Home Blog Page 67

జగన్ రాజకీయంలో 'ముద్రగడ' కుటుంబం!

Mudragada Family Controversy
Mudragada Family Controversy

Mudragada Family Controversy: ముద్రగడ పద్మనాభం తీవ్ర అస్వస్థతతో హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన వైద్య సేవలకు సంబంధించి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనట్లు కూడా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వెంటిలేటర్ పై ముద్రగడ చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం తనమీద ఎన్నో అపవాదులు వేసుకున్నారు ముద్రగడ. కానీ పార్టీ నుంచి మాత్రం ఆయనకు ఎటువంటి పదవి దక్కలేదు సరి కదా.. ఇప్పుడు తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఆర్థికపరమైన భరోసా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. కనీసం ముద్రగడను పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. దానిని తప్పు పట్టారు ముద్రగడ కుమార్తె క్రాంతి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన తన తండ్రిని పరామర్శించే సమయం లేదా అని ప్రశ్నించారు. గంజాయి బ్యాచ్ కు పరామర్శించే సమయం ఉంటుంది కానీ. పార్టీ కోసం పని చేసిన మా నాన్న లాంటి వారికి కనీసం సమయం కేటాయించలేరా అంటూ క్రాంతి నిలదీసినంత పని చేశారు.

* ఫ్యామిలీలో విభేదాలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ముద్రగడ పద్మనాభం పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కుటుంబంలోనే తీవ్ర విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. జనసేనలో చేరేందుకు ముద్రగడ పద్మనాభం ప్రయత్నం చేశారు. అయితే అది వైసిపి ప్రయోజనం కోసం పని చేసేందుకే అని పవన్ కళ్యాణ్ గుర్తించారు. అందుకే ఆయనను దూరం పెట్టారు. దీంతో కుమారుడిని తీసుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ముద్రగడ. కానీ తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కుమార్తె క్రాంతి మాత్రం జనసేనకు మద్దతు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం నేరుగా జనసేనలో చేరారు క్రాంతి. కానీ వైసీపీ వ్యూహాలకు లోబడి ముద్రగడ తన సొంత కుమార్తె పైనే తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది.

* పరామర్శ లేదు..
వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ముద్రగడను జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన దాఖలాలు లేవు. ఆ విషయాన్ని కుమార్తె క్రాంతి ప్రశ్నించేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ముద్రగడ కుమార్తెను తిట్టిన క్లిప్పింగులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ముద్రగడ కుటుంబంలోనే చిచ్చుపెట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు ఉంటున్నాయి. మరోవైపు ఒక మహిళ న్యాయవాది ముద్రగడను ఆసుపత్రిలో పరామర్శిస్తే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నట్టు ప్రచారం చేసుకుంటుంది వైసిపి.

* ట్రాప్ లో పెద్దాయన..
ముద్రగడ పద్మనాభం వైసీపీ ట్రాప్ లో పడ్డారని ఇట్టే అర్థం అవుతోంది. వైసిపి కోసం పనిచేసే క్రమంలో తన వ్యక్తిత్వాన్ని సైతం తాకట్టు పెట్టేసారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆయనకు గౌరవం ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు వైసీపీ రాజకీయం ఆ కుటుంబంలో కూడా కల్లోలం రేపుతోంది. ఈ సమయంలో భరోసా ఇవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శించలేదు. ముద్రగడ కాకపోతే మరో కాపు నేత అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంది. అయితే ముద్రగడ లాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఇతర కాపు నేతలు జాగ్రత్త పడితేనే మంచిది.

బంగారంపై పెట్టుబడులు... నష్టపోకుండా ఉండడానికి సరైన దారులు ఇవే..

Gold Investment
Gold Investment

Gold Investment: ద్రవ్యోల్బణం పెరుగుతున్న ప్రస్తుత కాలంలో సంపదను కాపాడుకోవడానికి, దీర్ఘకాలంలో ఆదాయాన్ని పెంచుకోవడానికి చాలామంది బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కూడా. అయితే ప్రస్తుతం బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏది ఎవరికి సరిపోతుంది? వాటి ప్రయోజనాలు, పరిమితులు ఏమిటి? తెలుసుకుందాం.

బంగారం విలువ కాలక్రమేణా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి తగ్గుతూ ఉంటాయి. ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు వంటి పరిస్థితుల్లో కూడా బంగారం సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తారు. షేర్ మార్కెట్‌లో ఒడిదొడుకులు వచ్చినప్పుడు కూడా బంగారం పెట్టుబడులకు కొంత రక్షణ కల్పించే ఆస్తిగా భావిస్తారు. అయితే అంతర్జాతీయ పరిస్థితులు మారినప్పుడు వీటి కొనుగోలు శక్తి తగ్గే అవకాశం ఉంటుంది.అయితే దీర్ఘకాలికంగా ప్రతి పెట్టుబడిదారుడి పోర్ట్‌ఫోలియోలో కొంత శాతం బంగారం ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. వాటిలో ఇవి బెస్ట్ అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

గోల్డ్ ETFలు (Gold Exchange Traded Funds):
గోల్డ్ ETFలు స్టాక్ ఎక్స్చేంజ్‌లో ట్రేడ్ అయ్యే బంగారం ఆధారిత పెట్టుబడి సాధనాలు. డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్ ఉన్నవారు షేర్లను కొనుగోలు చేసినట్లే వీటిని కొనుగోలు చేయవచ్చు. ఇవి స్వచ్ఛమైన బంగారం ధరను అనుసరిస్తాయి. ఈ పెట్టుబడుల్లో బంగారాన్ని ఇంట్లో భద్రపరచాల్సిన అవసరం ఉండదు. స్వచ్ఛతపై ఎలాంటి సందేహం ఉండదు.
అవసరమైనప్పుడు మార్కెట్‌లో సులభంగా విక్రయించవచ్చు.మేకింగ్ ఛార్జీలు, నిల్వ ఖర్చులు ఉండవు. డిజిటల్ రూపంలో బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు:
డీమ్యాట్ అకౌంట్ లేని వారు కూడా గోల్డ్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఫండ్లు ప్రధానంగా గోల్డ్ ETFల్లో పెట్టుబడి పెడతాయి. ఒకేసారి పెద్ద మొత్తం లేదా నెలవారీ SIP రూపంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఇందులో చిన్న మొత్తాలతో కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు. SIP ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్ అవసరం ఉండదు. దీర్ఘకాలిక సంపద సృష్టికి అనుకూలం.

గోల్డ్ బిస్కెట్లు (Gold Bars/Biscuits):
పెద్ద మొత్తంలో బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు గోల్డ్ బిస్కెట్లను ఎంచుకుంటారు. ఇవి సాధారణంగా 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారంతో ఉంటాయి. గ్రాముల నుంచి కిలోల వరకు వివిధ పరిమాణాల్లో లభిస్తాయి. ఎక్కువ స్వచ్ఛత కలిగిన బంగారం. దీర్ఘకాలిక పెట్టుబడికి అనుకూలం. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేవారికి మంచి ఎంపిక. భద్రత కోసం ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. కొనుగోలు, విక్రయ సమయంలో ధరల్లో వ్యత్యాసం ఉండొచ్చు.

ఏ మార్గం బెస్ట్?
సురక్షితంగా, పారదర్శకంగా, మార్కెట్‌కు అనుసంధానమైన పెట్టుబడి కావాలంటే గోల్డ్ ETFలు మంచి ఎంపిక. ప్రతి నెల SIP ద్వారా పెట్టుబడి పెట్టాలనుకుంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు అనుకూలం. చేతిలో భౌతిక బంగారం ఉండాలనుకుంటే గోల్డ్ కాయిన్లు లేదా గోల్డ్ బిస్కెట్లు ఎంచుకోవచ్చు. చిన్న మొత్తాలతో డిజిటల్ రూపంలో ప్రారంభించాలనుకుంటే డిజిటల్ గోల్డ్‌ను పరిశీలించవచ్చు. అయితే దాని నిబంధనలను పూర్తిగా తెలుసుకోవడం అవసరం.

