానించారు. అంతేకాదు.. కోటి రూపాయల నగదు బహుమతిని.. విలువైన ఇంటి స్థలాన్ని.. ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆమెకు కేటాయించారు. నాడు ఆమెతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. అప్పుడు నారా లోకేష్.. మిథాలీ రాజ్ వంటి క్రికెటర్ కూడా ఉన్నారు.

తాజాగా అంతర్జాతీయ టి20 ర్యాంకింగ్స్ లో శ్రీ చరణి దుమ్మురేపింది. నెంబర్ వన్ ఉమెన్ టి20 బౌలర్ గా నిలిచింది. అంతర్జాతీయ టి20 బౌలర్ల ర్యాంకింగ్స్ లో శ్రీ చరణి మొదటి స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ లిన్సే స్మిత్ ను ఆమె అధిగమించింది. అగ్రస్థానంలోకి చేరుకుంది. ఇక ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్లు ఆడిన మన తెలుగు అమ్మాయి.. 10 వికెట్లను సొంతం చేసుకుంది. శ్రీ చరణి ఈ స్థాయిలో బౌలింగ్ చేయడం పట్ల.. నెంబర్ వన్ స్థానాన్ని చేరుకోవడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ వేదికమందు గొప్ప పేరు తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.

రేవంత్ రెడ్డి వ్యవహారశైలి సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా..

Revanth Reddy political style

Revanth Reddy political style : రేవంత్ రెడ్డి .. యంగెస్ట్ సీఎం.. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యువ సీఎం. ఆయనకు పార్టీలు ముఖ్యం కాదు.. పార్టీలను ఒక సాధనంగా వాడుకొని పైకి వచ్చిన వ్యక్తి. రేవంత్ రాజకీయ ప్రయాణం అలానే కనిపిస్తోంది. మాటల గారెడీతో ఆకట్టుకోగలదు. అవతల వారిని హర్ట్ చేసినా చింతించడు. అది ఎంత పెద్ద నాయకుడు అయినా.. మోడీ స్థాయి ఏంటి.. మోడీపై కూడా అలాంటి డైలాగులు మాట్లాడుతాడు. అలాంటి మోడీతోనే సన్నిహితంగా మెలగలరు. కేవలం ట్రాన్సాక్షన్ నాయకుడు. ఈ వ్యవహారశైలి బాగానే ఉంటుంది. హైడ్రా వంటి మంచి ప్రయత్నం హైదరాబాద్ లో కొనసాగుతోంది.కొన్ని ఆరోపణలున్నా మంచి పనులే చేస్తున్నారు.

హైడ్రా, మూసీ పనులు మంచి పనులు. మెట్రో ఎయిర్ పోర్టు విస్తరణ తుగ్గక్ పని.. హైడ్రా ఇన్స్పిరేషన్ హిట్లర్ అని.. రెడ్లు సహజ పాలకులు అంటాడు. చాలా స్లిప్ట్ పర్సనాలిటీని ఎక్కడా చూడలేం.

మెట్రో విస్తరణ విషయంలో కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శించాడు. కేంద్రమంత్రుల వద్ద రేవంత్ రెడ్డి పరపతి సరిపోవడం లేదు. పబ్లిక్ లో తిట్టేసి ఒత్తిడి తీసుకొచ్చాడు. అదే కిషన్ రెడ్డిని పట్టుకొని వెళ్లి అశ్వినీ వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్ దగ్గరకు తీసుకెళ్లి మెట్రో విస్తరణపై పని చేసుకొని పెట్టాడు కిషన్ రెడ్డి. పబ్లిక్ గా బ్లాక్ మెయిల్ తీసుకొచ్చి కిషన్ రెడ్డి పనిచేయించుకున్నాడు రేవంత్ రెడ్డి..

రేవంత్ రెడ్డి వ్యవహారశైలి సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోను చూడొచ్చు. 

కాక్రోచ్ జనతా పార్టీ.. కార్పొరేట్ టూల్ కిట్.. వందల కోట్లు.. నడిపిస్తున్నది ఎవరు..

