MVS Murthi: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి ఉంది. ఆ పార్టీ బలం పెంచుకున్నట్లు ఊహిస్తోంది. కానీ చాలా చోట్ల పార్టీకి సరైన నాయకత్వం లేదు. ఇప్పటికీ నియోజకవర్గ ఇన్చార్జులు బాధ్యతలు తీసుకోవడం లేదు. పార్టీలో యాక్టివ్ గా ఉన్న నాయకులు కొద్దిమంది మాత్రమే. మిగతావారు రకరకాల కారణాలతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నికల ముంగిట చూసుకోవచ్చు కదా అని భావిస్తున్న వారు ఉన్నారు. వైసిపి హయాంలో ఒక వెలుగు వెలిగిన నేతలు సైతం ఇప్పుడు పెద్దగా బయటకు రావడం లేదు. ఇప్పుడు వస్తే పార్టీ ఖర్చులు చూడాల్సి వస్తుందన్న భయంతో ఉన్నవారు కూడా ఉన్నారు. దాదాపు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇదే పరిస్థితి ఉంది. మంత్రి పదవులతో పాటు ఎంపీ పదవులు చేపట్టి ఆర్థికంగా బలపడిన వారు సైతం ముఖం చాటేస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా ఇలానే ముఖం చాటేసిన విశాఖ మాజీ ఎంపీ ఎంవీఎస్ మూర్తి ఇప్పుడు యాక్టివ్ అవుతుండడం విశేషం. అయితే విశాఖ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్థికంగా గట్టి నేత..
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంవీఎస్ మూర్తి ఉండేవారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన మూర్తి 2018లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్థికంగా స్థితిమంతుడు తో పాటు బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో జగన్మోహన్ రెడ్డి ఎంతగానో ప్రోత్సహించారు. 2019 ఎన్నికల్లో కీలకమైన విశాఖ ఎంపీ టికెట్ ఇచ్చారు. టిడిపి అభ్యర్థిగా శ్రీ భరత్ అప్పట్లో పోటీలో నిలిచారు. జనసేన అభ్యర్థిగా సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ రంగంలోకి దిగారు. కేవలం త్రిముఖ పోటీ కావడంతో.. ఎంపీగా తక్కువ మెజారిటీతో విజయం సాధించారు మూర్తి. కానీ ఐదేళ్ల వైసిపి పాలనలో సొంత పార్టీ నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి మూర్తికి.
ఓడిన తరువాత..
2024 ఎన్నికల్లో ఎంవీఎస్ మూర్తి అభ్యర్థిత్వాన్ని మార్చారు జగన్మోహన్ రెడ్డి. ఆయన స్థానంలో బొత్స ఝాన్సీ లక్ష్మిని తెచ్చారు. ఎంవీఎస్ మూర్తిని విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నిలబెట్టారు. ఎందుకంటే అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెలగపూడి రామకృష్ణ బాబు టిడిపి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన వరుసగా గెలుస్తూ వచ్చారు. అందుకే అదే సామాజిక వర్గానికి చెందిన ఎంవీఎస్ మూర్తి అయితే గెలుస్తారని భావించారు జగన్మోహన్ రెడ్డి. కానీ మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు మూర్తి. అయితే ఓడిపోయిన నాటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండిపోయారు.. ఒకానొక దశలో పార్టీకి గుడ్ బై చెబుతారని కూడా ప్రచారం నడిచింది. అయితే రెండేళ్ల తర్వాత ఇప్పుడు పార్టీలో యాక్టివ్ కావాలని చూస్తున్నారు. అందుకు కేడర్ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అదే పనిగా నాయకత్వానికి టచ్ లోకి వెళ్తున్న మూర్తిని త్వరలో ఏదో ఒక నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించడం ఖాయమన్న ప్రచారం నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..























ఒక్క మగాడికి ఒక్క పెళ్ళామే సరిపోదట.. పెళ్ళాలు ఉండాలట.. ఈ మహిళ ఎమ్మెల్యే గారి తెలివికి దండం పెట్టాల్సిందే..
Sana Malik statement: మనదేశంలో చట్టసభలకు ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులకు టెస్ట్ పెట్టాలి. ఆ టెస్టులో పాస్ అయిన వారికి మాత్రమే చట్టసభలకు వెళ్లే అవకాశం కల్పించాలి. ప్రజల ఓటు వేసి గెలిపించినప్పటికీ.. కచ్చితంగా ఆ టెస్ట్ నిర్వహించాలి. అందులో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే చట్ట సభకు అర్హులు అని కఠినమైన నిబంధన పెట్టాలి. ఇలాంటి నిబంధన లేకపోవడం వల్ల ఇదిగో ఇలాంటి పనికిమాలిన వారు చట్టసభలకు ఎన్నికవుతున్నారు.
ఇప్పటిదాకా బుద్ధిలేని పురుష ప్రజాప్రతినిధులు ఉన్నారు అనుకున్నాం.. కానీ ఇప్పుడు కొంతమంది మహిళా ప్రజా ప్రతినిధులు వారిని మించి పోతున్నారు. తమ బుద్ధిలేని వ్యాఖ్యలతో పరువు తీసుకుంటున్నారు. చివరికి అనకూడని మాటలు అంటూ.. చేయరాని వ్యాఖ్యలు చేస్తూ నవ్వుల పాలవుతున్నారు.
ఆమె పేరు సనా మాలిక్. మహారాష్ట్రలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఈమె ఎంత వరకు చదువుకున్న తెలియదు గాని.. పనికిమాలిన మాటలు మాట్లాడటంలో మాత్రం నెంబర్ వన్. అనేక సందర్భాలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నవ్వుల పాలైంది. తాజాగా మరోసారి తన మందబుద్ధిని ప్రదర్శించుకుంది. ఈసారి ఏకంగా భారత్ లో కూడా పాకిస్తాన్ మాదిరిగా చట్టాలు ఉండాలని డిమాండ్ చేసింది. అంతేకాదు నిండు మహారాష్ట్ర శాసనసభలో ఉమ్మడి పౌరస్మృతి మీద జరిగిన చర్చలో ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. “ఖురాన్లో ప్రస్తావించిన అంశాలను పాకిస్థాన్ లో మాదిరిగానే భారతదేశంలో కూడా అమలు చేయాలి. ముస్లిం చట్టాలు బహు భార్యత్వాన్ని అమలు చేస్తున్నాయి. ఒక్క మగాడికి ఒక్క భార్య సరిపోదు.. అతడికి భార్యలు కావాలి. కేవలం దీనిని మతం కోణంలో చూడకూడదు. ముసలి మహిళలు మాత్రమే వేధింపులకు గురి కావడం లేదు.. బహుభార్యత్వం అనేది ఇస్లాంలో ఉంది. దీనికి ముస్లిం చట్టాలు కూడా అనుమతిస్తున్నాయి. ఖురాన్ లో కూడా దీనికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయని” ఆమె చెప్పింది.
దీనిపై శివసేన ఎమ్మెల్యేలు గట్టిగానే స్పందించారు. త్రిబుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చి నరేంద్ర మోడీ ముస్లిం మహిళల గౌరవాన్ని పెంచితే.. సనా మాలిక్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఇది ఎటువంటి విధానాలకు నిదర్శనమో చెప్పాలని శివసేన ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. మరోవైపు దీనిపై మాలిక్ క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. పాకిస్తాన్ దేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తాను చెప్పలేదని.. ఖురాన్ మార్గదర్శకాలను మాత్రమే పాటించాలని చెప్పినట్టు ఆమె కవర్ చేసుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.