ఒక్క పెయింటింగ్.. భారత్-జపాన్ మీటింగ్ నే ఆపేసింది.. ఎంటా కథ?

India Japan meeting
India Japan meeting

India Japan Meeting: జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నప్పుడు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తారు. భద్రతా పరంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తారు. అంతర్జాతీయ సమావేశాల వేదికను వివిధ దేశాల ప్రతినిధులు ముందుగా తనిఖీ కూడా చేస్తారు. అయితే చిన్నచిన్న పొరపాట్లు పెద్ద సమస్యగా మారతాయి. తాజాగా భారత్‌లోని ఈశాన్యం రాష్ట్రం అస్సాం రాజధాని గౌహతిలో జరగాల్సిన సమావేశం ఒక పెయిటింగ్‌ కారణంగా వేదికను మార్చాల్సి వచ్చింది. ఫలితంగా ఏడు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి నష్టం జరిగే ప్రమాదం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహించే ఈ సమావేశం ఈశాన్య రాష్ట్రాల్లో (ఏడు సోదరి రాష్ట్రాలు) జపాన్‌ పెట్టుబడులు, వంతెనలు, రోడ్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, నీటి సరఫరా వంటి పథకాలపై ఒప్పందాలు చేసుకోవడానికి ఉద్దేశించబడింది. జపాన్‌ ఇప్పటికే అస్సాం నుంచి మేఘాలయ వరకు 19 కిలోమీటర్ల వంతెన నిర్మించి రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలను సులభతరం చేసింది. ఈ సహకారం ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానం పెంచి, వ్యూహాత్మకంగా కూడా ప్రాముఖ్యత కలిగి ఉంది.

ఒక పెయింటింగ్‌తో మారిన ప్రణాళిక..
అస్సాంలో ప్రముఖ గాయకుడు జుబీన్‌ గార్గ్‌ థాయ్‌లాండ్‌లో నీటిలో మునిగి మరణించిన సంఘటన తర్వాత, ఒక పెయింటర్‌ ఫ్లైఓవర్‌పై ఆయన నీటిలో మునుగుతున్న దృశ్యాన్ని వేసి, సంఘీభావ సందేశం రాశాడు. ఇది సమావేశం కోసం ఫ్లైఓవర్‌ను అందంగా తీర్చిదిద్దే సమయంలో జరిగింది. జపాన్‌ తనిఖీ బృందం ఈ పెయింటింగ్‌ను గమనించి, అభిమానులు రావడం వల్ల భద్రతా సమస్యలు ఏర్పడవచ్చని భావించి, సమావేశం ఢిల్లీకి మార్చాలని సూచించింది. దీంతో ఫ్లైఓవర్‌ బ్లాక్‌ అయి, అభిమానులు రావడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఎవరీ పెయింటర్‌?
ఈ పెయింటర్‌ మార్షల్‌ బరువా అనే వ్యక్తి. ఆయన పర్యావరణ సమస్యలపై నిరసనలు చేస్తూ, వంతెన నిర్మాణం కోసం చెట్లు తొలగించడాన్ని వ్యతిరేకించి రోడ్లు బ్లాక్‌ చేసినట్లు సమాచారం. ఆయనకు కొన్ని ఉద్యమాల్లో పాల్గొన్న చరిత్ర ఉందని, ఆ చర్యలు ప్రభుత్వ వ్యతిరేకిగా చూడబడుతున్నాయని తెలుస్తోంది. ఇటువంటి చర్యలు వ్యక్తిగత వ్యక్తీకరణగా లేదా నిరసనగా చూడవచ్చు, కానీ వాటి పరిణామాలు విస్తృతంగా ఉంటాయి.

ఈశాన్య రాస్ట్రాల అభివృద్ధి కోసమే సమావేశం..
ఈ సమావేశం ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు వేగవంతం కావాలని ఆశించారు. రోడ్లు, వంతెనల మెరుగుదలతో ఆగ్నేయాసియాతో వాణిజ్య, కనెక్టివిటీ పెరగవచ్చు. ఇది ప్రాంతీయ సమతుల్యతకు, ఆర్థిక వద్ధికి సహాయపడుతుంది. జపాన్‌ వంటి దేశాల సహకారం ఈ లక్ష్యాలను చేరుకోవడంలో కీలకం.

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి భారతదేశానికి చాలా ముఖ్యం. జపాన్‌ వంటి భాగస్వాముల సహకారం రోడ్లు, వంతెనల నిర్మాణంలో సహాయపడుతుంది.ౖ హెదరాబాద్‌లో కూడా ఇలాంటి సమావేశాలను అడ్డుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇటువంటి చర్యలు ప్రత్యామ్నాయాలు సూచించకుండా కేవలం అడ్డుకోవడం లక్ష్యంగా ఉంటే, అభివృద్ధి ప్రక్రియ నెమ్మదిస్తుంది. నిజమైన ప్రగతి కోసం సంవాదం, సహకారం అవసరం. చిన్న తప్పులు లేదా ఉద్దేశపూర్వక చర్యలు ఎలా పెద్ద నష్టాలు కలిగిస్తాయో ఈ సంఘటన చూపిస్తుంది.

బాహుబలి 3 వస్తుంది.. సంచలన ప్రకటన చేసిన ప్రభాస్

Baahubali 3
Baahubali 3

Baahubali 3: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ రాజమౌళి చేసిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి పెరిగింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు మన వాళ్ళు వెనుతిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతుండటం విశేషం… ఇక బాహుబలి రెండు పార్టులుగా వచ్చి సూపర్ సక్సెస్ సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇక బాహుబలి 3 ఉంటుంది అంటూ మొదటి నుంచి కూడా ప్రచారం చేసుకుంటూ వస్తున్న మేకర్స్ ఇప్పుడు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేశారు. ‘బాహుబలి ది టార్చ్ బేరర్’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది ఇది టెలికాస్ట్ అవ్వడానికి ముందే బాహుబలి 3 ఉంటుందంటూ ఒక వీడియో అయితే అనౌన్స్ చేశారు… ఇక ప్రపంచం మొత్తం బాహుబలి 3 మూవీ వస్తుందని ఊహించలేదు మీ అందరి కోసం బాహుబలి మూడో భాగం రాబోతుంది అంటూ ప్రభాస్, రానా, అనుష్క వెల్లడించారు. ఇక ఈ వీడియోలో అనుష్క గురించి ప్రభాస్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. అనుష్క ఒక్కసారి నవ్వడం స్టార్ట్ చేస్తే దాదాపు 40 నిమిషాల పాటు ఆపకుండా నవ్వుతూనే ఉంటుందని బాహుబలి సినిమా షూటింగ్ బ్రేక్ టైమ్ లో తను చాలాసార్లు అలా నవ్వేదని చెప్పాడు.

అలాగే కొన్ని సందర్భాల్లో అయితే తన సెట్స్ కి వచ్చే ముందు నవ్వకూడదు అనే ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చేదని ఒకవేళ నవ్వితే అక్కడ షూటింగ్ కి ఇబ్బంది అయ్యేదని దానివల్ల కోటా రూపాయలను ఖర్చు పెట్టి సినిమాను చేస్తున్న ప్రొడ్యూసర్ కి నష్టం వాటిల్లే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతోనే ఆమె అలా నవ్వకూడదు అనే ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చేది అంటూ ప్రభాస్ అనుష్క మీద కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశాడు.