Cockroach Janata Party Controversy
Cockroach Janata Party Controversy

Cockroach Janata Party Controversy: పగలేమో నిరసనలు చేస్తున్నారు. రాత్రి ఏమో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రతి ప్రాంతంలోనూ నిరసన చేపట్టే ముందు హంగామా చేస్తున్నారు. ఇండిపెండెంట్ ఉద్యమాలు అని చెబుతూనే.. లగ్జరీ లెవెల్ లో నిరసనలు చేపడుతున్నారు. వాస్తవానికి ఇదంతా ఎలా జరుగుతోంది.. ఈ ఖర్చు మొత్తం ఎవరి భరిస్తున్నారు.. అభిజిత్ ఒక పిలుపు ఇవ్వగానే ఒక వర్గానికి సంబంధించిన మేధావులు ఎందుకు వస్తున్నారు.. వారంతా ఏం చేస్తున్నారు.. దీనిని ఎవరు నడిపిస్తున్నారు.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు కొంతమంది పాత్రికేయులకు కలిగాయి. వారు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేస్తే దారుణమైన నిజాలు వెలుగు చూశాయి.

అప్పట్లో రైతు చట్టాలను కేంద్రం తీసుకొచ్చినప్పుడు టూల్ కిట్ ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమానికి మనదేశంలో చాలామంది సపోర్ట్ చేశారు. అందులో కమ్యూనిస్టు పార్టీలకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ఆకస్మాత్తుగా ఖలిస్తాన్ నినాదం పుట్టింది. ఆ తర్వాత ఢిల్లీలో ఎర్రకోట మీద జాతీయ జెండాకు బదులుగా వేర్పాటు వాదులు తమ జెండాను ఎగరవేశారు. దీంతో వారి ఎజెండా క్లియర్గా కనిపించింది.

ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో కూడా కొంతమంది పాత్రికేయులు లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇదంతా కూడా కార్పొరేట్ టూల్ కిట్ మాదిరిగానే ఉంది.. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ వెబ్సైట్.. ఇతర సోషల్ మీడియా ఖాతాలు పనిచేయడం లేదు. ఆయనప్పటికీ వాటి సంబంధించిన డిజిటల్ వ్యవహారాలలో ఫుట్ ప్రింట్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేసి కనిపిస్తున్నాయి.. పైగా నిరసనలు చేపడుతున్నప్పుడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు దరఖాస్తు చేసిన వారందరికీ సందేశాలు వెళుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న నిరసనలో పాల్గొనాలని పిలుపులు వెళ్తున్నాయి. లక్షల మంది విద్యార్థులకు అలా సందేశాలు వెళ్లడం వెనక ఎగ్జామ్ జీట్ ఆప్స్ వాడుతున్నట్టు తెలుస్తోంది. డేటా హార్వెస్టింగ్ కూడా చేపడుతున్నట్టు సమాచారం. ఇదంతా అంతా సులువైన వ్యవహారం కాదు. దీని వెనక పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు.. పేరుపొందిన హ్యాకర్లు పనిచేస్తూ ఉంటారు. బొద్దింకల ఉద్యమానికి వీరంతా ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టు.. ఎన్ని కోట్ల ఖర్చు ఎందుకు పెడుతున్నట్టు.. అదే ఆందోళన కలిగిస్తోంది.

పైగా కాక్రోచ్ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్న కొన్ని వెబ్సైట్లో సోలానా బిట్ కాయిన్ గేట్ వే లు కనిపిస్తున్నాయి. ఇవి మనీలాండరింగ్ వ్యవహారాలలో కీలకంగా ఉంటాయి. ఎందుకంటే వీటి ద్వారా సులభంగా నల్లధనాన్ని తెల్లగా మార్చవచ్చు. మనదేశంలో ప్రభుత్వ బ్యాంకుల సర్వర్లు ఒప్పుకోనప్పటికీ.. ఎప్పటికప్పుడు హ్యాకర్లు డొమైన్ లు మార్చుతున్నారు. ఇలా వందల కోట్ల డబ్బు ఖర్చు పెట్టడం.. తెర వెనుక కార్పొరేట్ వ్యక్తులు ఉండడం.. ఈ ఉద్యమంలో కొంతమందిని భాగస్వాములు చేయడం చూస్తుంటే దేశాన్ని అస్థిరపరిచే కుట్ర పన్నినట్టు తెలుస్తోంది..