అలాగే బాహుబలి సినిమా అనేది తనకొక ఎమోషనల్ జర్నీ అంటూ ప్రభాస్ ఎమోషనల్ అయ్యాడు… ఇక సత్యరాజు మాట్లాడుతూ బాహుబలి సినిమా షూటింగ్ స్పాట్ లో ఉన్నప్పుడు కాస్ట్యూమ్స్ విపరీతంగా ఉండేవని కనుచూపుమేరలో ఎటు చూసినా కూడా కాస్ట్యూమ్స్ కనిపించేవని వాటన్నిటిని చూస్తే ఆశ్చర్యం వేసేది అంటూ ఆయన మాట్లాడాడు…

ఇక రాజమౌళి సైతం గతంలో ‘త్రిబుల్ ఆర్ ‘ సినిమా ప్రమోషన్స్ టైమ్ లో కూడా ‘బాహుబలి 3’ సినిమా ఉంటుందంటూ క్లారిటి ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ వీడియో రావడంతో బాహుబలి 3 సినిమా ఉంటుంది అనే విషయం చాలా స్పష్టంగా చెప్పేశారు. ఇక ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ప్రేక్షకులను ఎలా ఎంగేజ్ చేయగలుగుతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

‘సుకన్య సమృద్ధి’.. ‘ఎన్‌పీఎస్ వాత్సల్య’.. ఏ పథకంతో కోట్లు వస్తాయో తెలుసా?

Sukanya Samriddhi Yojana
Sukanya Samriddhi Yojana

Sukanya Samriddhi Yojana: పిల్లల భవిష్యత్ కోసం చాలా మంది పెట్టుబడులు పెట్టాలని అనుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు వారి పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్లు వంటివి పొదుపు చేశారు. అయితే 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ‘సుకన్య సమృద్ధి యోజన’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సామాన్యుల నుంచి ఇందులో చిన్నమొత్తాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల వారి పిల్లల అవసరాలకు విడతల వారీగా నగదును అందిస్తారు. అయితే ప్రస్తుతం చాలా వరకు పిల్లల కోసం ఆర్థిక పథకాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఎన్‌పీఎస్ వాత్సల్య (NPS Vatsalya) ఒకటి. అయితే ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలి? ఏ పథకం ఎవరికి అనుకూలం?

సుకన్య సమృద్ధి యోజన:
సుకన్య సమృద్ధి యోజన అనేది కేంద్ర ప్రభుత్వం బాలికల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన చిన్న పొదుపు పథకం. ఇందులో 10 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న బాలిక పేరుపై ఖాతా తెరవొచ్చు. పోస్టాఫీసు లేదా గుర్తింపు పొందిన బ్యాంకుల్లో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. తక్కువ మొత్తంతోనే పెట్టుబడి ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఈ పథకంపై ప్రభుత్వం ప్రతి త్రైమాసికం వడ్డీ రేటును ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఇది చిన్న పొదుపు పథకాలలో అత్యధిక వడ్డీ అందించే స్కీమ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ పథకంలో సంవత్సరానికి 8.2శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. ప్రతి ఏటా కనీసం రూ.250 నుండి గరిష్టంగా రూ.1,50,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. ఖాతా తెరిచిన తర్వాత 15 సంవత్సరాల వరకు డబ్బు జమ చేయాలి. ఖాతా 21 సంవత్సరాలకు మెచ్యూర్ అవుతుంది. ఉన్నత విద్య లేదా వివాహం కోసం కొన్ని షరతులతో ముందుగానే కొంత మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది కేవలం ఆడపిల్లల కోసం మాత్రమే.

ఎన్‌పీఎస్ వాత్సల్య:
ఎన్‌పీఎస్ వాత్సల్య అనేది పిల్లల కోసం రూపొందించిన కొత్త పెన్షన్ ఆధారిత పెట్టుబడి పథకం. ఇందులో 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న బాలిక లేదా బాలుడు పేరుతోనైనా ఖాతా తెరవొచ్చు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లల తరఫున పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పథకం మార్కెట్ ఆధారిత పెట్టుబడి కావడం వల్ల రాబడులు స్థిరంగా ఉండవు. కానీ దీర్ఘకాలంలో అత్యధిక వృద్ధిని అందిస్తుంది. ఈక్విటీల్లో సుమారు 14శాతం, కార్పొరేట్ డెట్‌లో 9.1శాతం, ప్రభుత్వ సెక్యూరిటీలలో 8.8 శాతంవరకు సగటు రాబడులు ఉంటాయి. ఈ పెట్టుబడుల్లో చక్రవడ్డీ కూడా వస్తుండడంతో పిల్లల భవిష్యత్తుకు పెద్ద మొత్తంలో సంపదను సృష్టిస్తుంది. మార్కెట్ బాగా ఉంటే అధిక లాభాలు వచ్చే అవకాశం ఉన్నా, రాబడికి ఎలాంటి హామీ ఉండదు. పిల్లలు 18 ఏళ్లు పూర్తి చేసిన తర్వాత ఈ ఖాతా సాధారణ ఎన్‌పీఎస్ ఖాతాగా మారుతుంది.

రెండు పథకాల మధ్య ప్రధాన తేడాలు:
సుకన్య సమృద్ధి కేవలం బాలికలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో 15 సంవత్సరాల పాటు మాత్రమే నెలకు రూ. 1,000 చెల్లించాలి.అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చే వరకు మొత్తం పెట్టుబడిపై వడ్డీ జమ అవుతుంది 15 ఏళ్లలో మొత్తం రూ. 1,80,000 జమచేస్తే 21 ఏళ్ల తర్వాత సుమారు రూ. 5.5 లక్షల వరకు మెచ్యూరిటీ మొత్తం వస్తుంది (వడ్డీ రూపంలోనే రూ. 3.7 లక్షలు)

ఎన్‌పీఎస్ వాత్సల్య అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరికీ వర్తిస్తుంది. సుకన్యలో ప్రభుత్వం నిర్ణయించే హామీతో కూడిన వడ్డీ లభిస్తుంది. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ. 1,000 చొప్పున కడితే మొత్తం రూ. 2,16,000 అవుతుంది. సంవత్సరానికి సగటున 10 శాతం రాబడి వస్తుందని భావిస్తే.. ఈ మొత్తం దాదాపు రూ. 6 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే మార్కెట్ అస్థిరతలకు లోబడి రాబడి ఉంటుంది.

ఏది బెస్ట్?
కూతురు భవిష్యత్తు, చదువు, పెళ్లి కోసం భద్రమైన పెట్టుబడి కావాలనుకుంటే సుకన్య సమృద్ధి యోజన మంచి ఎంపికగా చెప్పవచ్చు. పిల్లల కోసం దీర్ఘకాలంలో మార్కెట్ ఆధారిత అధిక రాబడి కోరుకుంటే, అలాగే కొంత రిస్క్‌ను భరించే సామర్థ్యం ఉంటే ఎన్‌పీఎస్ వాత్సల్యను పరిశీలించవచ్చు. అబ్బాయిల కోసం సుకన్య అందుబాటులో ఉండదు కాబట్టి ఎన్‌పీఎస్ వాత్సల్య ఒక మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. చాలామంది ఆర్థిక నిపుణులు చెబుతున్న ప్రకారం.. అవసరాలను బట్టి ఈ రెండు పథకాలను కలిపి ఉపయోగించడం ద్వారా భద్రతతో పాటు వృద్ధి అవకాశాన్ని కూడా పొందవచ్చని సూచిస్తున్నారు.

తుని చిన్నారి మిస్సింగ్..: కుక్క పోస్టుమార్టంలో సంచలన నిజం బయటకు..