నీట్ పరీక్ష నిర్వహణ దారుణంగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం కూడా తెలిసిందే. ఈ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టకూడదు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. కానీ, నీట్ లో లోపాలను సాకుగా చూపించి కొంతమంది కృత్రిమ ఉద్యమాలు సృష్టించి.. దేశంలో అస్థిరత సృష్టించే పనులు చేపడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఎందుకంటే ఈ దేశం అందరిది. ఈ దేశంలో ఏవైనా దారుణాలు జరిగితే బాధపడేది కూడా అందరే.

'ఓజీ 2' నిర్మాత మార్పు పై మూవీ టీం సంచలన ప్రకటన.. ఫ్యాన్స్ కి పండుగ లాంటి వార్త..

OG 2 Producer Change
OG 2 Producer Change

OG 2 Producer Change: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లాంటి ఘోరమైన ఫ్లాప్ తర్వాత పవన్ కళ్యాణ్ అసలు సినిమాలు చేస్తాడా?, లేదంటే కేవలం పాలనపైన మాత్రమే ఫోకస్ పెడుతాడా అనే అనుమానాలకు చెక్ పడిన సంగతి తెలిసిందే. ఆయన తదుపరి చిత్రం తన కెరీర్ లో మైల్ స్టోన్ లాగా నిల్చిపోయిన ‘ఓజీ’ సీక్వెల్ ‘ఓజీ 2’ చేయబోతున్నాడని స్పష్టమైన క్లారిటీ అభిమానులకు ఇచ్చాడు. రీసెంట్ గానే ఈ చిత్ర డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ ని కలిసి ఈ సినిమా షూటింగ్ ప్రణాళిక పై చర్చలు జరిపాడు. అందుకు సంబంధించిన ఫోటో ని విడుదల చేయగా , అది సోషల్ మీడియా లో సెన్సేషన్ సృష్టించింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ , లక్షల కొద్దీ లైక్స్ ఈ ఫోటో కి వచ్చాయి. దీనికే ఈ రేంజ్ క్రేజ్ ఉంటే , ఇక ఫస్ట్ లుక్ రోజు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో ఊహించడం కూడా కష్టమేనని అంటున్నారు నెటిజెన్స్.

సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా , ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ వీడియో ని విడుదల చేస్తారని , అదే నెలలో ముహూర్తపు కార్యక్రమాలు జరిపి , నవంబర్ నెలలో ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెడతారని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా నుండి నిర్మాత DVV దానయ్య తప్పుకున్నాడని , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిమరించడానికి ముందుకొచ్చిందని , పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కూడా నిర్మాణం లో భాగం కాబోతుందని , ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మీడియాకు పవన్ కళ్యాణ్ టీం కీలక సమాచారం అందించింది. ఈ సినిమా నిర్మాత గురించి సోషల్ మీడియా లో రకరకాల చర్చలు జరగడం మేము గమనిస్తూనే ఉన్నాము.

అవన్నీ నమ్మకండి , సరైన సమయం వచ్చినప్పుడు , అన్ని వివరాలను తెలియజేస్తాము అంటూ చెప్పుకొచ్చారు. అంటే ఈ సినిమా నిర్మాణ భాగస్వామ్యంలో DVV ఇప్పటికీ ఉన్నాడా?, ఉంటే చాలా బాగుంటుంది అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే DVV సంస్థ ఆన్లైన్ లో ఈ సినిమా విడుదల సమయం లో ఇచ్చిన అప్డేట్స్ కి అభిమానులు మెంటలెక్కిపోయేవారు , అంతే కాకుండా ఆ హ్యాండిల్ కి విపరీతమైన రీచ్ కూడా ఉంది. అందుకే DVV కూడా భాగం అవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. మరి వాళ్ళు అవుతారా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇంకా మొదలు అవ్వలేదు. త్వరలోనే క్యాస్టింగ్ ని కూడా నిర్ణయిస్తారట.