Tuni Missing Girl
Tuni Missing Girl

Tuni Missing Girl:  తుని చిన్నారి అదృశ్యం మిస్టరీ 20 రోజులు అవుతున్న వీడడం లేదు. మూడు వారాలు గడుస్తున్నా ఆచూకీ లేదు. ఇప్పటివరకు వందలాది మంది పోలీసులు గాలింపు చర్యలు చేపడుతూ వచ్చారు. ఒక్క క్లూ కూడా దొరకలేదు. తొలుత కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేశారు పోలీసులు. తర్వాత అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణుల బారిన పడవచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఏ కోణంలో కూడా ఈ కేసు ఒక కొలిక్కి రావడం లేదు. అయితే ప్రధానంగా ఈ కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్క సైతం మృతి చెందింది. దీంతో మరిన్ని అనుమానాలు పెరిగాయి. వాటన్నింటినీ తెరదించుతూ కుక్క మృతి పై ల్యాబ్ నివేదికలు వచ్చాయి. కుక్క ఎందుకు మృతి చెందిందో.. పశుసంవర్ధక శాఖ అధికారులు బయటపెట్టారు.

* మూడు వారాల కిందట..
ఈనెల 6న చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం అయింది. పామాయిల్ తోటలో కాపలాదారులుగా ఉన్న తల్లిదండ్రుల చెంతనే ఉండేది జ్ఞానేశ్వరి. అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ కుటుంబ సభ్యులకు ఎవరైనా ప్రత్యర్థులు ఉన్నారా? కుటుంబంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. ఆచూకీ లేకపోవడం, అటవీ ప్రాంతం కావడంతో ఎన్ డి ఆర్ ఎఫ్ తోపాటు ఎస్ టి ఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వందలాది మంది పోలీసులు జల్లెడ పట్టారు. కానీ చిన్నారి ఆచూకీ మాత్రం ఇంతవరకు లేదు.

* పెంపుడు కుక్క మృతి..
అయితే చిన్నారి అదృశ్యం అయినప్పుడు.. వారింట్లో ఉండే పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయింది. అక్కడకు రెండు రోజుల తర్వాత తీవ్ర అలసట, ఆందోళనతో ఇంటి వద్ద కనిపించింది. దాని ద్వారా అదృశ్యమైన చిన్నారి ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ కుక్క మెడకు జిపిఎస్ ట్రాక్ చేసి అడవుల్లోకి వదిలారు. రెండు రోజులపాటు గాలించిన ఆ కుక్క.. మళ్లీ ఇంటికి చేరింది. తీవ్ర అనారోగ్యానికి గురైంది. కాపాడేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఫలితం లేకపోవడంతో ఆ కుక్క మృతి చెందింది. కుక్క మృతి పై అనేక రకాల అనుమానాలు వ్యక్తం కావడంతో.. పోస్టుమార్టం చేసి ల్యాబ్ నివేదిక కోసం పంపించారు విశాఖకు. అయితే ఆ ల్యాబ్ నివేదిక బయటకు వచ్చింది. ఒక్క చనిపోవడానికి అనారోగ్యమే కారణమని తేలిపోయింది. విష ప్రయోగం, అటవీ జంతువుల దాడి వంటివి కావలి నిర్ధారణ అయింది. దీంతో చిన్నారి అదృశ్యం మిస్టరీ మరింత జఠిలం అయినట్టు కనిపిస్తోంది.

ఏపీలో చిత్ర పరిశ్రమ విస్తరణ.. బాలకృష్ణతో మొదలు!

Balakrishna
Balakrishna

Balakrishna: తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి తరలివచ్చే సమయం ఆసన్నం అయ్యింది. నిన్ననే అమరావతిలో నందమూరి బాలకృష్ణ నూతన చిత్రం అధికారికంగా షూటింగ్ ప్రారంభించుకుంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమాలో నటిస్తున్నారు. దానికి సంబంధించి ప్రారంభోత్సవం అమరావతిలో నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కార్యక్రమానికి మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఏపీలో చిత్ర పరిశ్రమ విస్తరణకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమ విస్తరణకు సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బాలకృష్ణ చిత్రం ప్రారంభంతో మొదలైనట్టేనని సినీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రంలో మెజారిటీ పార్ట్ షూటింగ్ ఏపీలోనే జరిపేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఈ సినిమా యూనిట్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇదే స్ఫూర్తితో మరిన్ని చిత్రాలు షూటింగ్ ఏపీలో జరిగే అవకాశం ఉంది.

* అనువైన వాతావరణం..
వాస్తవానికి సినిమా షూటింగ్లకు అనువైన వాతావరణం ఏపీలో పుష్కలంగా ఉంది. గతంలో అవుట్ డోర్ షూటింగ్ లన్ని గోదావరి జిల్లాల్లో జరిగేవి. ఏపీలో వైవిధ్యమైన లొకేషన్లు చాలా ఉన్నాయి. విశాఖలో బీచ్ పరిసర ప్రాంతాలు, అరకు లోయ, లంబసింగి కొండలు, ఉభయగోదావరి జిల్లాల పచ్చని ప్రకృతి, మారేడుమిల్లి అడవులు, గండికోట లోయలు, శ్రీశైలం పరిసర ప్రాంతాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఇటీవల ఈ ప్రాంతాల్లో తెలుగు తోపాటు అన్ని ప్రాంతీయ భాషలకు సంబంధించిన వెబ్ సిరీస్ ప్రాజెక్టులు షూటింగులు జరుపుకున్నాయి. సహజసిద్ధమైన అందాలు, తక్కువ ఖర్చుతో లొకేషన్లు లభించడం సినీ నిర్మాతలకు అదనపు ప్రయోజనం.

* పవన్, బాలకృష్ణ ప్రయత్నం..
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుల కుటుంబాలుగా నందమూరి, కొణిదల కుటుంబాలు ఉన్నాయి. ఆ రెండు కుటుంబాలకు చెందిన పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. అటువంటి నందమూరి బాలకృష్ణ అమరావతిలో తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టడం మాత్రం నిజంగా శుభపరిణామం. అయితే ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమ విస్తరణకు సంబంధించిన వార్తలు మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడు అది ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు నారా లోకేష్ సైతం అమరావతిలో చిత్ర పరిశ్రమ విస్తరణకు అడుగులు వేస్తుండడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. కొత్తగా నిర్మితమవుతున్న అమరావతి రాజధానిలో.. సినిమా షూటింగులకు సంబంధించి ప్రత్యేకంగా భూమి కేటాయింపు తో పాటు కొన్ని రకాల నిర్మాణాలు జరిపితే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది.

* భారీ ఫిలిం స్టూడియోలో ఏర్పాటు..
ఏపీ వ్యాప్తంగా సినిమా షూటింగ్లకు సంబంధించి అనేక లొకేషన్లు ఉన్నాయి. అయితే హైదరాబాద్ తరహాలో భారీ ఫిలిం స్టూడియోలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆధునిక ఫిలిం సిటీ, డిజిటల్ స్టూడియోలు, వి ఎఫ్ ఎక్స్ హబ్ లు, ఓటిపి కంటెంట్ ప్రొడక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఓటిపి మార్కెట్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ప్రొడక్షన్ కేంద్రాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం వినియోగించుకుంటే అమరావతి కొత్త సినీ గమ్యస్థానం గా మారే అవకాశం ఉంది.

ప్రశాంత్ నీల్ కి కాల్ చేసి సినిమా చేద్దామని చెప్పిన స్టార్ హీరో...

Prashanth Neel
Prashanth Neel

Prashanth Neel: కన్నడ సినిమా ఇండస్ట్రీలో తన కెరియర్ ను మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. కేజీఎఫ్, కేజిఎఫ్ 2, సలార్ సినిమాలతో ఒక్కసారిగా తను ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో కూడా భారీ విజయాన్ని సాధిస్తాననే దృఢ సంకల్పంతో ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాడు. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇప్పటికే అతనితో సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.

అందులో భాగంగానే రామ్ చరణ్ సైతం రీసెంట్ గా ప్రశాంత్ నీల్ కి కాల్ చేసి ఒక అదిరిపోయే కథ ఉంటే చెప్పమని తప్పకుండా మనం సినిమా చేద్దామని వీలైనంత తొందరగా ఆ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని కూడా చెప్పారట. ప్రశాంత్ నీల్ సైతం అద్భుతమైన కథను కూడా రెడీ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే డ్రాగన్ సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన సలార్ 2 సినిమాని కంప్లీట్ చేసి అప్పుడు రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది…

ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి నటుడు సైతం ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. పెద్ది సినిమాతో పర్ఫామెన్స్ పరంగా వందకి వంద మార్కులు కొట్టేసిన ఆయన ఇప్పుడు సుకుమార్ తో చేయబోయే సినిమా విషయంలో కూడా అదే క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు.

ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకొని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు… తను అనుకున్నట్టుగానే ప్రశాంత్ నీల్ రాబోయే రోజుల్లో కూడా భారీ విజయాలను సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ గా మారతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

సినిమా కోసం నాగదుర్గ టాప్ ప్రొడ్యూసర్ బన్నీ వాసుకే 15 రూల్స్ పెట్టి షాక్ ఇచ్చిందట...

Nagadurga
Nagadurga

Naga Durga: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలైతే వస్తున్నాయి. స్టార్ హీరోలు పాన్ ఇండియా బాట పడుతుంటే యంగ్ హీరోలు కొత్త దర్శకులు డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సుకుమార్ రైటింగ్స్ టీమ్ లో నుంచి వచ్చే కథలు చాలా అద్భుతాలను సృష్టిస్తున్నాయనే విషయం మనందరికి తెలిసిందే. ఇక రీసెంట్ గా ‘ఇడుపు కాయితం’ అనే ఒక సినిమాని అనౌన్స్ చేశారు…ప్రియదర్శి హీరోగా ఫోక్ సాంగ్స్ కి తన డ్యాన్స్ తో ప్రాణం పోస్తున్న నాగ దుర్గ హీరోయిన్ గా వంశీ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న బన్నీ వాసు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం… ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో బన్నీ వాసు మాట్లాడుతూ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఇది గ్లోబల్ కథ అంటు ఆయన చెప్పాడు. అలాగే ఈ సినిమాను బీహార్ లో తీసుకెళ్లి రిలీజ్ చేసిన అక్కడి ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని ఆయన చెప్పాడు. ఈ సినిమాని చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరు వాళ్ల నిజ జీవితాన్ని చూసుకుంటారు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…

ఇక ఈ సినిమాలో హీరోగా ప్రియదర్శి ని అనుకున్నప్పుడు హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన వచ్చినప్పుడు నాగ దుర్గ అయితే ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా న్యాయం జరుగుతుంది అని అనుకున్నాం. ఆమె ను ఈ సినిమాలో హీరోయిన్ గా చేయమని సంప్రదించినప్పుడు ఆమె నాకు 15 రూల్స్ పెట్టింది అంటూ బన్నీ వాసు చెప్పాడు.

నిజానికి తెలుగు అమ్మాయి తను సినిమాలు చెయ్యాలి అంటే ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ పెట్టుకోవడం మంచిదే. ఆమె పెట్టిన రూల్స్ కూడా నాకు బాగా నచ్చాయి అంటూ బన్నీ వాసు చెప్పడం విశేషం. ఇక ఇదంతా చూసిన వాళ్ళు మాత్రం నాగ దుర్గ 15 రూల్స్ పెట్టడం వెనక కారణమేంటంటే సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తారు కదా… అందుకే ఆమె ముందుగానే వాటన్నింటిని చూసుకొని అవి ఒకే అయితేనే సినిమా చేస్తానని కండిషన్స్ పెట్టుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు…

ఇక మొన్నటి దాకా యూట్యూబ్లో రచ్చ చేసిన నాగ దుర్గా ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద మెరవబోతుంది. సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మొదటి నుంచి కూడా చాలా మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమాతో తను హీరోయిన్ గా రాణిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

అమ్మాయిలు కాదు.. యువకులతో కలిసి అంటీలు ఆ పని చేస్తున్నారు

Older Women Relationships
Older Women Relationships

Older Women Relationships: నిజమే.. నేటి కాలం పూర్తిగా మారిపోయింది. మనుషుల మధ్య అనుబంధాలు పూర్తిగా వక్రమార్గం పడుతున్నాయి. వయసు తారతమ్యం లేదు. సమాజం ఏమనుకుంటుందని సోయి లేదు. పెళ్లయిన వాళ్లు అలానే.. పెళ్లి కాని వాళ్ళు అలానే.. మొత్తానికి వెస్ట్రన్ కంట్రీస్ లో ఉండే దిక్కుమాలిన కల్చర్ మొత్తం మన ఇండియాలోకి వచ్చి చేరుతుంది. అందువల్లే మనుషులు ఇలా మారిపోతున్నారు.

ఒకప్పుడు మనుషుల మధ్య ఇలా ఉండేది కాదు. తమకంటే వయసులో పెద్దవారైన మహిళలను చిన్న వయసులో ఉన్న యువకులు ఆ దృష్టితో చూసేవారు కాదు. పెద్ద వయసున్న మహిళలు.. తనకంటే చిన్నవాళ్ళైన యువకులను రెచ్చగొట్టేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా కామ వ్యవహారాలు సాగుతున్నాయి. మనుషులు జంతువుల కంటే హీనంగా మారిపోతున్నారు. సభ్య సమాజం ఏమనుకుంటుంది అనే సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా సంఘటనలు పెరిగిపోతున్నాయి.

ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని 30 సంవత్సరాల వివాహిత తన 19 సంవత్సరాల మేనల్లుడితో పారిపోయింది. అప్పటికి ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గడచిన నాలుగు నెలలుగా వారిద్దరి మధ్య ఈ సంబంధం సాగుతోంది. ఉత్తర ప్రదేశ్ లోని గోండా ప్రాంతానికి చెందిన 30 సంవత్సరాల వివాహిత.. తనకంటే 11 సంవత్సరాల చిన్నవాడు అయినా మేనల్లుడితో పారిపోయింది. ఆ మహిళ తన అల్లుడితో పారిపోయే ముందు ఇద్దరు పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయింది.

మరో ఘటనలో అలీగడ్ ప్రాంతానికి చెందిన ఓ 40 సంవత్సరాల మహిళ.. తమ ఇంటికి ఎదురుగా ఉండే 17 సంవత్సరాల బాలుడితో సంబంధం పెట్టుకుంది. సంబంధం కొనసాగిస్తుంది. అతడు నిరాకరించినప్పుడల్లా కేసు పెడతానని బెదిరించడం మొదలుపెట్టింది. ఇటీవల ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రీతి అనే మహిళ భాగోతం బయటపడింది.

ఇవి వెలుగులోకి వచ్చిన కేసులు మాత్రమే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రమని ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ తరహా కేసులు నమోదవుతున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేవలం ఉత్తర ప్రదేశ్ మాత్రమే కాదు.. దేశంలో చాలా ప్రాంతాలలో ఇతర సంఘటనలు చోటుచేసుకుంటుంది. ఆధునిక కాలంలో సామాజికపరంగా వచ్చిన మార్పులు.. కమ్యూనికేషన్ ప్రభావం.. కుటుంబంలో పరిస్థితులు వంటివి మహిళలను ఈ తరహా అడ్డదారులు తొక్కే విధంగా చేస్తున్నాయని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు.. ఇటువంటి వారికి కౌన్సిలింగ్ ఇస్తే పరిస్థితి మెరుగుపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

టీమిండియా గెలిచింది..కానీ ఇది సరిపోదు..

India Vs Bangladesh
India Vs Bangladesh

India Vs Bangladesh: టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అనుకూలమైన ఫలితాన్ని సాధించింది. బంగ్లాదేశ్ విధించిన లక్ష్యాన్ని మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. తద్వారా ఐదు వికెట్ల తేడాతో గెలుపును అందుకుంది. దీంతో టీమ్ ఇండియా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఈ విజయం ద్వారా టీమ్ ఇండియాలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. సెమీఫైనల్ వెళ్లడానికి టీమ్ ఇండియాకు ఈ విజయం సరిపోతుందా.. ఈ ప్రశ్న ఇప్పుడు ప్రతి అభిమాని నోటి నుంచి వినిపిస్తోంది.

టీమిండియా ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలైంది. వాస్తవానికి గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయి సెమీఫైనల్ అవకాశాలను చాలా వరకు సంక్లిష్టం చేసుకుంది. దీంతో టీమిండియా బంగ్లాదేశ్ జట్టుతో జరిగే మ్యాచ్లో భారీ అంతరంతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ టీమ్ ఇండియా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో తన స్థాయి ఆట తీరు ప్రదర్శించలేకపోయింది.

ఈ మ్యాచ్లో ముందుగా బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ చేసింది.. నిర్ణీత 20 ఓవర్ల పాటు టీమ్ ఇండియా బౌలర్లను బంగ్లాదేశ్ బ్యాటర్లు ప్రతిఘటించారు. 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేశారు. వాస్తవానికి బంగ్లాదేశ్ స్థాయిలో పరుగులు చేసిందని ఎవరూ ఊహించలేదు. బంగ్లాదేశ్ జట్టులో జూయారియా 33, సుల్తానా 32 పరుగులు చేశారు. ఎప్పటిలాగే మన చరణి అద్భుతంగా బౌలింగ్ చేసింది. నాలుగు ఓవర్లు వేసి కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి.. రెండు వికెట్లు పడగొట్టింది. రాధా యాదవ్ 4 ఓవర్లు వేసి 28 పరుగులు ఇచ్చి.. మూడు వికెట్లు పడగొట్టింది. రేణుక సింగ్ ఒక వికెట్.. నందిని శర్మ ఒక వికెట్ సాధించారు.

137 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన భారత జట్టు 16.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఫినిష్ చేసింది. ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్ అందుకుంది. టీమిండియాలో ఈసారి ఓపెనర్ స్మృతి మందాన దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. కేవలం ఎన్ని పరుగులు మాత్రమే చేసింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ 53 పరుగులు చేసి అదరగొట్టింది. యాస్తిక భాటియా 23.. జెమీమా 26 పరుగులతో సత్తా చూపించారు. వాస్తవానికి ఈ టార్గెట్ టీమ్ ఇండియా 12 ఓవర్లలో ఫినిష్ చేసి ఉంటే నెట్ రన్ రేట్ మరింత పెరిగేది. అలాంటప్పుడు ఆస్ట్రేలియాతో తదుపరి మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ టీమిండియా సెమీఫైనల్ లాగా వెళ్ళేది. కానీ టీమిండియా బ్యాటర్లు మధ్య ఓవర్లలో నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేయడం.. మెరుగైన ఆరంభం లభించకపోవడంతో 17 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అది కూడా ఐదు వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని సాధించడంతో.. టీమ్ ఇండియాకు అనుకున్న స్థాయిలో నెట్ రన్ రేట్ సాధ్యం కాలేదు.

ఇప్పటికే గ్రూప్ ఎ లో ఆస్ట్రేలియా నాలుగు పాయింట్లతో తిరుగులేని స్థానంలో ఉంది. సెమి ఫైనల్ దాకా వెళ్ళిపోయింది. ఇండియా ఖాతాలో 6 పాయింట్లు ఉన్నప్పటికీ.. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవడం వల్ల ఇప్పటికి సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోలేకపోతోంది. టీమిండియా మరో మాటకు తావు లేకుండా సెమీఫైనల్ వెళ్లాలంటే కచ్చితంగా ఆస్ట్రేలియా మీద గెలవాలి. అప్పుడే గ్రూప్ ఎలో ఆస్ట్రేలియా, భారత సెమీఫైనల్ వెళ్తాయి. గ్రూప్ బి లో ఇంగ్లాండ్ సెమీఫైనల్ వెళ్ళిపోయింది. వెస్టిండీస్ కూడా సెమి ఫైనల్ దారిలో ఉంది..

టీమిడియా ఖాతాలో ప్రస్తుతం +2.268 నెట్ రన్ రేట్ ఉంది. దక్షిణాఫ్రికా ఖాతాలో -0.546 నెట్ రన్ రేట్ ఉంది. దక్షిణాఫ్రికా నెదర్లాండ్, బంగ్లాదేశ్ జట్లతో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ రెండు జట్లు కూడా దక్షిణాఫ్రికాకు పోటీ ఇచ్చేంత స్థాయి కాదు కాబట్టి.. కచ్చితంగా అందులో ఆ జట్టుకు అనుకూలమైన ఫలితమే వస్తుంది. అలాంటప్పుడు టీమిండియా ఆస్ట్రేలియా మీద ఖచ్చితంగా గెలవాలి. అప్పుడే సెమీఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది.

నిన్న సాయికృష్ణ.. నేడు మాలగంగమ్మ.. ఏపీలో ఏంటీ "బలి" ప్రయోగాలు

Mala Gangamma Case
Mala Gangamma Case

Mala Gangamma Case: ఏ ప్రాంతంలోనైనా శాంతి భద్రతలు మెరుగ్గా ఉంటేనే ప్రజల జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లోనే జనజీవనం సాఫీగా సాగుతూ ఉంటుంది. మనదేశంలో ఏ ప్రాంతానికైనా సరే విదేశీయులు వెళుతుంటారు. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. స్వేచ్ఛాయుత అనుభూతులను సొంతం చేసుకుంటారు. అదే విదేశీయులు పాకిస్తాన్ వెళ్లగలరా.. స్వేచ్ఛగా జీవించగలరా.. ఇక్కడ శాంతి భద్రతలను పరిరక్షించేది ప్రభుత్వం… పోలీసులు.

శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ఇటువంటి అవకాశాలను ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి కాబట్టి.. అధికారంలో ఉండే ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. అందువల్లే పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవద్దు. శిక్షలు.. ఇతర వ్యవహారాలు సాగించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. నేరాన్ని రుజువు చేయడం మాత్రమే పోలీసుల విధి. కోర్టు అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే అంతిమంగా హింస రాజ్యమేలుతూ ఉంటుంది.

అప్పట్లో తమిళనాడులో కరోనా సోకినప్పుడు.. నిబంధనలు ఉల్లంఘించి సెల్ఫోన్ షాప్ ఓపెన్ చేశారని.. ఇద్దరు తండ్రి కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్రంగా హింసించడంతో తండ్రి కొడుకులు చనిపోయారు. అయితే ఈ వ్యవహారాన్ని అక్కడి కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆ తర్వాత ఈ దారుణంలో పాలుపంచుకున్న వారందరికీ మరణశిక్ష విధించింది. పోలీసులు పాల్పడిన ఘోరాన్ని చూసి న్యాయస్థానం ఊరుకోలేదు. కఠినమైన శిక్ష విధించింది. తద్వారా ఇటువంటి తప్పులు మరొకరు చేయకుండా ఉండడానికి కఠినమైన నిబంధనలు విధించింది.

ఏపీ రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కొంతకాలంగా విమర్శలకు కారణమవుతోంది. పోలీసులు ఇటీవల సాయి కృష్ణ అనే యువకుడి విషయంలో వ్యవహరించిన తీరు జాతీయస్థాయిలో చర్చకు కారణమవుతోంది. సాయి కృష్ణ వ్యవహారాన్ని మర్చిపోకముందే.. ఇప్పుడు తెరపైకి మాల మంగమ్మ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ సంఘటన సాయి కృష్ణ వ్యవహారానికి మించి ఉందని తెలుస్తోంది. మంగమ్మ కేసును లోతుగా తవ్వితే మరిన్ని నిజాలు బయటపడే అవకాశం ఉంది.

మంగమ్మ అది కర్నూలు జిల్లా కౌతాళం మండలం. ఈమెకు వీరేష్ 17 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. సరిగ్గా వీరేష్ ఏడాదిన్నర క్రితం కనిపించకుండా పోయాడు. దీంతో మంగమ్మ పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు అతడి జాడను కనుక్కోలేకపోయారు. ఈ దశలో మంగమ్మ తన కొడుకు కోసం కోర్టు మెట్లు ఎక్కింది. హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు స్పందించారు. వీరేష్ ను మంగమ్మ చంపిందని పోలీసులు తేల్చారు. మంగమ్మ దర్గప్ప అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని.. అది వీరేష్ చూసిన నేపథ్యంలో.. వారిద్దరూ కలిసి అతనిని చంపారని పోలీసులు తేల్చారు. గంగమ్మ.. దుర్గప్పను పోలీసులు విచారించిన సమయంలో.. గంగమ్మ ఊహించని విధంగా చనిపోయింది… ప్రస్తుతం గంగమ్మ కేసు హైకోర్టు పరిధిలో ఉంది. గంగమ్మకు సంబంధించిన పోస్టుమార్టం నివేదికను తమకు అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

గంగమ్మ భర్త చనిపోయిన తర్వాత దర్గప్పతో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఒకవేళ ఆమె తన కొడుకును చంపుకుంటే.. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేస్తుంది.. హైకోర్టు దాకా ఎందుకు వెళ్తుంది.. ఒకవేళ పరిహారం కోసమే అయితే.. దర్గప్ప తో తాను సాగిస్తున్న వ్యవహారం పోలీసుల విచారణలో బయటపడుతుంది కదా.. అలాంటప్పుడు ఆమె పోలీసుల దాకా ఎందుకు వెళ్తుంది.. పైగా అనుమానాస్పద స్థితిలో మంగమ్మ చనిపోయినప్పుడు పోలీసులు దగ్గర ఉండి దహన క్రియలు నిర్వహించారు.. ఇది అనేక రకాల అనుమానాలకు కారణమవుతోంది. ఒకవేళ హైకోర్టుకు సమర్పించిన పోస్టుమార్టం నివేదికలో.. పోలీసులకు ప్రతికూల ఫలితం వస్తే గనుక ఏపీ రాష్ట్రంలో అనేక పరిణామాలు జరుగుతాయి. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పకడ్బందీగా ఉండాలి. అలాకాకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఇదిగో ఇటువంటి పరిణామాలే ఎదురవుతాయి.

ఈ ఐదు రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం.. డబ్బు కట్టలు లెక్క పెట్టాల్సిందే..

Today July 2 2026 Horoscope
Today July 2 2026 Horoscope

Today 26 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై జ్యేష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకున్న దానికంటే ఎక్కువగా లాభాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండనున్నాయి. దీంతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. గతంలో మొదలు పెట్టిన పనులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది. దీంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన పనులను వెంటనే పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కష్టమైన పనుల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. దుబారా ఖర్చుల విషయంలో అదుపు ఉండాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం రెట్టింపుగా మారే అవకాశం ఉంది. అయితే వ్యాపారులు కొన్ని నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వీరు కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడును పెట్టేముందు ఆలోచించాలి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విజయాలే సమకూరుతాయి. గతంలో మొదలుపెట్టిన పనులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అధికారుల మద్దతు ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. అనుకోకుండా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల నుంచి మద్దతు ఉంటుంది. వ్యాపార కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల మధ్య సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితికి తగిన విధంగా ఖర్చులు చేయాలి. దుబారా ఖర్చులను నియంత్రించాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు సక్సెస్ రోజు అని చెప్పుకోవచ్చు. వ్యాపారులు తమ తెలివితేటలతో అధిక లాభాన్ని పొందుతారు. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఏ రోజు అపారమైన విజయాలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల నుంచి మద్దతు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. పిల్లల కెరీర్ విషయంపై కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండడంతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గతంలో ఏర్పాటు చేసిన లక్ష్యాలను ఈరోజు పూర్తి చేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో రాణిస్తారు. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులు లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని పనుల్లో విజయమే ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. గతంలో అనుకున్న ముఖ్యమైన పనులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం ఏర్పడుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. కొత్త వ్యక్తులు పరిచయమైన సందర్భంగా వారితో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ఉండేవారికి ప్రజల నుంచి మద్దతు ఉంటుంది.

ఈ ఈగ విలువ అక్షరాల లక్ష రూపాయలు..

IRCTC Food Complaint
IRCTC Food Complaint

IRCTC Food Complaint: శీర్షిక చదివారు కదా.. ఈగ విలువ లక్ష రూపాయలు అని అర్థమైంది కదా.. అదేంటి ఈగలను పరాన్న జీవి వాహకాలుగా భావిస్తుంటారు కదా.. పైగా ఈగలకు దూరంగా ఉంటారు కదా.. అటువంటి వాటికి లక్ష రూపాయలు ఎలా ఖర్చు పెడతారు.. అసలు అది అలా సాధ్యమవుతుంది.. ఇలా అనేక రకాల ప్రశ్నలు మీలో వ్యక్తమవుతున్నాయి కదా.. ఈ ప్రశ్నలకు సంబంధించి మీకు ఒక క్లారిటీ రావాలంటే ఈ కథనం చదవాల్సిందే..

అహ్మదాబాద్, ముంబై మధ్యలో తేజస్ రాజధాని అనే పేరుతో రైల్వే శాఖ ఎక్స్ ప్రెస్ రైలు నడుపుతూ ఉంటుంది. ఈ రైలు కొన్ని ఎంపిక చేసిన స్టేషన్ల లో మాత్రమే ఆగుతూ ఉంటుంది. ఈ రైలులో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐఆర్సిటిసి యాప్ ద్వారా ఆహార ముందుగానే బుక్ చేసుకున్నాడు. అతడు ఆ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఐ ఆర్ సి టి సి నిర్వాహకులు ఫుడ్ డెలివరీ చేశారు.

ఫుడ్ పార్సెల్ ఓపెన్ చేసి అతడు తినడం మొదలుపెట్టాడు. అందులో ఒక ఈగ కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని అతడు ఐఆర్సిటిసి అధికారులకు కంప్లైంట్ చేశాడు. సమాచారం అందుకున్న రైలు కెప్టెన్.. క్యాటరింగ్ మేనేజర్ వెంటనే ప్రయాణికుడిని కలిశారు. క్షమాపణ చెప్పారు. ఆ ఫుడ్ పార్సెల్ స్థానంలో మరొక ప్యాకెట్ అందిస్తామని వారు చెప్పారు. దానికి ఆ ప్రయాణికుడు ఒప్పుకోలేదు. అతడు కోర్టుకు వెళ్తామని హెచ్చరించడంతో.. ఐఆర్సిటిసి అధికారులు రంగంలోకి దిగారు విచారణ మొదలుపెట్టారు. ఆ ప్రయాణికుడికి భోజనాన్ని సరఫరా చేసిన అర్హ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు లక్ష రూపాయలు జరిమానా విధించారు.

ఈ కంపెనీకి సూరత్ నగరంలో ఆహారం తయారు చేసే కేంద్రం ఉంది. కేంద్రానికి సంబంధించిన లైసెన్స్ మొత్తం రద్దు చేయాలని ఐఆర్సిటిసి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆహార కేంద్రాన్ని త్వరలో మూసివేస్తారని తెలుస్తోంది. ఒక ప్రయాణికుడు ఎంతో ఆశతో.. ఆహారం బుక్ చేస్తే.. చివరికి అందులో ఈగ పడడం.. అది అతడి కంటపడడం.. ఐఆర్సిటిసికి ఫిర్యాదు చేయడం.. లక్ష రూపాయలు జరిమానా విధించడం… జాతీయస్థాయిలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, మనదేశంలో హాస్పిటల్ ఎలా వ్యవహరిస్తున్నాయో మరోసారి వెలుగులోకి వచ్చింది.

ఇటలీ ప్రధాని మెలోని ఢిల్లీలో పోటీ.. 10 లక్షల ఓట్లు గ్యారెంటీ

Giorgia Meloni
Giorgia Meloni

Giorgia Meloni: మెలోని మనదేశీయురాలు కాదు. ఆమెకు మన పౌరసత్వం కూడా లేదు. పైగా తను ఇటలీ ప్రధానమంత్రి. ఇటీవల ట్రంప్ కు చుక్కలు చూపించిన మహిళ. అంతర్జాతీయంగా మీడియాను ఆకర్షించిన రాజకీయ నాయకురాలు. ఇటీవల జీ7 సమ్మిట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఐరన్ లేడీ. అటువంటి మెలోని మనదేశంలో పోటీ చేయడం ఏంటి.. అది కూడా 10 లక్షల ఓట్లు రావడం ఏంటి.. ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

మెలోని కి జాతీయ భావం చాలా ఎక్కువ. పైగా తను రైట్ వింగ్ యాక్టివిస్ట్. దేశం తప్ప మరో వ్యాపకం ఆమెకు ఉండదు. దేశ ప్రయోజనాల విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాదు. అంతటి అమెరికాను నేరుగా క్వశ్చన్ చేసింది. అంతేకాదు, తిక్కరి ట్రంప్ కు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పింది. తిక్క తిక్క వేషాలు వేస్తే నార తీస్తాను అంటూ హెచ్చరించింది. తద్వారా అమెరికాను ప్రపంచ దేశాల ముందు చులకన చేసింది. మెలోనికి అమెరికా అంటే ఎంత ద్వేషమో.. ఇండియా అంటే అంత ప్రాణం. బాగా ఇష్టపడుతుంది.

2023లో ఇటలీ ప్రధానమంత్రి హోదాలో ఆమె మనదేశంలో పర్యటించింది. ఆ సమయంలో ఆమెకు భారీగా స్వాగతం లభించింది. ఢిల్లీ నగరంలో ఆమెకు స్వాగతం పలుకుతూ ప్రభుత్వం భారీగా పోస్టర్లను ఏర్పాటు చేసింది. ఈ స్థాయి స్వాగతం ఆమెకు ఏ దేశంలో కూడా లభించలేదు. దీంతో ఆమె ఈ విషయాన్ని తన కొత్త పుస్తకం జార్జియా విజన్ లో ప్రస్తావించారు. 2023 సంవత్సరంలో ఢిల్లీలో పర్యటించినప్పుడు తనకు ఎదురైన అనుభవాలను అందులో పంచుకున్నారు. ఆ పోస్టర్లను.. అక్కడి ప్రజల ఆదరణ చూసి ముచ్చట వేసిందని మేలోని ఆ పుస్తకంలో వ్యాఖ్యానించారు.

“అప్పుడు ఆమె ఢిల్లీలో పర్యటించారు. ఆమెకు అద్భుతమైన స్వాగతం లభించింది. భారత ప్రభుత్వం ఆమెను ప్రత్యేకమైన అతిథిగా స్వీకరించి. వారు అద్భుతమైన హాస్పిటాలిటీ అందించారు. అది నాకు ఎంతో గొప్పగా అనిపించింది. ఒకవేళ ఆమె ఢిల్లీలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తే కచ్చితంగా 10 లక్షల కోట్లు వచ్చేవేమో. నాటి పరిస్థితి చూస్తే అలానే అనిపించిందని” ఇటలీ ఉప ప్రధాని ఆంటోనియో వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని మేలోని చెబితే మీడియా ద్వారా యావత్ ప్రపంచానికి తెలిసింది.

రాజస్థాన్ తీసుకొచ్చింది.. తెలుగు రాష్ట్రాలూ అమలు చేస్తే.. లక్షల మందికి ప్రయోజనం..

Rajasthan Child Marriage Rule
Rajasthan Child Marriage Rule

Rajasthan Child Marriage Rule: వెనుకటి కాలంలో వివాహాలు చిన్న వయసులోనే జరిగేవి. దానివల్ల అనేక రకాల అనర్ధాలు చోటు చేసుకునేవి. పైగా అప్పట్లో ఈ స్థాయిలో వైద్య పరిజ్ఞానం అభివృద్ధి చెందలేదు కాబట్టి మరణాలు ఎక్కువగా సంభవించేవి. ఆ తర్వాత వైద్య పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. వివాహాలకు ఒక నిర్దిష్టమైన వయసును ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మరణాలు తగ్గడం మొదలైంది. అంతేకాదు, మనుషుల్లో పరిపక్వత పెరిగింది.

ఈ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినప్పటికీ.. అంతరిక్షంలో అద్భుతాలు చేసే స్థాయికి మనుషుల సామర్థ్యం పెరిగిపోయినప్పటికీ.. నేటి కాలంలో కూడా కొన్ని రకాల మూఢనమ్మకాలు.. దారుణాలు మన సమాజంలో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దీనివల్ల రకరకాల అనర్ధాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి అనర్ధాలు సంభవించడానికి ప్రధాన కారణం బాల్య వివాహాలు. నేటికీ ఉత్తర భారత దేశంలోని రాజస్థాన్.. మధ్యప్రదేశ్.. మహారాష్ట్ర.. ఉత్తరప్రదేశ్.. బీహార్ వంటి రాష్ట్రాలలో బాల్యవివాహాలు జరుగుతున్నాయి. బాల్య వివాహాల వల్ల అమ్మాయిల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటున్నది. ముఖ్యంగా చిన్న వయసులోనే వారు గర్భం దాల్చడం వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనికి తోడు వారి శరీరంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు.

బాల్య వివాహాలను అరికట్టడానికి ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది.. వివాహ పత్రిక మీద వధూవరుల డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేస్తోంది. అంతేకాదు, వివాహ పత్రికలను సంబంధిత ఐసిడిఎస్ అధికారులకు పంపించాలని కండిషన్ కూడా విధించింది. దీంతో అక్కడ ఆ నిబంధన విజయవంతంగా అమలవుతోంది. ఫలితంగా బాల్య వివాహాలు జరగడం లేదు. గతంతో పోల్చి చూస్తే బాల్యవివాహాల సంఖ్య ఆ రాష్ట్రంలో చాలావరకు తగ్గిపోయింది. రాజస్థాన్ మాదిరిగానే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదేవిధంగా చేయాలని భావిస్తోంది. ఇప్పటికే అధికారులు రాజస్థాన్ నమూనాను పరిశీలిస్తున్నారు. మరోవైపు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బాల్య వివాహాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఉమ్మడి పాలమూరు.. ఉమ్మడి వరంగల్.. ఉమ్మడి మెదక్.. ఉమ్మడి నల్లగొండ.. ఉమ్మడి శ్రీకాకుళం.. ఉమ్మడి విజయనగరం.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలలో బాల్యవివాహాలు గతంలో విపరీతంగా జరిగేవి. ఇప్పుడు కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. ఐసిడిఎస్ అధికారుల తనిఖీలలో ఇవి బయటపడుతున్నాయి. ఫిర్యాదులు వస్తే అధికారులు వెంటనే బాల్య వివాహాలు నిలిపివేస్తున్నారు.

రాజస్థాన్ రాష్ట్రంలో పెళ్లి పత్రికల మీద వధూవరుల పుట్టిన తేదీలను నమోదు చేస్తున్న నేపథ్యంలో బాల్య వివాహాలు ఆగిపోయాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిబంధనను పరిశీలిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నిబంధన అమలయితే బాల్యవివాహాలకు చెక్ పెట్టొచ్చు. మరి ఆ దిశగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

లేత వయసులో నటాషా ఘాటు అందాలు

Natasha Bharadwaj poolside photos
Natasha Bharadwaj poolside photos